సీఎం అభ్యర్థిగా శ్రీధరన్.. మరో కిరణ్ బేడీనా?

అనుకున్నట్టే జరిగింది. మెట్రోమేన్ శ్రీధరన్ ను కేరళ సీఎం అభ్యర్థిగా ప్రకటించింది బీజేపీ. పార్టీ జాతీయ కోర్ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సురేంద్రన్ అధికారికంగా శ్రీధరన్ పేరు ప్రకటించారు.  కేరళలో బీజేపీకి ఇంకా ఎమ్మెల్యే అభ్యర్థులే ఖరారు కాలేదు. అందరికంటే ముందు సీఎం అభ్యర్థి మాత్రం డిసైడ్ అయిపోయారు. ఢిల్లీ మెట్రో మేన్ గా దేశమంతా సుపరిచితమైన శ్రీధరన్ ఇటీవలే బీజేపీలో చేరారు. సీఎం కేండిడేట్ కు సై అంటూ సిగ్నల్ ఇచ్చారు. ఇక శ్రీధరనే బీజేపీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థి అంటూ ప్రచారం కూడా జరిగింది. అనుకున్నట్టే.. ఆయన పేరును అధికారికంగా ప్రకటించింది పార్టీ. గురువారంతో తాను పదవీ విరమణ చేస్తానని, ఆ తర్వాతే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని శ్రీధరన్ చెప్పారు.  శ్రీధరన్ ఏ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తారో అనే దానిపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. కొచ్చి అర్బన్ నుంచి పోటీ చేస్తారని తెలుస్తోంది. రాజధాని నుంచి బరిలో దిగితే.. యావత్ రాష్ట్రంపై ఆయన ప్రభావం ఉంటుందని లెక్కలేస్తోంది కమలదళం. మిస్టర్ క్లీన్ గా, మెట్రో మ్యాన్ గా పాపులారిటీ ఉన్న శ్రీధరన్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే.. పార్టీకి మంచి మైలేజీ వస్తుందని భావిస్తోంది.  గతంలో ఢిల్లీలోనూ బీజేపీ ఇలాంటి ప్రయోగమే చేసింది బీజేపీ. మాజీ ఐపీఎస్ కిరణ్ బేడీని సీఎం కేండిడేట్ గా ప్రకటించి ఎన్నికల బరిలో దిగినా ఫలితం లేకుండా పోయింది. ఇప్పుడు కేరళలోనూ శ్రీధరన్ తో ఢిల్లీ తరహా ఎక్స్ పర్మెంట్ చేస్తోంది. LDF, UDF కూటములు బలంగా ఉన్న కేరళలో బీజేపీ ప్రభావం అంతంత మాత్రమే. ఎలాగూ గెలిచే అవకాశం లేని చోట మాత్రమే.. బీజేపీ కిరణ్ బేడీ, శ్రీధరన్ లాంటి మిస్టర్ క్లీన్ లను ముఖ్యమంత్రి అభ్యర్థులుగా ప్రకటిస్తూ.. ఓటర్లకు గాలం వేసే ప్రయత్నం చేస్తుంటుందనే ఆరోపణ ఉంది. అదే, పక్కా గెలిచే ఛాన్స్ ఉన్న రాష్ట్రాల్లో మాత్రం RSS మూలాలున్న లీడర్లను మాత్రమే ముఖ్యమంత్రులను చేస్తుందనేది విమర్శ వినిపిస్తుంటుంది. అయితే, విద్యాధికులు ఎక్కువగా ఉండే కేరళలో శ్రీధరన్ ఇమేజ్ కమలదళానికి ఏ మేరకు కలిసొస్తుందో...

ఏపీలో ఏబీసీడీ పాలన 

మున్సిపల్ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. కర్నూల్ కార్పొరేషన్ పరిధిలో ర్యాలీ నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ లో  ఏబీసీడీ పాలన సాగుతోందని చంద్రబాబు విమర్శించారు.  ఏ అంటే అట్రాసిటీ, ఆటవిక పాలన, బీ అంటే బాదుడు, సీ అంటే అవినీతి, డీ అంటే విధ్వంసమని చంద్రబాబు చెప్పారు. వైసీపీ పాలనలో ప్రజలు నిరాశ, నిస్పృహలో ఉన్నారని చెప్పారు. పోలీసులు ఎప్పుడు ఇంటికి వస్తారో తెలియని భయానక పరిస్థితి నెలకొందన్నారు చంద్రబాబు.  ఏపీలో మత సామరస్యం దెబ్బతిందని.. ఆలయాలపై దాడులు చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. టీడీపీ పాలనలో అభివృద్ధికి పెద్దపీట వేస్తే.. జగన్‌ విధ్వంసానికి పెద్దపీట వేశారని మండిపడ్డారు. పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల్లో  బలవంతపు ఏకగ్రీవాలు చేశారని ఆరోపించారు. ఎప్పుడైనా చరిత్రలో ఇన్ని ఏకగ్రీవాలున్నాయా? అని ప్రశ్నించారు. టీడీపీ గెలిచిన స్థానాలనూ వైసీపీ నేతలు వారి ఖాతాలో వేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటేసే అవకాశమే లేకపోతే ప్రశ్నించే అవకాశం వస్తుందా?.. ప్రశ్నించే అవకాశం లేకపోతే నాయకులు భయపడతారా?’’ అని చంద్రబాబు ప్రశ్నించారు.  మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు చంద్రబాబు.   

బతికున్న వ్యక్తికి పోస్టుమార్టం! వైద్యుల నిర్లక్ష్యం

యాక్సిడెంట్ లో శంకర్ కు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని దగ్గరలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. రెండ్రోజుల పాటు అబ్జర్వేషన్ లో ఉంచారు. మూడో రోజూ అతడిలో చలనం లేదు. క్షతగాత్రుడు చనిపోయాడని నిర్ధారించిన వైద్యులు.. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.  శంకర్ డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. శవపరీక్ష చేయడానికి సిబ్బంది సిద్ధమయ్యారు. కత్తితో డెడ్ బాడీపై గాటు పెట్టబోతుండగా.. శంకర్ చేయి సడెన్ గా కదిలింది. పోస్ట్ మార్టం సిబ్బంది ఒక్కసారిగా బిత్తరపోయారు. అదేంటి? మృతదేహం చేయి కదలడమేంటి? అని షాక్ అయ్యారు. అంతలోనే తేరుకున్నారు. శంకర్ చనిపోలేదని, ఇంకా ప్రాణాలతోనే ఉన్నాడని నిర్ధారించుకున్నారు. వెంటనే అతన్ని మార్చురీ నుంచి ఆసుపత్రి వార్డుకు తరలించారు. ప్రభుత్వ వైద్యులు అతనికి చికిత్స కొనసాగిస్తున్నారు. ప్రైవేట్ ఆసుపత్రి డాక్టర్లు నిర్లక్ష్యంతోనే.. బతికున్న శంకర్ చనిపోయాడని పోస్ట్ మార్టంకు తరలించారని ప్రభుత్వ వైద్యులు మండిపడుతున్నారు. కర్ణాటక, బెల్గావిలో జరిగిన ఈ దారుణంతో.. ప్రైవేటు ఆసుపత్రుల నిర్వాకంపై మరోసారి చర్చ జరుగుతోంది. పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శంకర్ కుటుంబ సభ్యులు, స్థానికులు ఆ ఆస్పత్రి ముందు ధర్నాకు దిగారు.

