చలికాలంలో వచ్చే జలుబు, గొంతు నొప్పికి ఇవి దివ్యౌషధం..!

కొందరికి తరచుగా జలుబు, ఫ్లూ, దగ్గు వస్తుంటాయి. ఈ సందర్భంలో గొంతు నొప్పి సాధారణం. ఇది వివిధ ఇన్ఫెక్షన్ల వల్ల సంభవించవచ్చు.  చలికాలం వస్తే ఇది మామూలేనని పలువురు వాపోతున్నారు. కొందరు వ్యక్తులు గొంతు నొప్పితో వాపును కూడా అనుభవిస్తారు. అయితే గొంతు నొప్పి నుంచి ఉపశమనం పొందేందుకు అనేక హోం రెమెడీస్ ఉన్నాయి. మన పెద్దలు కూడా వీటి గురించి చెబుతుంటారు. చలికాలంలో వేధించే గొంతునొప్పి, జలుబుకు సంబంధించిన హోం రెమెడీస్ గురించి ఇప్పుడు చూద్దాం. తేనె: తేనె చాలా సంవత్సరాలుగా సాంప్రదాయ ఔషధం యొక్క సహజ రూపంగా ఉపయోగిస్తున్నారు. ఇది వివిధ ఆరోగ్య సమస్యలకు ఆయుర్వేద ఔషధంగా పనిచేస్తుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉన్నందున ఇది మన శరీరంలో మంటను తగ్గించడంలో గొప్పగా పనిచేస్తుంది. ఇది కాకుండా, ఇది వెంటనే గొంతు నొప్పి తగ్గిస్తుంది. ఉప్పు నీటితో గార్గ్లింగ్: గోరువెచ్చని ఉప్పు నీరు మీ స్క్రాచీ గొంతు, జలుబు వల్ల వచ్చే గొంతు నొప్పికి ఉత్తమ ఔషధంగా కనిపిస్తుంది. ఇది గొంతులోని బ్యాక్టీరియాను తొలగిస్తుంది. నొప్పిని కూడా తగ్గిస్తుంది. దీని కోసం, ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో అర టీస్పూన్ ఉప్పు వేసి, బాగా మిక్స్ చేసి రెండు నిమిషాలు పుక్కిలించాలి. చమోమిలే టీ తాగడం: ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్, ఇతర ఔషధ గుణాలు ఉన్నాయి. ఇవి గొంతు నొప్పికి నివారణగా పనిచేస్తాయి. మీరు తాగే చమోమిలే టీలో కొంచెం తేనె కలుపుకుంటే మరింత మేలు జరుగుతుంది. ఇది కెఫిన్ కలిగి ఉండదు కాబట్టి, ఇది కడుపు నొప్పిని కూడా తగ్గిస్తుంది. వేడి నిమ్మరసం తాగడం: చలికాలంలో మీ గొంతు నొప్పికి గోరువెచ్చని నిమ్మరసం దివ్యౌషధంగా పనిచేస్తుంది. శరీర బరువును తగ్గించడమే కాకుండా అనేక చర్మ సమస్యలకు ఇది ఔషధంగా పని చేస్తుంది. చలికాలపు లక్షణాలను తొలగించడమే కాకుండా, యాంటీ బ్యాక్టీరియల్,యాంటీ వైరల్ లక్షణాల వల్ల శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి, గొంతులో ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది.

ఆహారంలో ఇదొక్కటి లోపించడం వల్లే ఇరవై ఏళ్ళకే ముసలోళ్ళుగా కనబడుతున్నారు

మనిషిని బట్టి వయసు అంచనా వేస్తుంటారు చాలామంది.  ఈ అంచనాలో కొన్ని సార్లు నిండా 20ఏళ్ళు కూడా లేనివారు ఆంటీలు, అంకుల్స్ అనే ట్యాగ్ లోకి వెళతారు. చిన్న వయసులోనే ఇలా పిలవడం వల్ల మనసులో భోరుమని కుమిలిపోయేవారు చాలామంది ఉన్నారు. నేను ఆంటీలా కనబడుతున్నానా అని ముఖం మీద అనేసేవారు కూడా ఉన్నారు. అయితే ఇది ఎదుటివారి తప్పూ కాదూ, మీ వయసు తప్పూ కాదు. అక్కడున్న తప్పల్లా శరీర చర్మంలో వచ్చిన మార్పే. చిన్నవయసులో చర్మం ముడుతలు పడటం, బలహీనంగా మారటం, శరీరం కూడా వయసు మించినట్టు కనబడటం జరుగుతుంది. ఈ కారణం వల్లే అన్ని సమస్యలు ఎదురవుతాయి. ఈ సమస్య ఏర్పడటానికి శరీరంలో తీసుకునే ఆహారంలో ఒకే ఒకటి లోపించడం కారణమని ఆహార నిపుణులు చెబుతున్నారు. చిన్నవయసులోనే శరీరం ముసలిగా  మారకూడదంటే అవసరైన  పోషకం ఏంటి?  అది ఏ ఆహారాలలో లభిస్తుంది? పూర్తీగా తెలుసుకుంటే.. సాదారణంగా వయసు పెరిగేకొద్ది శరీరం ముసలిగా మారుతుంది. చర్మం యవ్వనంగా ఉండటానికి కారణమయ్యే కొల్లాజెన్ ఉత్పత్తి తగ్గిపోవడమే దీనికి ప్రధాన కారణం. చిన్నవయసులోనే కొల్లాజెన్ సరిగా ఉత్పత్తి కాకపోతే చిన్నవసులోనే ముసలివాళ్లుగా కనబడతారు. చిన్నవయసులో వృద్దాప్య సమస్యను అధిగమించాలంటే కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహించే ఆహారాలను సమృద్దిగా తీసుకోవాలి.  కింది ఆహారాలు తీసుకుంటే శరీరానికి కొల్లాజెన్ సమృద్దిగా అందుతుంది. పైపెచ్చు ఇవి అందుబాటులో ఉండేవే. అవేంటో తెలుసుకుంటే.. టమోటా.. చర్మం వృద్దాప్యంలోకి జారుతుందనడానికి మొదటి సూచన ముఖంలోనే కనిపిస్తుంది. ముఖం మీది చర్మం ముడతలు పడుతూ ఉంటే వెంటనే టమోటా వినియోగం పెంచాలి. టమోటాలు తినడం వల్ల లైకోపీన్, కొల్లాజెన్ కంటెంట్ శరీరంలో పెరుగుతాయి.  ఇది ఒకరకమైన యాంటీ ఆక్సిడెంట్. ఇది చర్మానికి చాలా మేలు చేస్తుంది. ఆకుపచ్చని కూరగాయలు.. కొల్లాజెన్ లోపాన్ని అధిగమించడానికి మాంసాహారులు, శాఖాహారులు కూడా తినగలిగే ఆహారం ఆకుపచ్చని కూరగాయలు. ఆకుపచ్చని కూరగాయలను సహజంగానే ఆరోగ్యానికి ఎంతో మంచివని అంటారు.  ఆకుకూరలలో పాలకూర, బ్రోకలి, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉన్న కూరగాయలు తీసుకోవడం వల్ల కొల్లాజెన్ పొందడం సులువు. అరటిపండు.. బాగా ఆకలిగా ఉన్నప్పుడు భోజనం ఏమీ లేకపోయినా రెండు అరటిపండ్లు తిని గంటకు పైగా ఆకలిని అధిగమించవచ్చు. అరటిపండు కడుపునింపడంతో పాటు శరీరానికి ఆరోగ్యం చేకూరుస్తుంది. అయితే అరటిపండు తింటే వృద్దాప్యాన్ని కూడా జయించవచ్చు. అరటిపండులో కొల్లాజెన్ ఉంటుంది. ప్రతిరోజూ అరటిపండు తింటే కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది వృద్దాప్యాన్ని ఆమడదూరంలో ఉంచుతుంది. పై మూడు రకాల పండ్లు, కూరగాయలను ఆహారంలో క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉంటే కేవలం నెలరోజులలోపే ముడుతలు పడిన చర్మం యవ్వనంగా మారడం గమనిస్తారు. ఈ ఆహారాలు రోజువారి లైఫ్ స్టైల్ లో భాగం చేసుకుంటే యాబై ఏళ్ళు దాటినా యవ్వనంగా యూత్ లా కనిపిస్తారు.                                                   *నిశ్శబ్ద.

ఇందుకే రోజులో ఒక్కసారైనా బెల్లం ముక్క తినాల్సిందే..!!

