అలర్జిక్ వ్యాధుల గురించి నమ్మలేని నిజాలు!!

శ్వాసకోశ వ్యవస్థలోని వివిధ భాగాలు అలర్జీ వ్యాధికి గురవటం చూస్తున్నాము. అలర్జిక్ రైనైటిస్, అలర్జిక్ బ్రాంకైటిస్, బ్రాంయల్ అస్తమా వంటి వ్యాధులు ఈ కోవకు చెందుతాయి. అలర్జీ అంటే మితిమీరిన సున్నితత్వం అని చెప్పవచ్చు. కొన్ని హానికరంకాని పదార్థాలకు, వాతావరణానికి శరీరం అతి సున్నితంగా స్పందించడమే. ఏ పదార్థానికైతే రోగి సున్నితత్వం కలిగి ఉంటాడో ఆ పదార్థాన్ని అలెర్జిన్ అంటాము. ఈ పదార్థాలు ఇతర ఆరోగ్యవంతులు తీసుకున్నా, ఎక్స్పోజ్ అయినా, ఎలాంటి దుష్ప్రభావం ఉండదు. కాని అలా ఉన్నవాళ్ళు ఈ అలెర్జెన్స్ ని తీసుకున్నట్లయితే దేహరక్షణ వ్యవస్థ తీవ్రంగా స్పందిస్తుంది. దీనినే అలర్జిక్ రియాక్షన్ అంటాము.  ఇది గాలిలో పుప్పొడి, దుమ్ము . ధూళి, తినే పదార్థాలలోగాని, పాలు, చేపలు, గుడ్లు, పులుపు, పండ్లు మొదలయి వాటికి దేనికైనా ఈ అలర్జీ రోగులు రియాక్ట్ కావచ్చు. ఆరోగ్య వంతులు ఈ పదార్థాలను సులభంగా శరీరంలో ఇముడ్చుకుంటారు. దేహరక్షణ వ్యవస్థ ఈ పదార్థాలను దేహానికి శత్రువులుగా భావించటం వల్ల రియాక్ట్ అవుతుంది. ఈ రియాక్షన్ చర్మం పైకాని, జీర్ణనాళంలో కాని, శ్వాసమండలంలో కాని జరగవచ్చు. శ్వాసమండలంలో ఈ అలర్జీ రియాక్షన్ ఏర్పడటం వల్ల రైనైటిస్, అలర్జిక్ బ్రాంకై టెస్, బ్రాం యల్ ఆస్తమావంటి వ్యాధులు వస్తాయి. అలర్జీక్ రియాక్షన్ తినే పదార్థాలనుండే కాకుండా ముఖ్యంగా వాతావరణ పరిస్థితుల వల్ల కూడా వస్తుంది. కొంతమంది అధిక తేమవల్ల, కొంతమంది చల్లదనం వల్ల, కొంతమంది వాతావరణంలో మార్పులకు కూడా స్పందిస్తారు. వేడి నుండి మేఘాలతో కూడిన తేమ వాతావరణం, మరికొంతమంది వాతావరణం లోని విద్యుత్ మార్పులకు కూడా స్పందించటం జరుగుతుంది. ఆరోగ్యవంతులు ఈ వాతావరణ పరిస్థితులకు సులభంగా తట్టుకోగలరు. అలర్జీ రోగుల్లో వ్యాధినిరోధక శక్తిలో సమతుల్యం లోపించటం వల్లనే ఈ విధంగా అతిగా రియాక్ట్ అవుతారు.  సాంప్రదాయ వైద్య విధానంలో రోగి ఏ పదార్థాలకు సున్నితంగా ఉన్నాడో, ఆ పదార్థాన్ని డైల్యూట్ చేసి అతిసూక్ష్మ పరిమాణంలో కొంతకాలం రక్తంలోకి ఇంజెక్ట్ చేస్తారు. దీనినే డిసిన్సిలైజేషన్ అంటారు. అంటే రోగి ఉన్న అతి సున్నితత్వం ఆ పదార్థం నుండి తగ్గిపోతుంది. ఈ పద్ధతి వల్ల రోగి రియాక్ట్ అవటం కొంత తగ్గుతుంది. కాని ఈ రకమైన డిసెన్సిటైనేషన్ వల్ల కూడా ఉపశమం తాత్కాలికమే. కొంతకాలం తర్వాత రోగి ఇంకో పదార్థానికి సున్నితత్వం పెరుగుతుంది. అలర్జిన్ మారిపోతుంది కాని సమస్య పరిష్కారం అవటంలేదు.  ఆహార పదార్థాలకు, దుమ్ము, ధూళి, పుప్పొడి వంటి పదార్థాలకు డిసిన్సిటైజేషన్ ప్రయత్నించవచ్చు. కాని, చల్లదనం, వేడి, వాతావరణంలో మార్పులకు సున్నితత్వాన్ని మా తం ఈ ప్రక్రియ ద్వారా ఏమి చేయలేరు. ఈ అలర్జిక్ వ్యాధులు దీర్ఘవ్యాధులు. అపుడపుడు వ్యాధి ఉద్రేకిస్తుంది. దీనిని అక్యూట్ అటాక్ అంటాము. అక్యూట్ అటాక్ తగ్గటానికి అక్యూట్ మందులు వాడినా, వెంటనే రోగ లక్షణాలు తక్కువవుతాయి. కాని రోగం నిగూఢంగా ఉంటుంది. తగిన పరిస్థితులు ఏర్పడినపుడు ఈ వ్యాధి మళ్లీ దర్శనమిస్తుంది. అలర్జిక్ వ్యాధులను సమూలంగా నయం చేయటానికి సమయం పడుతుంది. అలర్జిక్ వైనైటిస్లో 1-3 సంవత్సరాలు, ఆస్తమాలో 2 నుండి 6 సంవత్సరాలు పడుతుంది. వ్యాధి తీవ్రత, అక్యూట్ అటాక్స్ తరచుదనం, క్రమంగా తగ్గిపోతాయి. చికిత్స ప్రారంభ దశలో రోగి తనకు పడని ఆహార పదార్థాలకు, వాతావరణ పరిస్థితులకు దూరంగా ఉండడం మంచిది. చర్మానికి సంబంధించిన అలర్జిక్ వ్యాధులను పై పూతతో వ్యాధిని అణచివేయటం వల్ల రెస్పిరేటరీ అలర్జీ వచ్చే అవకాశం వుంది. ఇదీ అలర్జీక్ వ్యాధుల తీరూ… తెన్ను.                                       ◆నిశ్శబ్ద.

చేతులు కాళ్ళు వణుకుతున్నాయా... అయితే మీకూ ఈ ప్రమాదం ఉండొచ్చు!

చాలా మందికి కూర్చున్నప్పుడు  చేతులు లేదా కాళ్లు తరచుగా వేగంగా వణుకుతుంటాయి.  శరీరాన్ని సక్రమంగా  నియంత్రించడంలో  సమస్య ఏర్పడుతుంటుంది. ఈ లక్షణాలు ఉంటే మాత్రం దాన్ని లైట్ గా తీసుకోవడానికి లేదు. ఈ లక్షణాలు నాడీ వ్యవస్థకు సంబంధించినవిగా పరిగణిస్తారు. దీన్ని చాలా ప్రమాదకరమైన  పార్కిన్సన్స్ వ్యాధి లక్షణాలుగా కూడా చెబుతారు.  కదలికను నియంత్రించే మెదడులోని నాడీ కణాలలో సమస్య కారణంగా ఈ వ్యాధి వస్తుంది. ఈ వ్యాధిలో నరాల కణాలు చనిపోయిపోతాయి  లేదా క్షీణిస్తాయి. ఇది డోపమైన్ అనే ముఖ్యమైన రసాయనాన్ని ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. డోపమైన్  అనే రసాయనాన్ని ఉత్పత్తి చేసే కణాలలో 80 శాతం లేదా అంతకంటే ఎక్కువ నష్టం కలిగిన వారిలో  పార్కిన్సన్ లక్షణాలు అభివృద్ధి చెందుతాయి.  మనిషిలో సంతోషాన్ని కలిగించే న్యూరోట్రాన్స్మిటర్లలో డోపమైన్ ఒకటి. పార్కిన్సన్స్ వ్యాధి.. ప్రతి సంవత్సరం 60,000 కొత్త పార్కిన్సన్స్ వ్యాధి కేసులు నమోదు అవుతున్నాయి. ఈ పరిస్థితి సాధారణంగా 55 ఏళ్ల తర్వాత వస్తుంది.  అయితే ఇది 30-40 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులను ప్రభావితం చేస్తుంది. పార్కిన్సన్స్ వ్యాధి   మెదడులో ఉండే అత్యంత సాధారణమైన మోటార్ వ్యవస్థ దెబ్బతినడం వల్ల వచ్చే వ్యాధి. ఈ వ్యాధి అభివృద్ధి చెందుతున్నప్పుడు, దాని లక్షణాలు కూడా పెరుగుతాయి. వ్యాధి  తరువాతి దశలలో  మెదడు పనితీరు తరచుగా ప్రభావితమవుతుంది, ఇది చిత్తవైకల్యం వంటి లక్షణాలు, ఇంకా నిరాశకు దారితీస్తుంది. పార్కిన్సన్స్ వ్యాధి  లక్షణాలు.. పార్కిన్సన్స్ వ్యాధి శరీరంలో అనేక రకాల సమస్యలను కలిగిస్తుంది. శరీరంలో అవయవాలు,  దవడ  వణుకు లేదా అసంకల్పిత కదలిక ఉంటాయి. ఈ లక్షణాలలో అత్యంత సాధారణమైనవి కండరాల దృఢత్వం, భుజాలు లేదా మెడలో నొప్పి రావడం. మానసిక పరిస్థితిలో మార్పు లేదా స్పందించే  సమయం తగ్గుతుంది.  కనురెప్పలు ఆర్పే వేగం తగ్గుతుంది.  నడకలో  స్థిరత్వం ఉండదు.  డిప్రెషన్ లేదా డిమెన్షియా ప్రమాదం ఉంటుంది. పార్కిన్సన్స్ వ్యాధి ఎవరికి వస్తుంది?  కుటుంబంలో ఎవరికైనా ఇంతకు ముందు ఈ సమస్య ఉంటే, ఆ కుటుంబ సభ్యులు  కూడా దీని బారిన పడే ప్రమాదం ఉంది. అదనంగా, పార్కిన్సన్స్ వ్యాధిని మహిళల కంటే పురుషులలోనే  ఎక్కువగా వస్తుంది. టాక్సిన్స్ ఎక్కువగా ఉండే వ్యక్తులు కూడా దీని బారిన తొందరహా పడతారు. పార్కిన్సన్స్ వ్యాధికి చికిత్స,  నివారణ ఈ వ్యాధి ఉన్న రోగుల పరిస్థితి, దాని లక్షణాలను బట్టి ఈ వ్యాధి నియంత్రించడానికి  మందులు,  చికిత్స ఉంటుంది. దీని ద్వారా నాణ్యమైన జీవినశైలి అందించడానికి   ప్రయత్నాలు చేస్తారు. పార్కిన్సన్స్ వ్యాధి జన్యుపరమైన కారణాల వల్ల లేదా యాదృచ్ఛికంగా కూడా సంభవిస్తుంది. ఇలాంటి పరిస్థితిలో దాన్ని కంట్రోల్ చేయడం అసాధ్యం. అయినప్పటికీ, క్రమం తప్పకుండా ఏరోబిక్ వ్యాయామం చేయడం ద్వారా  పార్కిన్సన్స్ వ్యాధి ప్రమాదాన్ని  తగ్గించుకోవచ్చని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.                                                               *నిశ్శబ్ద.  

లిఫ్ట్ ఎక్కడం మాని మెట్లమీద వెళితే జరిగే మ్యాజిక్ ఏంటో తెలుసా!