విశాఖలో రౌడీ దిగాడు.. పారిశ్రామిక వేత్తలు పారిపోతున్నారు!

విశాఖకు కొత్త పరిశ్రమలు రావడం లేదు.. గతంలో వచ్చినవి మూత పడుతున్నాయి.. ఏపీకి రావాలంటనే పారిశ్రామిక వేత్తలు వణికిపోతున్నారు.. ఇవి విద్యార్థులతో జరిగిన సమావేశంలో తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేసిన ఆరోపణలు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖలో విద్యార్థులతో లోకేష్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జగన్ రెడ్డి సర్కార్ పై ఆయన సంచలన ఆరోపణలు చేశారు.  ఒక్క ఛాన్స్ అడిగి సీఎం జగన్ విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను అమ్మేస్తారని  లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ సామర్థ్యం పెంచారు. ఇప్పుడు నష్టాలు వచ్చాయి అని చెబుతున్నారన్నారు. పక్కనే ఉన్న జింక్ మూసేసారు ఇప్పుడు కార్మికులు రోడ్డున్న పడ్డారని మండిపడ్డారు. విశాఖలో ఆధాని డేటా సెంటర్ వచ్చి ఉంటే లక్షల ఉద్యోగాలు వచ్చేవని తెలిపారు.  విశాఖపట్నానికి రెండేళ్లు ఏం చేశారో చెప్పాలని వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు లోకేష్. విశాఖపట్నం రాజధాని అంటున్న జగన్.. రెండేళ్లలో ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా అని ప్రశ్నించారు.  విశాఖలో రౌడీ దిగాడు.. A2 మొత్తం భూములు దోచుకుంటున్నాడని నారా లోకేష్ ఆరోపించారు. విశాఖకు ఐటీ పరంగా చాలా అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఇక్కడ కొత్త పరిశ్రమలు రావడం కన్నా ఉన్న పరిశ్రమలు పోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిశ్రామిక వేత్తలు ఏపీ రావడానికి భయపడుతున్నారని లోకేష్ ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలో ఉండగా విశాఖలో కన్వెన్షన్ సెంటర్ కావాలన్నామని.. కానీ దాన్ని  వైసీపీ ప్రభుత్వం వెల్లగొట్టిందని మండిపడ్డారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై చాలా బాధగా ఉందన్నారు నారా లోకేష్.  రాష్ట్ర ప్రభుత్వం వైఖరీ ఇలాగే కొనసాగితే వడ్డీ కట్టలేని పరిస్థితి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.    

శివుడిని నమ్ముకున్న దీదీ..

పశ్చిమ బెంగాల్ లో ఓట్లను పోలరైజ్ చేసేందుకు బీజేపీ జైశ్రీరామ్ నినాదం ఎత్తుకున్న సంగతి తెలిసిందే. కొద్దిరోజుల క్రితం నేతాజీ సుభాష్ చంద్రబోస్ సంస్మరణ సభలో ప్రధాని మోడీతో కలిసి పాల్గొన్న సభలో మమతా బెనర్జీ లేచి ప్రసంగం చేయబోతుండగా.. బీజేపీ నాయకులు ఒక్కసారిగా జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేయడంతో.. ఆమె ప్రసంగించకుండానే వెళ్లిపోయిన సంగతి తెలిసిందే.  తాజాగా బెంగాల్ ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల కావడంతో ఇక బీజేపీ ఫాలో అవుతున్న "హార్డ్‌కోర్ హిందుత్వ" కి కౌంటర్ గా సీఎం మమత నేతృత్వంలోని తృణమూల్ ఇకపై "సాఫ్ట్ హిందుత్వ" ను ఫాలో కావాలని డిసైడ్ అయింది..రాముడికి విరుగుడుగా మమత శివుణ్ని తెరపైకి తీసుకురావాలని నిర్ణయించారు. దీంతో ఆమె తన ఎన్నికల నామినేషన్‌ను మహా శివరాత్రి పర్వ దినాన దఙ్ఖలు చేయనున్నారు. తాజాగా దీనికి సంబంధించి కావలసిన ఏర్పాట్లన్నీ సిద్ధమయ్యాయి. త్వరలో జరిగే ఎన్నికల్లో మమత నందిగ్రామ్ నుంచి బరిలోకి దిగనున్న నేపథ్యంలో ఆమె అక్కడే తన నివాసాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. దీంతో పాటు అక్కడ ఎన్నికల కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. మరోపక్క బీజేపీని ఇరుకున పెట్టడానికే ఆమె నామినేషన్ వేయడానికి ఆ రోజును ఎంపిక చేసుకున్నట్లు గ తెల్సుస్తోంది. అంతేకాకుండా ఎన్నికల ప్రచారం సందర్భంగా పాదయాత్రను చేపట్టాలని మమత డిసైడ్ అయ్యారు. అంతేకాకుండా మన తెలుగు రాష్ట్రాలలో బాగా పాపులర్ అయిన పాదయాత్రను మమత నమ్ముకున్నట్లుగా తెలుస్తోంది. దీంతో ప్రతి రోజు ఆమె కొన్ని కిలోమీటర్లు పాదయాత్ర చేయాలని సంకల్పించినట్లుగా సమాచారం. అంతేకాకుండా "బెంగాల్ కూతురే ఇక్కడ సీఎం కావాలి" అనే నినాదంతోనే ఎన్నికల్లోకి దూసుకెళ్లాలని ఇప్పటికే మమత నిర్ణయించారు.    

అంగన్ వాడీ ఉద్యోగితో వెట్టిచాకిరీ! జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఫిర్యాదు 

జేసీ ప్రభాకర్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు అందింది. తన నివాసంలో అంగన్ వాడీలతో వెట్టిచాకిరి చేయిస్తున్నట్లు ఆయనపై ఆరోపణలు వస్తున్నాయి. ఉద్యోగం కోసం మూడున్నర లక్షలు చెల్లించాలని డిమాండ్ చేసినట్లు ఫిర్యాదులో బాధితురాలు ఆరోపించారు. అంగన్ వాడీలో పనిచేస్తున్న తనను ఇంట్లో పనిమనిషిగా పెట్టుకున్నారని.. కాళ్లు పట్టించుకోవడం సహా అన్ని పనులు చేయిస్తున్నారని వాపోయింది. ఉద్యోగంలో నుంచి తీసేస్తామని బెదిరించడంతో రూ.2లక్షలు చెల్లించానని.. కానీ మరింత డబ్బు కావాలని డిమాండ్ చేస్తున్నారని ఆమె తెలిపింది. అడిగినంత డబ్బు ఇవ్వనందుకు తనను చిత్రహింసలు పెడుతున్నారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వివరించింది బాధితురాలు.  ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రభాకర్ రెడ్డిపై..  నెల్లూరు వైఎస్ఆర్ కాలనీలో అంగన్ వాడీ ఆయా రిహానా పోలీసులకు ఫిర్యాదు చేసింది.   జేసీ దగ్గర సీసీగా పనిచేసే శ్రీకాంత్, డ్రైవర్ వికార్ సు తనపై దూషణలకు దిగడమే కాకుండా దాడి చేశారని ఆరోపించింది. ఆరోగ్యం సరిగా లేక పనిలోకి వెళ్లకపోతే ఇంట్లో రూ.1.50 లక్షలు చోరీ చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారని వెల్లడించింది. ఐదు రోజులుగా పోలీసులు తనను చిత్రహింసలకు గురిచేస్తున్నట్లు వివరించింది. చేయని తప్పులు నాపై వేసి డబ్బులు వసూల్ చేయడానికి నన్ను 5 రోజులు నుండీ పోలీసు స్టేషన్ చుట్టూ తిప్పుతున్నారని అవేదన వ్యక్తం చేసింది. స్థానిక పోలీస్ స్టేషన్లో జేసీతో పాటు ఆయన సిబ్బందిపై చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని వేడుకుంది. జాయింట్ కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి బంగ్లాలో వేధింపులకు గురైన అంగన్ వాడీ హెల్పర్ కు మద్దతుగా కోటమిట్టలో బాధితురాలు, ముస్లిం సంఘాలు ఆందోళనకు దిగాయి. జేసీ ప్రభాకర్ రెడ్డి ని సస్పెండ్ చేయాలని , వేధింపులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయం చేయాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని కలిసి విన్నవించారు.  మరోవైపు అంగన్ వాడీ ఉద్యోగితో తన ఇంట్లో వెట్టి చాకిరి చేయిస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న జేసీ ప్రభాకర్ రెడ్డి.. తన పిల్లలిద్దరినీ ప్రభుత్వ పాఠశాలలో చెర్పించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. అలాంటి జేసీపై వెట్టిచాకిరి ఆరోపణలు రావడం నెల్లూరు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.  

