హెల్మెట్‌ మాకేనా..పోలీసులకు ఉండవా..?

ఆర్టికల్ 14 ప్రకారం చట్టం ముందు  అందరు సమానమే. అది పొలిటిషన్ అయినా, పోలీస్ అయినా , సామాన్యులైనా. చట్టానికి ఎవరు చుట్టాలు కారు. కొందరు అధికారులు తమకు చట్టాలు చుట్టాల భావిస్తుంటారు. అందుకే వాళ్ళు చేసే తప్పులు కనిపించవు. వాళ్ళు చేసింది తప్పని అడగడానికి దైర్యం చేయరు. కానీ ఖమ్మం లో ఒక్క యువకుడు పోలీసుల తీరును వ్యతిరేకించాడు. రూల్స్ మాకేనా మీకు ఉండవా అని ప్రశ్నించాడు ఆ యువకుడు.   హెల్మెట్‌ పెట్టుకోలేదని పోలీసులనే ప్రశ్నించాడు ఓ యువకుడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో హెల్మెట్‌ పెట్టుకోని వారికి పోలీసులు జరిమానాలు విధిస్తున్నారు. అయితే పోలీసులు ద్విచక్రవాహనాలపై హెల్మెట్‌ ధరించకుండా వచ్చిన విషయాన్ని గమనించిన ఓ యువకుడు ఇదేంటని ప్రశ్నించాడు. మీకు శిరస్త్రాణం పెట్టుకునే బాధ్యత లేదా అంటూ నిలదీశాడు. తన సెల్‌ఫోన్‌లో వీడియో తీస్తూ ఎందుకు హెల్మెట్‌ పెట్టుకోలేదని, మీరే నిబంధనలు పాటించనప్పుడు మాకెలా జరిమానాలు విధిస్తారని ఆ యువకుడు మండిపడ్డాడు.   

వైఎస్సార్ వల్లే రాష్ట్ర విభజన.. చంద్రబాబుకు తుళ్లూరు శాపం..

ఆంధ్రప్రదేశ్ విభజనకు వైఎస్ రాజశేఖర్‌రెడ్డే కారకుడు. అప్పటి సీఎం కోట్ల విజయ భాస్కర్‌రెడ్డిని గద్దె దించేందుకు తెలంగాణ ఉద్యమానికి నాంది పలికింది నాటి వైఎస్సారే. చెన్నారెడ్డితో మొదలైన ఉద్యమం ఉస్మానియాకు చేరింది. ఆ తర్వాత కేసీఆర్ సారథ్యంలోకి వెళ్లింది. ఇలా తెలంగాణ ఉద్యమానికి, రాష్ట్ర విభజనకు కారకుడు తన మిత్రుడైన వైఎస్ రాజశేఖరరెడ్డే అన్నారు కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్. మౌనంగా ఉండడం ఇష్టం లేక నోరు విప్పుతున్నానంటూ చింతా మోహన్ చేసిన కామెంట్లు రాజకీయంగా ప్రకంపణలు సృష్టిస్తున్నాయి.  దేశం, రాష్ట్రం నాశనం అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు కేంద్ర మాజీ మంత్రి. విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని యూపీఏ సర్కార్ హామీ ఇచ్చిందని, తిరుపతిని రాజధాని చేయాలని నాటి ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కోరామన్నారు. తిరుపతి చూట్టూ లక్ష ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, తిరుపతి రాజధాని అవుతుందని బ్రహ్మంగారి కాల జ్ఞానంలో కూడా ఉందన్నారు చింతా మోహన్. తుళ్లూరు రాజధానిగా సాధ్యం కాదని, అది శపించబడిన స్థలమని చంద్రబాబుకు ముందే చెప్పానన్నారు. తుళ్లూరులో అడుగు పెట్టి చంద్రబాబు మటాస్ అయ్యారని, అంజయ్య, భవనం వెంకట్రామ్, ఎన్టీఆర్ పదవులు సైతం పోయాయన్నారు. తుళ్లూరులో అడుగుపెడితే పదవి గండం తప్పదన్నారు. జగన్‌కూ అదే గతి పడుతుందని జోస్యం చెప్పారు. టీడీపీ మునిగిపోయే నావా అని.. చంద్రబాబు చల్లని రూపాయని విమర్శించారు. చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉండి.. తిరుపతికి 14 రూపాయలు కూడా ఇవ్వలేదన్నారు.  ఎన్నికల సమయంలో ప్రజాస్వామ్యం అపహాస్యమైందని.. బోగస్ ఎన్నికలను నిర్వహించడం అవసరమా అని ప్రశ్నించారు. అమ్మ ఒడి వల్ల 5 లక్షల మంది ప్రైవేటు టీచర్స్ రోడ్డున పడ్డారన్నారు. 50 వేల ప్రైవేటు విద్యా సంస్థలు మనుగడ కోల్పోయాయన్నారు.  తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక చరిత్రలో నిలిచిపోతుందన్నారు చింతా మోహన్. తిరుపతి బై పోల్ చంద్రబాబు, జగన్ భవిష్యత్తు నిర్ణయించే ఎన్నిక కాదని.. దేశ భవిష్యత్తు నిర్ణయించే ఎన్నికలన్నారు. బ్యాంకులు, రైల్వే, ఎల్ఐసీ, విశాఖపట్నం ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని చింతా మోహన్ తప్పబట్టారు. బీజేపీ, వైసీపీకి తేడా లేదన్నారు కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్. 

విమానంపై సోనూసూద్ ఫోటో.. 