ఇప్పట్లో ఆఫీసులు, ఇళ్లు అన్నీ బిల్డింగ్ లలోనే ఉంటున్నాయి. ఈ కారణంగా లిఫ్ట్ లు తప్పనిసరిగా వాడుతుంటారు. లిఫ్ట్ సౌకర్యం ఉందిగా.. మళ్ళీ మెట్లు ఎక్కి ఎందుకు శ్రమ పడాలి?? అనుకుంటారు ఎక్కువ శాతం మంది. అయితే ఆఫీసుల్లో గంటల కొద్ది కూర్చుని చేసే ఉద్యోగం, ఆ తరువాత ఇళ్ళల్లో కూడా మరీ శారీరక శ్రమ ఏమీ లేకుండా సింపుల్ గా పనులు జరిగిపోయే మార్గాలు ఉండటంతో శారీరక శ్రమ తక్కువగానే ఉంటుంది. అయితే ఇలా బిల్డింగ్ లలో లిఫ్ట్ లో వెళ్ళడం మానేసి మెట్లు ఎక్కితే జరిగే మ్యాజిక్ ఏంటో తెలుసా??  లిఫ్ట్‌కి బదులుగా మెట్లను ఉపయోగిస్తే.. రోజువారీ పనుల్లో వేగం కారణంగా లిఫ్ట్ ఎక్కువగా వాడుతారు. ఇది సమయాన్ని సేవ్ చేస్తుంది. కానీ ఈ అలవాటు మానుకుంటే చాలా ప్రయోజనాలు ఉంటాయి. రొటీన్‌లో ఈ చిన్న మార్పు మీకు ప్రయోజనకరంగా ఉంటుంది.  ఒక మెట్లు ఎక్కడం వల్ల సాధారణంగా నాలుగు అడుగులు నడిస్తే ఎన్ని కేలరీలు ఖర్చు అవుతాయి అయ్యి కేలరీలు దీనివల్ల ఖర్చు అవుతాయి.  రోజూ కనీసం 50 మెట్లు ఎక్కితే 2000 అడుగులు నడిచినంత ఫలితం చేకూరుతుంది. ఇప్పట్లో  ఎక్కువసేపు కూర్చుని పనిచేసేవారికి ఫిట్నెస్ తక్కువగానే ఉంటోంది . ఇలాంటి వాళ్లకు లైఫ్ స్టైల్ లో భాగమైన ఆఫీసులు, అపార్ట్మెంట్లకు వెళ్ళడం అనేది మంచి అనువైన మార్గం. వ శారీరక దుష్ప్రభావాలను తగ్గించడంలో  క్యాలరీలను బర్న్ చేయడంలో మెట్లు ఎక్కే ప్రక్రియ చాలా అద్భుత ఫలితాలను ఇస్తుంది.   బరువు పెరిగే ప్రమాదం తగ్గుతుంది. ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారంటే?  మెట్ల ఎక్కడం అనేది గుండె మరియు శ్వాసకోశ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకునే అద్భుతమైన వ్యాయామం.   మెట్లు ఎక్కేటప్పుడు ఫాలో అయ్యే విధానం కూడా దానికి తగిన ఫలితాలను ఇస్తుంది.   మెట్లపై నడవడం కంటే జాగింగ్ లాగా నెమ్మదిగా పరుగెడుతున్నట్టు వెళితే అదొక మంచి ఏరోబిక్ వ్యాయామంలా కూడా పనిచేస్తుంది. ఏరోబిక్ వ్యాయామాలు శరీరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతాయి.  రొటీన్‌ లైఫ్ స్టైల్ లో ఈ ఒక్క మార్పు చేసుకుంటే చాలు.. చాలా ప్రయోజనాలను కలిగి ఉంటుంది. మెట్లు ఎక్కడం అలవాటు చేసుకోవడం వల్ల, ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల శరీరం మీద కలిగే దుష్ప్రభావాలు తగ్గడమే కాకుండా రక్త ప్రసరణను ప్రోత్సహిస్తుంది.  గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కొన్ని ఆసక్తికర విషయాలు..   రోజుకు 55 కంటే ఎక్కువ మెట్లు ఎక్కడం  వల్ల అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని,  మరణ రేటును  తగ్గిస్తుంది. నిమిషం పాటు నాన్ స్టాప్ గా మెట్లు ఎక్కితే.. 8-11 కిలో కేలరీలు బర్న్ అవుతాయి, ఇది ఇతర  శారీరక శ్రమతో పోలిస్తే చాలా ఎక్కువ. మెట్లు ఎక్కేవారు సాధారణ వ్యాయామం చేసేవారికంటే మరింత ఫిట్‌గా ఉంటారు.   ఏరోబిక్ సామర్థ్యం పెరుగుతుంది. రోజుకు 20 మెట్లు ఎక్కినా చాలా సులువుగా ఏడాదికి 2 కిలోల వరకు బరువు తగ్గవచ్చు. రుతుక్రమం ఆగిపోయిన మహిళల్లో  ఎముకలు బలంగా మారడానికి ఇది సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన శరీర బరువును నిర్వహించడానికి ఇది  సహాయపడుతుంది.  ఎముకలు, కండరాలు మరియు కీళ్ల ఆరోగ్యానికి మెట్లు ఎక్కడమనే ప్రక్రియ అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి ఈరోజు నుండే మీ లిఫ్ట్ బటన్ నుండి దూరం జరిగి మెట్లు ఎక్కడాన్ని ఎంజాయ్ చేయండి..                                    *నిశ్శబ్ద.

విటమిన్ హెచ్ గురించి ఎంతమందికి తెలుసు? ఇది లోపిస్తే ఏకంగా ప్రాణాలే పోతాయి.. 

విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ బి12 ఇలా చాలా విటమిన్ల  పేర్లు తప్పక వినే ఉంటారు. ఆరోగ్యంగా ఉండటానికి ఈ పోషకాహారం చాలా ముఖ్యం. కానీ విటమిన్-హెచ్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా?? అసలు విటమిన్ల గురించి మీకు ఎంత తెలుసు?? ఈ విటమిన్ హెచ్ లోపిస్తే జబ్బులు రావడం, శరీర పనితీరు దెబ్బతినడం కాదు, ఏకంగా ప్రాణాలే పైకి పోతాయట. ఈ విటమిన్ హెచ్ గురించి పూర్తిగా తెలుసుకుంటే.. విటమిన్ హెచ్ అంటే.. విటమిన్ B7 ని విటమిన్ H అని కూడా అంటారు. జుట్టు,  చర్మానికి ఇది చాలా ముఖ్యమైన పోషణ. బయోటిన్ ఏ విటమిన్ b7, ఈ విటమిన్ బి7 ఏ విటమిన్ హెచ్.  ఇది లోపిస్తే.. విటమిన్ హెచ్ లేదా బయోటిన్ లోపం వల్ల బట్టతల, దద్దుర్లు, కండ్లకలక, కీటోలాక్టిక్ అసిడోసిస్, అసిడ్యూరియా, చర్మ వ్యాధులు, అలసట  ఇలా  మరెన్నో సమస్యలకు కారణమవుతుంది. విటమిన్ హెచ్ లోపం వల్ల కొన్ని అమైనో ఆమ్లాలు సరిగా జీర్ణం కావు. దీని కారణంగా రక్తం,  మూత్రంలో ప్రమాదకరమైన పదార్థాలు పెరగడం ప్రారంభిస్తాయి. దీని కారణంగా, మూత్రంలో నురుగు ఏర్పడటం ప్రారంభమవుతుంది. విటమిన్ హెచ్ ఎందులో ఉంటుందంటే.. గుడ్లలో బయోటిన్ ఉంటుంది, ఇది విటమిన్ హెచ్ లోపాన్ని నివారిస్తుంది. ఒక గుడ్డు 10 mcg బయోటిన్‌ను అందిస్తుంది. ఇది రోజువారీ అవసరాలలో భారీ భాగం. శాకాహారులు విటమిన్ హెచ్‌ని పొందడానికి బాదంపప్పును తినవచ్చు. పావు కప్పు బాదంపప్పు తినడం వల్ల 1.5 mcg బయోటిన్ లభిస్తుంది. పొద్దుతిరుగుడు విత్తనాలు, చిలగడదుంపలు, బ్రోకలీ, బచ్చలికూర, సాల్మన్ చేపలు, పాలు, అరటిపండ్లు మొదలైన వాటిని తినడం ద్వారా కూడా విటమిన్ హెచ్ లేదా బయోటిన్ పొందవచ్చు . *నిశ్శబ్ద.

వర్షాకాలంలో మధుమేహం ఉన్నవారు ఇవి పాటించకపోతే నష్టపోతారు..

వర్షాకాలం రుతుపవనాలు మాత్రమే కాకుండా వాటితో  పాటు అనేక వ్యాధులను కూడా తెస్తాయి, ఇప్పటికే ఏదైనా వ్యాధులతో బాధపడుతున్న వారికి ఈ వర్షాకాలం అతిపెద్ద ప్రమాదం. మరీ ముఖ్యంగా మధుమేహంతో బాధపడుతున్న వ్యక్తులు ఈ సీజన్‌లో వారి ఆరోగ్యం గురించి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షాకాలంలో అంటువ్యాధుల ప్రమాదం ఎక్కువ.    వాతావరణం మారుతున్న కొద్దీ మధుమేహ వ్యాధిగ్రస్తులకు ముప్పు పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. ఉష్ణోగ్రతలో హెచ్చుతగ్గులు, కాలుష్యం,  కలుషిత నీటి ద్వారా సంక్రమించే వ్యాధుల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందుకే రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుకోవడం, ఈ సీజనల్ వ్యాధుల నుండి తమను తాము రక్షించుకోవడం చాలా ముఖ్యం.  వర్షాకాలంలో బ్యాక్టీరియా, వైరస్ల వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఇతర సీజన్లలో కంటే ఎక్కువగా ఉంటుంది. రక్తంలో చక్కెర ఎక్కువగా ఉంటే, అంటు వ్యాధుల ప్రమాదం కూడా ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి.  వాతావరణంలో తేమ కారణంగా, ఫంగల్ ఇన్ఫెక్షన్లు మరియు రింగ్వార్మ్, చర్మంపై దద్దుర్లు,  కాలిన గాయాలు వంటి చర్మ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది.  మధుమేహ రోగులకు రోగనిరోధక శక్తి తక్కువగానే ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో అంటు వ్యాధులు సోకితే వాటి  నుండి కోలుకోవడానికి ఎక్కువ సమయం పట్టవచ్చు. అందుకే మధుమేహం ఉన్నవారు ఆరోగ్యం కాపాడుకోవడం చాలా ముఖ్యం పాదాలకున్న ముప్పు.. డయాబెటిక్ పేషెంట్లకు డయాబెటిక్ ఫుట్ అనే సమస్య కూడా ఉంటుంది, ఇందులో పాదాల చర్మం చీలిపోయి, ఇన్ఫెక్షన్‌తో అల్సర్ వంటి తీవ్రమైన సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. వర్షం నీళ్లలో తిరగడం వల్ల కాలికి పుండ్లు తొందరగా వస్తుంటాయి. ఇవి మధుమేహం ఉన్నవారికి పెద్ద ముప్పు తెచ్చిపెడతాయి.  డయాబెటీస్ ఉన్న వ్యక్తికి బలహీనమైన రోగనిరోధక శక్తి, రక్తనాళాలు పెళుసుగా మరియు రక్తస్రావానికి ఎక్కువ ప్రమాదం ఉంటుంది, డెంగ్యూ ప్రమాదం వీరిలో ఎక్కువగా ఉండవచ్చు.  డయాబెటిక్ పేషెంట్లలో డెంగ్యూ వచ్చినప్పుడు అంతర్గత రక్తస్రావం ఎక్కువయ్యే ప్రమాదం ఉందని తేలింది, అంతే కాకుండా  కోలుకునే సమయం కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే మధుమేహ వ్యాధిగ్రస్తులు దోమల వల్ల వచ్చే వ్యాధుల నివారణపై అప్రమత్తంగా ఉండాలి ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. వర్షాకాలంలో  ఆరోగ్యానికి సంబంధించి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఇది కాకుండా, అంటు వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి రోగనిరోధక శక్తిని పెంచడానికి చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఆరోగ్యకరమైన ఆహారాన్ని అనుసరించండి, ఆహారంలో పండ్లు-కూరగాయలు, రోగనిరోధక శక్తిని పెంచే మసాలాలు చేర్చాలి. ఫుట్ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గించడానికి మంచి నాణ్యత గల బూట్లు, పాదాలు  కవర్ చేసే చెప్పులు ధరించాలి. బయటి ఆహారాన్ని తినడం మానుకోవాలి, కడుపు ఇన్ఫెక్షన్ లేదా టైఫాయిడ్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ఫుల్ స్లీవ్‌లు లేదా శరీరాన్ని బాగా కప్పి ఉంచే దుస్తులు ధరించడం ద్వారా దోమల నుండి  రక్షించుకోవచ్చు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.  శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవాలి. *నిశ్శబ్ద.

ఈ  కొత్త డైట్ శరీరంలో కొవ్వును ఐస్ లా కరిగిస్తుందట!

ప్రస్తుతకాలంలో అందరినీ ఇబ్బంది పెట్టే సమస్య ఏదైనా ఉందంటే అది అధికబరువే... అయితే చాలా మంది తీరా బరువు పెరిగిన తరువాత బరువు తగ్గడానికి ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో వివిధ రకాల డైట్ లు ఫాలో అవుతుంటారు.  అలాంటి వాటిలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది గోలో డైట్. వినడానికి కాస్త వింతగా ఉంటుంది కానీ ఈ డైట్ వల్ల మంచి ఫలితాలు  ఉంటాయన్నది డైటీషియన్ల మాట. ఇంతకూ ఈ గోలో డైట్ ఏంటి? దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? దీన్ని ఎలా ఫాలో అవ్వాలి? ఈ డైట్ లో ఏమి తినాలి? వంటివి తెలుసుకుంటే.. చాలామంది జీవనశైలి కారణంగా బరువు పెరుగుతారని అంటుంటారు.  కానీ అది వాస్తవం కాదని చెబుతున్నారు డైటీషియన్లు. వచ్చిన చిక్కల్లా తీసుకుంటున్న ఆహారం దగ్గరే. చాలామంది జీవనశైలికి తగిన ఆహారం ఎంచుకోవడం లేదని, అందుకే బరువు పెరుగుతున్నారని చెబుతున్నారు. దీనికి చక్కని ప్రత్యామ్నాయంగా గోలో డైట్ ను సూచిస్తున్నారు. దీనివల్ల శరీరంలో పేరుకున్న అదనపు కొవ్వును కరిగించడం జరుగుతుంది. ఈ డైట్ వల్ల కొన్ని నెలల నుండి ఏడాది లోపు సుమారు 20కిలోల బరువు సునాయాసంగా తగ్గొచ్చట. ఈ డైట్ లో రోజువారీ 1300నుండి 1500 కేలరీల ఆహారాన్ని మాత్రమే తీసుకంటూ ఉంటారు. దీంతో  పాటు డైటరీ సప్లిమెంట్లు తీసుకోవడం జరుగుతుంది. ఈ కారణంగా  బరువు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గోలో డైట్ ఆహారం ఎలా ఉంటుందంటే.. జంతు ఆధారిత ప్రోటీన్లు గుడ్లు, పాలు, చీజ్,  పెరుగు బ్రోకలీ, గుమ్మడికాయ వంటి తాజా పండ్లు మరియు ఆకుపచ్చ కూరగాయలు. కొబ్బరి నూనె, ఆలివ్ నూనె, చియా గింజలు, అవిసె గింజలు వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు. బాదం, జీడిపప్పు, వాల్‌నట్‌లు, పిస్తా మరియు వేరుశెనగ వంటి నట్స్. బంగాళదుంపలు, చిలగడదుంపలు మరియు స్క్వాష్‌తో సహా ఇతర కూరగాయలు. గోధుమ బియ్యం, వోట్మీల్ మరియు క్వినోవా వంటి తృణధాన్యాలు. ఈ డైట్ లో ప్రధానంగా తీసుకునే ఆహారాలు. ఈ డైట్ కేవలం బరువు తగ్గడానికి మాత్రమే కాకుండా గుండె జబ్బులు, క్యాన్సర్, టైప్-2 డయాబెటిస్ వంటి ప్రమాదాలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ఈ డైట్ ప్లాన్ మంచిదే అయినా దీన్ని ఫాలో అయ్యే ముందు పోషకాహార నిపుణులను సంప్రదించి శరీర పరిస్థితిని బట్టి సలహా తీసుకోవడం చాలా ముఖ్యం.                                                                *నిశ్శబ్ద