రియల్ బిచ్చగాడు..

అతడు కోటీశ్వరుడు. కానీ కూటికి చేతి చాస్తూ బిక్షాటన చేస్తున్నాడు. అతనికి ఉన్న అలవాటే అతన్నిబిచ్చగాడ్ని చేసింది. చివరికి గుడిమెట్ల దగ్గర బిచ్చమెత్తుకుంటున్నాడు. ఈ విషయం తెలిసిన అధికారులు రమేష్ యాదవ్ ని తన ఇంటికి తీసుకెళ్లారు.. రమేష్ ఇంటిని చూసిన అధికారులు ఆశ్యర్యపోయారు.   దీనబంధు పునరావాస యోజన పథకంలో భాగంగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో మున్సిపల్ సిబ్బంది, జిల్లా అధికారులు ఫిబ్రవరి 24న ఒక ప్రత్యేక కార్యక్రమాన్నినిర్వహించారు.   సంయుక్తంగా అనాథ వ్యక్తులను ఆదుకునే కార్యక్రమాన్ని ప్రారంభించారు. వారికి పునరావాసం కల్పించే పనులను చేపట్టారు.ఈ కార్యక్రమానికి మొత్తం 109 మంది అనాథలను తీసుకువచ్చారు. వారికి  తగిన వైద్య చికిత్స అందిస్తున్నారు. ఈ నేపధ్యంలో అధికారులకు బిచ్చగానిగా మారిన రమేష్ అనే కోటీశ్వరుడు తారసపడ్డాడు.  రెండేళ్లుగా రమేష్ ఒక ఆలయం దగ్గర బిచ్చగానిగా కాలం గడుపుతున్నాడు. పెళ్లి కూడా చేసుకోలేదు. అధికారులకు రమేష్ ఇచ్చిన సమాచారం మేరకు వారు రమేష్ ఇంటికి వెళ్లారు. ఆ ఇంటిలోని హంగులను చూసిన వారు తెగ ఆశ్చర్యపోయారు. ఆ ఇంట్లో సకల సౌకర్యాలు ఉన్నాయి. అయితే రమేష్‌కు ఉన్న ఒక్క అలవాటు అతనిని బిచ్చగానిగా మార్చివేసింది. అతని మద్యం అలవాటే అతనిని ఈ దుస్థితికి తీసుకువచ్చింది. రమేష్ కు ఒక సొంత భవనం, ప్లాట్ ఉన్నాయి. వాటి విలువ కోట్ల రూపాయలలో ఉంటుంది. అయితే విపరీతంగా మద్యం తాగే అలవాటు కారణంగా అతను ఆలయం దగ్గర బిచ్చమెత్తుకుంటూ కాలం గడుపుతున్నాడు. రమేష్ పరిస్థితిని గమనించిన అధికారులు అతనికి కౌన్సెలింగ్ ఇప్పించారు. దీంతో రమేష్ ఆరోగ్యం మెరుగుపడింది. తిరిగి రమేష్ తన ఇంటికి చేరుకున్నాడు.

కమీషన్లు రావనే ఐటీఐఆర్ పై నిర్లక్ష్యం! 

తెలంగాణలో పట్టభద్రుల మండలి ఎన్నికల హీట్ పెరిగింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ నేతల మధ్య లేఖలు, సవాళ్ల యుద్ధం సాగుతోంది. ఐటీఐఆర్ కేంద్రంగా ఇరు పార్టీల నేతలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. తాజాగా ఈ అంశంలోకి ఎంటరై.. రెండు  పార్టీలను కడిగి పారేశారు తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి.  ఐటీఐఆర్ విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ ఇద్దరిది దొంగాటేనని ఎద్దేవా చేశారు.   ఐటీఐఆర్‌కు కాంగ్రెస్ సర్కార్ అప్రూవల్ ఇచ్చిందని చెప్పారు రేవంత్ రెడ్డి. ఏడేళ్లయినా ఐటీఐఆర్‌పై టీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం డీపీఆర్ ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ నిర్లక్ష్యం కారణంగానే రాష్ట్రం ఐటీఐఆర్‌ను కోల్పోయిందని విమర్శించారు. టీఆర్ఎస్ అంటే టోటల్ రివర్స్ స్టాండ్ అన్నారు రేవంత్ రెడ్డి. ఐటీఐఆర్‌కు సమానమైన ప్యాకేజీ .. మంత్రి కేటీఆర్ ఇవ్వాలనడం దారుణమన్నారు.  కేటీఆర్ .. మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నాడని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.  కేటీఆర్ దగ్గర అసలు ప్రణాళికనే లేదు .. లెటర్ రాయడం ఏంటి .? అని ప్రశ్నించారు.  కమిషన్లు వచ్చేదుంటే ఐటీఐఆర్‌కు కూడా కేసీఆర్ డీపీఆర్ ఇచ్చేవారని తెలిపారు. కమిషన్లు వచ్చినందుకే కాళేశ్వరాన్ని డీపీఆర్ లేకుండానే నిర్మించాడని చెప్పారు. దేశంలో బీజేపీ గ్రాఫ్ వేగంగా పడిపోతుందని రేవంత్‌రెడ్డి తెలిపారు. పట్టభద్రులంతా బీజేపీ, టీఆర్ఎస్ కు బుద్ది చెప్పాలని, కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. 