సోనూసూద్ అంటే ఇండియాలో తెలియని వాళ్ళు ఉండరు. ‌అరుంధతి సినిమాలో వదల బొమ్మాలి వదలా అంటూ నెగిటివ్ పాత్ర పోషించిన  సోనూసూద్. నటుడిగా వచ్చి సేవకుడిగా మారి లాక్ డౌన్ లో ఎంతో మందికి సేవ చేసిన విషయం  దేశ ప్రజలందరికి తెలిసిందే.. తన సేవకు గౌరవంగా   దేశీయ విమానయాన సంస్థ స్పైస్ జెట్ అరుదైన గౌరవం అందించింది. లాక్‌డౌన్‌ సమయంలో ఆయన చేసిన విశేషమైన సేవలకు గౌరవంగా స్పైస్ జెట్ బోయింగ్ 737 విమానం మీద సోనూసూద్ ఫొటో వేశారు. ‘ఆపద్బాంధవుడు సోనూసూద్‌కు సెల్యూట్‌’ అని క్యాప్షన్‌ కూడా ఇచ్చారు. దేశీయ విమానయాన సంస్థ సొంత ఖర్చులతో ఒక వ్యక్తి గౌరవార్థంగా ఇలా చేయడం ఇదే తొలిసారి.   స్పైస్‌జెట్‌ నుంచి లభించిన ఈ గౌరవం పట్ల సోనూ ఆనందం వ్యక్తం చేశారు. కష్టాల్లో ఉన్నవారికి తాను చేతనైనంత సాయం చేస్తూనే ఉంటానని తెలిపారు. మరోవైపు, లాక్‌డౌన్‌లో సోనూసూద్‌, స్పైస్‌జెట్‌ కలిసి విదేశాల్లో చిక్కుకున్న ఎంతో మంది భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చిన విషయం తెలిసిందే.  

త్వరలో విశాఖకు టీ-మంత్రుల బ‌ృందం! కేటీఆర్, గంటా మిలాఖత్

విశాఖ ఉక్కు ఉద్యమానికి కేటీఆర్ మద్దతు. అవసరమైతే విశాఖ వెళ్తానంటూ ప్రకటన. కట్ చేస్తే.. మంత్రి కేటీఆర్‌తో టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు భేటీ. ఉక్కు పోరాటానికి సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పారు. విశాఖ రావలసిందిగా కోరారు. స్పందించిన కేటీఆర్.. విశాఖ పర్యటనపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని, కుదిరితే అసెంబ్లీ సమావేశాల తర్వాత మంత్రులతో కలిసి బృందంగా విశాఖకు వస్తామని చెప్పారని తెలుస్తోంది.  తెలంగాణ శాసన సభ సమావేశాల బ్రేక్ సమయంలో మంత్రి కేటీఆర్‌ను ఏపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కలిశారు. వారి మధ్య రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. స్టీల్ ప్లాంట్ కోసం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు కేటీఆర్‌ను కలిసి మరింత మద్దతు కోరారు గంటా. గతంలోనే ఉక్కు ఉద్యమానికి సపోర్ట్ చేసిన కేటీఆర్.. విశాఖ పర్యటనపై త్వరలో నిర్ణయం తీసుకుంటానని గంటాకు చెప్పారు. 

కుక్కకు  డీఎన్‌ఏ టెస్ట్..  

ఆస్తుల కోసం అన్నదమ్ముల గొడవ పడడం వింటుంటాం. ఏదైనా వస్తువు కోసం గొడవ పడుతుంటారు. కానీ ఇద్దరు వ్యక్తులు ఒక కుక్క నాదంటే నాదంటూ గొడవ పడడం చూశారా.. చూసేవుంటారు కానీ ఈ కేసులో ఒక కొత్త కోణం ఉంది. అదేంటంటే... గత  ఏడాది  ఆగస్టులో ఓ లాబ్రాడర్‌ జాతి కుక్క.. తమదేనంటూ  షాదాబ్‌ ఖాన్, కార్తీక్‌ శివహరేలు గొడవ పడ్డారు. విషయం పెరిగి  పోలీస్‌ స్టేషన్‌లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. ఇక్కడే చిన్న ట్విస్ట్ ఉంది. ఇద్దరు వ్యక్తులు కుక్క  ఫిర్యాదు ఇవ్వడంతో కుక్క ఎవరితో తేల్చలేక పోలీసులు తలలు బాదుకున్నారు. ఎంతగా విచారణ చేసినా, అసలు యజమానెవరో పోలీసులు తేల్చలేకపోయారు. చివరకు డీఎన్‌ఏ పరీక్షలు చేయాలని నిర్ణయించారు.  ఎక్కడైనా ఒక వ్యక్తి ఎవరికి జన్మించాడో, తన పుట్టుపూర్వోత్తరాలేంటో తెలుసుకోవడానికి  డీఎన్‌ఏ టెస్ట్ చేస్తారు. కానీ ఈ కేసులో కుక్క  యజమాని ఎవరో తెలుసుకోవడానికి డీఎన్‌ఏ టెస్ట్ పరీక్ష చేశారు.  టెస్ట్ తర్వాత   కుక్క యజమానిని తేల్చారు ‌ పోలీసులు.  కుక్కను తాను పచ్‌మడీ ప్రాంతం నుంచి కొనుగోలు చేశానని షాదాబ్‌ తెలిపారు. దీంతో కుక్క నుంచి, కుక్క తల్లి నుంచి శాంపిళ్లను సేకరించి డిసెంబర్‌లో డీఎన్‌ఏ పరీక్షల కోసం హైదరాబాద్‌ పంపారు. ఆ ఫలితాలు ఇప్పుడు వచ్చాయి. కుక్క యజమాని షాదాబేనని తేలింది. డీఎన్‌ఏ పరీక్షల కోసం రూ.50 వేలు ఖర్చు పెట్టాను. చివరకు నా కుక్క నాకు దక్కింది. చాలా సంతోషంగా ఉంది అని షాదాబ్‌ ఖాన్‌ తెలిపారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ హోషంగాబాద్ లో జరిగింది. 

కలకలం రేపుతున్న స్టీల్ ప్లాంట్ ఉద్యోగి సూసైడ్ నోట్ ..

విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మికులు, ట్రేడ్ యూనియన్ల నేతల దీక్షలు, నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. మరోపక్క ఈ నెల 25 నుండి స‌మ్మె చేయాల‌ని కార్మికులు నిర్ణ‌యించారు. యాజ‌మ‌న్యానికి నోటీసు కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఉద్య‌మంలో యాక్టివ్ గా ఉన్న శ్రీనివాసరావు అనే  స్టీల్ ప్లాంట్ ఉద్యోగి  ఈ  ప్రైవేటీకరణపై మనస్తాపం చెందుతూ రాసిన సూసైడ్ నోట్ తాజాగా సంచలనం రేపుతోంది. అయన రాసిన లేఖలో.. "ప్రియమైన కార్మిక సోదరుల్లారా మనమంతా కలిసికట్టుగా ఉంటేనే ఈ పోరాటంలో విజయం సాధించగలం. ఈ రోజు జరగబోయే ఉక్కు కార్మిక గర్జన ఒక మైలురాయిగా మొదలు కావాలి. 32 మంది ప్రాణ త్యాగాల ప్రతిఫలం ఈ ఉక్కు కర్మాగారం. ఎట్టిపరిస్థితుల్లో దీనిని ప్రైవేటుపరం కానివ్వద్దు. నేను నా ప్రాణాన్ని ఈ ఉక్కు ఉద్యమం కొరకు త్యాగం చేస్తున్నాను. ఈ రోజు ఫర్నేస్‌లో అగ్నికి ఆహుతి కావడానికి  5:49 నిమషాలకు మూహుర్తం ఉంది కాబట్టి ఈ పోరాటానికి ప్రాణత్యాగం నా నుండి మొదలు కావాలి’’ అంటూ సూసైడ్ నోట్ రాసి శ్రీనివాసరావు ఇవాళ ఉదయం నుండి అదృశ్యమయ్యారు.  దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క పోలీసులు శ్రీనివాస్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.  

ఓడిపోయి.. తప్పతాగి...

ఎన్నికలు అన్నాక గెలుపు ఓటమిలు సహజం .. ఎన్నికలో ఓడిపోతే కొందరు బాధపడుతాడు. లేదంటే మనకు  అదృష్టం బాగాలేదని అనుకుంటారు. మహా అయితే మన టైం బాలేదు మళ్ళీ పోటీచేద్దాం అనుకుంటారు. కానీ ఓటమి ని జీర్ణించుకొని ఒక వ్యక్తి ఏం చేశాడో తెలుసా. తనకు ఓట్లు వేయలేదని మందు తాగి ఓటర్లను నానా మాటలు అన్నాడు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు.? ఏ పార్టీకి సంభందించిన వ్యక్తి అని తెలుసుకోవాలనుకుంటున్నారా.  ఏపీ మంత్రి మేకపాటి ముఖ్య అనుచరుడు ఆండ్ర సుబ్బారెడ్డి  ఆత్మకూరు మున్సిపల్ ఎన్నికల్లో రెండవ వార్డు నుంచి వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన ఈయన ఓటమి చవిచూసారు. వార్డు ఎన్నికల్లో ఓడిపోయాననే ఆక్రోశంతో పూటుగా మద్యం సేవించి గ్రామ సచివాలయానికి వెళ్లి నానా హంగామా చేశారు. తనకు ఓట్లు వేయనివారు నాశనమవుతారంటూ శాపనార్ధాలు పెడుతూ అక్కడి స్థానికులను భయాందోళనకి గురి చేశారు.  పీకల్లోతు మద్యం సేవించి గందరగోళం సృష్టించిన ఆయన చేష్టలతో  విసిగిపోయిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకుని సుబ్బారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

చిన్నారెడ్డి రాజకీయ సన్యాసం! రేవంత్‌రెడ్డి సహకారం..

ఇకపై ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనని కాంగ్రెస్ సీనియర్ నేత చిన్నారెడ్డి చేతులెత్తేశారు. పనిలో పనిగా మిగతా వారికీ ఓ సలహా కూడా ఇచ్చేశారు. డబ్బులు లేకపోతే ఎవరూ ఎన్నికల్లో పోటీ చేయొద్దని హితవు పలికారు. పట్టభద్రులు సైతం అధికార టీఆర్ఎస్‌కు ఓట్లు అమ్ముకోవటం బాధ కలిగిస్తోందని అన్నారు.  కేవలం డబ్బులు పంచలేకపోవటం వలనే తనకు ఓట్లు పడలేదని ఆవేదన వ్యక్తం చేశారు చిన్నారెడ్డి. డబ్బు ఖర్చు చేయటంలో కేసీఆర్‌ను భవిష్యత్‌లో ఎవరు తట్టుకోలేరన్నారు. నాగార్జునసాగర్‌లో జానారెడ్డి మాత్రమే టీఆర్ఎస్, సీఎం కేసీఆర్‌కు తట్టుకోగలరన్నారు. పార్టీ నాయకత్వం, రేవంత్ రెడ్డి శక్తికి మించి తనకు సహకరించారని పొగిడారు. తాగుబోతులు, లంచగొండి రాష్ట్రంగా మార్చిన కేసీఆర్ నుంచి తెలంగాణను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. నాగార్జునసాగర్‌లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని.. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ పునఃనిర్మాణం కోసం పనిచేస్తానని చిన్నారెడ్డి స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి అంచున ఉన్న చిన్నారెడ్డి తీవ్ర నిరాశలో మునిగిపోయారు. అందుకే, ఇకపై ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించేశారు. 

ఏపీలో అండర్ గ్రౌండ్ మాఫియా

ఏపీలో అండర్ గ్రౌండ్ మాఫియా పెరగడం ఆందోళనకరం. రౌడీయిజాన్ని, గుండాలను అధికార వైసీపీ పెంచి పోషిస్తోంది. మాదక ద్రవ్యాలతో మత్తులో ముంచి యువతను పెడదారి పట్టిస్తున్నారు. వాటాల కోసం బెదిరించి పరిశ్రమలను తరిమేశారు. ఉపాధి అవకాశాలకు గండికొట్టారు. అక్రమ వసూళ్లు, రౌడీదందాలతో సామాన్య వ్యాపారులు బెంబేలెత్తుతున్నారంటూ జగన్‌రెడ్డి ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు. అధికార వైసీపీ మాఫియా గ్యాంగులకు రక్షణ కవచంగా మారిందని ఆరోపించారు. పొట్టకూటి కోసం మాఫియా ఉచ్చులో యువత చిక్కుకుంటోందని అన్నారు. అన్నా క్యాంటిన్ల మూత, పండుగ కానుకల రద్దుతో పేదల జీవితాలు దుర్భరమయ్యాయని తెలిపారు. మానవాభివృద్ది సూచిలో ఏపీ 27వ స్థానానికి దిగజారిందని మండిపడ్డారు యనమల. రాష్ట్రంలో నిరుద్యోగం 24% పెరిగిందని, పేదరికం 20%కు చేరిందని ఆరోపించారు. మాఫియా గ్యాంగ్‌లపై ఉక్కుపాదం మోపాలని, రౌడీయిజాన్ని అణిచేయాలని డిమాండ్ చేశారు యనమల. రాజకీయ కక్ష సాధింపులో మునిగితేలుతున్న సీఎం జగన్ ఇకనైనా పగలు, ప్రతీకారాలకు స్వస్తి చెప్పి పేదల సంక్షేమంపై శ్రద్ద పెట్టాలని సూచించారు. రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణపై దృష్టి పెట్టాలని, ఉపాధి కల్పించి యువత భవిత కాపాడాలని యనమల రామకృష్ణుడు కోరారు.