అడుసు ఆకు కషాయం సర్వరోగ నివారిణి

అడుస చెట్టు లో ఉన్న వెళ్ళు ఆకులో మంచి ఔషద గుణాలు ఉన్నాయని అంటున్నారు ఉనాని వైద్యనిపుణురాలు డాక్టర్ సత్య ప్యాన్ డమిక్ లో అవసరమైన మొక్క అడుస అని అన్నారు. ఉనానిలో ఎన్నో పోషక ఔఫద గుణాలు ఉన్నాయని దాదాపు 6౦౦౦ మొక్కలు ఉన్నాయని వివరించారు. చిన్న పిల్లలు ఉన్న ఇళ్ళలో అడుసా ఆరు ఫీట్ల ఎత్తులో పెంచుకోవచ్చు.అడుస మొక్కను కుండీలో 2,3  ఫీట్ల మొక్కగా పెంచుకోవచ్చు.అడుసా ఆకు కషా యం  దగ్గు,జలుబు.ఆయాసంఉన్న వారికి అడుసా  ఆకు కాషాయం బ్రంహాస్త్రం లా పని చేస్తుందని.అసలు దగ్గు వచ్చినప్పుడు వాడే దగ్గు టానిక్ లో ఉండే  రసాయనాలు మనల్ని నిద్రపుచ్చుతాయి.అలా దగ్గు వచ్చినప్పుడల్లా తీసుకుంటే దగ్గు మందు  నరాల పై తీవ్ర ప్రభావం చూపిస్తుందని మెదడు మొద్దు బారి పోతుందని డాక్టర్ సత్య వివరించారు. దగ్గు తగ్గుతుంది కాని నరాలలో బలహీనాథ వస్తుంది అది గమనించండి. పిల్లలకు దగ్గు మందు వాడితే చేతులు కాళ్లు వణకడం మొదలు అవుతుంది. ఒక్కో సారి పూర్తిగా ఇంఫెర్టీలిటికి దారి తీస్తుందని డాక్టర్ సత్య హెచ్చరించారు దగ్గు మందు ను పూర్తిగా తగ్గించుకోవాలంటే ఆకు పచ్చగా ఉండే అడుసా ఆకును అంటే బ్రైట్ గ్రీన్ లో ఉండే అడుసా ఆకు బాగా పొడవుగా ఉంటాయి.తీసుకోవాలి పెద్దవాళ్ళు అయితే 1౦ ఆకులు,పిల్లలు అయితే 5 ఆకులు తీసుకుని ఆకులను బాగా కడిగి నీళ్ళలో వేసి బాగా మరిగించి వడకట్టి రోజుకు మూడు కప్పులు అంటే ఉదయం,మధ్యాహ్నం, రాత్రి  అడుసా కషాయం తీసుకుంటే మంచి ఫలితాలు ఉన్నాయి. ఇక మహిళలు,అడ పిల్లలు ఎదుర్కునే నెలసరి సమస్య లకు నెలసరి ఎక్కువ లేదా,నెలసరి అసలు లేకపోవడం వంటి సమస్యలు ఎదుర్కుంటున్న వారికి,ఆయాసం,ఉబ్బసం,దగ్గు తో బాధ పడే వారికి,బాగా దగ్గడం వల్ల ఒక్కోసారి వారి ఊపిరితిత్తులు పట్టేసి నట్లుగా ఉంటుంది,అలాగే కొందరిలో పంటి నొప్పి వస్తుంది, అలాంటి వారికి అడుస ఆకు కషాయం తో నోటి దుర్వాసన కూడా పోతుంది.లేదా కొంతమందిలో ముక్కు నుండి రక్తం కారడం చూస్తాం. ముక్కు చీదినప్పుడు అలా రక్తం వస్తే అడుస ఆకు కషాయం  ఉపయోగ పడుతుంది. అడిసను వైద్యంలో వాడతారు.జ్వరం వచ్చినప్పుడు,కోరోనా డెంగ్యు,వైరస్ లు,గొంతు నొప్పి  ఉన్నప్పుడు అడుసా మొక్కను పెంచితే మంచి ఫలితాలు ఉంటాయని అంటారు డాక్టర్ సత్య.  అడుసా ను అందుకే సర్వరోగనివారిణి అంటారు.ఉనాని అంటేనే మొక్కలతో వైద్యం,అవగాహన కల్పించే ప్రయతనం చేస్తున్నామని కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉన్న సంప్ర దాయ వైద్యంలో ఉన్న సులువైన వైద్య విధానాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తున్నామని ప్రముఖ యునాని వైద్య నిపుణురాలు డాక్టర్ ఎస్ గి వి సత్య స్పష్టం చేసారు. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

యువర్ లంగ్స్ ఫర్ యువర్ లైఫ్!

మీ ఊపిరి తిత్తులే మీ జీవితం ఇది నిజం... మీరు ఆరోగ్యంగా ఉండాలంటే మీ ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలి ఇదే ప్రపంచ ఊపిరి తిత్తుల దినోత్చవం యొక్క నినాదం.ఆరోగ్య వంతమైన ఊపిరి తిత్తుల కోసం ప్రపంచ సి ఓ పి డి దినోత్చవం ప్రతిఏటా నవంబర్ మూడవ బుధవారం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. సి ఓ పి డి అంటే క్లినిక్ అపస్త్రక్టివ్ లంగ్ డిసీజ్ అని అంటారు మీ ఊపిరి తిత్తులే మీజీవితం ఈ నినాదమే మీరు దీర్ఘకాలం పాటు మీఊపిరి తిత్తులను ఆరోగ్యంగా ఉంచుతుంది . ప్రత్యక్షంగా ప్రపంచ వ్యాప్తంగా ౩91  మిలియన్ల ప్రజలు ప్రస్తుతం సి ఓ పి డి తో బాధ పడుతున్నారు.ప్రపంచంలో అత్యధిక మరణాలకు కారణం సి ఓ పి డి మూడో స్థానం లో ఉండని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.భారత దేశం లో మరణాలకు  ఊపిరితిత్తుల సమస్యలే రెండవ స్థానం ఆక్రమించింది అంటే ఊపిరితిత్తుల సమస్యలు ప్రణాలను ఏరకంగా కబళి స్తోందో అర్ధం చేసుకోవచ్చ్ఘు.దీనికి తోడు డిల్లి ముంబై వంటి నగరాలలో ఉన్న వాయు కాలుష్యం కూడా ఊపిరి తిత్తుల సమస్యలకు కారణంగా నిపుణులు పేర్కొన్నారు.సి ఓ పి డి పై ప్రజలకు అవగాహన కల్పించడం సి ఓ పి డి డే లక్ష్యం గా పేర్కొన్నారు. మీ ఊపిరి తిత్తులు బంగారం తో సమానం మీ ఊపిరి తిత్తులు ఆరోగ్యంగా ఉన్నంతకాలామే వ్యక్తి జీవిన్చాగాలడను ఒక్కసారి ఊపిరి తిత్తుల సమస్యలు వచ్చాయో ఊపిరి ఆగిపోవడం ఖాయం కాబట్టి మీ ఊపిరి తిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే మీ ఊపిరితిత్తులు ఏమి చేస్తాయి. ఊపిరితిత్తులకు సమస్యలు రావడానుకి కారణాలు తెలుసుకోవడం అవసరం. యువర్ లంగ్స్ ఫర్ లైఫ్ మీ ఊపిరి తిత్తులు బలంగా ఆరోగ్యంగా ఉంటేనే జీవించడం సాధ్యం.మీఊపిరి తిత్తులలో మీ ఆరోగ్యం మీకు కనిపిస్తుంది మీరు ఊపిరి పీలుస్తున్నప్పుడుకష్టంగా ఉండడం లేదా అడ్డుపడడం అసమస్య రిజంతా కొనసాగడం కష్టం గా ఉండడం కనిపిస్తుంది.ఈ సమస్యలకు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలాలో దోమల నివారణకు కోయిల్స్ రేపలేన్ట్స్ వాడడం పెరుగుతున్న  వాయు కాలుష్యం  ప్రధానంగా చెప్పవచ్చు.సి ఓ పి డి కి కారణం ముఖ్యంగా పొగతాగడం అది మీ ఊపిరి తిత్తుల నాళాలలో పేరుకు పోయి ఊపిరి తిత్తలు చెడిపోడానికి ఆస్కారం ఉంటుంది. కొన్ని సందర్భాలలో మీఊపిరి తిత్తులు చేడి పోడానికి  కారణం కాదాని దీర్ఘకాలంగా అక్కడా సమస్య ఉందని గ్రహించాలి ఊపిరి తిత్తులు కుంచించుకు పోవడం వల్లా ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా మారడం. చెస్ట్ ఇన్ఫెక్షన్ దగ్గు తోపాటు కఫం వంటి లక్షణాలు గమనుంచాలని అంటున్నారు నిపుణులు. సి ఓ పి డి తీవ్రత ను గుర్తిస్తే ప్రాణాలు కపాదవచ్చని లేదంటే ప్రాణాలు పోతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.  ఊపిరి తిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాసం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.      వాయు కాలుష్యం,పొగతాగడం వల్లే ఊపిరి తిత్తుల అనారోగ్య్యనికి కారణం! ప్రపంచ ఊపిరి తిత్తుల దినోత్చవం 2౦22 సందర్భంగా ఊపిరి తిత్తుల ఆరోగ్యంగా ఉండాల్సిన అవసరాన్ని చెప్పుకోక తప్పదు.ఈసందర్భంగా కే జి ఎం యు లక్నో మాజీ అధ్యక్షుడు ఊపిరి తిత్తుల వ్యాధి నిపుణులు పల్మనాలాజి వైద్యుడు డాక్టర్ సూర్యాకాంత్ మాట్లాడుతూ వాయు కాలుష్యం,పొగతాగడం వల్లే ఊపిరి తిత్తులపై తీవ్రప్రభావం చూపుతుందని ఈకారణంగానే నిమోనియా,తో పాటు ఇతర అవయవాల పై తీవ్రప్రభావం చూపుతుందని. ఊపిరి తిత్తుల అనారోగ్యానికి గురి అవుతున్నాయాని సూర్యకాంత్ అభిప్రాయ పడ్డారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఫోరం ఫర్ ఇంటర్ స్తైనల్ రేస్పెరేటరీ సొసైటీ ద్వారా 25 సెప్టెంబర్ న ప్రపంచ ఊపిరి తిత్తుల దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఊపిరి తిత్తుల ఆరోగ్యం పట్ల ప్రపంచవ్యాప్తంగా జాగృతం చేయడం ముఖ్య లఖ్యమని వివరించారు .కాగా కరోనా మహమ్మారి మన ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపిందో అందరికీ తెలుసు.ఈకారణంగానే ఈసారి లంగ్ హెల్త్ అంటే ఊపిరి తిత్తులు  ఆరోగ్యంగాఉండాలని సరిగా పనిచేస్తేనే వ్యక్తిఆరోగ్యంగా ఉంటాడని అని నిపుణులు అభిప్రాయ పడ్డారు.ప్రపంచ ఊపిరితిత్తుల దినోత్సవం2౦22 లక్ష్యం శ్వాస సంబంధిత వ్యాధుల వల్ల ప్రజలకు తలకు మించిన భారంగా మారిందని వీటికోసం అయ్యే ఖర్చు సైతం పెరుగుతూ ఉండడం తో ప్రజలు ప్రతిఒక్కరు ఊపిరి తిత్తుల సంరక్షణ కు గలకారణాలు.ఊపిరి తిత్తుల సంరక్షణ వ్యాధి ప్రస్తుత తీవ్ర స్థితి నేరుగా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు స్పష్టం చేసారు.శ్వాస సంభందిత సమస్యలతో బాధ పడేవారికి సేవలు సపర్యలు చేయడం అత్యవసరమని భావిస్తున్నారు.ఈ అంశం పై ప్రపంచంలోని అన్నిదేశాలు తప్పనిసరిగా పరస్పర సహకారం అవసరమని నిపుణులు సూచించారు. ఊపిరి తిత్తులలో వచ్చే సమస్యల కారణంగా టి బి,ఆస్తమ,సి ఓ పిడి,నిమోనియా,ఊపిరి తిత్తుల క్యాన్సర్ తో మారో 5 రకాల శ్వాస సంభందిత రోగాలు ఉన్నాయి.వాయుకాలుష్యం,పోగాతాగడం,నీటి కాలుష్యం,వాయుకాలుష్యం,లో వచ్చే మార్పులు ఊపిరి తిత్తుల అనారోగ్యం పై తీవ్ర ప్రభావం చూపిస్తాయి.రోగాలను పెంచుతాయి. వాయు కాలుష్యం వల్ల ప్రమాదం... వాయుకాలుష్యం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణం లో వస్తున్న మార్పులు ఆరోగ్యం పై తీవ్రప్రభావం చూపిస్తుంది.ఇది ప్రపంచ మానవాళికి పెను ముప్పుగా పరిణ మిస్తుందని నిపుణులు పేర్కొన్నారు.ప్రపంచం లో 7౦ లక్షల మరణాలకు కారణం వాయులాలుశ్యమే అని నిపుణులు నిర్ధారించారు. వాయుకాలుష్యం కారణంగా ప్రతిఎతా 17 లక్షల మంది మరణిస్తున్నారని.వాయుకాలుష్యం ప్రభావం ఉందన్న కారణంగా నిత్యం ఆర్ధికంగా 8 అరబ్ డాలర్ల ఆర్ధికంగా ప్రభావం చూపుతోందని అభిప్రాయ పడ్డారు. దీనిప్రభావం ప్రపంచ ఉత్పాదక రంగం పై ౩%నుండి 4%నష్టానికి గురికావడాన్ని గమనించినట్లు నిపుణులు పేర్కొన్నారు. డిల్లీలో అత్యధిక వాయుకాలుష్యం... ప్రపంచ వాయు కాలుష్య నియంత్రణా మండలి రిపోర్ట్ ప్రకారం 2౦21 నాటికి ప్రపంచ లో వాయుకాలుష్య రాజధాని డిల్లి ఉండడం గమనార్హం.గత సంవత్సరం తో పోలిస్తే 15% కాలుష్యం పెరిగింది. 2౦21 లో అన్నిటికన్నా అత్యంత దరిద్రమైన వాయు ప్రమాణాలు ప్రపంచంలోని 5౦% పట్టణాలలో ౩5 పట్టణాలు భారత్ లోనే ఉన్నాయి అని నివేదికలో పేర్కొన్నారు.1౦౦ పట్టణాలలో 6౩ పట్టణాలు భారత్ లోనే  ఉండడం గమనార్హం. మే 2౦22 లో ప్రోంచ ఆరోగ్య సంస్థ ప్రచురించిన రిపోర్ట్  ఆధారంగా పొగాకు,సిగరెట్ తయారు చేసేందుకు 6౦ కోట్ల చెట్లు ప్రతిఏటా సంహరించడం అత్యంత హేయమైన చర్యగా పేర్కొన్నారు.ఆఫలితంగానే ప్రపంచంలో పర్యావరణ సమతౌల్యం లోపించి వాతవరణంలో పెనుమార్పులకు కారణంగా పర్యా వరణ శాస్త్ర వేత్తలు ఆందోళన వ్యక్త్గం చేస్తున్నారు. కాగా రానున్న రోజుల్లో ఎలాంటి ప్రాకృతిక విధ్వంసానికి పూనుకుంటారో దానివల్ల వచ్చే ఫలితం ఎంత భయంకరం గా ఉంటుందో అంచనా వేయలేమని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అన్నిటికన్నా అత్యంత భయంకరమైన విషయం ఏమిటి అంటే 15౦ హెక్టార్ల అటవీ ప్రాంతం పొగాకు కారణంగా అటవీ సంపద నాశనం అయ్యిందని పేర్కొన్నారు.దీనికి తోడు పొగాకు,బీడీ,చుట్ట,సిగరెట్ తయారీకి 22౦౦ కోట్ల లీటర్ల నీటిని దుర్వినియోగం చేసారని రిపోర్టులో పేర్కొన్నారు. ఈ నీటిని దాదాపు 2 కోట్ల ప్రజల దాహం ఆకలి తీర్గలిగే వారాని పొగతాగడం వల్లే ప్రపంచానికి ముప్పు పొంచిఉందని.ప్రపంచ పర్యావరణానికి తీవ్ర పరిణామాలు తప్పవని గ్లోబల్ వార్మింగ్ తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ధూమపానం పొగతాగడం వల్ల 84 కోట్ల టన్నుల కార్బన్ డయాక్సైడ్ విడుదల అవుతోందని ఈకారణంగా ప్రపంచానికి పెనుముప్పు పొంచి ఉందని శాస్త్రజ్ఞులు వెల్లడించారు.మనదేశం లో దాదాపు 12 కోట్ల ప్రజలు పొగాకు సేవిస్తున్నారని.ఎవరైతే పోగాతాగుతున్నారో ఆ వ్యాక్తి విడుదల చేసే పొగ ౩౦ %ఊపిరి తిత్తులలోకి చేరుతోందని మిగిలిన 7౦%పొగ ఆవ్యక్తికి దగ్గరాగా ఉన్న వ్యక్తుల లోని ఊపిరి తిత్తులలోకి చేరి తీవ్రనష్టం కలిగిస్తోందని నిపుణులు ద్రువీకరిస్తున్నారు. దీనివల్ల ప్రత్యక్షంగా కాని పరోక్షంగా కాని పెసివ్ స్మోకింగ్ చేసే వారికి వారు పోగాతాగిన వారితో సమానమే అని అది మీఊపిరి తిత్తులపై ప్రభావం చూపుతుందని పల్మనాలజిస్ట్లు లు  హెచ్చరిస్తున్నారు.అది అత్యంత నష్ట దాయకమైన అంశమని మీరు పోగాతీసుకోవడం ద్వారా విడుదల అయ్యే పొగ వాతావరణానికి కలుషితం చేస్తోందని అన్నారు. రసాయనాల ద్వారా ఆరోగ్యానికి ముప్పు... మన శ్వాస నాళాలు పర్యావరణం లో ఉన్న రకరకాల్ హానికారకాలు ఏజెంట్లు కాలుష్యం కోరల్లో చిక్కుకోవడం తో ఊపిరి తిత్తుల పై  తీవ్రప్రభావం చూపుతోంది.ప్రపంచంలో రెండు అరబ్ కోట్ల ప్రజలు బయోమాస్ ఇంధనం దహనం చేయడం వల్ల ఉత్పన్న మౌతున్న విష పదార్ధాలు, పొగలు, బారిన పడ్డప్పుడు రెండు అరబ్ కోట్ల ప్రజలకు పై గానే వాతావరణ కాలుష్యం వల్ల ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారింది.ప్రధాన మంత్రి ఉజ్వల పధకం కింద బయోమాస్ ఇంధన వినియోగం  తగ్గడం వల్ల మహిళల ఊపిరితిత్తుల ఆరోగ్యం లో మంచి ఫలితాలు వచ్చాయి. అందరి బాధ్యత... పర్యావరణం కాపాడుకోవడం మనందరి బాధ్యత. పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచడం రక్షించుకోవడం ముఖ్యం. ఏది ఏదైనా సమావేశం జరిగినప్పుడు సభలు జరినప్పుడు ఒక గులబీ పూల బోకే లేదా పూలబుట్టను గిఫ్ట్ గా ఇవ్వడం పూలతో స్వాగతం పలకడం ఒక సాంప్రదాయంగా వస్తుంది.అయితే వాటి స్థానం లో చిన్న చిన్న చెట్లు మొక్కలు ఇవ్వవచ్చు. ఎవరిపుట్టినరోజున అయినా  ఆసంవత్సరం లో జరిగే ఉత్చవాల లో చెట్లు మొక్కలను పెతాలి తద్వారా అందరికీ కాలుష్యం లేని ఆక్సిజన్ అందరికీ అందుతుంది మనం ఊపిరి తీసుకున్నప్పుడు ౩5౦ నుండి 5౦౦ లీటర్ల ఆక్సిజన్ ప్రతిరోజూ మనకు అవసరం. ముఖ్యంగా 65 సంవత్సారాల వయస్సు ఉన్నవారు దాదాపు 5 కోట్లమంది ఉంటారు వారికి ఆక్సిజన్ మొక్కలు చెట్లద్వారానే ఏమాత్రం ఖర్చులేకుండా పొందవచ్చు.అందుకు మనంమొక్కలకు చెట్లకు కృతజ్ఞత చేపుకోవాలి అందుకోసం మనం ఎక్కువ సంఖ్యలో అత్యధిక సంఖ్యలో చెట్లను నాటాలి తరువాత మనచుట్టూ ఉన్న చెట్లను సంరక్షించాలి.అలాకాకుండా ఎరాటోసిన్ ఇతరటీకాలు చికిత్చలకు సలహాతీసుకోవాలి అత్యధిక జనాభా ఉన్న ప్రాంతాలాలో మాస్క్ వినియోగించాలి. మాస్క్ వినియోగించడం వల్ల కోరోనా నుండి రక్షించుకోవచ్చు.దీంతో పాటు టి బి నిమోనియా లాంటి తీవ్రమైన వ్యాధులు వాయుకాలుష్యం నుండి రక్షించుకోవచ్చు.అసలు ఆరోగ్యంగా ఉండాలంటే మనం ప్రతిరోజూ నడక సాగించాలి. సైకిల్ ను వినియోగించడం. ప్రభుత్వ రవాణా వ్యవాస్త ఎలక్ట్రికల్ కార్లు ఉపయోగించాలి. దీనితో పాటు పొగతాగడం మధ్య పానం తీసుకోవడం ఇతర మత్తు పదార్దాలకు దూరంగా ఉండడం అవసరం. శాఖాహారం భోజనం అయారుతువులలో దొరికే పండ్లు ఆకు కూరాగాయలు, వాడాలి.మీఊపిరి తిత్తులు ఆరోగ్యంగా బలంగా ఉండాలంటే అప్పుడప్పుడు ఆవిరి పట్టాలి మరియు యోగా ప్రాణాయామం వ్యాయామం తప్పనిసరిగా చేయాలి తద్వారా మీఊపిరి తిత్తులు అనారోగ్యం పాలు కాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు.