పంచదారతో పోలిస్తే బెల్లం ఆరోగ్యకరమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. బెల్లంలో సహజసిద్ధమైన ఖనిజాలు,  విటమిన్లు ఉంటాయి. కాబట్టి శుద్ధి చేసిన చక్కెరతో పోలిస్తే బెల్లం చాలా మంచిది. అంతేకాకుండా, మన శరీరానికి అవసరమైన ఐరన్, కాల్షియం,  పొటాషియం కూడా ఇందులో ఉన్నాయి. వీటన్నింటి వల్ల బెల్లం మన శరీరానికి మరింత శక్తిని అందిస్తుంది. రోజూ క్రమం తప్పకుండా బెల్లం తీసుకోవడం వల్ల శరీరానికి మంచి కేలరీలు, కార్బోహైడ్రేట్లు అందుతాయి. అనేక కారణాల వల్ల రోజుకు ఒక్కసారైనా బెల్లం హెల్త్ ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు. యాంటీ ఆక్సిడెంట్లు పెరుగుతాయి: బెల్లంలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.  ఇవి మన శరీరంలోని ఫ్రీ రాడికల్ ఎలిమెంట్స్‌తో పోరాడుతాయి.  క్యాన్సర్,  గుండె సమస్యల వంటి దీర్ఘకాలిక వ్యాధుల నుండి మనలను రక్షిస్తాయి. జీర్ణవ్యవస్థకు మంచిది: మనం తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కావాలి కాబట్టి దానికి బెల్లం లాంటి మరో ఆహారం కావాలి. ఎందుకంటే ఇలాంటి ఆహారాలు మన శరీరంలోని అజీర్ణం, మలబద్ధకం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను నివారిస్తాయి. ఇది మన జీర్ణశక్తిని పెంచుతుంది. కాలేయాన్ని శుభ్రపరుస్తుంది: బెల్లం ఒక ప్రధాన సహజ డిటాక్సిఫైయర్‌గా పనిచేస్తుంది.  కాబట్టి ఇది మన శరీరం నుండి విషాన్ని సులభంగా తొలగిస్తుంది. దీని వల్ల మన కాలేయ భాగం మునుపటి కంటే మెరుగ్గా పనిచేయడం ప్రారంభిస్తుంది. కాలేయం వల్ల మన శరీరంలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు. శక్తిని పెంచుతుంది: కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉన్న బెల్లం తీసుకోవడం వల్ల మన శరీరంలో శక్తిని పెంచి, మనల్ని ఎల్లప్పుడూ ఎనర్జిటిక్ గా ఉంచుతుంది. అలసట, అనిపించే వారు బెల్లం తినడం అలవాటు చేసుకోవాలి. ఋతు నొప్పి ఉపశమనం: బెల్లంలో ఐరన్,  పొటాషియం అధికంగా ఉండటం వల్ల మన శరీరంలో రక్తప్రసరణను నిర్వహించి, బహిష్టు నొప్పి, తిమ్మిరి నుండి ఉపశమనం కలిగిస్తుంది. కాబట్టి పీరియడ్స్ సమయంలో బెల్లం తీసుకోవడం వల్ల మహిళలకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పవచ్చు. రోగనిరోధక శక్తిని పెంచుతుంది: బెల్లంలో అవసరమైన మినరల్స్, విటమిన్లు ఉండటం వల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి ఇన్ఫెక్షన్లకు ఔషధంలా మారుతుంది. దీని వల్ల జలుబు, దగ్గు వంటి సమస్యలు దరిచేరవు. బెల్లం తినే విధానం: మీరు బెల్లాన్ని అనేక రకాలుగా ఆస్వాదించవచ్చు. మీరు నీటిలో బెల్లం కలుపుకొని తినవచ్చు లేదా మీ రోజువారీ టీ-కాఫీలో చక్కెరకు బదులుగా బెల్లం త్రాగవచ్చు. మీరు తయారుచేసే వివిధ తీపి వంటకాలకు బెల్లం జోడించవచ్చు.  మీ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.

ఒంట్లో కొవ్వును ఐస్ లా కరిగించే ఫిట్నెస్ రూల్..

  కొవ్వును కొలెస్ట్రాల్ అని కూడా పిలుస్తారు. శరీరంలో రెండు రకాల కొవ్వులు ఉంటాయి. అవి ఆరోగ్యకరమైన కొవ్వులు, చెడు కొవ్వులు. ఆరోగ్యకరమైన కొవ్వులు గుండె జబ్బులను తగ్గించడంతో పాటు మెదడు పనితీరు, హార్మోన్ ఉత్పత్తి, కణాల పెరుగుదల.. ఇలా చాలా విధులు నిర్వర్తిస్తాయి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా తగ్గిపోతాయి. కొలెస్ట్రాల్ కు, అధిక బరువుకు చాలా దగ్గరి సంబంధం ఉంటుంది.  అధిక బరువు తగ్గాలన్నా, కొలెస్ట్రాల్ ఐస్ లా కరిగిపోవాలన్నా ఒక శక్తివంతమైన ఫిట్నెస్ రూల్ ఫాలో అవుతున్నారు చాలామంది. ఆ ఫిట్నెస్ రూలే 30-30-30.. అసలు 30-30-30 అంటే ఏంటి? బరువు తగ్గడంలో దీని ప్రాముఖ్యత ఏంటి? ఇది ఎంతవరకు బరువు తగ్గించడంలో శక్తివంతంగా పనిచేస్తుంది? పూర్తీగా తెలుసుకుంటే.. అధికబరువుకు ప్రధాన కారణం జీవనశైలి సరిగా లేకపోవడం. ఈ జీవన శైలిని సింపుల్ రూల్ తో ఒకదారిలోకి పెట్టవచ్చు. దీనికి 30-30-30 రూల్ పేరు పెట్టారు. వ్యాయామం, ఆహారం, ప్రశాంతంగా తినడం. కేవలం ఈ మూడు ప్రధానంగా సాగే ఈ రూల్ గురించి తెలుసుకుంటే.. 30 గ్రాముల ప్రోటీన్ తినాలి.. ప్రోటీన్ అనేది బరువు తగ్గడానికి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజూ 30గ్రాముల ప్రోటీన్ ఆహారంలో ఉండేలా చూసుకుంటే అది శరీర అవసరాలకే కాకుండా బరువు తగ్గడానికి కూడా బాగా సహాయపడుతుంది. ఈ 30 అనే మార్క్ కు ఉన్న మరొక అర్థం ఏమిటంటే  రోజూ తీసుకునే ఆహారంలో 30శాతం కేలరీలు తగ్గించాలని. కేలరీలు తగ్గిస్తే సహజంగానే బరువు పెరగరు. ఇక 30గ్రాముల ప్రోటీన్ తీసుకోవడం వల్ల శరీరం బలహీనంగా మారకుండా ఉంటుంది. ప్రోటీన్ కండరాలకు ఎంతో అవసరమైనది కాబట్టి 30గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలి, 30శాతం కేలరీలు తగ్గించుకోవాలి. వ్యాయామం.. వ్యాయామం చేసేవారు చాలా ఆరోగ్యంగా ఉంటారు. వారు స్వతహాగా అన్ని పనులలో చురుగ్గా పాల్గొంటార. ఫిట్నెస్ రూల్ ప్రకారం రోజులో 30నిమిషాలపాటు వ్యాయామం చేయడం వల్ల శరీరంలో కొవ్వు కరిగించడం సులువు అవుతుంది. ఈ వ్యాయామంలో వాకింగ్, జాగింగ్, స్విమ్మింగ్, గేమ్స్, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ మొదలైనవి  ప్రభావవంతంగా ఉంటాయి. ప్రశాంతంగా తినడం.. ప్రశాంతంగా తినడాన్ని ఇప్పట్లో మైండ్ పుల్ ఈటింగ్ అని అంటున్నారు. తినే ఆహారం మీద ద్యాస పెట్టడమే మైండ్ పుల్ పద్దతి. ఇప్పట్లో చాలామంది ఉద్యోగాలు, చదువుల హడావిడిలో వేగంగా తినేయడం చేస్తుంటారు. మరికొందరు భోజనం చేస్తున్నప్పుడు కూడా టీవి, మొబైల్ చూస్తూ  తింటారు.  దీనివల్ల కడుపు అయితే నిండుతుంది కానీ ఆహారంలోని శక్తి శరీరానికి సంపూర్ణంగా అందదు. మనం తినే ఆహారం చాలా శక్తివంతమైనదని, అది అమృత సమానమైనదని భావిస్తూ ఆహారాన్ని చేత్తో కలుపుకుని ఆహారం మీద ఎంతో ఇష్టంతో తినాలి. ఇలా కొన్ని రోజులు చేసిన తరువాత మునుపు ఆహారం తీసుకున్నప్పటికి, తరువాత మైండ్ ఫుల్ గా తిన్నప్పటికి గల తేడాను స్పష్టంగా చూడగలుగుతారు. ఆహారంలో నిఘూడమైన ఉంటుంది. దాన్ని పొందగలగాలి.  ధ్యానం చేస్తున్నప్పుడు, దేవుడిని పూజిస్తున్నప్పుడు ఎంత భక్తితో ఉంటామో ఆహారం దగ్గరా అంతే భక్తితో ఉండాలి. ఆహారాన్ని ఇలా ఫీలవుతూ తినడానికి 30నిమిషాల సమయాన్ని కేటాయించాలి. కేవలం పై మూడు ఫాలో అయితే కొన్ని రోజులలోనే బరువు తగ్గడం స్పష్టంగా గమనించగలుగుతారు.                                                   *నిశ్శబ్ద

ఈ ఐదు రకాల నూనెల గురించి పూర్తీ తెలుసుకోకుండా వంటల్లో అస్సలు వాడకూడదు!

చాలా రకాల వంటలలో నూనె వినియోగం తప్పనిసరి. అస్సలు నూనె ఉపయోగించకుండా చేసే వంటల రుచి బాగుండదనే మాట వాస్తవం. నూనె వినియోగానికి బాగా అలవాటు పడిపోవడం వల్ల అలా అనిపిస్తుంది. వంట చేయడానికి  వినియోగించే నూనెలలో చాలా రకాలు ఉన్నాయి. వీటిలో కొన్ని నూనెలు ఆరోగ్యానికి మంచివి కావని, మరికొన్ని ఆరోగ్యానికి చాలా మంచివని చెబుతుంటారు. అయితే అందరూ ఆరోగ్యానికి చాలా మంచివని అనుకునే అయిదు రకాల నూనెలతో వంట చేయడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని తేలింది. డైటింగ్ చేసేవారు, ఆరోగ్యం మీద స్పృహ ఉన్నవారు ఉపయోగించే కొన్ని రకాల నూనెలు కూడా వంటల్లో వినియోగించడం మంచిది కాదని తేలింది. ఆ నూనెలేంటంటే.. ఆవనూనె.. ఆవనూనె వంటల తయారీలో ఆరోగ్యకరమైనదిగా  పరిగణిస్తారు.  అయితే ఈ నూనెను చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి. ఇందులో  ఒమేగా-3,  ఒమేగా-6 కొవ్వు ఆమ్లాలను కలిగి ఉంటుంది.  కల్తీ లేని ఆవనూనె మాత్రమే వంటకు ఉత్తమమైనది. లేని పక్షంలో మంచి ఫలితాల కంటే కలిగే నష్టాలే ఎక్కువ. సోయాబీన్ నూనె.. సోయాబీన్ నూనెలో ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ చాలా పుష్కలంగా ఉంటాయి. దీని కారణంగా శరీరంలో ఒమేగా -6,  ఒమేగా -3 నిష్పత్తి అసమతుల్యమవుతుంది. దీని వల్ల శరీరంలో వాపు, కీళ్లనొప్పులు,  కొన్ని రకాల క్యాన్సర్‌లు వచ్చే ప్రమాదం ఉంది. సోయాబీన్ నూనెను రోజూ వంటల్లో వినియోగించడం  వల్ల ఊబకాయం,  మధుమేహం తొందరగా వస్తుంది. మొక్కజొన్న నూనె.. వెజిటబుల్  నూనె మాదిరి మొక్కజొన్న నూనెలో కూడా ఒమేగా -6 కొవ్వు ఆమ్లాలు అధిక స్థాయిలో ఉంటాయి. ఆహారంలో ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్‌లు అధికంగా ఉంటే వాపుకు కారణమవుతుంది. దీన్ని తీసుకుంటే   100% కొవ్వులు శరీరంలో చేరతాయి.  ఇకపోతే ఈ నూనెలో ప్రోటీన్ లేదా కార్బోహైడ్రేట్లు ఏమీ ఉండవు. మొక్కజొన్న నూనె వంట విషయంలో ఆరోగ్యకరమైన ఎంపిక కాదు. ఆలివ్ నూనె.. ఆలివ్ నూనె ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతారు. సలాడ్‌లు,  ఆహారంలో నూనెను జోడించడం విషయానికి వస్తే ఆలివ్ నూనె అత్యంత ఆరోగ్యకరమైనదిగా పరిగణించబడుతుంది. అయితే  ఈ నూనె వేడెక్కే ఉష్టోగ్రత ఇతర నూనెల కంటే తక్కువగా ఉంటుంది, అంటే ఇది అధిక మంట మీద  వంట చేయడానికి తగినది కాదు. ఆలివ్ నూనెను ఎప్పుడూ పైపైన వాడాలే తప్ప నేరుగా మంటమీద వేడి చేసి ఆహారాన్ని వండకూడదు. అలా వండితే  దాని పోషకాలు చెడిపోతాయి, అలాంటి  నూనె శరీరానికి హానికరం అవుతుంది. పామాయిల్.. ఒకప్పుడు పామాయిల్ చాలా విరివిగా వాడేవారు. ఈ పామాయిల్ లో  సంతృప్త కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. వీటిని అధికంగా తీసుకుంటే గుండె జబ్బులు వస్తాయి. ఈ నూనెను ఎక్కువగా స్నానపు సబ్బు తయారీలో ఉపయోగిస్తారు . ఇది చాలా ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద కరుగుతుంది, అందుకే దీనిని రెస్టారెంట్లలో లేదా టాఫీ చాక్లెట్ మొదలైన వాటి తయారీలో ఉపయోగిస్తారు, తద్వారా ఇది నోటిలోకి వెళ్ళిన వెంటనే కరిగిపోతుంది. ఆరోగ్యం బాగుండాలంటే పైన చెప్పిన నూనెలను ఆహారం వండటానికి అస్సలు వినియోగించకూడదు. దీనికి బదులుగా కొబ్బరి నూనె, అవకాడో నూనె, నువ్వుల నూనె వంటి ఆరోగ్యకరమైన నూనెలు వినియోగించవచ్చు. అయితే ఆహారం తయారీలో నూనెల వినియోగం పరిమితంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉండటం సాధ్యమవుతుంది.                                        *నిశ్శబ్ద.