రహస్యం రచ్చ.. నిమ్మగడ్డ పిటిషన్‌ మరో బెంచ్‌కు బదిలీ

రహస్య లేఖలు లీకయ్యాయి. గవర్నర్ బంగ్లా నుంచి సమాచారం మీడియాకు చేరింది. దీనిపై సీబీఐతో దర్యాప్తు చేయించాలి అంటూ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ హైకోర్డును ఆశ్రయించారు. మంత్రులు పెద్దిరెడ్డి, బొత్సలను ప్రతివాదులుగా చేర్చారు. ఎస్‌ఈసీ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరగాల్సి ఉండగా అది వేరే బెంచ్‌కు బదిలీ అయింది.  ఏపీ గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌, తనకు మధ్య జరిగిన సంభాషణ లీక్‌ చేయడంపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. గవర్నర్‌తో పంచుకున్న అత్యంత కీలక సమాచారం లీక్‌ అయిందని, గవర్నర్‌కు రాసిన ఉత్తర ప్రత్యుత్తరాలు లీక్‌ అయ్యాయని పిటిషన్‌లో తెలిపారు. ఆ విషయాలన్నీ సామాజిక మాధ్యమాల్లో కనిపించడంపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని కోరారు. ప్రతివాదులుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాజ్‌భవన్‌ ముఖ్య కార్యదర్శిలతో పాటు మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణలను చేర్చారు. ఎస్‌ఈసీ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరగాల్సి ఉండగా మరో బెంచ్‌కు బదిలీ అయింది. 

కాలు జారిన బైడెన్

అమెరికా అధ్యక్షుడు మెట్లపై కాలు జారి పడ్డారు. విమానం ఎక్కుతుండగా తడబాటుకు లోనై.. కింద పడ్డారు. ఘటనలో ప్రెసిడెంట్ బైడెన్‌కు ఎలాంటి గాయాలు అవలేదు. ఆయన సుదర్షితంగానే ఉన్నారని వైట్‌హౌజ్ ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు కాలు జారి కింద పడటం మామూలు విషయమేమీ కాదు. అందుకే, ఈ న్యూస్ ఇప్పుడు అంతర్జాతీయంగా ప్రముఖ వార్త అయింది. అట్లాంటా రాష్ట్రంలో రెండు వేర్వేరు చోట్ల జరిగిన కాల్పుల ఘటనల్లో ఎనిమిది మంది మృతిచెందారు. వీరిలో ఆరుగురు ఆసియా మహిళలు ఉన్నారు. ఆసియా కమ్యూనిటీని కలిసేందుకు.. వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్‌తో కలిసి అట్లాంటా వెళ్లేందుకు సిద్దమయ్యారు. 'ఎర్‌ఫోర్స్ వన్' ఎయిర్ క్రాఫ్ట్ ఎక్కుతుండగా మెట్లపై కాలుజారి రెండుసార్లు కిందపడ్డారు. అనంతరం తనంతట తాను పైకి లేచి విమానంలోకి వెళ్లిపోయారు. ఈ ఘటనతో అధ్యక్షుడి సహాయ బృందం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.ఆయనకు ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. 

16 ఏళ్ళ అమ్మాయి పై.. ముగ్గురు అబ్బాయిలు..  

ఆ  అమ్మాయికి 16 ఏళ్ళు. తన ఫ్రెండ్ బర్త్ డే పార్టీకి పిలిచాడని వెళ్ళింది. కానీ, ఆ బర్త్ డే పార్టీ  చాటున  ప్రమాదం ఉందని గ్రహించలేదు ఆ అమ్మాయి. పార్టీకి వెళ్లిన ఆమెపై ముగ్గురు కుర్రాళ్లు అత్యాచార* చేశారు. ఆ విషయం ఎవరికైనా చెబితే చ*పేస్తామని బెదిరించారు. ఆ బాధ భరించలేని ఆ బాలిక తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పింది. ఇక అంతే ఆ తల్లిదండ్రుల గుండె పగిలింది. తన కూతురుకు వచ్చిన కష్టంపై న్యాయం కోసం పోరాడాలని నిర్ణయించుకుని. నేరుగా మహిళా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. సాధారణంగానే ఈ కేసు విచారణ కూడా సుదీర్ఘంగానే కొనసాగింది. అయినప్పటికీ ఎట్టకేలకు తీర్పు వచ్చింది. ఆమెకు న్యాయం జరిగింది. అసలు ఏం జరిగిందో చూద్దాం..  16 ఏళ్ల ఓ బాలిక స్నేహితుడు పిలిచాడని పుట్టిన రోజు వేడుకకు వెళ్లింది. అతడు ఆమెను ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడకు అతడి మరో ఇద్దరు స్నేహితులు కూడా వచ్చారు. వారు ముగ్గురు ఆ బాలికను బెదిరించి, భయపెట్టి ఆమెపై అత్యాచార* చేశారు. తనను వదిలేయమని ప్రాథేయ పడినా వినలేదు. అత్యాచార* చేసి ఎవరికైనా చెబితే చ*పేస్తామని బెదిరించి ఆమెను వదిలేసి వెళ్లిపోయారు. ఈ ఘటన 2018వ సంవత్సరం సెప్టెంబర్ 25న జరిగింది. ఆమె ఎలాగోలా అక్కడి నుంచి బయటపడి తన ఇంటికి చేరుకుంది. ఇంట్లో తల్లిదండ్రులకు విషయం చెప్పింది. దీంతో ఆ తల్లిదండ్రులు వెంటనే స్థానిక మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా పోలీసులకు కొన్ని నిజాలు తెలిశాయి. దారుణానికి పాల్పడిన ముగ్గురు కుర్రాళ్లు మైనర్లేనని తేలింది. మొత్తానికి రెండున్నరేళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం గురువారం దీనికి సంబంధించిన కేసులో కోర్టు తుది తీర్పు వెల్లడయింది. దారుణానికి పాల్పడిన ముగ్గురు మైనర్లకు జీవిత ఖైదు విధించింది. అదే సమయంలో ఒక్కొక్కరికీ 42వేల రూపాయల జరిమానా కూడా విధించింది. జార్ఖండ్ రాష్ట్రంలో జరిగిన ఈ ఘటన చోటు చేసుకుంది. 