సైలెంట్ గా ఆరు వ్యాధులు మనిషిని చంపేస్తాయి...

ఆరు రకాల వ్యాధులు మిమ్మల్ని సైలెంట్ గా ప్రాణాలు తీసేస్థాయి అన్న విషయం మీకు తెలుసా .మంచి ఆహారం తీసుకుంటూ  మీ జీవన శైలిని మార్చుకుని నిత్యం మీరు ఆరోగ్యంగా ఉండడం కోసం మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు.అయినప్పటికీ దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతూ ఉంటారు. ఒక్కో సారి అనుకోకుండా ముప్పు ముంచుకొస్తుంది. కాగా కొన్ని వ్యాధుల పై ప్రత్యేక శ్రద్ధ అవసరం వాటినే సైలెంట్ కీల్లర్స్ గా  డాక్టర్స్ చెపుతున్నారు. హై బి పి... హై బీపీ  హై బ్లడ్ ప్రెషర్ హై పర్ టెన్షన్ చాలా ప్రమాద కరం. ఒక్క సారి హై బీపీ వచ్చిందంటే ఇతర అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది.  ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం 1.28 బిలియన్ల ప్రజలు దాదాపు 30 -79  సంవత్సరాల వారిలో హై బీపీ అత్యంత ప్రమాదకారి. అయితే బీపీ అమాంతం ఎందుకు పెరుగు తుందో కని పెట్టడం కష్టం లేదా ఒక్కోసారి లో బీపీ కూడా ప్రనాలు తీసేస్తుంది.హై బీపీ నిద్రలోనే వస్తే హార్ట్ స్ట్రోక్, బ్రైన్ స్ట్రోక్, వస్తుంది.  మాసివ్ హార్ట్ స్ట్రోక్ వచ్చిందో హై బీపీ ప్రాణమే తీసేతుంది. అందుకే బీపీ ని నియంత్రించుకోవాలి. లేదా మీ ప్రాణాలకు ముప్పు తప్పదు అని హెచ్చరిస్తున్నారు.వైద్యులు.  కరో నరీ  ఆర్ట్రీ  డీసీజ్... చాలా రకాల వ్యాధులు జీవితానికి ప్రమాదకరంగా మార తాయి.  అందులో కరోనా ఆర్ట్రీ డీసీజ్ ఒకటి.కరో నరీ ద్వారా ఆక్సిజన్ తో పాటు రక్త ప్రసారం జరుగుతుంది.గుండెలో దమనులు కుంచించుకు పోవడం వల్ల గుండె నొప్పి ,గుండె పోటు మొదటి లక్షణం గా చెప్పవచ్చు. డయా బెటిస్.... రక్తంలో హై గ్లూకోజ్ శాతం రెండు రకాలు టైప్ 1,టైప్ 2 డయా బెటిస్ వస్తుంది. శరీరంలో ఉండే ప్యాంక్రియాస్ లో ఉత్పత్తి అయ్యే ఇన్సూలిన్ అందకుంటే టైప్ 2 టిప్1 డయాబెటిస్ మరింత పెరిగే అవకాశం ఉంది. హైపర్ గ్లైసీమీయ తీవ్రంగా వస్తే  తీవ్ర మూత్ర విసర్జన కు వెళ్ళడం.యూరిన్ లో ప్రోటీన్ పోతూ ఉంటుంది. దీనివల్ల కిడ్నీ పాడై పోవడం,డయా బెటిక్ నేఫ్రో పతి,డయాబెటిక్ న్యూరో పతి, డయాబెటిస్ వల్ల కళ్ళు పోయేప్రమాదం ఉంది.హై పర్ టెన్షన్ ,హై షుగర్ ఉంటే గుండెపోటు రావచ్చు.హై షుగర్ వల్ల బ్రైన్ స్ట్రోక్,ఫిట్స్,వంటివి వస్తాయి మీకు తెలియకుండానే నిద్రలో మరణానికి దారితీసుకు పోతుంది.  ఆస్త్రియో ప్రోరోసిస్... ఆస్త్రియో  ప్రోరోసిస్ ఒక ఎముకల వ్యాధి.శరీరంలో ఎముకలలో కాల్షియం తక్కువ గా ఉండడం వల్ల శరీరంలోని ఎముకలలో రాలిపోవడం బలహీన పడిపోతాయి.ముఖ్యంగా ఆస్టియో ప్రోరోసిస్ ముఖ్యంగా స్త్రీలలో ఎకువగా వస్తుంది. ఆస్టియో ప్రోరోసిస్ ఉన్నవాళ్ళు ఒక్కోసారి ఉన్నట్లు ఉండి ఉన్నచోట కుప్పకూలిపోతారు.వ్యక్తి గతంగా  ఆరోగుల  పరిస్తితి ఎలా ఉంటుందో తెలియదు.ఒకోసారి ఎముకలు విరిగి పోతాయి.ఉన్నచోటే ఉండి కుప్పకూలిపోతారు.దీనినినుండి బయట పడడానికి కాల్షియం విటమిన్ డి,తప్పనిసరి ఎలాంటి ఎముకల సమస్య నుండైన వారు వ్యాయామం,నడక,జాగింగ్, మెట్లు ఎక్కడం ప్రతి రోజూ పరీక్షించుకోవడం ముఖ్యం. నిద్ర లేమి... నిద్ర లేమి తీవ్ర అనారోగ్య సమస్య,పెద్దగా గాలిపీలుస్తూ ఉంటారు.ఈ కరణంగా గురక కు దారి తీస్తుంది. నిద్రలేమి వల్ల అలసట చాలామంది నిద్రలేమి సమస్యను ఎదుర్కుంటారు.నిద్రలేమి వల్ల సహజంగా మరణిస్తారు.నిద్రలోనే గుండె పోటు, వస్తుంది.అందుకే ఈ అనారోగ్యాన్ని సైలెంట్ కిల్లర్ గాపేర్కొన్నారు. అప్సెస్సివ్  స్లీప్ అప్నియా వాళ్లమీరు గాలిపీల్చుకునే మార్గాలు మూసుకుపోవచ్చు. ఫ్యాటీ లివర్... ప్రాణాలు తీసెసే సైలెంట్ కీల్ల ర్స్ లో ఫ్యాటి లివర్ అని డాక్టర్స్ చెప్పారు. ఫ్యాటి లివర్ వ్యాధిని గుర్తించడం కష్టం.అతిగా తాగడం వల్ల ఫ్యాతి లివర్ వస్తుంది.లివర్ వాపు,లేదా నల్లని చార వస్తుంది.లివర్ శిరోసిస్ వల్ల పూర్తిగా లివర్ పైపోతుంది ఒక్కోసారి లివర్ డోనార్ దొరికితే లివర్ ట్రాన్స్ ప్లాంట్ చేయాల్సి రావచ్చు.లివర్ నాళాలలో ఇబ్బంది మొదలై.అది ముదిరితే ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది.ప్రాణాలు తీసెసే ఆరు రకాల వ్యాధుల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకునేందుకు జాగ్రతగా పరీక్షలు చేయించుకోవాలి.                    