తులసి గురించి ఆయుర్వేదంలో ఉన్న షాకింగ్ చిట్కాలు!!

 చర్మవ్యాధుల్ని  పోగొట్టడంలో  తులసి చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. తామర మొదలైన చర్మ వ్యాధులకు తులసి ఆకులను నూరి, నిమ్మపండు రసం కలిపి పైన రాస్తారు. క్రిములను సైతం తులసి సంహరిస్తుంది. ఎక్కిళ్ళు, ఆయాసం, దగ్గు మొదలైన శ్వాసకోశ సంబంధ వ్యాధులు నయమవుతాయి. నిమోనియా, మలబద్ధకాలకు తులసి మంచి ఔషధం. మలేరియా జ్వరానికి తులసీ దళాల కషాయం బాగా పనిచేస్తుంది. ఎండు తులసి ఆకులను నీళ్ళలో (10 తులాల నీళ్ళకు ఒక తులం ఆకు వంతున) వేసి మరిగించి, ఆ కషాయాన్ని రొమ్ము పడిసెం మొదలైనవాటికి వాడతారు. చెవిపోటు వస్తే తులసి ఆకు రసాన్ని చెవిలో పిండితే తగ్గిపోతుంది. మానకుండా ప్రతి రోజూ రెండు పూటలా తులసీ దళాలను సేవించడం వల్ల రక్తపోటు, క్యాన్సర్, కడుపులో పుండు మొదలైనవి రావు. అలాగే ప్రతి రోజూ ఉదయం తులసి ఆకును నలిపి, ఒక తులం రసం తీసి తాగుతుంటే జీర్ణజ్వరాలు, విరేచనాలు మొదలైనవి తొలగిపోతాయి. పిల్లలకు కడుపుశూల వస్తే, తులసి ఆకు రసంలో కొద్దిగా అల్లపు రసాన్ని కలిపి తాగిస్తారు. ఒక తులం తులసి రసంలో పావు తులం నల్ల మిరియాల రసం కలిపి తాగిస్తే, జలుబుతో కూడిన జ్వరం, విడవకుండా వస్తున్న జ్వరం కూడా తగ్గిపోతాయి. అలాగే, అప్పటికప్పుడు తాజాగా తీసిన తులసి రసాన్ని తాగిస్తే వాంతులు కట్టేస్తాయి. పేగుల్లో ఉండే క్రిములు నశిస్తాయి. వాంతులు, విరేచనాలు అవుతుంటే, పిల్లలకు తులసి గింజలను ఆవు పాలతో నూరి తాగిస్తారు. శరీరంలో వేడిని పెంచే గుణం తులసికి ఉంది. అందుకే, అవసాన దశలో శరీరం చల్లబడుతున్నప్పుడు గొంతులో తులసీ రసం (తీర్థం) పోస్తారు. తులసి ఆకుల్ని వాసన చూస్తే జలుబు పోతుంది. తులసీ  రసాన్ని కళ్ళల్లో వేస్తే చూపు బలపడుతుంది. కళ్ళల్లో నీళ్ళు కారడం ఆగుతుంది. చెవిలో పోస్తే చెవుడు పోతుంది. ఆకును నమిలి చెవిలో పెడితే, చెవి పోటు తగ్గుతుంది. సూర్యోదయం కన్నా ముందే ఆకులు నమిలి, దంతాలకు రుద్దితే పంటి నొప్పి రాదు. తులసి ఆకుల్ని నూరి, వేడి నీటితో కలిపి పుక్కిలించినా, నమిలినా నోరు పొక్కడం మానుతుంది. ఇక, తులసి గింజల్ని తాంబూలంతో సేవిస్తే, గొంతు వాపు పోతుంది. దీని ఆకు రసంతో తేనె కలిపి ఇస్తే, గట్టిగా ఉండే శ్లేష్మం పల్చబడి బయట పడుతుంది. అలాగే, దగ్గు, రొమ్ము పడిసెం మొదలైనవి కలిగినప్పుడు తులసి రసంలో తేనె, అల్లపు రసం, నీరుల్లి రసం కలిపి ఇస్తే, కఫం తెగి పడుతుంది. తులసి ఎండుటాకును నూరి, నస్యం చేస్తే ఉబ్బసం తగ్గుతుంది. తులసి రసాన్ని తేనెతో కలిపి ఇస్తే, ఆకలి కలుగుతుంది. అన్నకోశానికి శక్తి నిస్తుంది. జీర్ణశక్తిని కలిగిస్తుంది. వాంతులు ఆగుతాయి. తులసి ఆకుల రసాన్ని, శొంఠి పొడి కలిపి ఇస్తే చలి జ్వరం పోతుంది. జలుబు చేసిన వాళ్ళు రోజుకు మూడు, నాలుగు సార్లు తులసి ఆకులు కొన్ని తీసుకొని, బాగా నమిలి మింగాలి. లేదంటే, మరుగుతున్న నీటిలో ఆ ఆకులు వేసి కొద్దిసేపు ఉంచి, వడపోసి, అందులో కాస్త పంచదార, రెండింతల పాలు పోసి, కాఫీ లాగా తాగాలి. దీని వల్ల రొంప తగ్గి, జ్వరం రాదని వైద్యులు చెబుతుంటారు. ఇలా గృహ కృత్యాలలో, సామాన్య వ్యాధులకు అన్నిటికీ తులసి దివ్యౌషధం. ప్రాణదాయక, ప్రాణరక్షక శక్తులు తులసిలో ఉండడంతో జగద్రక్షకుడైన విష్ణుమూర్తికి ఇది ప్రియమైనదని హిందువులు నిశ్చయించారు.                                          *నిశ్శబ్ద.

అలారంతో నిద్రలేచే అలవాటుందా? అయితే వెంటనే మానేయడం మంచిది!