కేజ్రీ జోరు బీజేపీ బేజారు

దేశ రాజధాని ఢిల్లీపై తిరుగులేని పట్టు సాధించిన, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్’ మంచి జోరు మీదున్నారు. గత వారం గుజరాత్’లో ఆరు మున్సిపల్ కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల్లో ఆప్ అనూహ్య విజయం సాధించింది.  అహ్మదాబాద్ సహా ఐదు కార్పొరేషన్లలో అడుగు పెట్టలేక పోయినా,ఇంకెక్కడా ఆయన పార్టీకి కనీసం డిపాజిట్లు అయినా రాకపోయినా, సూరత్’లో మాత్రం ‘చీపురు’ తిరగేశారు. ఫస్ట్ అటెంప్ట్’లోనే డిస్టింక్షన్’ సాధించారు. చీపురి  కాంగ్రెస్ పార్టీని పూర్తిగా తుడిచేసింది. మొత్తం 120 సీట్లున్న కార్పొరేషన్’ బీజేపీ 93 సీట్లు, ఆప్ 27 సీట్లు గెలుచుకున్నాయి. హస్తం పార్టీ అడ్రస్ గల్లంతైంది. ఒక్క సీటు కూడా దక్కలేదు. అదలా ఉంటే, ఆ ఆనందం మత్తు నుంచి ఇంకా బయటకు రాక ముందే, ఢిల్లీలోని మూడు మున్సిపల్  కార్పొరేషన్ల పరిధిలోని ఐదు స్థానాలు జరిగిన ఉపఎన్నికల్లోనూ ఆప్’ విజయ ఢంకా మోగించింది. ఐదింట నాలుగు సీట్లలో  ‘ఆప్’ జైకేతనం ఎగరేసింది.మిగిలిన ఒక సీటును హస్తం పార్టీ ఎగరేసుకు పోయింది. బీజేపీకి ఢిల్లీ జనం మొండి చేయి చూపించారు. ఉన్న ఒక్క సీటు కూడా లాగేసుకున్నారు. మరో సంవత్సరంలో,2022లో ఢిల్లీలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగనున్నాయి.ప్రస్తుతం మూడు కార్పొరేషన్లలోను బీజేపీ అధికారంలో ఉంది, అయినా ఐదుకు ఐదు సీట్లలో కమలం పార్టీ కనుమరుగుకావడం ఆ పార్టీ ని కలవరానికి గురి చేస్తోంది. మరో వంక ముఖ్యమంత్రి అరివింద్ కేజ్రీవాల్ పార్టీ ఆనందడోలికల్లో తెలిపోతోంది. అయితే, ఉపఎన్నికలు జరిగిన ఐదు స్థానాల్లో ఒక్కటి మినహా మిగిలిన నాలుగు ఆప్ సిట్టింగ్ స్థానాలు. ఆ స్థానాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న కార్పొరేటర్లు, ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్ల్యేలు కావడంతో, ఆ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. కాబట్టి ఇది తమకు అంత పెద్ద ఎదురుదెబ్బ కాదని బీజేపీ, బుకాయించే ప్రయత్నం చేస్తోంది. అయితే,కేజ్రీవాల్ మాత్రం, వచ్చే సంవత్సరం ఏమి జరగబోతోందో ఈ ఫలితాలు సూచిస్తున్నాయని అన్నారు. నిజమే,  ఎన్నిక ఎంత చిన్నదే అయినా గెలుపు ఉత్సాహాన్ని ఇస్తుంది. ముఖ్యంగా కార్యకర్తల నైతిక బలాన్నిపెంచుతుంది. ఓటమి నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తుంది.అయితే సంవత్సరం తర్వాత జరిగే ఎన్నికల్లో ఏమి జరుగుతుంది అనేది పక్కన పెడితే, జాతీయ స్థాయిలో, బీజేపీ ప్రత్యన్మాయంగా ఎదిగేందుకు ‘ఆప్’ చేస్తున్న ప్రయత్నాలు సత్పలితాలు ఇస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ  ఖాళీ చేసిన స్థానాన్ని ‘ఆప్’ ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తోంది.ఇంతవరకు కొంత విజయం సాధించింది. ఈ నేపధ్యంలోనే కేజ్రీవాల్  ఇకముందు కూడా ఇతర రాష్ట్రాలలో జరిగే ఎన్నికల్లో పోటీ చేస్తామని, పార్టీని విస్తరిస్తామని ప్రకటించారు. అయితే, గతంలోనూ ‘ఆప్’పార్టీ  విస్తరణ ప్రయత్నాలు చేయకపోలేదు. వారణాసిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీనే, కేజ్రీవాల్ డీ కొన్నారు. ఇతర రాష్ట్రాల్లోనూ పోటీ చేశారు,అయితే ఒక్క పంజాబ్ మినహా ఎక్కడా సక్సెస్ కాలేదు ... ఈ సారి ఏమవుతుందో కాలమే నిర్ణయిస్తుంది.  

సాగర్ లో షాకింగ్ క్యాండిడేట్! జానారెడ్డి కోసం కేసీఆర్ స్కెచ్! 

తేరా చిన్నపరెడ్డి.. నోముల భగత్, దూదిమెట్ల బాలరాజు యాదవ్, ఎంసీ కోటిరెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి... ఇవి త్వరలో ఉప ఎన్నిక జరగనున్న నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికకు అధికార పార్టీ అభ్యర్థి రేసులో ఉన్న పేర్లు. వీరిలోనే ఎవరికో ఒకరికి టికెట్ వస్తుందని అంతా భావిస్తూ వస్తున్నారు. అయితే  రాజకీయ వ్యూహాల్లో  దిట్టగా పేరున్న  తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. నాగార్జున సాగర్ అభ్యర్థి విషయంలో ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ప్రతిపక్షాలు కూడా షాకయ్యేలా  అభ్యర్థిని ఖరారు చేసినట్లు సమాచారం  నాగార్జునసాగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ నుంచి బీసీ అభ్యర్థిని పోటీలో పెట్టాలని కేసీఆర్ నిర్ణయించినట్లు చెబుతున్నారు. సామాజిక వర్గాల వారీగానే కాకుండా నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో పరిస్థితుల ఆధారంగా మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తియాదవ్ అల్లుడు కట్టబోయిన గురవయ్యయాదవ్‌ను రంగంలోకి దించబోతున్నారని తెలుస్తోంది. ఈ మేరకు త్వరలో  అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహాయ్య యాదవ్ కొడుకు నోముల భగత్ బీసీ వర్గానికి చెందినవాడే. అయితే నాన్ లోకల్. నాగార్జున సాగర్ నియోజకవర్గ జనాల్లో లోకల్, నాన్‌లోకల్ ఇష్యూ తలెత్తిందని కేసీఆర్ దృష్టికి వచ్చిందంటున్నారు.అందుకే స్థానికుడైన గురవయ్య యాదవ్ వైపు మొగ్గు చూపినట్టు తెలుస్తోంది.  ఉపఎన్నిక టికెట్ కోసం టీఆర్ఎస్ నుంచి తీవ్ర పోటీ నెలకొంది. వరుస ఓటములతో డీలా పడిన పార్టీ కేడర్ లో జోష్ నింపాలంటే... సాగర్ లో ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన పరిస్థితిలో ఉంది టీఆర్ఎస్. అందుకే గతానికి భిన్నంగా అభ్యర్థి ఎంపికలో గులాబీ బాస్ సుదీర్ఘ కసరత్తు చేశారని తెలుస్తోంది. ప్రతిపక్షాలను ఎదుర్కొనేందుకు బలమైన నేతను పోటీలోకి దించాలని భావించిన కేసీఆర్.. పలు సార్లు సర్వే చేయించారట. అన్ని సర్వేలతో పాటు నిఘా వర్గాలు కూడా  బీసీ అయితేనే గెలిచే అవకాశం ఉందని నివేదికలు ఇచ్చాయని సమాచారం. దీంతో కట్టబోయిన గురవయ్యయాదవ్ పేరును కేసీఆర్ దాదాపుగా ఫైనల్ చేశారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎవరూ ఊహించని విధంగా గురవయ్యయాదవ్ పేరు తెరపైకి రావడంతో రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. గురవయ్య యాదవ్ ది నిడమనూరు మండలం వెనిగండ్ల గ్రామం. మాజీ ఎమ్మెల్యే గుండెబోయిన రామ్మూర్తియాదవ్‌కు అల్లుడు. రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌కు తోడల్లుడు. కావలి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత బీద మస్తాన్ రావుకు వియ్యంకుడు. 2018 సంవత్సరం వరకు కుందూరు జానారెడ్డికి ప్రధాన అనుచరుడిగా ఉన్నారు. 2018లోనే టీఆర్ఎస్‌లో చేరారు. బీసీ సామాజికవర్గానికి చెందినవారు కావడంతో పాటు ఆర్థికంగా ఉండడంతో టీఆర్ఎస్ పార్టీ గురువయ్య యాదవ్ ను బరిలోకి దింపిందని భావిస్తున్నారు. మరోవైపు గురువయ్య యాదవ్  పేరు తెరపైకి రావడంతో మరో ప్రచారం కూడా జరుగుతోంది. కాంగ్రెస్ సీనియర్ నేత జానా రెడ్డిని గెలిపించేందుకే కేసీఆర్... కొత్త వ్యక్తికి టికెట్ ఇచ్చారని కూడా చర్చించుకుంటున్నారు. బీసీ వర్గానికి ఇవ్వాలనుకుంటే నోముల భగత లేదా విద్యార్థి నేత బాలరాజు యాదవ్ కు ఇవ్వవచ్చని... కావాలనే కొత్త వ్యక్తిని పోటీలో పెడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇక టీఆర్ఎస్ యాదవ వ్యక్తికి టికెట్ ఇస్తే బీజేపీ ఎవరిని బరిలోకి దింపుతుందన్నది ఆసక్తిగా మారింది. బీజేపీ టికెట్ రేసులో నివేదితా రెడ్డితో పాటు కడారి అంజయ్య యాదవ్ ఉన్నారు. 