చలికాలంలో ఉబ్బసం సమస్యకు ఇలా చెక్ పెట్టండి!

ఉబ్బసం అనేది శ్వాస సంబంధ సమస్య. ఈ సమస్య వచ్చిన వాళ్లలో శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది ఉంటుంది. సాధారణ సమయంలో బాగానే ఉన్నా అతి చల్లని వాతావరణం ఉన్నప్పుడు, కొన్ని ప్రతికూల వాతావరణ పరిస్థితులలో సమస్య ఎక్కువగా ఉంటుంది. ఈ ఉబ్బసం సమస్య ఎందుకు వస్తుంది అంటే..  వాతావరణ కాలుష్యం వల్ల, పీల్చే గాలి కలుషితమైపోయి శ్వాస కోశాన్ని దెబ్బతీయడం వల్ల, ఆహారపు అలవాట్ల వల్ల, నేటి కాలంలో కృత్రిమమైన జీవన విధానం వల్లా ఉబ్బసం వ్యాధి వస్తుంది. ఈ ఉబ్బసం వ్యాధినే ఆస్తమా అని కూడా అంటారు. ముఖ్యంగా ఈ చలి కాలములో ఆస్తమా సమస్య ఉన్నవారు మరింత ఎక్కువ ఇబ్బంది పడతారు. వీరు తీసుకునే ఆహారం, జీవనశైలి మొదలైన విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి. జీవన శైలి.. రాత్రి ఎప్పుడో ఆలస్యంగా పడుకుని, ఉదయమేప్పుడో సూర్యుడు నడినెత్తి మీదకు వచ్చాక నిద్రలేవడం వంటి జీవన విధానాన్ని వదిలిపెట్టాలి. ప్రతిరోజూ సూర్యోదయంతో పాటే నిద్రలేవడం అలవాటు చేసుకోవాలి. ఉదయం నిద్ర లేవగానే కాలకృత్యాలు పూర్తి చేసుకుని ముఖం కడుక్కున తరువాత తేనె, తులసి రసం రెండింటిని సమానంగా కలిపి 10గ్రాముల వరకు తీసుకోవాలి. అంటే 5గ్రాముల తేనె, 5 గ్రాముల తులసిరసం తీసుకోవాలి.  నువ్వుల నూనె తీసుకుని శరీరమంతా పట్టించి బాగా మర్దన చేసుకుని సూర్యుడి లేత ఎండలో గడపాలి. ఎండలో కొద్దిసేపు ఉన్న తరువాత ఒక బకెట్టు వేడి నీరు, ఒక బకెట్టు చల్ల నీళ్లు తీసుకోవాలి. ఈ నీటిని మొదట రెండు చెంబులు తల మీద, వీపు మీద పోసుకోవాలి. ఆ తరువాత చల్ల నీళ్లు తలమీద నుండి పోసుకోవాలి.  ఇలా మార్చి మార్చి నీటిని పోసుకుంటూ స్నానం పూర్తి చేయాలి. వేసవికాలంలో కూడా ఇదే విధంగా స్నానం చేయాలి.  ఆస్తమా సమస్య ఉన్నవారు తీసుకునే ఆహారం ఎలా ఉండాలంటే :-  ఆస్తమా సమస్య ఉన్నవారు తినే ఆహారం కఫం లేకుండా ఉండాలి. ముఖ్యంగా పులుపు, ఉప్పు, కారం మొదలైనవి ఎంత మానుకుంటే అంత మంచిది. నూనెలో వేయించిన పదార్థాలు, దుంపలు మొదలైనవి మానుకోవాలి.  మత్తు మాదకద్రవ్యాలు, కాఫీ, టీలు, ఐస్ క్రీమ్లు చల్లని ఫ్రిజ్లో పెట్టినవి వాడరాదు. పంచదార, బెల్లము తగ్గించి వాడాలి. మలబద్దకం లేకుండా ఉండటానికి  అన్నం తక్కువ కూరలు ఎక్కువ తినాలి. దేహతత్త్యమును బట్టి ఆయా ఋతువులలో దొరికే పండ్లు వాడాలి. పాలు త్రాగాలంటే పిప్పలి, ధనియాలు శొంఠి పౌడరు చేసి డికాషన్ కలిపిన పాలు త్రాగాలి. మనం తినే ఆహారము ఎంత రుచిగా ఉన్నా చాలా తగ్గించి తినాలి. కడుపు నిండుగా అతిగా తినకూడదు. కడుపులో ఎప్పుడూ కాస్త కాళీ ఉండేట్టుగా తినాలి. ఎప్పుడూ ఆకలి కలిగిఉండాలి. చిరుతిండ్ల జోలికి వెళ్లకూడదు.  వ్యాయామము:- ప్రతిరోజూ ఉదయం స్నానం చేయగానే సూర్యనమస్కారములు చేయాలి. ఇలా  చేసినవారికి ఉబ్బసమే కాదు సమస్త వ్యాధులు నయమైపోతాయి.                                                 ◆నిశ్శబ్ద.

మలేరియా నివారణకు వ్యాక్సిన్...

ప్రపంచ ఆరోగ్య సంస్థ వద్ద ఉన్న డాటా ప్రకారం పెద్దమొత్తం లో మలేరియా ప్రభావిత ప్రాంతాలలో దాదాపు ౩౦ దేశాలలో ఉన్నాయని. వ్యాక్సిన్ ద్వారా సంవత్సరానికి 25 మిలియన్ పిల్లల సంరక్షణ చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. మలేరియా వ్యాక్సిన్ ను సూచించిన డబ్ల్యు హెచ్ ఓ యు నిసెఫ్ ద్వారా మొదటి మలేరియా వ్యాక్సిన్ కాంట్రాక్ట్ 17౦ డాలర్లు. ఫర్మా సంస్థలకు చెల్లించింది. యు ఎన్ ఏజెన్సీ సంస్థలు 18౦౦౦ డోసులు ఆర్ టి ఎస్ ఎస్ డోసులు మరో మూడేళ్ళు అందుబాటులో ఉంటాయాని సంవత్సరానికి వేల మంది పిల్లల ఆరోగ్య సంరక్షణ చేయాలనేదే లక్ష్యమని యుని సేఫ్ పంపిణీ విభాగం డైరెక్టర్ ఎట్లేవా కడిల్లీ తెలిపారు. మలేరియా వ్యాక్సిన్ మార్కర్లను అవసరమైన చోట వ్యాక్సిన్ పంపిణీ చేచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.తద్వారా మలేరియా బారిన పడకుండా మలేరియా బారిన పడకుండా మలేరియా ప్రభావం లేకుండా పిల్లలను కాపాడగలమని అభిప్రాయ పడ్డారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ వద్ద ఉన్న సమాచారం ప్రకారం మలేరియా ప్రభావిత ప్రాంతాల దేశాల సంఖ్య ౩౦ దాకా ఉండవచ్చని.౩౦ కి పైగా దేశాల్లో వ్యాక్సిన్ కు డిమాండ్ ఉందని. 25 మిలియన్ ప్రజలకు ప్రతి ఏటా సంరక్షించేందుకు కృషిచేస్తున్నట్లు వెల్లడించారు. మలేరియా వ్యాక్సిన్ ను కనుగొనేందుకు ౩5 సంవత్సరాలు పట్టిందని పరాసైట్ డిసీజ్ కు  తొలి వ్యాక్సిన్ ప్లాస్మోడియం కు వ్యతిరేకంగా పనిచేస్తుందని ప్రేసిఫేరం అత్యంత ప్రమాదకరమైన మలేరియాగా పేర్కొన్నారు దీని ప్రభావం ఆఫ్రికా దేశాలలో ఉందని తెలుస్తోంది. మలేరియా వ్యాక్సిన్ తయారీకి 18 నెలలు... మలేరియా వ్యాక్సిన్ తయారీకి 18 నెలలు సమయం పట్టిందని. చాలా శ్రమించాల్సి వచ్చిందని. మలేరియా వ్యాక్సిన్ ప్రభావ వంతంగా పనిచేస్తుందని. ప్రాధమిక స్థాయిలో వాటికి డిమాండ్ ఉండక పోవచ్చని. ఆతరువాత ఈ వ్యాక్సిన్ కు మరింత డిమాండ్ పెరిగే అవకాశం ఉత్పత్తి పెరగవచ్చని ఆశాభావం వ్యక్తం చేసారు. 2౦ 28 నాటికి సంవత్సరానికి 15 మిలియన్ల డోసులు ఉత్పత్తిచేస్తామని సంవత్సరానికి 1౦౦ మిలియన్ వ్యాక్సిన్లు అవసరం కాగల వాణి అంచనా సంవత్సరానికి ఆఫ్రికాలో 25 మిలియన్ల పిల్లలు పుడతారని వారి సంరక్షణ కు ఉపయోగ పడగలదని. ఈ స్థితిలో వ్యాక్సిన్ ఉత్పత్తి చేసే సాంకేతికతను భారాత్ ఫర్మా రంగానికి ఉందని ఇలా చేస్తే పెద్ద సంఖ్యలో వ్యాక్సిన్ ఉత్పత్తి సంవత్సరాలు పట్టవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. మలేరియాను పూర్తిగా రూపు మాపే ప్రక్రియకు శ్రీకారం చుడ దామాని ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపు నిచ్చింది.

కోడి నిద్ర ప్రమాదం సుమా!