ఉదయాన్నే లేచి ఇంటిపనులు చేసుకోవడం కోసం కొందరు మహిళలు, ఉదయాన్నే లేచి జిమ్ కో,  వాకింగ్ కో వెళ్లాలని కొందరు, చదువుకోవాలని కొందరు ఇలా ఎంతోమంది ఉదయం సమయంలో తొందరగా నిద్ర లేవడానికి అలారం సహాయం తీసుకుంటున్నారు. అయితే ఇలా అలారం సహాయంతో నిద్రలేస్తామని, పనులన్నీ చక్కగా చేసుకుంటామని, చక్కగా చదువుకుంటామని గొప్పగా చెప్పుకునేవారు ఎంతో మంది ఉన్నారు. కానీ ఇలా అలారం సహాయంతో నిద్రలేవడం అనేది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదనే చేదు వార్త ఇప్పుడు అందరినీ ఆందోళనకు గురిచేస్తున్న అంశం. అసలు అలారం సహాయంతో నిద్రలేవడం ఎందుకు మంచిది కాదు? దీనివల్ల కలిగే అనారోగ్య సమస్యలు ఏమిటి?  ఈ విషయాల గురించి పూర్తీగా తెలుసుకుంటే ఇకమీదట ఎప్పుడూ అలారం పెట్టుకుని నిద్రలేవడానికి ప్రయత్నించరు. ఒకప్పుడు పిల్లలు పరీక్ష సమయాల్లో ఉదయమే లేచి చదువుకోవాలంటే అలారం ఉపయోగించేవారు. ఆ తరువాత మొబైల్ లోనే అలారం అందుబాటులోకి వచ్చాక నిద్రపోయే ముందు పక్కనే పెట్టుకుని పడుకునే మొబైల్ అలారం సహాయంతో నిద్రలేస్తుంటారు. కానీ చాలామంది అలారం మోత  మోగగానే మొదట్లోనే లేవరు. అది ఒకటికి పదిసార్లు మోగితే కానీ నిద్రలేవరు.  అసలు సమస్య ఎక్కడుందంటే.. ఉదయాన్నే నిద్రలేవడానికి ఉపయోగింటే అలారం సౌండ్ ఆరోగ్యం మొత్తాన్ని చెడగొట్టేస్తుంది. రాత్రంతా విశ్రాంతి తీసుకున్న శరీరం ఉదయాన్నే పెద్ద శబ్దాలతో మేల్కొనడం అంటే అది రక్తపోటు, గుండె సమస్యలకు కోరి దారి ఇస్తున్నట్టేనట.  రాత్రంతా నిశ్చల స్థితిలో పడుకుని ఉండటం వల్ల శరీరంలో రక్తం చిక్కగా ఉంటుంది. అలారం శబ్దం కారణంగా మేల్కోవడం వల్ల శరీరంలో రక్తప్రసరణ చురుగ్గా జరగదు. శరీరం సాధారణంగా మేల్కొన్నప్పుడు శరీరంలో రక్తం చురుగ్గా ప్రసారమవుతుంది. నిద్రమత్తులో, గాఢంగా ఉన్నప్పుడు  అలారం శబ్ధం ద్వారా మేల్కోవడం అంటే జ్ఞాపకశక్తి, మెదడు సామర్థ్యాన్ని క్రమంగా తగ్గిస్తుంది. అలారం ద్వారా మేల్కోవడం అడ్రినలిన్ పై ప్రభావం చూపిస్తుంది.  కాబట్టి అలారం ద్వారా నిద్ర నుండి మేల్కొనే అలవాటు ఉన్నవారు దీన్ని మానేయడం ఉత్తమం. అలారం అలవాటు ఎలా మానాలంటే.. అలారం ద్వారా లేవడం రోజులో భాగమైపోయినవారు దీన్ని మానుకుని సాధారణంగా నిద్రలేవడానికి కాస్త కష్టంగా అనిపిస్తుంది. కానీ ఈ అలవాటు మానడం వల్ల దీర్ఘకాల అనారోగ్యాలు నివారించవచ్చు. అలారం వరుసపెట్టి అరుస్తున్నా నిద్రమత్తుతో లేవకుండా బద్దకంగా అలాగే పడుకునే అలవాటు మానుకోవాలి. ఒకటి లేదా రెండు సార్లు అలారం మోగగానే దాన్ని కట్టేయాలి. ఇది క్రమంగా సాధారణంగా లేచే సామర్థ్యాన్ని ప్రోత్సహిస్తుంది. బిగ్గరగా భయపెట్టేలానూ, పెద్ద పెద్ద శబ్దాలతో కూడిన అలారం ను ఉపయోగించడం మానుకోవాలి. సన్న శబ్దంతో పేస్ ఫుల్ గా ఉండే అలారం వాడితే ప్రభావం తక్కువగా ఉంటుంది. ఇంట్లో సూర్యకాంతి నేరుగా ముఖం మీద పడేలాగా నిద్రపోయే ప్రాంతాన్ని సెట్ చేసుకోవాలి. దీనివల్ల ఏ అలారం అక్కర్లేకుండా నిద్రలేవవచ్చు. ప్రతిరోజూ ఒకేసమయంలో నిద్రపోవడం, నిద్రలేవడం చేస్తుంటే ఉదయం సమయంలో అలారం అక్కర్లేకుండానే దానికదే మెలకువ వస్తుంది. ప్రతి రోజూ 7నుండి 8గంటలపాటు నిద్రపోవాలి. ఆరోగ్యకరమైన నిద్ర ఉన్నప్పుడు మేల్కోవడం కూడా సులువుగానే జరుగుతుంది. అదే నిద్ర తక్కువైతే మేల్కోవడం కష్టం.                               *నిశ్శబ్ద.  

చలికాలంలో చాలామందిని ఇబ్బంది పెట్టే అతిపెద్ద సమస్య ఇదే..

ఇప్పటిదాకా ఎండలు ఏమాత్రం తగ్గకుండా వేసవిని తలపిస్తున్నా శరత్కాల ప్రభావం వల్ల క్రమంగా చలి పెరుగుతుంది. సాధారణంగానే అక్టోబర్ నెలలో వాతావరణంలో తీవ్రమైన మార్పులు చోటుచేసుకుంటాయి. క్రమంగా ఉదయం, సాయంత్రం సమయాలలో చలి ఎక్కువ అవుతుంది. ఈ సీజన్ లో ఇన్ఫ్లూయెంజా వంటి వైరల్ లు పెరగడంతో పాటు మైగ్రేన్ సమస్య కూడా పెరిగే ప్రమాదం ఉంది. మైగ్రేన్ అనేది మొండి తలనొప్పి. ఇది వచ్చిందంటే బాధితులను చాలా దారుణంగా హింసిస్తుంది. అసలు మైగ్రేన్ కు చలికి ఉన్న సమస్య ఏంటి? చలికాలంలో దీనికి చెక్ పెట్టడానికి ఏం చెయ్యాలి? పూర్తీగా తెలుసుకుంటే.. మైగ్రేన్ సమస్య ఉన్నవారు చలికాలంలో ఈ సమస్యను మరింత ఎక్కువగా ఎదుర్కొంటారు. ఈ సీజన్ లో గాలి పొడిగా ఉండటం, విపరీతమైన చలి కారణంగా మైగ్రేన్ వస్తుంది. సూర్యరశ్మి తగినంత లేకపోయినా మైగ్రేన్ వస్తుంది. సూర్యరశ్మి లేకపోవడం వల్ల మెదడులో సెరోటోనిన్ వంటి రసాయనాల అసమతుల్యత ఏర్పడుతుంది. ఇది తలనొప్పి, మెగ్రేన్ వంటి సమస్యలు పెంచుతుంది.  సూర్యరశ్మి లేకపోవడం వల్ల సిర్కాడియన్ రిథమ్ కు అంతరాయం కలుగుతుంది. ఇది అంతర్గత నిద్ర గడియారం. ఇది అసమతుల్యతకు గురికావడం వల్ల నిద్రలేమి, తద్వారా తలనొప్పి, మైగ్రేన్ కు దారితీస్తుంది. కేవలం సూర్యరశ్మి మాత్రమే కాకుండా ధూమపానం, మద్యపానం, కెఫిన్ పానీయాలు తీసుకోవడం, అధికంగా వెలుగు కలిగిన, మెరుస్తున్న లైట్లముందు, ఘాడత కలిగిన వాసనల మధ్య ఉండటం కూడా మైగ్రేన్ కు కారణం అవుతాయి. మైగ్రేన్ ఎలా నివారించాలంటే.. చలి భరించలేని వారు, చాలా సున్నితమైనవారు మైగ్రేన్ బారిన తొందరగా పడతారు. శీతాకాలంలో వీరు మైగ్రేన్ బారిన పడే అవకాశం ఎక్కువ.  మైగ్రేన్ ను నివారించడానికి చలికి లోనుకాకుండా ఉండటం ముఖ్యం. వ్యాయామం శరీరంలో వేడి పుట్టిస్తుంది. కాబట్టి రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఈ వ్యాయామం సెరటోనిన్ స్థాయిలను పెంచుతుంది. అలాగే చలికాలపు జాగ్రత్తలు బాగా తీసుకోవాలి. వేడి నీరు, వేడి ఆహారం, వెచ్చని వాతావరణం, ఆరోగ్యాన్ని కాపాడతాయి. మైగ్రేన్ ను దూరంగా ఉంచుతాయి.                                                *నిశ్శబ్ద. 

సహజంగా శరీరంలో విషపదార్థాలను తొలగించుకోవడానికి అద్బుతమైన ఆహారాలు..

ప్రతి రోజూ స్నానం చేస్తాం, శరీరం  ఆరోగ్యంగా కనిపించేలా చూసుకుంటాం. దుస్తుల దగ్గర నుండి శరీరం మీద ఎక్కడైనా మురికి పేరుకుందా లేదా అని గమనించి జాగ్రత్తలు తీసుకుంటాం. ఇలా బాహ్య శుభ్రతకు ఇచ్చిన ప్రాముఖ్యత, దాని మదీ తీసుకున్న శ్రద్ద అంతర్గత శుభ్రత గురించి చాలామందికి ఉండదు. కానీ శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే అంతర్గత శుభ్రతే ముఖ్యం. ఇప్పుడున్న ఆహార కాలుష్యం, జీవనశైలి, వాతావారణ మార్పులు ఇలా ప్రతి ఒక్కటి శరీర అంతర్గత ఆరోగ్యాన్ని ప్రభావం  చేస్తుంది. కొన్ని అద్బుతమైన ఆహారాలు తీసుకోవడం వల్ల లోపలి శరీరం శుద్ది అవుతుంది. టాక్సిన్ లు తొలగిపోతాయి. అవేంటో తెలుసుకుంటే.. బీట్‌రూట్‌లో చాలా యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి.   ఆరోగ్యానికి చాలా  మేలు చేస్తాయి. ఇది కాలేయానికి కూడా చాలా మంచిది.  ఇది నేచురల్ బ్లడ్ క్లెన్సర్‌గా  పనిచేస్తుంది. ఇందులో నైట్రిక్ యాసిడ్ ఉంటుంది ఇది రక్తంలోని విషాన్ని శుభ్రపరచడంలో సహాయపడుతుంది. ప్రతి రోజూ బీట్రూట్ జ్యూస్ తాగినా లేదా రోజులో కనీసం కొన్ని బీట్ రూట్ ముక్కలు తిన్నా రక్తాన్ని శుద్ది చేస్తుంది. కేవలం రెండు వారాల నుండి నెలలోపే ఇందులో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. పసుపులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండటం వల్ల చాలా ఏళ్లుగా దీనిని ఉపయోగిస్తున్నారు. ఇందులో ఉండే కర్కుమిన్ కాలేయాన్ని నిర్విషీకరణ చేయడంలో సహాయపడుతుంది. ఇది ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుండి శరరీరాన్ని  రక్షిస్తుంది. అందువల్ల, ఆహారంలో పసుపును చేర్చుకోవచ్చు, గోల్డ్ మిల్క్ పేరుతో పిలుచుకునే పసుపు పాలు తాగడం లేదా వేడి నీటిలో చిటికెడు పసుపు వేసుకుని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. నిమ్మకాయలో విటమిన్ సి ఉంటుంది. ఇది గొప్ప రోగనిరోధక శక్తిని కలిగిస్తుంది.  జీర్ణక్రియకు  చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి, ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. దీన్ని నీటిలో కలిపి కూడా తాగవచ్చు. ఇది శరీరాన్ని డిటాక్సిఫై చేయడంలో సహాయపడుతుంది. కొత్తిమీర  ఆహారానికి రుచిని, సువాసనను ఇవ్వడానికి మాత్రమే కాదు, శరీరంలో  కొలెస్ట్రాల్ నియంత్రించడంలోనూ,  జీర్ణక్రియను మెరుగుపరచడంలోనూ  ఉపయోగకరంగా ఉంటుంది. దీనితో పాటు, ఇది  శరీరంలో ఉండే ఎక్కువ మొత్తం టాక్సిన్ లను తొలగించడంలో కూడా సహాయపడుతుంది. అందువల్ల, దీన్ని తినడం వల్ల  శరీరం డిటాక్సిఫై అవుతుంది. వెల్లుల్లిలో అధిక సల్ఫర్ కంటెంట్ ఉంటుంది.  ఇది టాక్సిన్స్ తొలగించడంలో కాలేయానికి సహాయపడుతుంది. దీనితో పాటు జుట్టుకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అందువల్ల ఆహారంలో వెల్లుల్లిని చేర్చడం ద్వారా  శరీరాన్ని డిటాక్స్ చేయవచ్చు.  