మందు బాబులకు చేదు వార్త..

ఎన్నికలు వస్తే మందు బాబులకు పండగే పండగే..వారికి పార్టీలతో సంభందం లేదు. మందు బాటిల్ తోనే సంబంధం. ఛత్రపతి సినిమాలో కత్తికి బొచ్చుకు ఉన్న సంబంధం డైలాగ్ మాదిరి మందు బాబులకు మందు బాటిల్ కి ఉన్న సంబంధం. వారికీ పెగ్ వేయనిదే పొద్దుగడవడు. ఎన్నికల నేపధ్యంలో మందుబాబులకు  చేదు వార్త చెప్పిన సర్కార్. ఏప్రిల్ 6 వరకు మద్యం బంద్. మనిషికి రెండు ఫుల్ బాటిల్స్ మాత్రమే. దుకాణాలకు సర్కారు ఉత్తర్వులు. ఇక మందు బాబులకు తప్పని ఇక్కట్లు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలయ్యే దాకా రోజుకు ఒక్కొక్కరికి రెండు ఫుల్‌ బాటిళ్లు మాత్రమే ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశించింది. అంతకు మించి ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. వచ్చే ఏప్రిల్‌ 6న అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండటం తో ప్రస్తుతం ప్రధాన పార్టీలన్నీ తమ సభలకు, రోడ్‌షోలకు కార్యకర్తలతోపాటు సామాన్య ప్రజలను కూడా తరలించేందుకు చర్యలు తీసుకుంటు న్నాయి. అదే సమయంలో సభలకు, రోడ్‌షోలకు హాజరయ్యే కార్యకర్తలు, ప్రజలకు రూ. 300ల నుండి రూ.500ల వరకూ రోజువారీ భత్యంగా చెల్లిస్తుంటారు. ఇక మధ్యాహ్నం బిర్యానీ విందులు తప్పనిసరి. ఆ తర్వాత ఇళ్లకు తిరిగివెళ్లే ముందు టాస్మాక్‌ దుకాణా నికి వెళ్ళి మద్యం కొనుగోలు చేసుకెళుతుంటారు. ఈ పరిస్థితి వల్ల పీకలదాకా తాగిన మందుబాబులు గొడవలకు పాల్పడుతుంటారు.  ఈ ఎన్నికల్లో అలాంటి పరిస్థితులను నిరోధించాలని తమిళనాడు రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఆ మేరకు ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకూ ప్రభుత్వ మద్యం దుకాణాలలో ఒక వ్యక్తికి రెండు ఫుల్‌బాటిళ్ల కు మించి మద్యాన్ని విక్రయించకూడదంటూ పరిమితిని విధించింది. రెండు ఫుల్‌బాటిల్స్‌ లభించకపోతే నాలుగు ‘హాఫ్‌బాటిల్స్‌’ కొనుగోలు చేసుకోవచ్చునని స్పష్టం చేసింది. హాఫ్‌బాటిల్స్‌ కొరతగా ఉంటే ఎనిమిది ‘క్వార్టర్‌’ బాటిళ్ల చొప్పున మద్యం కొనవచ్చని అన్నారు . రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణాలలో ఈ ఉత్తర్వులు అమలులోకి వస్తాయని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు.

జగన్ వేటగాడు..

వైసీపీ రౌడీల పార్టీ. జగన్‌ది వేటగాడి మనస్తత్వం. పావురాలకి ఆహారాన్ని వేస్తారు, అది పావురాల మీద ప్రేమతో కాదు, ఆ పావురాల మాంసం కోసం. ఇదే జగన్ తీరు అంటూ ఏపీ సీఎంను వేటగాడితో పోల్చారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి. జగన్ అధికారంలోకి వస్తే అరాచక పాలన వస్తుందని ముందే చెప్పానని.. ఇప్పుడు అదే జరుగుతోందని గుర్తు చేశారు తులసీరెడ్డి.  పనిలో పనిగా మిగతా ప్రతిపక్షాలనూ ఏకిపారేశారు తులసీరెడ్డి. వైసీపీ, టీడీపీ, జనసేన.. ఈ మూడు పార్టీలు బీజేపీకి తోక పార్టీలన్నారు. ఆంధ్రలో కుస్తీ.. హస్తినలో దోస్తీ.. అంటూ కమలనాథులపై కస్సుమన్నారు. బీజేపీ చంకలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉన్నారన్నారు. జనం లేని పార్టీ జనసేన అంటూ విమర్శించారు. వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు బీజేపీకి బినామీలు అని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం అందరి పార్టీ అన్నారు తులసిరెడ్డి.

భర్త ఎఫైర్.. భార్య అటాక్..

వాళ్ళిద్దరిది ప్రేమవివాహం. పెళ్ళై 12 సంవత్సరాలు అవుతుంది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. మరోయువతితో అక్రమ సంబంధం స్టార్ట్ చేశాడు. ఆ విషయం తెలుసుకున్న భార్య భర్తను పలకరిస్తే అదేం లేదని బుకాయిస్తూ, భార్యకు సమాధానం చెప్పకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. ఇక అంటే భార్య . ఓ రోజు కాపుకాసి భర్తను, అతనితో అక్రమ సంబంధం పెట్టుకున్న అమ్మాయితో కలిసి ఉండడం చూసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఇంకేముంది బందువులకు కబురు పెట్టి  ఆ తర్వాత ఇద్దరికి బడితపూజ చేసింది. ఈ ఘటన కొత్తగూడెం, గాజులరాజాం బస్తీలో వెలుగులోకి వచ్చింది. కేబుల్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న రాజు 12 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.  అయితే కొన్ని నెలలుగా రాజు.. మరో యువతితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. భర్తపై అనుమానం రావడంతో భార్య నిలదీసింది. అదేంలేదంటూ తప్పించుకున్నాడు. దీంతో భర్తపై ఆమె నిఘా పెట్టింది. వేరే యువతి ఇంటికి భర్త వెళ్లిన తర్వాత బయట గెడ పెట్టి.. బంధువులకు ఫోన్ చేసింది. వారిముందే భర్తతోపాటు ఆ యువతిని చితకబాదింది. ఈలోగా సమాచారం అందుకున్న పోలీసులు వచ్చి వారిని స్టేషన్‌కు తరలించారు.