రాత్రి వేళ సరైన నిద్ర అంటే 6 గంటలు నిద్రసరిపోతుంది. వర్తమాన కాల మాన పరిస్థితులలో ఇప్పుడు కనీసం 5 ఘంటలు నిద్రపోవడం గగనంగా మారింది నేటి ఆధునిక జీవన విధానం పనిఒత్థిడి వ్యక్తి జీవితాన్ని మార్చేస్తోంది. మీరు కనీసం 5 గంటలు నిద్రపోకుంటే దీర్ఘకాలిక వ్యాధుల ప్రామాదం పొంచిఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.4౦% ప్రజలలో రెండు లేదా మూడు దీర్ఘ కాలిక వ్యాధులతో బాధపడుతున్నట్లు గుర్తించారు.అదే 25 సంవత్చరాల పై బడ్డ వారే వీరు ఇతరులతో పోలిస్తే 7 గంటలు నిద్రపోయిన వాళ్ళే. 5గంటల కన్నా తక్కువ అంటే మాధ్య రాత్రి నిద్రపోవడం లేదా మాధ్యరాత్రి నిద్రమేల్కోవడం వంటి సమస్యల వల్ల పూర్తిగా ఆరు గంటలు నిద్రపోలేక పోతున్నారా.దీనివల్ల ఖచ్చితంగా రెండు రకాల దీర్ఘకాలిక వ్యాదులబారిన పడక తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.యునివర్సిటి కాలేజ్ అఫ్ లండన్ లోజరిగిన పరిశోదనలో చాలామంది 5 గంటలకన్నా తక్కువగంటలు నిద్ర పోతున్న వారిలో 5౦%నుండి 2౦ %ప్రజలలో దీర్ఘకాల వ్యాధులబారిన పడుతున్నట్లు నిపుణులు గుర్తించారు.4౦% మంది లో రెండు రకాల దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారని 25 సంవత్చారాలు పై బడిన వారితో పోలిస్తే 7 గంటలు నిద్రపోతున్న వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. పరిశోదన వివరాలను పి ఎల్ ఒన్ మెడిసిన్ లో ప్రచురించారు. 5౦-6౦-7౦  సంవత్చరాల వయస్సులో ఉన్నవారు  ౩౦ % నుండి 4౦ % దీర్ఘకాలిక సమస్యలు ఎదుర్కుంటున్నారని.7 గంటల కన్నా ఎక్కువ నిద్ర పోయే వారితే పోలిస్తే అనారోగ్య సమస్యలు మల్టి మార్బిడిటేస్ ను గుర్తించారు.రెండు లేదా చాలా దీర్ఘకాలిక వ్యాధులు అధిక ఆదాయం ఉన్న దేశాలలో మల్టి మార్బిడిటిస్ మధ్య వయస్కులలో రెండు రకాల అనారోగ్య సమస్యలు ప్రజా ఆరోగ్యానికి ఇది పెద్ద సవాలే అని నిపుణులు అంటున్నారు.మల్టి మమార్బి డిటీస్ ఉన్నవారు ఉన్నత ప్రమాణాలు గల వైద్య సేవలు వినియోగించాల్సి ఉంటుంది. ఒక్కోసారి మల్టి మార్బిదిటిస్ ఉండేవారిని అత్యవసరంగా ఆసుపత్రిలో చేర్చాల్సి రావచ్చుఅని డాక్టర్ పరిశోదన శాస్త్రవేత్త డాక్టర్ సబియా వెల్లడించారు. .5౦ సంవత్చారాల లోపు వారు 5 గంటలు నిద్రలేకుంటే 25% మరణానికి దారితీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.వయస్సు పెరుగుతున్న కొద్ది వారు నిద్ర పోయే అలవాట్లు నిద్ర పోయే పద్దతులలో మార్పులు వస్తాయి.అంటే దాదాపు 7 గం--8 గం --రాత్రి నిద్రపోవాలి 5 గం తక్కువ ఉన్నవారు లేదా 5 గం కన్నా తక్కువ నిద్ర పోయినా అంతకన్నా ఆ తరువాత నిద్రపోయిన వారిలో దీర్ఘ కాలిక వ్యాధులు వస్తాయని డాక్టర్ సబియా వరించారు. పరిశోధకులు సహజంగా ఇద్దరూ ఎంత సేపు నిద్రపోయారు. మల్టి మార్బిదిటిస్ ఉంటె మరణాల శాతం గుండెజబ్బులు క్యాన్సర్ డయాబెటిస్ వంటి సమస్యలు 25 సంవత్చరాలు పై బడిన వారిలో వస్తాయి అని నిపుణులు పరిశోదన వివరాలలో పేర్కొన్నారు.చేసిన పరిశోదన ఎంతసేపు ప్రభావవంతంగా నిద్రపోగలుగుతున్నారు. పరిశోదన 7,౦౦౦ మంది పురుషులు 5౦--6౦ --7౦ సంవత్చరాలు ఉన్నవారి మధ్య పరిశోదన 1985 నుండి 1988 సంవత్చారాల మధ్యలో 14,౩౦8 మంది ప్రజల ప్రజల ప్రభుత్వ సేవలు చేసేవారిలో ౩5 నుండి --55 సం --మధ్యవయసులో ఉన్నవారిలో ౩/2%పురుషులు కాగా 1/౩% మంది స్త్రీలు ఉన్నారని పరిశోధకులు వెల్లడించారు.కొందరు అదే పనిగా నిద్రపోతే ఇంకొందరు అసలు నిద్ర పోరు. అసలు రాత్రి కనీసం ఒక్క ఐదు గంటలు అయినా నిద్ర పోనివాళ్ళు చాలామందే ఉంటారు. ఇంకొందరు షార్ట్ స్లీప్ కొద్ది సేపు కోడి నిద్ర పోయినట్లు పొతూ ఉంటారు. అలా ప్రతిరోజూ నిద్రభంగానికి గురిఅవుతూ ఉంటారో వారు మల్టి మార్బిడిటీ ఉన్నవారు రాత్రి సంపూర్ణంగా నిద్రపోవాలి. ఆరోగ్యంగా ఉండాలంటే నిద్ర తప్పనిసరి నిద్రపోయే ప్రదేశం ప్రశాంతంగా ఉండాలి.  చీకటి లేకుండా ప్రకాశ వంతంగా ఉండాలి. నిద్రపోయేముందు కాస్త వేడిగా ఉండాలి.ఎలాక్త్రానికి డివైస్ ను తొలగించాలి. నిద్రపోయే ముందు ఎక్కువ ఆహారం తీసుకోకూడదు. శరీరానికి వ్యాయామం రాత్రి పగలు వెలుతురు ఉండాలి లేదా లైట్ ఉండే విధంగా ఉండాలని మీరు నిద్రపోవాలంటే ఇవి తప్పనిసరి సుదీర్ఘ నిద్ర పోవాలని అంటే 9 గంటలు నిద్రపోయే వారు ఆరోగ్యంగా ఉన్నట్లు గుర్తించారు. దీర్ఘకాలం నిద్రపోఎవల్లలో మల్టి మార్బిడిటీ 5౦ సంవత్చరాలు పై బడిన  వారిలో లేదు.నిద్ర మన ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపుతుందని వాస్తవానికి 4,౦౦౦ మందిపై నిర్వహించిన ఎలెక్ట్రోనిక్ మేజర్ మెంట్ ద్వారా నిర్ధారించినట్లు పరిశోధకులు వెల్లడించారు.ఉద్యోగులు వారు ఆరోగ్యంగా ఉండచ్చు ఇతరులకన్న ఆరోగ్యంగా ఉండచ్చు అని నిర్ధారించారు.               

యోగా చేయండి గుండెపోటు నుండి కాపాడుకోండి...

 చలికాలం లో గుండె పోటు  నుండి కాపాడుకోండి. చలికాలం లో గుండె పోటు రాకుండా రక్షించ బడాలంటే  తప్పకుండా వ్యాయామం లేదా యోగ చేయాలి. అంటున్నారు నిపుణులు. గుండె సమస్యతో బాధ పడే వారు చలికాలం లో ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చాలా మంది నిపుణులు శాస్త్రజ్ఞులు గుండె పై చేసిన పరిశోదనలో తెలిసిన రహస్యం ఏమిటి  అంటే చల్లటి వాతావరణం లో గుండె పోటు వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని  ఈ వ్యాసం లో నిపుణులు సూచిస్తున్నారు. సహజంగా రోజుకి అరఘంట పాటు నడిచిన చాలని, అలాగే చిన్న పాటి వ్యాయామం చేసినముఖ్యంగా యోగా చేయడం ద్వారా ఎలాంటి సమస్య నుండి అయినా రక్షించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.చలికాలం లో ఎండవేడిమి తగ్గడం వల్ల  శరీరం లో రక్త ప్రవాహం సరిగా లేక రక్త నాళాలు కుంచించుకు పోతాయి. దీనిఫలితంగా బిపి  తో పాటు కొలస్ట్రాల్ పెరిగే అవకాశాలు ఉన్నాయి.ఈ పరిస్థితిలో చలికాలం లో గుండె సమస్యలు  ఉన్న వారు తమ ఆహారం లో అప్రమత్తం గా ఉండాలని వ్యాయామం తో పాటు యోగ సాధన చేయాలని. యోగా ప్రాణా యామం కలిపి చేయడం ద్వారా శరీరం మనసు,ఆత్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఏదైనా యోగా నిపుణులైన గురువుల సమక్షం లో యోగ సాధన చేస్తే గుండె పోటు వంటి వి జీవన శైలి సంబందించిన సమస్యలు నిలువరించవచ్చు.హార్ట్ అట్టాక్ ను నివారించ వచ్చు మూడురకాల యోగా పద్దతులు ఆసనాలు తప్పనిసరిగా చేయాల్సిందే ముందుగా యోగ చేసే పద్దతులు విధివిధానం,సాధన చేయాలి,అలాగే వజ్రాసనం,పవన ముక్తాసనం, మండూక ఆ సనం, వంటివి సాధన చేస్తే రక్త ప్రసారం సరిగా జరిగి గుండె పోటును నివారించవచ్చు.  మాండుకాసనం.... యోగ సాధనకు ముందు వజ్రాసనం లో కూర్చోవాలి.దీనిని వజ్రాసన ముద్ర అని అంటారు.మన శరీరంలో ని మోకాళ్ళ పై కూర్చుని వేసే సులభమైన ముద్ర.ఆ తరువాత మీ చేతుల లోని నాలుగు ఉంగరాల లోని లోపలి భాగాలను బాగా నొక్కండి. పిడ్ఫికిలిని మీ మొక్కకు రెండు వైపులా ముందుకు వంగండి.మీ పిడికిలి తో మీ నాభి భాగాన్ని నొక్కడం ప్రారంభించండి. మీ పొట్టను ఎంతవరకూ వీలైతే అంతనిలివుగా ఉంచండి.ఒంగిన తరువాత ముందుకు చూడండి.ఈ ముద్రలో మీ ఊపిరి ని బయటికి పంపండి.ఇలా కొంత సేపు చేయండి.ఇది కొంతమేర మీరు ఉపసమనం  కలిగిస్తుంది. ఈ ముద్రనుండి బయటికి వచ్చే టప్పుడు స్వాస తీసుకోండి.మీ వెనుక వైపు నుక్కును మోకాళ్ళ పైన  మెల్లగా పైకి తీయండి మీ చేతులను మీ భుజాల పైకి తీసుకోండి.మరల యధాస్థితికి రండి.                 

మైగ్రేన్ గురించి చాలామందికి తెలియని విషయాలివే!

చాలామంది తరచుగా తలనొప్పి అంటూ ఉంటారు. అయితే సాధారణ తలనొప్పి కంటే మైగ్రేన్ చాలా పెద్ద సమస్య. . మైగ్రేన్ నొప్పి చాలా డిస్టర్బ్ చేస్తుంది. తలనొప్పి లైటింగ్ చూసినా,  శబ్దాలు విన్నా భరించలేకపోవడం, వికారంగా అనిపించడం ఈ సమస్య తీవ్రతను  మరింత పెంచుతుంది. అయినప్పటికీ, చాలా సందర్భాలలో, మైగ్రేన్ అటాక్ కొన్ని గంటల్లోనే తగ్గిపోతుంది. కానీ తీవ్రమైన మైగ్రేన్ సమస్యలు ఉన్నవారిలో, తీవ్రమైన పరిస్థితులు ఎదురవుతాయి.  మైగ్రేన్ అనేది ఒక రకమైన సైకోసోమాటిక్ డిజార్డర్ అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అంటే మానసిక ఆరోగ్య సమస్య కారణంగా ఇది జరుగుతుంది. అందువల్ల, తరచుగా మైగ్రేన్లు ఉంటే, చాలా శ్రద్ధ, దీనికి మెరుగైన చికిత్స అవసరం అవుతుంది. కొన్ని సందర్భాల్లో, మైగ్రేన్ దాడి ప్రాణాంతక సమస్యలను కూడా కలిగిస్తుంది. మైగ్రేన్  గురించి చాలామందికి తెలియని విషయలేంటంటే.. మైగ్రేన్ ఇన్ఫార్క్షన్..  దీనిని మైగ్రేన్ స్ట్రోక్ అని కూడా పిలుస్తారు, ఇది మహిళల్లో ఎక్కువగా కనిపించే అరుదైన సమస్య. మైగ్రేన్ తలనొప్పితో పాటు ఇస్కీమిక్ స్ట్రోక్ వచ్చినప్పుడు, దానిని మైగ్రేన్ స్ట్రోక్ అంటారు. మెదడులోని రక్తనాళం నిరోధించబడినప్పుడు, రక్త ప్రసరణను ఆగిపోయినప్పుడు ఇస్కీమిక్ స్ట్రోక్ వస్తుంది. . మైగ్రేన్ స్ట్రోక్ అకస్మాత్తుగా రావచ్చు, అత్యవసర పరిస్థితి కాబట్టి తరచుగా మైగ్రేన్ వస్తూ ఉంటే, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించడానికి చర్యలు తీసుకోవాలి. స్ట్రోక్ అనేది ప్రాణాంతక సమస్యగా మారుతుంది.. మైగ్రేన్ వల్ల మూర్ఛ సమస్య చాలా అరుదుగా అయినా.. మైగ్రేన్ కూడా మూర్ఛ సమస్యను కలిగిస్తుంది. తీవ్రమైన మైగ్రేన్లు మెదడును దెబ్బతీస్తాయని, దీనివల్ల  మూర్ఛ వచ్చే ప్రమాదం ఉందని పరిశోధకులు కనుగొన్నారు. మరొక విషయం ఏమిటంటే,. మూర్ఛ సమస్యలు ఉన్నవారికి మైగ్రేన్ వచ్చే అవకాశం ఎక్కువ. అందుకే మైగ్రేన్ నుండి తమను తాము కాపాడుకోవడం చాలా ముఖ్యం. మానసిక ఆరోగ్య సమస్యలు ఇతరులకన్నా మైగ్రేన్‌ వచ్చే వ్యక్తులు ఒత్తిడి, డిప్రెషన్‌కు తొందరగా  గురయ్యే అవకాశం ఉంది. కొన్నిసార్లు మైగ్రేన్ డిప్రెషన్ లేదా యాంగ్జయిటీ వల్ల కూడా రావచ్చు. ఇది కాకుండా మైగ్రేన్ నొప్పి, అసౌకర్యం కూడా నిద్ర సంబంధిత సమస్యలను పెంచుతుంది. తీవ్రమైన మైగ్రేన్ ఎక్కువగా అటాక్ ఇస్తున్నవారిలో నిద్రలేమి ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.  నిద్ర సరిగా లేకపోతే అది కూడా డిప్రెషన్‌కు కారణమవుతుంది.                                      ◆నిశ్శబ్ద.

పాలు మధుమేహం ప్రమాదాన్ని తగ్గిస్తాయా? అసలు నిజం ఏంటి?

