భారత్ లో పది లక్షలు దాటిన కరోనా కేసులు
భారత్ లో కరోనా ఉధృతి కొనసాగుతోంది. కేసుల సంఖ్య 10 లక్షల మార్క్ ను దాటింది. గత 24 గంటల్లో భారత్లో 34,956 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. దేశంలో ఒక్క రోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 10,03,832కి చేరింది. గత 24 గంటల్లో 687 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 25,602కి చేరింది. ఇప్పటివరకు 6,35,757 మంది కరోనా నుంచి కోలుకోగా, ప్రస్తుతం 3,42,473 యాక్టివ్ కేసులు ఉన్నాయి.