తూ ..తూ మంత్రంగా బడ్జెట్ సమావేశాలు ?

మార్చి నెల వచ్చేసింది. కానీ ఇంకా తెలంగాణ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఎప్పుడు అనే విషయంలో మాత్రం స్పష్టత రాలేదు. సహజంగా మార్చి మొదటి వారంలో బడ్జెట్ సమావేశాలు జరగడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ సంవత్సరం ఎమ్మెల్సీ ఎన్నికలు అడ్డురావడంతో ఎన్నికలు ముగిసిన తర్వాత.. మార్చి మూడవ వారంలో బడ్జెట్ సమావేశాలు ఉంటాయని ప్రభుత్వ వర్గాలు కొద్ది రోజుల క్రితం ప్రకటించాయి. అయితే ఇప్పుడు అందుతున్న తాజా సమాచారం ప్రకారం, నాగార్జున సాగర్ ఉపఎన్నిక  నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే  బడ్జెట్ సమావేశాలు ఎప్పుడు, ఎలా,ఎన్ని రోజులు అనే విషయంలో స్పష్టత వస్తుందని తెలుస్తోంది.   కేంద్ర ఎన్నికల సంఘం మార్చి 15 వ తేదీలోగా నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తే.. మార్చి మూడవ వారం మొదట్లో క్లుప్తంగా రెండు రోజులు సభను సమావేశపరిచే అవకాశం ఉందని తెలుస్తోంది. మొదటి రోజు గవర్నర్ ప్రసంగం, రెండవ రోజు బడ్జెట్ ప్రవేశ పెట్టి సాగర్ ఉపఎన్నిక ముగిసే వరకు సభను వాయిదా వేయాలని ప్రభుత్వం తొలుత భావించింది. అయితే ఇప్పుడు  ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలుతో పాటు నాగార్జున సాగర్ నోటిఫికేషన్ రాకపోవడంతో.. మార్చి చివరి వారంలో ఒకే సారి ఓ వారం రోజుల పాటు సమావేశాలు నిర్వహించి, ఏప్రిల్ 1 న కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యేలోగా బడ్జెట్ కథకు ముగింపు చెప్పాలని ప్రభుత్వం తలపోస్తోందని విశ్వసనీయ వర్గాల సమాచారం. గతంలో కనీసం పది పనిదినాలు ఉండేలా 15 రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు నిర్వహించడం  ఆనవాయితీగా వస్తోంది. బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ పై చర్చ ఆమోదంతో పాటు, గవర్నర్ ప్రసంగం, గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం పై చర్చ ఉంటుంది. ప్రభుత్వ సమాధానం, ప్రశ్నోత్తరాలు, స్వల్ప వ్యవధి చర్చ, ఇలా వివిధ నిబధనల పరిధిలో.. అనేక ప్రజాసమస్యలు చర్చకు వస్తాయి. కానీ ఈ సారి గవర్నర్ ప్రసంగం, బడ్జెట్ పై చర్చకు కూడా అంతగా అవకాశం ఉండక పోవచ్చని తెలుస్తోంది. గత సెప్టెంబర్ లో జరిగిన వర్షాకాల సమావేశాల్లో కొందరు సభ్యులు, సిబ్బందికి కొవిడ్ సోకడంతో అర్ధాంతరంగా వాయిదా వేశారు. వర్షాకాల సమావేశాల్లో  రెవెన్యూ బిల్లు సహా కొన్ని కీలక బిల్లులు అయితే ఆమోదం పొందాయి.  కానీ ప్రజా సమస్యలు అంతగా చర్చకు రాలేదు. ఆ తర్వాత అక్టోబర్ 13, 14 తేదీలలో రెండు రోజులపాటు జరిగిన ప్రత్యేక సమావేశాల్లో కేవలం హై కోర్టు ఆదేశాల మేరకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టసవరణ బిల్లు, యాసంగి పంటలు, ధాన్యం  కొనుగోలు విధానం మాత్రమే చర్చకు వచ్చాయి.   రాష్ట్రం ఎదుర్కుంటున్న సమస్యలు ముఖ్యంగా..  రోజు రోజుకు దిగజారుతున్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, పెరుగుతున్న అప్పులు, తరుగుతున్న ఆదాయం, ఆందోళనకు గురి చేస్తున్న శాంతి భద్రతల పరిస్థితిపై చర్చ జరగాల్సి ఉందని విపక్షాలు భావిస్తున్నాయి. నిరుద్యోగం, కేంద్ర ప్రభుత్వం నుంచి అందవలసిన సహాయం అందకపోవడం ఇలా రాష్ట్రాన్ని వేధిస్తున్న వివిధ అంశాలపై చర్చించేందుకు బడ్జెట్  సమావేశాలు కొంత ఎక్కువ కాలం నిర్వహించ వలసి ఉందని  ప్రతిపక్ష పార్టీలు చెబుతున్నాయి.  అయితే ప్రభుత్వం మాత్రం ఎదో విధంగా బడ్జెట్ పద్దు ‘మమ’ అని పించుకుంటే చాలనే ఉద్దేశంతో ఉన్నట్లు, అధికార వర్గాల సమాచారం బట్టి తెలుస్తోంది.  

నలుగురు మంత్రుల మాఫియా

ఏపీలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం వాడివేడీగా సాగుతోంది. అధికార, విపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.సినీ హీరో, టీడీపీ ఎమ్మెల్యే  బాలకృష్ణ.. తన సొంత నియోజకవర్గం హిందూపురంలో  మున్సిపల్ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ పై విరుచుకుపడ్డారు బాలయ్య. రాష్ట్రంలో వ్యవస్థలను నిర్వీర్యం చేశారని, ఏపీలో నలుగురు మంత్రుల మాఫియా నడుస్తోందని మండిపడ్డారు. ఒకరు చంద్రబాబును తిట్టడానికి... మరొకరు లిక్కర్ మాఫియా నడపడానికే ఉన్నారన్నారు బాలకృష్ణ. అన్నింటినీ ప్రైవేటు పరం చేసి వ్యవస్థలను నిర్వీర్యం చేశారని విమర్శించారు. ఐఏఎస్, ఐపీఎస్‌లు గత ప్రభుత్వంలో గౌరవంగా ఉండే వారనీ.. ఇప్పుడు ఐఏఎస్, ఐపీఎస్‌ల పరిస్థితి మారిపోయిందని బాలయ్య వ్యాఖ్యానించారు. ఏపీలో ప్రస్తుతం ఇసుక.. మద్యం మాఫియా రాజ్యమేలుతున్నాయని బాలకృష్ణ విమర్శించారు. రాష్ట్రంలో యువత భవిష్యత్తు అంధకారం అయిందన్నారు. ఒక్క ఛాన్స్ పేరుతో రాష్ట్రాన్ని నాశనం చేశారని చెప్పారు. గతంలో మట్కా.. అసాంఘిక కార్యకలాపాలను కట్టడి చేశామని, ఇప్పుడు ఇవన్నీ రాజ్యమేలుతున్నాయని బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసర ధరలు సామాన్యులకు అందుబాటులో లేవన్నారు. హిందూపురంలో ఎవ్వరు భయపడొద్దని, రెండేళ్లలో ఏమి అభివృద్ధి చేశారో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 20 సంవత్సరాలు వెనక్కి వెళ్లామన్నారు. హిందూపురంను గత ప్రభుత్వం టీడీపీ హయాంలో అన్ని విధాలుగా అభివృద్ధి చేశామన్నారు. జవాబు దారి తనం ఉన్న పార్టీకి ప్రజలు ఓటు వేయాలని బాలయ్య పిలుపు ఇచ్చారు.  