క్రమం తప్పకుండా బెండకాయ తింటే ఇన్ని లాభాలుంటాయని తెలుసా..

బెండకాయ, లేడీస్ ఫింగర్, ఓక్రా ఇలా పేర్లు ప్రాంతాలకే కానీ కూరగాయ మాత్రం అందరికీ ఒకటే. అమ్మాయిల వేళ్ళలా సుకుమారంగా ఉంటాయని వీటికి ఈ పేరు పెట్టారేమే. లేతగా ఉన్న బెండకాయలు పచ్చివే రుచిగా ఉంటాయి. వీటి విత్తనాలు కాస్త వగరుగా ఉంటాయి. వేగితే మాత్రం వీటి రుచి అద్భుతం. జిగటగా ఉంటుందని పిల్లలు వీటిని ఇష్టపడరు కానీ బెండకాయ నిజంగా గొప్ప ఔషదగుణాలు కలిగి ఉంది. ఇది ఆఫ్రికాకు చెందిన పుష్పించే మొక్క. భారతదేశం, ధక్షిణ అమెరికా సహా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలలో కూరగాయగా పరిగణించబడుతుంది.   బెండకాయలో పోషకాలు..  ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి, ఫైబర్ అధికంగా ఉంటుంది.  విటమిన్ A,  C పుష్కలంగా ఉంటుంది.  అలాగే పొటాషియం,  మెగ్నీషియం వంటి ఖనిజాలు ఉంటాయి. ఇది ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉండే ఫ్లేవనాయిడ్లు,  ఫినోలిక్ సమ్మేళనాలతో సహా యాంటీఆక్సిడెంట్లను కూడా కలిగి ఉంటుంది. బెండకాయ క్రమం తప్పకుండా  తీసుకోవడం వల్ల కలిగే  ప్రయోజనాలు తెలిస్తే అదంటే ఇన్నాళ్లు ఇష్టం లేనివారు కూడా హాయిగా తినేస్తారు. దీని లాభాలేంటో తెలుసుకుంటే.. బెండకాయలో  విటమిన్ A,  C, మెగ్నీషియం, పొటాషియం,  కాల్షియం వంటి అవసరమైన పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి కావసిన  మొత్తం ఆరోగ్యానికి జీవశక్తికి సహకరిస్తుంది. బెండకాయలో ఫైబర్ అధికంగా ఉంటుంది, ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది.  మలబద్ధకాన్ని నివారిస్తుంది.  ప్రయోజనకరమైన బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహించడం ద్వారా  ప్రేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. బెండకాయలో  ఫైబర్ కంటెంట్ కొలెస్ట్రాల్ శోషణను తగ్గిస్తుంది, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.  మొత్తం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. బెండకాయలో పాలీఫెనాల్స్,  ఫైబర్ వంటి సమ్మేళనాలు ఉన్నాయి.  ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి, మధుమేహం  ఉన్నవారు లేదా మధుమేహం వచ్చే ప్రమాదం ఉన్న వ్యక్తులకు ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. బెండకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, ఇది యాంటీఆక్సిడెంట్ రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.  అనారోగ్యాలు,  ఇన్ఫెక్షన్ల నుండి శరీరాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. బెండకాయలో ఉండే అధిక ఫైబర్ కంటెంట్ కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది. ఈ కారణంగా ఆకలిని నియంత్రించడం,  అతిగా తినడాన్ని నిరోధించడంలో సహాయపడుతుంది.  బరువును నియంత్రిస్తుంది. బెండకాయలో విటమిన్ సి, కాల్షియం,  మెగ్నీషియం బలమైన ఎముకలకు సహాయపడతాయి.   బోలు ఎముకల వ్యాధి, ఎముకలు బలహీనంగా ఉండటం, పెలుసుబారడం  వంటి సమస్యలను దూరంగా ఉంచుతుంది. విటమిన్ ఎ,  సితో సహా బెండకాయలోని యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి, చర్మాన్ని యవ్వనంగా ఉంచడానికి , చర్మం కాంతివంతంగా మారడానికి   సహాయపడతాయి. అవి అకాల వృద్ధాప్యం,  ముడతలను నివారించడంలో కూడా సహాయపడతాయి.                                                   *నిశ్శబ్ద.

ఈ ఆహారాలు మీరు ఎక్కువ తింటారా? కీళ్లను చాలా వేగంగా పాడుచేస్తాయట..

మూత్రపిండాలు శరీరంలో ముఖ్యమైన అవయవాలు. ఇవి ప్రతిరోజూ 200లీటర్ల రక్తాన్ని శుద్దిచేయడం ద్వారా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇక కీళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కీళ్ళు ఆరోగ్యంగా లేకపోతే నడవడం, కూర్చోవడం, కదలడం, శరీర అవయవాలను ఉపయోగించడం ఇలా అన్ని విధాలా సమస్యే. ఈ కీళ్లు, మూత్రపిండాలని పాడు చేసే ఆహారాలు కొన్ని ఉన్నాయి. ఈ ఆహారాలలో ఉన్న యూరిక్ యాసిడ్ దీనికి కారణం అవుతుంది. రక్తంలో యూరిక్ యాసిడ్ అధికంగా ఉండటాన్ని హైపర్యూరిసెమియా అంటారు. ఇది గౌట్,  కిడ్నీలో రాళ్లకు కారణమవుతుంది. యూరిక్ యాసిడ్ ప్యూరిన్ అనే మూలకం నుండి తయారవుతుంది. తినే కొన్ని ఆహారాలలో  ప్యూరిన్లు అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి తినడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి చాలావేగంగా పెరిగి శరీరంలో కీళ్లు, మూత్రపిండాలకు నష్టం కలుగుతుంది. జంతువుల మాంసం చాలామంది తింటారు. వీటిలో ముఖ్యంగా కాలేయం, మూత్రపిండాలు వంటి ప్రత్యేక అవయవాలను తినడం చాలామంది గొప్పగా ఫీల్ అవుతారు. ఆల్రెడీ యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నవారు ఈ ప్రత్యేక అవయవాల మాంసానికి దూరంగా ఉండాలి. సముద్ర జీవులలో కొన్ని రకాల చేపలు, నత్తలు,  యండ్రకాయలు వంటి వాటిలో ప్యూరిన్ లు ఎక్కువగా ఉంటాయి. ఇవి యూరిక్ యాసిడ్ స్థాయిలు పెంచుతాయి. గొడ్డుమాంసం, పంది మాంసం, గొర్రె మాంసంలో కూడా ప్యూరిన్లు పెద్ద మొత్తంలో ఉంటాయి.  వీటిని తినడం సమస్యను పెంచుకున్నట్టు అవుతుంది. ఆల్కహాల్ లో ప్యూరిన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఏ రకమైన వైన్ అయినా, బీర్ అయినా యూరిక్ యాసిడ్ పెరుగుదలకు కారణం అవుతుంది. ఆల్కహాల్ తీసుకునేవారిలో మూత్రపిండాలు వేగంగా చెడిపోవడానికి ఇదే కారణం. శీతల పానీయాలు తియ్యగా ఉంటాయి అనుకుంటారు. కానీ అధిక ప్రక్టోజ్ కార్న్ సిరప్ లు, చక్కెర పానీయాలు యూరిక్ యాసిడ్ స్థాయిలను వేగంగా పెంచుతాయి. ముఖ్యంగా మార్కెట్లో లభించే శీతల పానీయాలు, ప్లేవర్డ్ డ్రింక్స్ లో ఇది అధికం. ఎండిన బీన్స్, బఠాణీలు, కాయధాన్యాలు, ఆస్పరాగస్, బచ్చలికూర, క్యాలీఫ్లవర్, పుట్టగొడుగులు వంటి కొన్ని కూరగాయలలో కూడా ఇతర కూరగాయలకంటే అధిక మొత్తంలో ప్యూరిన్లు ఉంటాయి. వోట్మీల్, గోధుమ ఊక వంటి కొన్ని తృణధాన్యాలు మధుమేహం ఉన్నవారికి, అధిక బరువు ఉన్నవారికి చాలా మంచివని అంటారు. కానీ వీటిలో  ప్యూరిన్లు ఎక్కువగా ఉంటాయి. వీటిని ఎక్కవగా తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్  చాలా వేగంగా పెరుగుతుంది.                                                              *నిశ్శబ్ద.  

దంతాలు, ఎముకలు బలంగా ఉండాలంటే వీటిని డైట్లో చేర్చుకోండి..!!