ప్రస్తుత కాలంలో చాలామందిని వేధిస్తున్న సమస్య మధుమేహం. ఆందరినీ ఆందోళనకు గురి చేసే విషయం ఏమిటంటే యువత కూడా దీనికి బాధితులుగా మారుతున్నారు. ఎలివేటెడ్ షుగర్ లెవెల్స్ శరీరంలోని మూత్రపిండాలు, నరాలు, కళ్ళు వంటి ఎన్నో అవయవాలను దెబ్బతీస్తాయి.  అలాగే అనేక రకాల ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని పెంచుతాయి. అందుకే మధుమేహం నియంత్రణ మీద దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.  కుటుంబంలో ఎవరికైనా ఇప్పటికే మధుమేహం ఉంటే, ఆ కుటుంబ సభ్యులు మరింత అప్రమత్తంగా ఉండాలి. అయితే అందరినీ షాకింగ్ గా అనిపించే విషయం ఏమిటంటే.. క్రమం తప్పకుండా పాలు తీసుకుంటే మధుమేహం వచ్చే ప్రమాదాన్ని తగ్గించవచ్చు. పాలకు డయాబెటిస్ రిస్క్ తగ్గుతుందా? మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ ఫుడ్ డైట్ ప్లాన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. తీసుకునే ఆహారం  రక్తంలో చక్కెర స్థాయిని త్వరగా పెంచుతాయి. అయితే పాలను సంపూర్ణ ఆహారంగా పరిగణిస్తారు. పాలు, ప్రోటీన్లు, కాల్షియం, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఇతర ముఖ్యమైన పోషకాలతో సమృద్ధిగా ఉండటం వల్ల ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది. అయితే పాలు తాగడం వల్ల టైప్ 2 డయాబెటిస్ ప్రమాదం తగ్గుతుందనేది ఇప్పుడు బయటపడిన కొత్త విషయం. పాలు, పాల ఉత్పత్తులు మెటబాలిక్ సిండ్రోమ్, స్థూలకాయం, అధిక రక్తపోటును నివారిస్తాయి.  మధుమేహం ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయని పరిశోధనలు వెల్లడించాయి. తక్కువ కొవ్వు కలిగిన పాల ఉత్పత్తులు మరింత ప్రయోజనకరంగా ఉంటాయి. పాలు, పెరుగు రెండూ మెటబాలిక్ సిండ్రోమ్, టైప్-2 మధుమేహం నుండి ఆరోగ్యాన్ని కాపాడటంలో సహాయపడతాయి. పాలు కాల్షియం, ప్రోటీన్ రెండింటికీ అద్భుతమైన మూలం. కాబట్టి ప్రతి ఒక్కరూ దానిని ఆహారంలో చేర్చుకోవడం చాలా ముఖ్యం. క్యాల్షియం, ప్రొటీన్లు రెండూ పెరుగుతున్న పిల్లలకు మహిళలకు అవసరయ్యేవే. పాలలో ఇవి పుష్కలంగా ఉండటం వల్ల పాలుచాలా ఉపయోగకరం. పాలు తీసుకోవడం అలవాటు చేసుకోవడం వల్ల శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడంతో పాటు దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. ◆నిశ్శబ్ద.

బరువు తగ్గాలని అనుకునేవారికి గుడ్ న్యూస్.. ఇలా చేస్తే ఎంతో ఈజీగా..

శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే బరువు తగ్గడం చాలా ముఖ్యం. బరువు పెరిగేకొద్దీ అనేక వ్యాధుల బారిన పడవచ్చు. అధిక బరువు రక్తపోటు నుండి మధుమేహం, ఇంకా కొన్ని రకాల క్యాన్సర్ల వరకు అన్నింటికీ ప్రధాన కారణమవుతుంది. పరిగా ధికా బరువు ఉంటే తమ పనులు తాము చేసుకోవడంలో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకే అధిక బరువును వదిలించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ఆశించిన ఫలితం పొందేవారు తక్కువే. కానీ బరువు తగ్గడం చాలా సులభం అనే విషయం మీకు తెలుసా??  బరువు తగ్గడం ఈజీ అంటున్నారేంటి పిచ్చా?? అని నిందించాల్సిన పనిలేదు. నిజంగానే బరువు తగ్గడం సులువు. అయితే విషయమంతా బరువు తగ్గడానికి పాటిస్తున్న విధానాలలోనే ఉంది.  చాలామంది బరువు తగ్గడానికి ఫుడ్ స్కిప్ చేయడం నుండి జిమ్‌లో గంటలు గడపడం వరకు ఎన్నో చేస్తారు. కానీ వీటి వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. అందుకే సరైన పద్ధతులను శ్రద్ధగా పాటించడం చాలా ముఖ్యం. ఇది బరువు పెరగకుండా నిరోధించడమే కాకుండా ఇతర శరీరక ప్రయోజనాలను కూడా  చేకూరుస్తుంది. బరువు తగ్గాలని అనుకునేవారు అసలు బరువు ఎందుకు పెరుగుతున్నాం అనే విషయం గురించి ఆలోచించాలి.  రోజువారీ చేసే పనులు ద్వారా ఖర్చయ్యే దానికంటే ఎక్కువ కేలరీలు తీసుకుంటే, అది బరువు పెరగడానికి కారణమవుతుంది. అంటే మొదట బరువు పెరగకుండా నియంత్రించాలి. ఎప్పుడైతే బరువు పెరగడం ఆగుతుందో అప్పుడు బరువు తగ్గడానికి చేసే ప్రయత్నాలు పనిచేయడం మొదలుపెడతాయి. రోజు ఏమి తింటున్నారు?? ఎంత పని చేస్తున్నారు?? శారీరక శ్రమ ఎంత ఉంది??. వ్యాయామం వల్ల ఎలాంటి మార్పులు వస్తాయి.. ఇవన్నీ గమనించుకోవడం చాలా ముఖ్యం.  సాధారణంగా బరువు తగ్గాలని అనుకునేవారు ఆహారంలో కేలరీలు తగ్గుతాయి అనే భ్రమతో తిండి తగ్గిస్తుంటారు. దీనివల్ల ప్రయోజనాలు చేకూరకపోగా ఇతర ఆరోగ్య సమస్యలు కారణం అవుతుంది.  కాబట్టి బరువు తగ్గాలి అంటే కేలరీలు తక్కువ ఉండి, కడుపు నింపే ఆహారాలు తీసుకోవాలి. దీనీవల్ల శరీరంలో  కేలరీలు పేరుకుపోవు, అధికబరువు క్రమంగా తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇందుకోసం రోజులో తీసుకునే చక్కెర-తీపి పానీయాలు, బేకరీ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్ వంటివి తగ్గించుకోవాలి. వీటికి బదులు సలాడ్స్, పండ్లు, పండ్ల రసాలు తీసుకోవాలి. ఇవి బరువు తగ్గించుకోవడానికి  ప్రయోజనకరంగా ఉంటాయి. వ్యాయామం తప్పనిసరి.. బరువు తగ్గడానికి ఎన్ని పద్ధతులు ఫాలో అయినా వాటికి జతగా వ్యాయామం ఉండాల్సిందే. ఇది బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది. కేలరీలు పొదుపుగా తీసుకుంటూ ఒంట్లో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను కరిగించడం వల్ల బరువు చాలా ఈజీగా తగ్గుతారు. ఆహార మార్పుల ద్వారా మాత్రమే బరువు తగ్గడం సాధ్యం కాదు. బరువు తగ్గడానికి అందుబాటులో  ఉన్న మరొక గొప్ప  మార్గం యోగ. ప్రతిరోజు యోగ చేస్తూ డైట్ ఫాలో అయితే బరువు తగ్గడం చూసి ఎవరికి వారు ఆశ్చర్యపోతారు.  కాబట్టి ఆహారంలో కేలరీలు తగ్గించడం, వ్యాయామం చేస్తూ కొవ్వును కరిగించడం, డైట్ మెనూ ఫాలో అవ్వడం ఇవి పాటిస్తే అద్బుతమే..                               ◆నిశ్శబ్ద.

గుట్కా తింటే గుటుక్కే!

నోటి క్యాన్సర్... తల మెడ భాగాలకు వచ్చే క్యాన్సార్ లలో నోటి క్యాన్సర్ ముఖ్యమైనది.నోటి లోపలి భాగాన్ని ఓరల్ కావిటి అంటారు. నోటి వెనుక గొంతు పై భాగాన్ని ఓరో ఫారింక్స్ అంటారు. నోటి క్యాన్సర్ రానే కూడదు కాని వచ్చిందంటే మాత్రం చాలా త్వరగానే అతి ప్రమాదకరం గా పరిణమిస్తుంది. అసలు నోటి లోపలి భాగాలు ఏమిటి. *పెదాలు ,దంతాలు, చిగుళ్ళు. *పెదాల లోపలి పోర,బుగ్గల లోపలి పోర. *నాలుకకింది నోటి అడుగు భాగం. *నోటి పై భాగం అంగుటి. *జ్ఞాన దంతాల వెనుక ఉండే స్వల్ప భాగం. గొంతు పై భాగాన ఉండే ఒరోఫర్యర్ లో కింది భాగాలు ఉంటాయి. *నాలుక వెనుక మూడోవంతు భాగం. *మెత్తటి అంగుటి. *టాన్సిల్. *ఓరో ఫారింక్స్  నోటి క్యాన్సర్ నోటిలో ఎబాగామైనా రావచ్చు. సాధారణంగా నాలుకమీద లేక నాలుక కింద గాని క్యాన్సర్ ప్రారంభ మౌతుంది.దాదాపు నోటి క్యాన్సర్లు అన్ని కూడా నోరు, పెదాల పై భాగం పొరల లోని చదును కణాలు ఫ్లాట్ సెల్ల్స్ స్కుమౌస్ కణాలు నుండి మొదలు అవుతాయి.అందుకు నోటి క్యాన్సర్స్ ను స్కుమౌస్ సెల్ కార్సినోమా గా వ్యవహరిస్తారు.సాధారణంగా నోటి క్యాన్సర్ ఇతర శరీర భాగాలకు వ్యాపించడం లింఫ్ వ్యవస్థ ద్వారా జరుగుతుంది. లింఫ్ నోడ్స్ లోకి ప్రవేశించిన క్యాన్సర్ కణాలు వాటిలో స్వాచమైన నీటిలా ఉండే లింఫ్ ద్రవం ద్వారా ఇతర శరీర భాగాలకు వెళ్లి అయాభాగాలకు క్యాన్సర్ ను వ్యాపింప చేస్తాయి.  నోటి క్యాన్సర్ లక్షణాలు... నోటి క్యాన్సర్ సాధారణంగా తెల్లటి మచ్చతో ప్రారంభ మౌతుంది. దీనిని ల్యుకో ప్లేకియా లేక చిన్న గడ్డతో కూడా ప్రారంభం కావచ్చు.ఈ మచ్చ లేదా గడ్డ వద్ద నొప్పి అంటూ ఏమీ ఉండదు కానీ ఒక్కోసారి మంట పెడుతూ ఉంటుంది.గడ్డ పెరిగి కొన్నాళ్ళకి పుండుగా తయారయి లేదా డని చుట్టూ భాగం గట్టిగా ఏర్పడి గద్దమధ్య పగిలి అక్కడ నుంచి రక్తం కారడం,కణితి పక్క కణజాలం భాగాలకు వ్యాపించడం జారుతుంది ఈ విషయాన్ని పరిసీలించాకుంటే తెలియదు. నోటి క్యాన్సర్ కు కారణాలు... నోటి క్యాన్సర్ కొందరికి ఎందుకు వస్తుంది. కొందరికి ఎందుకురాడు.అన్న ఖచ్చితమైన సమాధానం అంటూ లభించదు.అయితే నోటి క్యాన్సర్ అంటు వ్యాధి కాదు.ఈ కింది అలవాట్లు ఉన్న వారికి నోటి క్యాన్సర్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయాని పరిశోదనలు చెపుతున్నాయి. పొగాకు... నోటి క్యాన్సర్ రావడానికి ఎక్కువ సందర్భాలలో పొగాకు ప్రాధాన కారణంగా ఉంటుంది.చుట్ట,బీడీ,సిగరెట్, పైపు,సిగార్ హుక్కా,గుట్కా పొగాకు సేవనం నస్స్యం పీల్చడం మొదలైన పొగాకు సంబందమైన అలవాట్లు కూడా నోటి క్యాన్సర్ రావడానికి కారణాలుగా నిపుణులు నిర్ధారించారు.ముఖ్యంగా దీర్ఘకాలం పాటు అతిగా పొగతాగే వారికి మద్యం తాగే వారికి రిస్క్ మరింత ఎక్కువగా ఉంటుందని మాద్యం పోగాతాగాడం రెండు అలవాట్లూ కలిసి ఉండడం అదీ అధికంగా ఉన్నవాళ్ళకు నోటి క్యాన్సర్ తేలికగా వస్తుంది.ఇక్కడ గమనించాల్సిన విష్యం ఒకటి ఉంది శ్రీకాకుళం జిల్లలో కాలుతున్న చుట్టభాగాన్ని నోటిలో పెట్టుకుని పొగాకు సేవించడం ఒక ఆన వాయితీగా ఉంది వీళ్ళు నోటిక్యాన్సర్  వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని దీనిని చుట్ట క్యాన్సర్ గా పేర్కొన్నారు. మధ్యం... మధ్యం ముట్టని వల్ల కంటే మధ్యం తాగే వారికి నోటి క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ మాధ్యమం ఎంత ఎక్కువ తాగితే అంత ఎక్కువ పరిమాణం  ఉంటుందనిరిస్క్ అంతే ఎక్కువ.మాద్యం పొగాకు రెండూ అలవాట్లూ కలిసి ఉంటె నోటి క్యాన్సర్ త్వరగా వస్తుంది. అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వైరస్ ఇన్ఫెక్షన్లు... హ్యూమన్ పాపిలోమా వైరస్ ఒకరేఅకమైన వైరస్ మూలంగా నోరు గొంతు క్యాన్సర్ కలగ వచ్చు. లైంగిక కలాపాల వల్ల సంక్రమించే వైరస్ లు నాలుక అడుగుభాగాన గొంతు వెనుక భాగాన టాన్సిల్స్ కి మెత్తటి అంగిటి వచ్చే క్యాన్సర్లు ఎక్కువగా హెచ్ పి వి ఇన్ఫెక్షన్ల మూలంగానే వస్తాయి. వక్కపొడి కిళ్ళీ నమలడం వంటి అలవాటు ఉన్న వాళ్ళకి రిస్క్ మరింత ఎక్కువ ఉంటుంది క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయన్నది దీని ఆర్ధం. క్యాన్సర్ చికిత్చ... నోటి క్యాన్సర్ చికిత్చ ప్రారంభ దశలో గుర్తిస్తే రోగికి సర్జరీ ద్వారా రేడియో తెరఫీ ద్వారా కాని చికిత్చ చేస్తారు.క్యాన్సర్ ముదిరితే పరిస్థితిని బట్టి కొన్ని సందర్భాలలో రేడియో తెరఫీ,లేదా కీమో తెరఫీ తార్గేతేడ్ తెరఫీ వంటి చికిత్చాలు చేస్తారు.మీ అలా వాట్లే మీనోటి క్యాన్సర్కు కారణం గా మారచ్చు.        అస్సాం లో పెరుగుతున్న నోటి క్యాన్సర్ బాదితులు.. గౌహతికి చెందినా బి బి సి ఆసుపత్రిలో 56 మంది రోగులకు ఓరల్ మౌత్ క్యాన్సర్ చికిత్చ చేసారు. అదీ 25 సం వత్చరాలనుండి 4౦ సం వత్చరాల వయసు ఉన్నవారు కావడం ఆందోళనకలిగిస్తోంది. అని నిపుణులు అంటున్నారు.ఇది ప్రామాడ ఘంటికలు మొగిస్తోందని నోటిలో వచ్చే కేవిటి నోటి క్యాన్సర్ సహజంగా గుర్తించ వచ్చు సహజంగా 6౦ సంవత్చరాలు వయసు పై బడిన వారిలో రెండు సంవత్చారాల్ క్రితం చూసేవారమని ఇప్పుడు 4౦ సంవత్చారాల లోపు ఉన్న వారిలో నోటి క్యాన్సర్ కేసులు అధికసంఖ్యలో పెరగడం పై అమ్కాలజిస్ట్ లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అత్యధికంగా పొగాకు సేవించడం ప్రాధాన కారణంగా యువత అలాగే గుట్కా కు అలవాటు పడడం క్యాన్సర్ కు కారణం. 2౦21 నాటి గణాంకాల ప్రకారం నార్త్ ఈస్ట్ లో అతిపెద్ద ఆసుపత్రి కి చెందిన క్యాన్సర్ నిపుణుడు డాక్టర్ బారు క్యాన్సర్ ఆసుపత్రి లో 56 మంది 25 సంవత్చారాల రోగులకు నోటి క్యాన్సర్ కు చికిత్చ ను డాక్టర్ నిర్వహించారు.మణి శ్రీ వ కృష్ణ త్రేయ వైద్య క్య్న్సర్ విభాగం ఎపిడమాలాజి యువతలో  క్యాన్సర్ కేసులు పెరగడాన్ని గుట్కాలు  నమలడం ప్రేస్టేజి గా తీసుకుని మరీ పోటి పది తినడం  ఒక కారణంగా పేర్కొన్నారు.అందులో నూ 25 ---4౦ సం మధ్య అస్సాం ఇతర ఉత్తరదేశంలోని రాష్ట్రాలలోని వారే అని నోటి క్యాన్సర్ రోగులు గుట్కా వాడకం వల్లే మరియు పొగాకు ఉత్పత్తుల్లో క్యాన్సర్ కు కారాణం గుట్కా ఇతరాపోగాకు ఉత్పత్తులు ఎక్కువగా యుక్త వయస్సులో ఉన్న వారే అని అంటే టీనేజ్ ఉంటున్నారని క్రిష్ణవర్మ తెలిపారు. ఇందులో ౩8 మంది పురుషులు 18 స్త్రీలు నోటి క్యాన్సర్ బారిన పడ్డ వారిలో 5 గురు మాత్రమే ప్రాధమిక స్థాయి లో ఉన్నవారే అని ఎక్కువ సంఖ్యలో ముదిరిపోయిందని.ఇతర క్యాన్సర్ల లాగానే ముదిరి పోయిందని చాలాకాలంగా ఉంది ఉండవచ్చని కృష్ణ అన్నారు.క్యాన్సర్ అవగాహన కార్యక్రమం లో భాగంగా పలువురు ప్రముఖులు కార్క్రమం లో పాల్గొని క్యాన్సర్ గుర్తించిన వెంటనే సత్వర చికిత్చ చేసుకోవాలని. ఇప్పటికే భారత్ లో 1.6 మిలియన్ల అంటే దాదాపు 1౦ లక్షల క్యాన్సర్ కేసులు సంవత్చారానికి పెరుగుతున్నాయని భగవతి ఆందోళన వ్యక్తం చేసారు అస్సాం చుట్టుపక్కల ప్రాంతాలలో ౩8,౦౦౦ కొత్త కేసులు ప్రతి సంవత్చారం గుర్తిస్తున్నారు.                              