భారీగా పెరిగిన పాజిటివ్ కేసులు.. మళ్ళీ హడలెత్తిస్తున్న కరోనా..

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి  మరింత ఉధృతమవుతోంది. రోజువారీగా నమోదవుతున్న పాజిటివ్ కేసులు మళ్ళీ హడలెత్తిస్తున్నాయి. గత నెల ఫిబ్రవరి వరకు తగ్గుతున్నట్లుగా కనిపించిన ఈ రోజువారీ పాజిటివ్ కేసులు మరోసారి ఇటు ప్రజలను అటు ప్రభుత్వాలను కూడా భయపెడుతున్నాయి.. దేశంలో వరుసగా తొమ్మిదో రోజు కరోనా బాధితుల సంఖ్య మరింత పెరిగింది. గడచిన 24 గంటలలో కొత్తగా 40,953 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,15,55,284కి చేరింది. మరోపక్క నిన్న కరోనా కారణంగా 188 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1,59,558 కు చేరింది.. ఇది ఇలా ఉండగా నిన్న 23,653 మంది కరోనా బారి నుండి కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 1,11,07,332కి చేరింది. రికవరీ రేటు 96.1 శాతంగా ఉంది. ఇక మన దేశంలో ప్రస్తుతం 2,88,394 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఇది ఇలాఉండగా దేశంలోనే ఎక్కువ పాజిటివ్ కేసులు నమోదవుతున్న మహారాష్ట్రలో నిన్న 25.7వేల కొత్త కేసులు  నమోదు అయ్యాయి. దీంతో ఈ నెలాఖరు వరకు విద్యా సంస్థలను మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరోపక్క మహారాష్ట్రలో వైరస్‌ ఉధృతి రీత్యా బస్సు సర్వీసుల రాకపోకలను మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం నిలిపివేసింది. ఇక నిన్న పంజాబ్‌లో 2.5వేలు, కేరళలో 1.98వేలు, కర్ణాటకలో 1.59 వేలు, గుజరాత్‌లో 1.4వేలు, మధ్యప్రదేశ్‌లో 1.14వేలు, చత్తీస్‌గఢ్‌లో 1.1వేలు, తమిళనాడులో 1.1వేల పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. మరోపక్క బెంగళూరు నగరంలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. గురువారం కర్ణాటకలో 1,590 కేసులు నమోదైతే, అందులో వెయ్యి కేసు‌లు బెంగళూరువే ఉన్నాయి. ఇది ఇలా ఉండగా మనదేశంలో గత నవంబర్ 29 తర్వాత అంటే... 111 రోజుల తర్వాత మళ్లీ అత్యధిక కేసులు రికార్డ్ అయ్యాయి. ఇక తెలంగాణ రాష్ట్రంలో నిన్న కొత్తగా 66,036 మందికి టెస్టులు చెయ్యగా 364 పాజిటివ్‌ కేసులు తేలాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3,02,724కి చేరింది. కొత్తగా కరోనాతో ఇద్దరు మరణించారు. మొత్తం మరణాల సంఖ్య 1,666కి చేరంది. మరణాల రేటు 0.55 శాతం ఉంది. తాజాగా 189 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీ కేసుల సంఖ్య 2,98,451కి చేరింది. ప్రస్తుతం 2,607 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. వాటిలో 980 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. ఇక జిహెచ్ఎంసీ పరిధిలో మొన్న 47 పాజిటివ్ కేసులు రాగా... నిన్న కొత్తగా 75 కేసులొచ్చాయి.  

ఉద్యోగం కోసం.. వ్యభిచార* 

ఉద్యోగం అవసరం ఉన్నవాళ్లే  వాళ్ళ టార్గెట్. అందులోను ముఖ్యంగా అమ్మాయిలే.  ఉద్యోగం పేరుతో నగరానికి వచ్చిన ఒంటరి అమ్మాయిలకు మాయమాటలు చెప్పి ట్రాప్ చేసి. వ్యభిచా* గృహాలకు పంపుతారు. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో మనం బతకాలంటే ఉద్యోగం కావాలి. ఉద్యోగం కోసం మనం చాలా ప్రయత్నాలు చేస్తుంటాం. మన అవసరాలను కొంత మంది కేటుగాళ్ళు కాష్ చేసుకుంటారు. మనకి  ఉద్యోగం కావలి. మోసం చేసేవాడికి డబ్బు తో పాటు అవసరం కావాలి. అందుకు ఈజీగా మోసపోయేవాళ్లు కావాలి.  అందుకే వాళ్ళు అమ్మాయిలను టార్గెట్ చేసుకున్నారు. ఉద్యోగం  పేరుతో  నగరానికి వచ్చిన కొంత మంది ఒంటరి అమ్మాయిలను సెలెక్ట్ చేసుకుని మాయ మాటలు చెప్పి, మోసపుచ్చి వ్యభిచా* గృహాలకు చేరవేశారు ముగ్గురు డుందగులు.   గోపాలపురం ఇన్‌స్పెక్టర్‌ సాయి ఈశ్వర్‌గౌడ్‌ కథనం ప్రకారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన సతీష్‌(28), వరంగల్‌కు చెందిన సురేష్‌(19), తూర్పుగోదావరికి చెందిన పవన్‌(20)లతో పాటు అఖిల్‌, తేజ, చరణ్‌ కలిసి ఓ ముఠాగా ఏర్పడ్డారు. ఉద్యోగాల కోసం నగరానికి వచ్చే ఒంటరి మహిళలకు మాయమాటలు చెప్పి వ్యభిచా* కూపంలోకి దించేవారు. దిల్లీకి చెందిన ఓ యువతి(19)కి ఫేస్‌బుక్‌లో హైదరాబాద్‌లో ఉంటున్న మహిళ పరిచయమై ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పింది. ఆ యువతి కొద్ది రోజుల క్రితం హైదరాబాద్‌ రాగా ఆమెను సతీష్‌కు పరిచయం చేసింది. ఆమెను వ్యభిచా* వృత్తిలోకి దించేందుకు ప్రయత్నించగా తప్పించుకుని ఈనెల 11న పోలీసులకు ఫిర్యాదు చేసింది. శుక్రవారం సతీష్‌, సురేష్‌, పవన్‌లను అరెస్ట్‌ చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు.     మనం ఉద్యోగం ఎందుకు చేస్తాం. తల్లిదండ్రులకి చేదోడు వాదోడుగా ఉందామనో, కుటుంబ పరిస్థితులు బాగాలేకానో .. సొసైటీలో బాగా బతుకుదామనో ఉద్యోగం చేయాలనుకుంటాం.. ఉద్యోగం చేయడం  వెనక  చాలా కారణాలే ఉండొచ్చు కారణాలు ఏవైనా అవసరం పీకల మీద ఉన్నపుడు  వెనక వెనక ముందు ఆలోచించకుండా అప్పుడప్పుడు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం. ఆ నిర్ణయాలు ఎక్కడి వరకు దారితీస్తాయో తెలియదు.  సో అందుకని ఆలోచించకుండా ఏ నిర్ణయాలు తీసుకోకండి. 