35 ఏళ్ల తర్వాత నెమ్మదిగా దంతాలు-ఎముకల సమస్యలు ఒక్కొక్కటిగా కనిపించడం ప్రారంభిస్తాయి. మనం తినే జంక్ ఫుడ్ మన ఆరోగ్యాన్ని త్వరగా పాడుచేస్తుంది. దంతాలు, ఎముకల ఆరోగ్యం చాలా ముఖ్యమైనది కాబట్టి, పోషక ఆహారాన్ని తినడం మంచిది.  ఎముకలను ఆరోగ్యంగా ఉంచడంలో కాల్షియం, విటమిన్ డి రెండు ముఖ్యమైన అంశాలు. తగినంత కాల్షియం లేని శరీరం పెళుసుగా ఉండే ఎముకలతో సహా ఇతర సమస్యలను త్వరగా ఆహ్వానించవచ్చు. విటమిన్ కె, విటమిన్ సి, మెగ్నీషియం, ఫాస్పరస్ ఎముకల ఆరోగ్యానికి ఇతర ముఖ్యమైన పోషకాలు. కాబట్టి ఏ ఆహారాలు చాలా ముఖ్యమైనవో తెలుసుకుందాం. పాలు: ఎముకలు, దంతాలకు పాలు ఎంతో మేలు చేస్తాయని అందరికీ తెలిసిందే.  అయితే ఇందులోని పోషకాల గురించి మీకు తెలియకపోవచ్చు. ఇది విటమిన్ ఎ, విటమిన్ డి యొక్క మంచి మూలం. ఇది ఎముకలు,  దంతాలకే కాదు , జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి, చర్మం, జుట్టు, గుండెకు కూడా చాలా మంచిది . మానసిక ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కాబట్టి రోజూ ఒక గ్లాసు పాలు తాగడం వల్ల మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. పెరుగు: పెరుగు కాల్షియం యొక్క అద్భుతమైన మూలం. ప్రోబయోటిక్స్‌లో సమృద్ధిగా ఉంటుంది. గుండె ఆరోగ్యం, రోగనిరోధక శక్తి సహా అనేక విధాలుగా పెరుగు ఆరోగ్యానికి ఒక వరం.  ఇది భాస్వరం, పొటాషియం, విటమిన్ B2,  B12 యొక్క అద్భుతమైన మూలం. పెరుగును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్‌ను నివారించవచ్చు. అత్తిపండ్లు: ఎండిన అత్తి పండ్లలో యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో మంచి కాల్షియం కూడా ఉంటుంది. అదనంగా, అత్తి పండ్లను మంచి మొత్తంలో పొటాషియం, విటమిన్ కె అందిస్తుంది. ఎముకల ఆరోగ్యానికి అవసరమైన రెండు సూక్ష్మపోషకాలను కలిగి ఉంటుంది. గుడ్డు: గుడ్లలో ప్రొటీన్లు, విటమిన్ డి, కాల్షియం పుష్కలంగా ఉంటాయి.  గుడ్లలో విటమిన్ డి మంచి మొత్తంలో ఉంటుంది. ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. విటమిన్ డి పచ్చసొనలో మాత్రమే లభిస్తుంది. కాబట్టి మీరు గుడ్డులోని తెల్లసొన ఆమ్లెట్లను తినడానికి ఇష్టపడితే ఎగ్ తినడానికి ప్రయత్నించండి. బాదం: బాదంపప్పులో కాల్షియం, ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఇ, ప్రొటీన్లు పుష్కలంగా ఉండటం వల్ల బాదం ఎముకలు, దంతాలకు చాలా మేలు చేస్తుంది. వాస్తవానికి, ఇది జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మీ గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.  జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.  

నాన్ వెజ్ తిననివారికి సూపర్ ఫుడ్స్ ఇవే..ఇందులో ఐరన్ ఎక్కువ!

మానవ శరీర ఎదుగుదలకు ఒక్కో పోషకం చాలా అవసరం. ఎందుకంటే వాటిలో ఏదో ఒక పోషకాహారం లోపించినా . ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందులో ఐరన్ కంటెంట్ కూడా ఒకటి. మానవ శరీరంలోని ప్రతి రక్తనాళానికి ఆక్సిజన్ సరఫరా చేయడం దీని ప్రధాన విధి.ఈ ముఖ్యమైన పోషకాలలో లోపం ఉంటే, దానితో సంబంధం ఉన్న ఆరోగ్యంలో కొన్ని మార్పులు ఉంటాయి. శరీరంలో ఐరన్ లోపించడం వల్ల రక్తహీనత సమస్య కనిపిస్తోందని వైద్యులు చెబుతున్నారు. అయితే ముఖ్యంగా నాన్ వెజ్ తినేవారికి ఐరన్ కంటెంట్ బాగుంటుంది. అయితే నాన్ వెజ్ తిననివారిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఐరన్ కంటెంట్ ఎక్కుగా ఉండే ఆహారాలు ఏవో ఇప్పుడు చూద్దాం. ఐరన్ లోపం ఉంటే: అకస్మాత్తుగా చెమటలు పట్టడం, తల తిరగడం, ఎలాంటి శారీరక శ్రమ లేకున్నా, ఆయాసం, అలసట, ఈ లక్షణాలన్నీ శరీరంలో ఐరన్ లోపానికి కారణం. పాలకూర: చాలా మంది ప్రజలు ఆకు కూరలను తినేందుకు ఇష్టపడరు.  కానీ సహజసిద్ధంగా లభించే ఇలాంటి కూరగాయల్లో మనిషి ఆరోగ్యానికి అవసరమైన అన్ని రకాల పోషకాలు కూడా ఉంటాయి. అందులో పాలకూర ఒకటి.ఈ గ్రీన్ లీఫీ వెజిటేబుల్‌లో ఉండే అధిక నాణ్యత గల విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ కె, జింక్, మెగ్నీషియం, ఐరన్ అనేక వ్యాధుల నుండి దూరంగా ఉంచుతాయి. ప్రధానంగా బచ్చలికూరలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి, ఇప్పటికే ఐరన్ డెఫిషియన్సీ అనీమియాతో బాధపడుతున్న వారికి ఈ వెజిటేబుల్ చాలా మంచిది. పప్పులు: కేవలం మొక్కల ఆహారాలపై ఆధారపడే మాంసాహారులకు పప్పుల వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ప్రధానంగా పప్పులో ఫైబర్, ప్రొటీన్లు, వివిధ విటమిన్లు, మినరల్స్, ఐరన్,  మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఎరుపు రంగు పప్పుల్లో ఈ పోషకాలన్నీ కాస్త ఎక్కువగానే ఉంటాయని చెబుతున్నారు. అందుచేత ఇంట్లో తయారుచేసే రకరకాల వంటలలో కొన్ని పప్పులను కలుపుకుంటే శరీరంలో ఐరన్ లోపం లక్షణాలు తొలగిపోతాయి. గుమ్మడికాయ గింజలు: గుమ్మడికాయ గింజలు చిన్నగా కనిపించినప్పటికీ, మానవ ఆరోగ్యానికి అవసరమైన అనేక పోషకాలను కలిగి ఉంటాయి. ముఖ్యంగా, ఈ చిన్న విత్తనాలలో ప్రోటీన్, మెగ్నీషియం, రాగి, జింక్, జింక్, ఐరన్ పోషకాలు భారీ మొత్తంలో ఉంటాయి. కాబట్టి ఈ చిన్న గింజలను పచ్చిగా లేదా సాయంత్రం కాల్చి తినవచ్చు. ముఖ్యంగా ఐరన్ కంటెంట్ లోపించి రక్తహీనతతో బాధపడే వారికి దీని వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది. డార్క్ చాక్లెట్: చాక్లెట్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు? అలాగే డార్క్ చాక్లెట్ తీసుకోవడం వల్ల శరీరంలో రక్తప్రసరణ మెరుగుపడటమే కాకుండా రక్తపోటు తగ్గి గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. దీనికి ప్రధాన కారణం కోకో, పాలీఫెనాల్స్ యొక్క బలమైన యాంటీఆక్సిడెంట్ కంటెంట్. కానీ దాని ప్రయోజనాలు రుచికి మాత్రమే పరిమితం కాదు, డార్క్ చాక్లెట్‌లో ఐరన్, మెగ్నీషియం, జింక్ వంటి ముఖ్యమైన ఖనిజాలు కూడా పుష్కలంగా ఉన్నాయి, ఇది ఐరన్ లోపం వల్ల కలిగే రక్తహీనత సమస్యను కూడా తొలగిస్తుంది.

కేవలం ఐదే ఐదు ఆహారాలు తింటుంటే చాలు.. కిడ్నీలు క్లీన్..

కిడ్నీలు శరీరంలో ముఖ్యమైన అవయవాలు. ఇవి ప్రతిరోజూ శరీరంలో 200లీటర్ల రక్తాన్ని శుధ్ధి చేస్తాయి. ఏదైనా కారణం వల్ల కిడ్నీలు పాడైతే ఇక రక్తాన్ని శుద్దిచేయడం కుదరదు. ఈ కారణంగా డయాలసిస్ చెయ్యాల్సి ఉంటుంది. పైగా ఈ ప్రక్రియతో ఎక్కువ కాలం నెగ్గుకురాలేం. కిడ్నీల కారణంగా ఇంత సమస్యలు కొనితెచ్చుకునేపని లేకుండా కిడ్నీలు క్లీన్ గా ఉండాలంటే కేవలం ఐదు ఆహారాలు తీసుకుంటే చాలు. పొటాషియం తక్కువగా ఉన్న ఆహారాలు మూత్రపిండాల వ్యాధికి మంచివిగా పరిగణించబడతాయి. యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి, ఇవి ఫ్రీ రాడికల్స్‌ను తటస్థీకరించడంలో సహాయపడతాయి. కిడ్నీ వ్యాధితో బాధపడేవారు, కిడ్నీ జబ్బులు రాకూడదని అనుకునేవారు ఈ  ఐదు ఆహారాలు తీసుకుంటే కిడ్నీలలో రాళ్ల సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది. రెడ్ క్యాప్సికం.. రెడ్ క్యాప్సికమ్ లో  విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు,  ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. వీటిలో పొటాషియం, ఫాస్పరస్,  సోడియం పరిమాణం తక్కువగా ఉంటుంది,   కిడ్నీ సమస్యలు ఉన్నవారు  దాన్ని మొదట్లోనే నియంత్రించాలని అనుకుంటే రెడ్ క్యాప్సికం తినడం మంచిది.  ప్రతిరోజూ అరకప్పు రెడ్ క్యాప్సికం ను ఆహారంలో భాగంగా తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. క్యాబేజీ.. క్యాబేజీ లో విటమిన్ కె, విటమిన్ సి,  ఫైబర్ పుష్కలంగా ఉంటాయి.  అవి మాత్రమే కాదు విటమిన్ బి6,  ఫోలిక్ యాసిడ్‌లు కూడా సమృద్దిగా ఉంటాయి.  ఇందులో పొటాషియం తక్కువగా ఉంటుంది.  డయాలసిస్ రోగులు తమ డైట్‌లో క్యాబేజీ  చేర్చుకుంటే చాలా మంచి ప్రయోజనాలు కలుగుతాయి. ఆకుకూరలు.. ఆకుకూరలలో  విటమిన్లు,  ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఇది కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచే పనిని పెంచుతుంది. ఇందులో  యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి, ఇవి రక్తాన్ని వడకట్టే పనిని సులభతరం చేయడంలో మూత్రపిండాలకు సహాయపడతాయి. ఉల్లిపాయ.. ఉల్లిపాయలో ఫ్లేవనాయిడ్స్,  క్వెర్సెటిన్ అనే యాంటీఆక్సిడెంట్ ఉన్నాయి. ఇది మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేకాకుండా, వాటిలో తక్కువ పొటాషియం కూడా ఉంటుంది, ఇది మూత్రపిండాలకు మంచిది. క్యాలీఫ్లవర్.. కాలీఫ్లవర్ విటమిన్ సితో నిండి  ఉంటుంది.  ఫోలేట్,  ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటాయి. క్యాలీఫ్లవర్ బాగా తీసుకోవడం వల్ల  కాలేయంలో ఉండే మురికి పదార్థాలను తటస్థీకరించడంలో సహాయపడే సమ్మేళనాలను కలిగి ఉంటుంది.                                                   *నిశ్శబ్ద.