విటమిన్-సి లోపం వచ్చిందని గుర్తుపట్టడం ఎలా?

శరీరాన్ని ఆరోగ్యంగా,  ఫిట్‌గా ఉంచుకోవడానికి, ఆహారంలో పోషకాలు బాగా తీసుకోవాలి.  మనం తీసుకునే ఆహారం శరీరంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. పౌష్టికాహారాన్ని ఎక్కువగా తీసుకునే వ్యక్తులకు  తక్కువ అనారోగ్య సమస్యలు వస్తాయి.  ఆరోగ్యకరమైన, పోషకమైన ఆహారం శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడుతుంది.  ఇందుకోసం విటమిన్-సి అవసరం. సమతులాహారం తీసుకుంటే శరీరానికి కావల్సిన విటమిన్-సి సులువుగా అందుతుంది. కానీ చాలామంది సమతులాహారం తీసుకోరు. అందుకే అనారోగ్యాలు తొందరగా వచ్చేస్తున్నాయి.  విటమిన్-సి శరీరానికి ఎలా మేలు చేకూరుస్తుందంటే.. విటమిన్ సి ని ఆస్కార్బిక్ యాసిడ్ అని కూడా పిలుస్తారు, ఇది శరీరంలో యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి కణాలను రక్షించడంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఆహారం ద్వారా విటమిన్-సిని పొందడం ద్వారా శరీర రోగనిరోధక శక్తిని సులభంగా పెంచుకోవచ్చు. కణాలను రక్షించడంలో వాటిని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడటమే కాకుండా, చర్మం, రక్త నాళాలను ఆరోగ్యంగా ఉంచడానికి కూడా ఇది అవసరం. విటమిన్ సి లోపిస్తే.. శరీర రోగనిరోధక శక్తికి విటమిన్-సి చాలా అవసరం కాబట్టి, అది లోపిస్తే, అంటు వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. ఆహారంలో పోషకాహారం లేని వ్యక్తులలో విటమిన్ సి లోపం ఎక్కువగా ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా, డయాలసిస్ చేయించుకునే కిడ్నీ వ్యాధి ఉన్నవారు, ఎక్కువగా ఆల్కహాల్ తీసుకునే వ్యక్తులు కూడా విటమిన్ సి లోపంతో బాధపడుతుంటారు. ధూమపానం చేసినప్పుడు ఏర్పడే ఫ్రీ రాడికల్ డ్యామేజ్‌ను తిరిగి సాధారణం చేయడానికి  ప్రతిరోజుకు అదనంగా 35 మిల్లీగ్రాముల విటమిన్ సి అవసరం అవుతుంది.  విటమిన్ సి  లోపం ఉందని ఎలా తెలుసుకోవాలంటే.. విటమిన్-సి లోపం వల్ల శరీరంలో అనేక దుష్ప్రభావాలు కలుగుతాయి. పెద్దలలో, విటమిన్ సి లోపం యొక్క లక్షణాలు వారాల నుండి నెలల వరకు డవలప్ అవుతాయి.  దీని కారణంగా బలహీనత, అలసట, చిరాకు, బరువు తగ్గడం, గాయాలు సరిగా మానకపోవడం, తరచుగా ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం వంటివి జరుగుతాయి. విటమిన్-సి లోపం వల్ల స్కర్వీ వ్యాధి వస్తుంది. ఇతర వ్యక్తుల కంటే ఎక్కువగా అనారోగ్యానికి గురైతే, ఇది విటమిన్-సి లోపానికి కూడా సంకేతం. విటమిన్ సి  ఎలా పొందాలంటే.. విటమిన్-సి కోసం, ఆహారంలో చాలా సులభమైన మార్పు చేసుకోవచ్చు. నారింజ, నిమ్మ వంటి సిట్రస్ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది కాకుండా, నల్ల మిరియాలు, స్ట్రాబెర్రీ, బ్రోకలీ, కివి, పైనాపిల్ మొదలైన వాటిని కూడా సులభంగా నెరవేర్చడానికి ఉపయోగించవచ్చు. తీసుకునే ఆహారంలో ఇవి తప్పక ఉండేలా చూసుకుంటే విటమిన్ సి లోపాన్ని అధిగమించవచ్చు.                                   ◆నిశ్శబ్ద.

ప్యాక్డ్ జ్యూసుల గుట్టేంటో తెలిస్తే విస్తుపోతారు!

శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి పండ్లు, పండ్ల రసాలు చాలా మంచివని వైద్యులు చెబుతారు. ఆరోగ్యం మీద అంతో ఇంతో స్పృహ ఉన్నవారు కూడా పండ్లు, పండ్ల రసాల మీద ఆసక్తి చూపిస్తారు. చాలామంది పండ్లు తినడం కంటే పండ్ల రసాలు తీసుకోవడానికే మొగ్గు చూపుతారు. కానీ పండ్ల రసాలు తయారు చేసుకోవాలంటే బద్దకం వల్లా, అవి చేసుకునేంత సమయం లేకపోవడం వల్ల బయట దొరికే వాటికి ప్రాధాన్యత ఇస్తారు. బయట ప్యాక్ చేయబడిన జ్యుస్ ప్యాకేట్స్, బాటల్స్ మీద కూడా 100% ప్యూర్ అనే మాటను చూసి అవన్నీ ఆరోగ్యమే అనే ఆలోచనతో వాటిని బాగా కొని తాగుతూ ఉంటారు. అయితే  ప్యాకేజ్డ్ జ్యూస్‌ల ఎక్కువ కాలం నిల్వ ఉంచడానికి వాటిలో కొన్ని రకాల ప్రిజర్వేటివ్‌లు, కృత్రిమ చక్కెరలు ఉంటాయి.  ఇవి అనేక విధాలుగా హాని చేస్తాయి.  జ్యూస్ ల ద్వారా ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవాలని అనుకుంటే తాజా పండ్ల రసాన్ని మాత్రమే తీసుకోవడం ఉత్తమం. పిల్లలు, పెద్దలు కూడా బయటకెళ్లినప్పుడు పండ్ల రసాన్ని ఇష్టపడతారనడంలో సందేహం లేదు, ప్యాక్‌డ్ జ్యూస్‌లు శరీరానికి మేలు చేస్తాయని అనుకుంటాం కానీ నిజానికి దాని వల్ల మనం అనుకున్నంత ప్రయోజనం ఉండదు.  ప్యాకేట్స్, బాటల్స్ అందంగా కనబడుతూ ఆకర్షిస్తాయి, ఇక ఏ సెలబ్రిటినో వాటిని ప్రమోట్ చెడితే కొనుగోళ్లు జోరందుకుంటాయి. అయితే ఈ జ్యుస్ లు ముమ్మాటికీ హాని చేసేవే..  100% నిజమైన జ్యూస్‌ అంటూ ప్యాకేజ్డ్ జ్యూస్‌లు అమ్ముడవుతున్నాయి. అవన్నీ కూడా ఆమోదం తెలిపినవే అని, తక్షణ శక్తిని ఇస్తాయని ఎన్ని కబుర్లు చెప్పినా వాటిలో చక్కెర, రంగు, రసాయనాలు తప్ప ఇంకేమి ఉండదు.  చాలా వరకు ప్యాకేజ్డ్ పండ్ల రసాలలో ఆర్సెనిక్, సీసం వంటి రసాయనాలు ఉంటాయి.  ఇవి చాలా తీవ్రమైన దుష్ప్రభావాలను కలిగిస్తాయి.  దాదాపు 24  రకాల పండ్ల రసాల బ్రాండ్లను పరీక్షించిన తరువాత అన్నింటిలోనూ సీసం శాతం ఎక్కువగా బయటపడింది. ఇవి పిల్లలలో న్యూరో డెవలప్‌మెంటల్ సమస్యలను కలిగిస్తాయి. మరీ ముఖ్యంగా ఆపిల్ జ్యుస్ కి సంబంధించిన బ్రాండ్లలో ఇది ఎక్కువగా ఉంటుంది.  ఖచ్చితంగా చెప్పాలంటే , ఆర్సెనిక్ అనేది పర్యావరణ కాలుష్యం, అలాంటిది మనిషికి ఇంకెంత ప్రమాదం చేకూరుస్తుందో అర్థం చేసుకోవచ్చు.  యాపిల్స్, ద్రాక్ష సహజంగా మట్టిలో ఉన్న, లేదా పురుగుమందుల కోసం ఉపయోగించే ఆర్సెనిక్‌ను సహజంగానే గ్రహిస్తుంది. ఇలాంటి వాటితో ప్యాక్డ్ జ్యుస్ లు తయారుచేస్తే అవి శరీరానికి మరింత హాని కలిగిస్తాయి.  ప్యాక్ చేయబడిన జ్యుస్ ల గుట్టు ఏంటో తెలుసా.. ప్యాక్ చేయబడిన జ్యూస్ లు బహుశా తక్కువ నాణ్యత గల పండ్ల నుండి తయారు చేయబడతాయి. ఈ జ్యూస్ లు మంచి రుచిని, సువాసనను కలిగి ఉంటాయి. తాగేకొద్ది తాగాలని అనిపిస్తుంది. రంగు కూడా టెంప్టింగ్ గా ఉంటుంది. కానీ అన్నీ కృత్రిమమే అనే విషయం గుర్తుంచుకోవాలి. ఇవన్నీ ఆరోగ్యానికి హాని కలిగించేవే.. డయాబెటిక్ లేదా అధిక బరువు ఉన్నవారు ప్యాక్డ్ జ్యూస్‌లను అసలు తీసుకోకూడదు. ఇంకా ఈ ప్యాక్ జ్యుస్ లు ఎక్కువగా తాగే వారికి తొందరగా డయాబెటిక్, అధిక బరువు సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త.                                  ◆నిశ్శబ్ద.