ఆ ఇద్దరు ఆర్థిక ఉగ్రవాదులు..

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి దిగజారిపోయింది. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. కాగ్ నివేదిక ప్రకారం అప్పుల్లో ఏపీ దేశంలోనే టాప్. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఇంత దారుణంగా మారడానికి ఆర్థిక ఉగ్రవాదులే కారణమన్నారు ఏపీ ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు కుటుంబరావు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డిలు ఉగ్రవాదుల కంటే ప్రమాదకరమని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి నెల జీతాలు 15వ తేదీన ఇచ్చారంటే రాష్ట్ర పరిస్థితిని అర్థం చేసుకోవచ్చుని అన్నారు. ఐదేళ్ళల్లో టీడీపీ ప్రభుత్వం చేసిన అప్పుల కంటే పది నెలల కాలంలో జగన్ ప్రభుత్వం చేసిన అప్పులు రెడ్డింపు అయ్యాయన్నారు. అభివృద్ధి కోసం అప్పులు చేయటంలో అర్థముంది.. కానీ పప్పు, బెల్లం పంచటానికి అప్పులు చేయటం చేతకాని తనమని కుటుంబరావు మండిపడ్డారు.  ఏపీ ఆర్థిక పరిస్థితిపై సామాన్య ప్రజలు సైతం ఆలోచించుకోవాలని కోరారు కుటుంబరావు. సంక్షేమ పథకాలు ఇస్తునే.. పన్నుల వసూలు చేస్తూ ప్రజలను దోచుకుంటున్నారని అన్నారు. ఆస్తిపన్నులు, లిక్కర్, పెట్రోల్, డీజిల్‌పై ఏపీ ప్రభుత్వం ఎక్కువ టాక్స్ వసూలు చేస్తోందని విమర్శించారు. ఆటో డ్రైవర్లకు ఇచ్చే పది వేలు పెట్రోల్ డీజిల్‌కే సరిపోవటంలేదని విమర్శించారు.  అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ టాప్! ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయే ఛాన్స్  ఆంధ్రప్రదేశ్ అంటే ఒకప్పుడు అన్నపూర్ణ రాష్ట్రం. స్వర్ణాంధ్రప్రదేశ్ ఏపీ ప్రజల నినాదం. కాని ఇప్పుడు సీన్ మారిపోయింది. జగన్ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్ అప్పుల రాష్ట్రంగా మారిపోయింది. అప్పు చేస్తేనే కాని రోజు గడవని పరిస్థితిలోకి వెళ్లిపోయింది. ఉద్యోగులకు వేతనాలు ఇవ్వాలన్నా అప్పు  చేయాల్సిన దుస్థితిలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉంది. ఇదేదో ఊరికే చెప్పడం కాదు.. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్  విడుదల చేసిన గణాంకాలే చెబుతున్నాయి. రాష్ట్రాలు తీసుకున్న రుణాల శాతంలో ప్రస్తుతం దేశంలోనే ఏపీలో టాప్ లో ఉంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో పది నెలల లెక్కలను విడుదల చేసిన కాగ్.. జనవరి నెలాఖరు వరకు ఏపీ రూ. 73,912.91 కోట్లను అప్పుల రూపంలో సమకూర్చుకున్నట్టు తెలిపింది. బహిరంగ మార్కెట్ నుంచి అప్పులు తీసుకోవడంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నాలుగో స్థానంలో నిలిచింది. ఏప్రిల్ 2020 నుంచి డిసెంబరు వరకు రూ.44,250 కోట్లను.. ఏపీ ప్రభుత్వం బహిరంగ మార్కెట్ నుంచి రుణంగా సేకరించింది. ఇందుకోసం స్పెషల్ డ్రాయింగ్ సౌకర్యం, చేబదుళ్లు, ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాన్ని ఉపయోగించుకుంది. అంతేకాదు రాష్ట్రం తీసుకున్న అప్పులలో 42% కంటే ఎక్కువ గత రుణంపై వడ్డీని తిరిగి చెల్లించటానికి వెళుతుంది.  గత ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ రాబడి పెరిగినా.. రుణాలు కూడా భారీ స్థాయిలో పెరిగాయి. 2010-20 ఆర్థిక సంవత్సరంలో జనవరి నెలఖారు వరకు రెవెన్యూ రాబడి రూ. 85,987.04 కోట్లుగా ఉండగా, ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.88,238.70 కోట్ల రాబడి ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో జనవరి నెలాఖరు నాటికి రూ.46,503.21 కోట్ల రుణం ఉంటే ఇప్పుడది ఏకంగా రూ. 73,912.91 కోట్లకు చేరింది. ఈ ఏడాది అప్పు అంచనాతో పోలిస్తే ఇది 153 శాతం అధికం. రాష్ట్రంలో ఖర్చు చేస్తున్న ప్రతి 100 రూపాయల్లో రూ. 45 అప్పుగానే సమకూర్చుకున్నట్టు కాగ్  విడుదల చేసిన గణాంకాలను బట్టి తెలుస్తోంది.  2020-21 ఆర్థిక సంవత్సరంలో  జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తన బడ్జెట్లో అంచనా వేసిన దానికంటే 142% ఎక్కువ అప్పు తీసుకుంది. 2020 డిసెంబర్‌లో కాగ్ ఇచ్చిన నివేదిక ప్రకారం 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్ర ఆర్థిక లోటు రూ .68,536 కోట్లు. 40,190 కోట్ల రూపాయల లోటుతో రాజస్థాన్ రెండో స్థానంలో ఉంది.  ద్రవ్య లోటు పెరుగుదల అధిక వడ్డీ చెల్లింపులను సూచిస్తుంది. వడ్డీ చెల్లింపులు అభివృద్ధి కాని ఖర్చులుగా పరిగణించబడతాయి. ఇవి పన్ను చెల్లింపుదారుపై భారాన్ని కలిగిస్తాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం 13,406 కోట్ల రూపాయలను వడ్డీ చెల్లింపులు చేసింది.  జగన్ రెడ్డి సర్కార్ సంక్షేమ పథకాలను కొనసాగిస్తోంది. ఈ పథకాలను అందించడానికి పన్నులు పెంచుతోంది. అది చాలక ఇబ్బడిముబ్బడిగా అప్పులు చేస్తోంది. రాష్ట్ర ఆదాయానికి రూ .9,000 కోట్లకు పైగా పన్నుల రూపేనా వస్తోంది.  రాష్ట్రంలో ప్రతి వ్యక్తిపై పరోక్ష పన్నుల భారం ఎక్కువగా ఉంటుంది. పన్నుల ద్వారా వచ్చే రాబడి గత సంవత్సరంతో  పోలిస్తే 176% పెరిగింది. వడ్డీ చెల్లింపులు పెరిగితే రాష్ట్రానికి మరింత భారమవుతుంది. వడ్డీని తిరిగి చెల్లించడం కోసం మరింతగా రుణాలు తీసుకోవాల్సి వస్తుంది. దీని ప్రభావం  ఉత్పాదక పెట్టుబడిపై పడనుంది. ఇదే జరిగితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుప్పకూలిపోయే ప్రమాదం ఉందని ఎకనమిస్టులు చెబుతున్నారు.  ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి అత్యంత ప్రమాదకర పరిస్థితిలో ఉందని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. ఆదాయ లోటు మరియు ద్రవ్య లోటు బడ్జెట్ అంచనాల కంటే ఎక్కువగా ఉండటం చాలా డేంజర్ అంటున్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఆదాయ లోటు రూ .18,434 కోట్లుగా అంచనా వేయబడింది, అయితే ఇది 2020 డిసెంబర్ నాటికి రూ 49,809 కోట్లకు పైగా దాటింది. రాష్ట్ర వ్యయం మొత్తం ఖర్చులో సగం అప్పులకే వెళుతున్నాయి. ఇది ఆమోదయోగ్యం కాదంటున్నారు ఆర్థికవేత్తలు.  అప్పుల ఉచ్చుకు ఇది స్పష్టమైన సూచన అని హెచ్చరిస్తున్నారు. ఆర్థిక చిక్కులను అర్థం చేసుకోకుండా  జగన్ మోహన్ రెడ్డి తన ఎన్నికల మ్యానిఫెస్టోను అమలు చేయడమే ఆర్థిక సంక్షోభానికి కారణమని ఏపీ మాజీ సీఎస్ ఐవై కృష్ణారావు చెప్పారు. ఇది భయంకరమైన పరిస్థితి అని.. ఆర్థిక వ్యవస్థ ఎప్పుడు కూలిపోతుందో చెప్పలేమన్నారు. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఇంత దారుణంగా మారడానికి ఆర్థిక ఉగ్రవాదులే కారణమన్నారు ఏపీ ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు కుటుంబరావు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డిలు ఉగ్రవాదుల కంటే ప్రమాదకరమని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రచారానికి దావూద్...