మధుమేహం ఉన్నవారు పొరపాటున కూడా తినకూడని పండ్లు ఇవే..

డయాబెటిస్ లేదా మధుమేహం అనేది చాలా పెద్ద సమస్య. దీనికి  శాశ్వత నివారణ లేదు. మధుమేహ వ్యాధిగ్రస్తులు వారి రక్తంలో చక్కెరను నియంత్రించడం ద్వారా మాత్రమే మెరుగైన జీవితాన్ని గడపాల్సి ఉంటుంది. రక్తంలో చక్కెరను నియంత్రించడానికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం.  డయాబెటిక్ రోగులు పండ్లు తినాలా వద్దా  అనే ప్రశ్న చాలామందిలో  తలెత్తుతుంది. డయాబెటిక్ పేషెంట్లు తమ పరిస్థితిని మెరుగ్గా ఉంచుకోవడానికి,  రక్తంలో చక్కెర స్థాయిని,   దాని  లక్షణాలను నియంత్రణలో ఉంచుకోవడానికి  ఆహారంలో పండ్లను ఒక భాగం చేసుకోవాలని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డయాబెటిస్ అండ్ డైజెస్టివ్ అండ్ కిడ్నీ డిసీజెస్ సూచిస్తోంది. పండ్లు,  కూరగాయలు తినడం వల్ల గుండె జబ్బులు,  క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు. పండ్లు విటమిన్లు, ఖనిజాలు,  ఫైబర్  వంటి అద్భుతమైన మూలాలతో కలిగి ఉంటాయి. కొన్ని పండ్లలో అధిక మొత్తంలో చక్కెర కూడా ఉంటుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోవడానికి కొన్ని పండ్లను తినకుండా ఉండటానికి కారణం ఇదే. అయితే మధుమేహం ఉన్నవారికి శత్రువు లాంటి  పండ్లు ఉన్నాయి. వాటిని పొరపాటున కూడా ఎప్పుడూ తినకూడదు. పుచ్చకాయ, అరటి పండు.. గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) అనేది ఆహారం తిన్న తర్వాత ఒక వ్యక్తి  రక్తంలో చక్కెర స్థాయి ఎంత పెరుగుతుందో కొలుస్తుంది. ఆహారం  GI స్కోర్ 70 నుండి  100 మధ్య ఉంటే, అది అధిక చక్కెరను కలిగి ఉంటుంది.  పుచ్చకాయ,  అతిగా పండిన అరటిపండ్లు ఈ కోవలో ఉన్నాయి. యాపిల్.. ఒక వ్యక్తి తినే కార్బోహైడ్రేట్ మొత్తం వారి రక్తంలో చక్కెర స్థాయిలపై  ప్రభావాన్ని చూపుతుంది.. యాపిల్,  అరటి పండ్లలో  పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. మామిడి.. మామిడిని పండ్లలో రారాజుగా పిలుస్తుంటారు, ఎందుకంటే దాని రుచి అలాంటిది. కానీ డయాబెటిక్ పేషెంట్ దీన్ని తినేముందు చాలా ఆలోచించాల్సి ఉంటుంది. ఒక మామిడికాయలో 14 గ్రాముల చక్కెర ఉంటుంది, ఇది డయాబెటిక్ రోగులలో రక్తంలో చక్కెర స్థాయిలను గణనీయంగా పెంచుతుంది. పైనాపిల్.. లిచీ.. పైనాపిల్‌లో దాదాపు 16 గ్రాముల చక్కెర ఉంటుంది. దీని GI విలువ కూడా ఎక్కువే. ఇది కాకుండా లిచీ కూడా అలాంటి కంటెంట్ ను కలిగి ఉంటుంది. ఈ జ్యుసి  పండులో 16 గ్రాముల చక్కెర ఉంటుంది. మధుమేహం ఉన్నవారు లిచీ,  పైనాపిల్ తినాలని అనిపిస్తే చాలా  పరిమితంగా  తీసుకోవాలి. మధుమేహం ఉన్నవారు పండ్లరసాలు తాగచ్చా.. భోజనం సమయంలో పండ్ల రసాన్ని తాగడం లేదా  వేరే దేనివల్లనైనా రక్తంలో చక్కెర స్థాయి వేగంగా పెరుగుతుంది. పండ్లను ఎక్కువగా తినేవారికి మధుమేహం వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. కానీ ఎక్కువ మొత్తంలో పండ్ల రసాలు తాగే వ్యక్తులు మధమేహానికి గురయ్యే అవకాశం ఉంది. జ్యూసులకు బదులుగా  మధుమేహం ఉన్నవారు  ఆప్రికాట్లు, బ్లాక్బెర్రీస్, చెర్రీస్, నారింజ, బొప్పాయి, పీచెస్, రేగు, స్ట్రాబెర్రీ  వంటి పండ్లను పుష్కలంగా నేరుగా తీసుకోవచ్చు.                                                                *నిశ్శబ్ద.  

రోజూ ఉదయం ఈ జ్యూస్ తాగితే ఎన్ని ప్రయోజనాలో..!!

రోజుకో ఆపిల్ తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదని సామేత ఉంది. అవును నిజమే రోజుకో ఆపిల్ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఆపిల్ తోపాటు ఆపిల్ జ్యూస్ ను రోజువారీ ఉదయపు దినచర్యలో భాగం చేసుకుంటే మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. యాపిల్ జ్యూస్‌లో అవసరమైన పోషకాలు,  యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఆరోగ్యాన్ని కాపాడటంతో కీలక పాత్ర పోషిస్తాయి. రోజూ ఉదయం ఆపిల్ జ్యూస్ తాగితే ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చో ఇప్పుడు చూద్దాం. రోగనిరోధక శక్తిని పెంచుతుంది: యాపిల్ జ్యూస్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక వ్యవస్థను బలపరిచే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. ఆపిల్ ప్రతిరోజూ తీసుకున్నట్లయితే... మీ శరీరం ఇన్ఫెక్షన్లు,  అనారోగ్యంతో పోరాడటానికి సహాయపడుతుంది. మిమ్మల్ని ఆరోగ్యంగా,  శక్తివంతంగా ఉంచుతుంది. శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది: శరీర పనితీరుకు హైడ్రేటెడ్‌గా ఉండటం చాలా ముఖ్యం. యాపిల్ జ్యూస్ దాహాన్ని తీర్చడమే కాకుండా మీ శరీరాన్ని బాగా హైడ్రేట్ గా ఉంచడానికి అవసరమైన ద్రవాలను కూడా అందిస్తుంది. జీర్ణక్రియకు సహాయపడుతుంది.  చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. సహజ శక్తిని అందిస్తుంది: యాపిల్ జ్యూస్‌లోని సహజ చక్కెరలు శుద్ధి చేసిన చక్కెరల యొక్క హానికరమైన ప్రభావాలు లేకుండా తక్షణ శక్తిని అందిస్తాయి. ఇది కెఫిన్ పానీయాలకు అద్భుతమైన ప్రత్యామ్నాయం, ఇది మీకు సహజమైన, రిఫ్రెష్ ప్రారంభాన్ని ఇస్తుంది. ఆపిల్ జ్యూస్ మీ మెదడును పదునుగా, చురుకుగా ఉంచే సహజ సమ్మేళనాలను కలిగి ఉంటుంది. చర్మ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది: ఆపిల్ జ్యూస్‌లో ఉండే విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు ఆరోగ్యకరమైన, మెరిసే చర్మానికి దోహదం చేస్తాయి. దీని రెగ్యులర్ వినియోగం మచ్చలను తగ్గిస్తుంది, మీ చర్మాన్ని లోపల నుండి హైడ్రేట్ చేస్తుంది. వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది: ఆపిల్ జ్యూస్‌లో డైటరీ ఫైబర్ ఉంటుంది.  ఇది జీర్ణక్రియకు సహాయపడటంతోపాటు.. మలబద్ధకాన్ని నివారిస్తుంది. యాపిల్ రెగ్యులర్ వినియోగం ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థను ప్రోత్సహిస్తుంది. మీ శరీరం పోషకాలను గ్రహించేలా చేస్తుంది.

ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ మూడూ వేరు వేరా? వీటి మధ్య తేడా ఏంటంటే..