నీ ఇల్లు బంగారం కానూ...

8.5 కిలోల బంగారం. 78 కేజీల వెండి. ఏ జ్యూవెల్లరీ షాపులో ఉన్న నగల లెక్కలు కావివి. ఒకే ఒక్క వ్యక్తికి చెందిన వెండి, బంగారు ఆభరణాల చి్ట్టా ఇది. ఆ వ్యక్తి మరెవరో కాదు.. ఒకప్పటి స్టార్ హీరోయిన్, ప్రస్తుత బీజేపీ నేత ఖుష్బూ ఇంట్లో ఉన్న బంగారు ఖజానా. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఛెన్నైలోని థౌజండ్ లైట్స్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు ఖుష్బూ. ఈ సందర్బంగా దాఖలు చేసిన అఫిడవిట్‌లో తన దగ్గర ఉన్న ఆభరణాలు, ఆస్తుల చిట్టా ప్రకటించారు.  తన దగగ్ర 8.5 కిలోల బంగారు ఆభరణాలు ఉన్నాయని.. ఆ నగల విలువ 3.42 కోట్లు ఉంటుందని తెలిపారు. ఎనిమిదిన్నర కిలోల బంగారంతో పాటు 78 కిలోల వెండి కూడా ఉన్నట్టు అఫిడవిట్‌లో ఉంది. ఖుష్బూ దగ్గర ఏకంగా ఓ జ్యువెల్లరీ షాపునకు సరిపడా ఆభరణాలు ఉంటే.. ఆమె భర్త సుందర్ దగ్గర మాత్రం దాదాపు అర కిలో బంగారం, 9 కిలోల వెండి ఉన్నట్టు వెల్లడించారు. ఎంతైనా లేడీస్ లేడీసే కదా! ఇక ఖుష్బూకి భారీగా స్థిర, చరాస్తులు కూడా ఉన్నాయి. 34.56 కోట్ల స్థిరాస్తులు, 6.39 కోట్ల చరాస్తులు  సహా మొత్తం 40.96 కోట్ల విలువైన ప్రాపర్టీస్ ఉన్నట్లు తెలిపారు. తన  వార్షిక ఆదాయం 1.50 కోట్లు అని.. అయితే, బ్యాంకు ఖాతాలో ప్రస్తుతం కేవలం 2.15 లక్షల నగదు మాత్రమే ఉందని తెలిపారు. 40 లక్షల విలువ చేసే రెండు లగ్జరీ కార్లు కూడా ఖుష్బూ దగ్గర ఉన్నాయట.  అయితే, ఇంత ఆస్తులు, ఇన్ని వెండిబంగారు ఆభరణాలు ఉన్న ఖుష్బూ.. చదువుకుంది మాత్రం కేవలం ఎనిమిదో తరగతి వరకే.

షాకింగ్.. అక్కడ బడి పిల్లల మధ్యాహ్న భోజనానికి పశువుల మేత..!

ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులు చేరిక పెంచడానికి... అలాగే  పేద విద్యార్థులకు కనీసం ఒక పూట ఆహారం అందించడం కోసం దేశ వ్యాప్తంగా మధ్యాహ్న భోజన పథకం అమలవుతున్న సంగతి తెల్సిందే. ఈ పథకానికి ఇటు కేంద్ర  ప్రభుత్వం, అటు రాష్ట్ర ప్రభుత్వాలు నిధులను సమకూరుస్తున్నాయి. అయితే కొన్ని రోజుల క్రితం మహారాష్ట్రలో జరిగిన ఒక ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.. పేద విద్యార్థులకు అందించే  ఆహారం ఇదా అని తల్లిదండ్రులు, ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. మహారాష్ట్రలోని పూణె మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలోని పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలవుతోంది. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ఉన్న సమయంలో కూడా ఇక్కడ విద్యార్థులకు మధ్యాహ్న భోజనానికి సంబంధించిన ఆహార పదార్థాలను నేరుగా పిల్లలకు ఇంటివద్దకే  అందిస్తున్నారు. స్థానిక కార్పొరేషన్ అధికారులు దీనికి సంబంధించిన పనులను  పర్యవేక్షణ చేస్తున్నారు. అయితే కొన్నిరోజుల క్రితం విద్యార్థులకు అందించమని చెపుతూ కొన్ని ఆహార పదార్థాలు పూణెలోని  స్కూలు నెంబర్ 58కి  చేరుకున్నాయి. అయితే వాటిని విప్పి చూసినవారు షాక్ తిన్నారు. ఎందుకంటే అవి మనుషులు తినే ఆహార పదార్థాలు ఎంతమాత్రం కావు. అవి కేవలం  పశువులకు ఆహారంగా పెట్టే పదార్థాలు. అయితే వీటిని పిల్లలకు పెట్టండంటూ స్కూళ్లకు సరఫరా చేయడంపై ఇటు విద్యార్థి సంఘాలు, అటు తల్లిదండ్రులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా కొంతమంది స్థానికులు వీటి ఫోటోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేయగా.. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు రంగంలోకి దిగి ఈ ఆహార పదార్థాల బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయంపై  పూణె మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ స్పందిస్తూ..  ఎక్కడో తప్పు జరిగి ఉంటుందని.. కేవలం సమాచార లోపం వల్లే ఈ పొరపాటు జరిగి ఉంటుందని పేర్కొన్నారు అంతేకాకుండా దీనిపై ఇప్పటికే విచారణ కూడా ప్రారంభమైందని.. బాధ్యులైన వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని మేయర్ పేర్కొన్నారు. తాజాగా ఈ ఘటనను ఆధారం చేసుకుని ప్రతిపక్షాలు  అధికారపక్షంపై  విరుచుకుపడుతున్నాయి    