ఎన్నికల ప్రచారంలో మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం, ఆలైఖైదా నేత బిన్ లాడెన్. వారి ఫోటోలే ప్రచారానికి కరెక్ట్. టీఆర్ఎస్ కు బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ ఇచ్చిన ఉచిత సలహా ఇది. అధికార పార్టీ నేతలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీవీ లాంటి గొప్ప నేత ఫోటోను వాడుకోవడంపై బండి మండిపడ్డారు. టీఆర్ఎస్ కు పీవీ ఫోటో కాకుండా, దావూద్, బిన్ లాడెన్ ఫోటోలు పెట్టుకుంటే ప్రజలు గుర్తిస్తారని సెటైర్లు వేశారు. గులాబీ పార్టీ నేతలు పీవీ ఫోటోను ప్రచారానికి వాడుకుంటున్నా.. కాంగ్రెస్ నేతలు స్పందించకపోవడం ఏంటని సంజయ్ ప్రశ్నించారు. ఆ రెండు పార్టీలు ఒక్కటే అని.. పరస్పరం కుమ్మక్కు అయ్యాయని ఆరోపించారు.  ఇక సమస్యలపై కేసీఆర్ ను అభ్యర్థించడం ఉండదు.. ఇక నుంచీ అన్నీ వార్నింగ్‌లే.. ఇదీ సీఎం కేసీఆర్ కు బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ ఇచ్చిన వార్నింగ్. లక్షల కోట్లు దోచుకున్నందుకు కేసీఆర్‌కు జైలు జీవితం తప్పదని, ఆయన పతనం ఆరంభమైందని హెచ్చరించారు. పనిలో పనిగా కేటీఆర్ నూ నిలదీశారు బండి. ఐటీఐఆర్‌ ప్రాజెక్టుపై టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తప్పుబడుతూ కాగ్‌ నివేదిక ఇచ్చిన మాట వాస్తవమా? కాదా? దీనిపై మంత్రి కేటీఆర్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు బండి సంజయ్.   

ప్రధాని మోడీకి ఎలక్షన్ కమిషన్  షాక్

దేశంలోని ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలలో ప్రస్తుతం ఉన్న ప్రధాని మోదీ ఫొటోలపై కేంద్ర ఎన్నికల కమిషన్ సంచలన ఆదేశాలు జారీ చేసింది. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఆ ఐదు రాష్ట్రాల్లోని పెట్రోల్ పంపుల్లో మోదీ ఉన్న హోర్డింగులను 72 గంటల్లోగా తొలగించాలని ఈసీ ఆదేశించింది. దేశ ప్రధానమంత్రి ఫోటోలతో కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి ప్రచారం చేస్తూ పెట్రోల్ పంపుల్లో హోర్డింగులు పెట్టడం ఎన్నికల నిబంధనల ఉల్లంఘనగా ఎన్నికల కమిషన్ పేర్కొంది. ఇది ఇలా ఉండగా కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ ఫొటోలు, పోస్టర్లు, వీడియోలను పెట్రోల్ పంపుల్లో ప్రదర్శిస్తున్నారని.. దీనిపై ఆదేశాలు జారీ చేయాలని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఈసీకి ఫిర్యాదు చేసింది. దీంతో పెట్రోల్ పంపులతోపాటు వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రచారంలో ప్రధాని మోదీ చిత్రాలు, పోస్టర్లు, వీడియోలను 72 గంటల్లోగా తొలగించాలని తాజాగా ఈసీ ఆదేశాలు జారీ చేసింది

బాలికలపై పోలీసుల వికృత చేష్టలు.. 

విచారణ పేరుతో పోలీసుల వికృత పనులు. బాలికల హాస్టల్లోకి ప్రవేశించి వారితో నగ్నంగా నృత్యం చేయించి దుశ్చర్యకు పాల్పడ్డారు. ఆ బాలికలతో అమానుషంగా ప్రవర్తించారు. ఓ కేసు విచారణ పేరుతో  పోలీసులు బాలికల హాస్టల్‌లోకి  ప్రవేశించారు. వారి డ్యూటీ మరిచి బాలికలతో బలవంతంగా బట్టలు విప్పించి.. వారితో నగ్నంగా నృత్యం చేయించారు. దీనికి సంబంధించి ఓ వీడి యో ఆన్‌లైన్‌లో వైరల్‌ అవుతోంది. ఈ ఘటన మహారాష్ట్రలోని జల్గావ్‌లో జరిగింది. పోలీసుల దుర్మార్గం పై  మహారాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. విచారణ కోసం నలుగురు సభ్యులతో అత్యున్నత స్థాయి కమిటీని నియమిస్తున్నట్లు బుధవారం అసెంబ్లీలో హోంశాఖ మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ ప్రకటించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఘటన చాలా తీవ్రమైనదని, ప్రభుత్వం అంత సీరియస్ లేదని అంతకుముందు అసెంబ్లీలో బీజేపీ నేత సుధీర్‌ అసెంబ్లీలో ఆరోపించారు.