పార్టీల ఆస్తుల లెక్కలు..

దేశంలో ఎన్ని రాజకీయ పార్టీలున్నాయి? అందులో ఎన్ని జాతీయ పార్టీలు, ఎన్ని ప్రాంతీయ పార్టీలు? అంటే లెక్క చెప్పడం కొంచెం చాలా కష్టమే. ముఖ్యంగా, అన్నతో చెడి చెల్లి, అయ్యతో చెడి కొడుకు ఎరికి వారు వేరు కుంపటి పెట్టుకోవడంతో కుక్క గొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రాంతీయ పార్టీల లెక్క తేల్చడం, మరీ కష్టం కావచ్చును. అయితే, కేంద్ర ఎన్నికల సంఘం లెక్క ప్రకారం దేశంలో ఎనిమిది జాతీయ పార్టీలు,  ఓ ఫిఫ్టీ దాకా గుర్తింపు పొందిన ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. జాతీయ పార్టీలుగా గుర్తింపు పొందిన పార్టీలలో సిపిఐ,టీఎంసీ,ఎన్సీపీల జాతీయ హోదా త్రిశంకు స్వర్గంలో తేలియాడుతోంది. ఈ మూడు పార్టీలకు జాతీయ హోదా ఉపసంహరిచుకోమని కేంద్ర ఎన్నికల సంఘం 2019లోనే నోటీసులు ఇచ్చింది. అయితే, ఇంకా అధికారికంగా ఆ పార్టీల  జాతీయ హోదా రద్దు కాలేదు కాబట్టి వాటి హోదా ఇంకా కొనసాగుతోంది.  ఆప్ నుంచి ఎస్పీ దాకా, ఎంఐఎం నుంచి డీఎంకే, అన్నాడీఎంకే దాకా, బిజు జనతాదళ్ నుంచి జనతా దళ్ (ఎస్), జనతాదళ్ (యూ)వరకు టీడీపీ నుంచి తెరాస, వైసీపీ వరకు మొత్తం ఓ 48 గిర్తింపు పొందిన ప్రాతీయ పార్టీ లున్నాయి. ప్రాతీయ పార్టీలలో కాసుల పార్టీలు వేరయా అన్నట్లు, దేశం మొత్తంలో ఉన్న ప్రాంతీయ పార్టీల ఫైనాన్సు స్టేటస్ లెక్కలు తీస్తే, ఉభయ తెలుగు రాష్రాలలోని మూడు ప్రాంతీయ పార్టీలు,టీడీపీ, టీఆర్ఎస్, వైసీపీ ఫస్ట్ టెన్’ పార్టీలలో ప్లేస్ సంపాదించాయి.2018-19 సంవత్సరానికి దేశంలో టాప్‌ టెన్‌ పార్టీలతో కూడిన జాబితాను ‘అసోసియేషన్‌ ఆఫ్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్‌ (ఏడీఆర్‌) విడుదల చేసింది. ఈ జాబితాలో సమాజ్‌వాదీ పార్టీ రూ.572 కోట్లతో అగ్రస్థానంలో ఉండగా, నవీన్‌ పట్నాయక్‌ సారథ్యంలోని బీజేడీ రూ.232 కోట్లతో ఆ తర్వాత స్థానంలో ఉంది.  ఏఐఏడీఎంకే రూ.206 కోట్లతో మూడో స్థానంలో నిలిచింది.  ఇక తెలుగు పార్టీల విషయానికివస్తే రూ.193 కోట్ల ఆస్తులతో టీడీపీ నాలుగో స్థానంలో, రూ.188 కోట్ల ఆస్తులతో టీఆర్‌ఎస్‌ ఆరో స్థానంలో, రూ.93 కోట్ల ఆస్తులతో వైసీపీ ఎనిమిదో స్థానంలో నిలిచాయి. టీడీపీకి రూ.115 కోట్లు, టీఆర్‌ఎ్‌సకు రూ.152 కోట్లు, వైసీపీకి రూ.79 కోట్ల ఫిక్స్డ్  డిపాజిట్లు ఉన్నాయి.  కాగా బీజేపీ 2,904.18 కోట్ల ఆస్తులను ప్రకటించింది. జాతీయ పార్టీలు వెల్లడించిన ఆస్తుల్లో ఇది 54.29 శాతం. కాంగ్రెస్‌ రూ.928.24 కోట్ల ఆస్తులున్నట్లు ప్రకటించింది. ప్రాతీయ పార్టీలలో, తెలుగు పార్టీలు ‘గౌరవప్రద’ స్థానం ‘సంపాదించు’ కున్నాయి.

 గెలుపు దిశగా తీన్మార్ మల్లన్న..   

తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఉత్కంఠగా మారాయి. రెండు స్థానాల్లోనూ రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుతో పాటు ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. శనివారం ఉదయం 8 గంటల వరకు రెండు స్థానాల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థులే లీడ్ లో ఉన్నా... రౌండ్ రౌండ్ కు ఫలితాల్లో అనూహ్య మార్పులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా నల్గొండ-వరంగల్- ఖమ్మం ఎన్నిక తీవ్ర ఉత్కంఠగా మారుతోంది. ఫస్ట్ ప్రియారిటీలో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఆధిక్యత రాగా.. రెండో ప్రయారిటీలో మాత్రం తీన్మార్ మల్లన్న దూసుకుపోతున్నారు. రెండో ప్రయారిటీలో కోదండరామ్ కు ఎక్కువ ఓట్లు వస్తాయని అంతా భావించగా.. ఫలితాల్లో మాత్రం అందరి అంచనాలు తలకిందులు చేస్తూ తీన్మార్ మల్లన్నకు భారీగా ఓట్లు పోలవుతున్నాయి. నల్గొండ-వరంగల్- ఖమ్మం స్థానంలో ఇప్పటివరకు 66 మంది ఎలిమినేషన్ పూర్తైంది. 66వ రౌండ్ పూర్తయ్యేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి లక్షా 17 వేల 386 ఓట్లు రాగా తీన్మార్ మల్లన్న 91 వేల  858  ఓట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నారు. ప్రొఫెసర్ కోదండరామ్   79 వేల 110 ఓట్లు సాధించి మూడో స్థానంలో ఉండగా.. బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి 42 వేల 15 ఓట్లతో నాలుగో స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థి రాములు నాయక్ ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. రాములు నాయక్ కు 29 వేల ఓట్లు రావడంతో... ఈ రౌండ్ లో రెండో ఓటు ఎవరికి ఎక్కువగా వస్తుందన్నది ఆసక్తిగా మారింది తొలి ప్రాధాన్యత ఓటులో పల్లాకు 27 వేల 550 ఓట్ల ఆధిక్యం రాగా... రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో మాత్రం పల్లా వెనకబడ్డారు. ఆయన మూడో స్థానానికి పడిపోయారు. రెండో ప్రాధాన్యత ఓట్లలో తీన్మార్ మల్లన్న పుంజుకోవడంతో... పల్లా లీడ్ క్రమంగా తగ్గుతోంది. 66 మంది ఎలిమినేషన్ అయ్యేసరికి పల్లా ఆధిక్యం 25 వేల 5 వందలకు పడిపోయింది. ఇప్పటికే రెండు వేల ఓట్ల లీడ్ తగ్గించారు తీన్మార్ మల్లన్న.ఇదే ట్రెండ్ కొనసాగితే.. బీజేపీ అభ్యర్థి ఎలిమినేషన్ వరకు వచ్చేసరికి పల్లాపై తీన్మార్ మల్లన్న లీడ్ లోకి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కోదండరామ్ కు కూడా రెండో ప్రాధాన్యత ఓట్లు భారీగానే వస్తున్నాయి. ప్రస్తుతానికి తీన్మార్ కంటే 12 వేల ఓట్ల వెనుకంజలో ఉన్నారు. అయితే కాంగ్రెస్, బీజేపీ ఎలిమినేషన్ లో తనకు భారీగా ఓట్లు వస్తాయని కోదండరామ్ ఆశతో ఉన్నారు. 

వాణీ దేవి ధర్మాగ్రహం

తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ముందెన్నడూ లేనంతగా భారీ పోలింగ్ జరిగింది. చదువుకున్నోళ్ళు ఓటింగ్’కు రారు, ఓటేయరు అన్న అపవాదును తుడిచేసే విధంగా గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు, డాక్టర్లు, డాక్టరేట్లు, ఇంకా ఉన్నత చదువులు చదివి ఉన్నత ఉద్యోగాలు చేస్తున్న వారు, ఉద్యోగాల వేటలో పుస్తకాలతో కుస్తీ పడుతున్న నిరుద్యోగులు పోలింగ్ లో పాల్గొన్నారు. సాధారణ ఎన్నికల్లో సామాన్య ఓటర్లులా బారులు తీరి, ఓటు హక్కును వినియోగించుకున్నారు. రెండు నియోజక వర్గాలలోనూ భారీగా పోలింగ్ జరిగింది. రంగా రెడ్డి-మహబూబ్ నగర్ – హైదరాబాద్ నియోజక వర్గంలో ఏకంగా 67 శాతం పోలింగ్ నమోదైంది. ఇదొక రికార్డు.  ఇంత ఉత్సాహంగా ఓటేసినా ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన తెరాస అభ్యర్ధి, పీవీ కుమార్తె వాణీదేవికి ఓటర్ల మీద కోపమొచ్చింది. ఓట్ల మీద కోపం రావడం మాత్రమే కాదు, ఆమె మీద ఆమెకే జాలి లాంటిది ఎదో వేసింది. ఇంతకీ అందుకు కారణం ఏమంటే, చెల్లని ఓట్లు.ఆమె పోటీచేసిన నియోజకవర్గంలో ఏకంగా 20వేలకు పైగా  ఓట్లు చెల్లక పోవడంతో ఆమె తీవ్ర అసహనానికి గురయ్యారు. పట్టభద్రులు సక్రమంగా ఓటు హక్కు వినియోగించుకో లేక పోవడం పట్ల బాధను వ్యక్తంచేస్తూ, ఇవేం చదువులు, మేము నేర్పిన చదువులు ఇవేనా  అంటూ ఆవేదనతో కూడిన ఆగ్రహాన్ని, ఆవేదనను వ్యక్తం చేశారు. నిజమే కదా పట్టభద్రులకు ఓటు వేయడం రాక పోవడం పట్ల ఎవరికైనా ఆగ్రహం రావడం సహజమే కదా, అందునా ఉపాధ్యవృత్తిలో ఉన్న పీవీ కుమార్తెకు ఆగ్రహం రావడం సహజం.నిస్సందేహంగా ఆమెది అమెది ధర్మాగ్రహమే, అర్థం చేసుకోవచ్చును. అయితే, అదే పట్టభద్రుల ఎన్నికల్లోనూ   కోట్లు ఖర్చు చేయడం,ప్రలోభాలకు గురి చేయడం, సాధారణ ఎన్నికల్లో కంటే ఎక్కువగా తాయిలాలు ఎరావేయడం వంటి, సకల అక్రమాలకు పాల్పడడం విషయంలోనూ ఆమె అదే ధర్మాగ్రహాన్ని వ్యక్తం చేస్తే ఆమె గౌరవం ఇంకొంచెం ఇనుమడించేది కదా ..