ఆరోగ్యం అనగానే ప్రతి ఒక్కరికి శరీరం ఫిట్ గా ఉండటమే గుర్తొస్తుంది. కానీ ఈ మధ్య కాలంలో  శారీరక సమస్యల కంటే మానసిక సమస్యలతో ఇబ్బంది పడేవారే ఎక్కువ. అందుకే మానసిక ఆరోగ్యం మీద రానురానూ అవగాహన పెరుగుతోంది. మానసిక సమస్యల కారణంగా చాలామంది సంతోషకరమైన జీవితానికి దూరం అవుతున్నారు.  విచారించాల్సిన విషయం ఏమిటంటే  తాము మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నామని చాలామందికి తెలియదు. కొందరు ఈ విషయాన్ని అర్థం చేసుకున్నా దానికి  తగిన వైద్యం తీసుకోలేకపోతున్నారు. మానసిక సమస్య అంటే అదేదో తప్పనే భావన, అంటరానితనంలా చూసే చూపు చాలామంది ఈ సమస్యను బయటకు చెప్పుకోవడానికి అడ్డుకుంటుంది. ఈ కారణంగానే అధికశాతం మంది మానసిక సమస్యలు అధిగమించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మానసిక ఆరోగ్యం గురించి తగిన జాగ్రత్తలు తీసుకోలేకపోతే దాని కారణంగా తీవ్రమైన శారీరక సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. ప్రపంచ స్థాయిలో మానసిక ఆరోగ్య సమస్యల గురించి ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో ప్రతి సంవత్సరం అక్టోబర్ 10న ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకుంటారు . మానసిక ఆరోగ్య సమస్యలలో  ఒత్తిడి, ఆందోళన,  నిరాశ వంటి సమస్యలు చాలా సాధారణమైనవి. అయితే ఈ మూడు ఒకటి కాదు, ఇవి  ఒకదానికొకటి భిన్నమైనవి. వాటి మధ్య తేడా ఏమిటో తెలుసుకుని, వాటిని అర్థం చేసుకుంటే.. ఈ సమస్యలను అధిగమించడం కూడా సులువు అవుతుంది. మానసిక ఒత్తిడి..  ఒత్తిడి  ఒక సాధారణ పరిస్థితి.  అది సందర్భానుసారం వస్తూ ఉంటుంది. ఇది  మానసిక లేదా శారీరక సమస్యల వల్ల కూడా సంభవించవచ్చు.  కొన్ని సంఘటనలు లేదా ఆలోచనల కారణంగా ఒత్తిడికి గురవుతూ ఉంటారు. చాలా సందర్భాలలో ఇది దానంతటదే వెళ్లిపోతుంది. అయితే ఒత్తిడి సమస్య చాలా కాలం పాటు కొనసాగితే, అది సాధారణంగా తగ్గకపోతే   ఖచ్చితంగా  వైద్యుడిని సంప్రదించాలి. ఒత్తిడి  అనే విషయాన్ని అర్థం చేసుకుంటే.. ఎప్పుడైనా ఏ విషయంలో అయినా ప్రమాదం అనిపించినప్పుడు, పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పుడు  శరీరంలో కలిగే  ప్రతిస్పందనను ఒత్తిడి అంటారు. పరిస్థితులు డీల్ చేయడం   లేదా నియంత్రించడం కష్టంగా మారుతున్నట్లు అనిపించినప్పుడు ఒత్తిడిలో ఉన్నట్టు చెబుతారు.  సహజంగా పరిస్థితులు మారడంతోనే ఒత్తిడి కూడా తగ్గిపోవడం జరుగుతుంది. ఆందోళన .. ఆందోళనను యాంగ్జిటీ  అని కూడా అంటారు. ఆందోళన ఉన్నవారిలో   భయం, నిలకడగా లేకపోవడం ముఖ్యంగా కలుగుతాయి. ఆందోళలనలో ఉన్నప్పుడు  చెమటలు పట్టడం, చిరాకు,  నాడీ వ్యవస్థలో మార్పులు  అనుభూతి చెందుతారు.  మరీ ముఖ్యంగా   గుండె కొట్టుకోవడం పెరుగుతుంది. ఆందోళన సమస్య తాత్కాలికం. ఇది పరిస్థితులు చక్కబడటంతో పాటే తగ్గిపోతుంది.  అయితే కొన్ని సందర్భాల్లో ఇది దీర్ఘకాలిక దుష్ప్రభావాలను కూడా  కలిగి ఉంటుంది.  ఆందోళన సమస్య మెరుగుపడకపోగా కాలక్రమేణా మరింత తీవ్రమైతే, దానిని యాంగ్జిటీ అని  అంటారు. ఈ సమస్య  రోజువారీ కార్యకలాపాలపై కూడా ప్రభావం చూపుతుంది. చాలా కాలం పాటు కొనసాగే ఈ సమస్య డిప్రెషన్ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. డిప్రెషన్.. డిప్రెషన్ (డిప్రెసివ్ డిజార్డర్). డిప్రెషన్ ను తీవ్రమైన మానసిక ఆరోగ్య సమస్యగా పరిగణిస్తారు. ఇది ఆలోచనల నుండి పనితీరు వరకు ప్రతి విషయాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. డిప్రెషన్ విచారాన్ని పెంచుతుంది. సంతోషకరమైన జీవితం పట్ల ఆసక్తి కోల్పోయేలా చేస్తుంది. డిప్రెషన్ సమస్య పెరగడం వల్ల ఆత్మహత్య ఆలోచనలు కూడా పెరుగుతాయి. ఇది తీవ్రమైన సమస్య, దీనికి తక్షణమే మానసిక వైద్యుడిని కలవడం చాలా అవసరం.  లేకపోతే పూర్తీ జీవితం మీద దారుణమైన ప్రభావాన్ని చూపిస్తుందిది. ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారు? ఆందోళన,  డిప్రెషన్ మధ్య ప్రధాన వ్యత్యాసం దాని లక్షణాలే అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. డిప్రెషన్ లో ఎప్పుడూ విచారంగా ఉండటం, కుంగుబాటుకు లోనుకావడం జరుగుతుంది. అయితే ఒత్తిడి,  ఆందోళన చాలా వరకు  తాత్కాలికంగా ఉంటాయి.  కొన్ని సందర్భాల్లో వీటి వల్ల కూడా దీర్ఘకాలిక దుష్ప్రభావాల ప్రమాదం  ఉండవచ్చు. ఈ రుగ్మతలకు అనేక కారణాలు ఉండవచ్చు.  వాటిని తొలగించుకోవడానికి చాలా ఓపిక అవసరం. అన్ని వయసుల వారు ఈ సమస్యల బారిన పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ  మనస్సును ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఆరోగ్యకరమైన జీవనశైలి, మనసుకు ప్రశాంతత చేకూర్చే పనులు చేయడం అలవాటు చేసుకోవాలి.                                                                 *నిశ్శబ్ద. 

మీకు హైబీపీ ఉందా? ఈ తప్పులు చేయండి. లేదంటే..?

ప్రస్తుత కాలంలో, చాలా మంది ప్రజలు అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు.  దీని కారణంగా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అంతేకాదు చాలా మంది గుండెపోటు కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. మన బిజీ లైఫ్ స్టైల్,  అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు అధిక బీపీకి కారణమవుతున్నాయి.  అదే సమయంలో, మీకు అధిక బీపీ సమస్య ఉంటే, మీరు కొన్ని తప్పులు చేయకుండా ఉండాలి. ఎందుకంటే మీరు చేసే ఈ తప్పులు ప్రాణాంతకం కావచ్చు. మన శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ రక్త ప్రవాహాన్ని ప్రభావితం చేసినప్పుడు రక్తపోటు సమస్య పెరుగుతుంది. కాబట్టి బీపీ పేషెంట్లు ఈ తప్పులకు దూరంగా ఉండాలి. బీపీని చెక్ చేసుకోవాలి : మీకు రక్తపోటు సమస్య ఉంటే, మీరు ప్రతిరోజూ మీ రక్తపోటును తనిఖీ చేయాలి. ఉదయం నిద్రలేచిన అరగంట తర్వాత బీపీని చెక్ చేసుకోవడానికి ఉత్తమ సమయం. మధ్యాహ్నం పూట రక్తపోటు పెరుగుతుంది కాబట్టి, సాయంత్రం కూడా బీపీని చెక్ చేసుకోవాలి. బీపీ మాత్రలను విస్మరించకూడదు: చాలా సార్లు బీపీ రోగులు రక్తపోటు పెరిగినప్పుడు మందులు తీసుకుంటారు. కానీ, మామూలుగా మారగానే లేదా బద్ధకం వల్ల మందులు తీసుకోవడం మానేస్తారు. బీపీకి చికిత్స జీవితాంతం కొనసాగుతుంది. చికిత్స తీసుకోవాలి: సాధారణ BP 120/80. కానీ, రక్తపోటు 130/90 కంటే ఎక్కువ ఉంటే అది మీకు ప్రమాదకరం. అందువల్ల, మీకు రక్తపోటు సమస్య ఉంటే, దానిని నిర్లక్ష్యం చేయకుండా చికిత్స పొందండి. ఈ పదార్థాలకు దూరంగా: బీపీ రోగులకు ప్రాసెస్ చేసిన ఆహారం విషం.  కాబట్టి మీకు డయాబెటిస్ ఉన్నట్లయితే, మీరు ప్రాసెస్ చేసిన.. స్తంభింపచేసిన ఆహారానికి దూరంగా ఉండాలి. ఎందుకంటే వీటిని తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది. బీపీ సమస్య లేని వారు కూడా అలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలి.  ఎప్పటికప్పుడు చెక్  చేసుకోవాలి: రక్తపోటు సమస్యలు ఉన్నవారు, వారి బిపి ఎక్కువ లేదా తక్కువ ఉంటే మందులు తీసుకోండి.  బీపీ పేషెంట్లు తమ శరీరాన్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి.    

సిగరెట్ తాగేవారికి పిల్లలు పుట్టరా? పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే..

ప్రతి మనిషి జీవితంలోనూ పెళ్లి, పిల్లలు, సంసారం అంటూ బోలెడు దశలు మారతాయి.  పుట్టిన వాడు పెరగక మానడు, పెరిగిన వాడు పెళ్లి చేసుకుని పిల్లల్ని కనక మానడు. కానీ ఇప్పటి కాలంలో చాలామంది మగవారు పిల్లలను కనడంలో ఫెయిల్ అవుతున్నారు. నిజానికి ఈ సమాజంలో ఒక స్త్రీకి పిల్లలు పుట్టకపోతే ఎన్నెన్నో మాటలు అంటారు. అదే లోపం మగవాడిలో ఉంటే  అతన్ని కూడా పనికిరాడు అనే మాటను నిర్దాక్షిణ్యంగా అనేస్తుంటారు.  మగవారిలో పిల్లలు కలగడానికి తగిన సామర్థ్యం లేదంటే అది వీర్యకణాల లోపంగా పరిణిస్తారు.  చాలామంది సరదా కోసం, ఫ్యాషన్ కోసం, ఒత్తిడి తగ్గించుకోవడానికి చేసే ధూమపానం  పిల్లలు కలగకపోవడానికి ఒక ప్రధానకారణం అవుతుందనే విషయం ఇప్పుడు ఆందోళనకు గురిచేస్తోంది.  అసలు ధూమపానం మగవారిలో సంతానం కలగకుండా ఉండటానికి ఎలా కారణం అవుతుంది? దీని ప్రభావం ఎంత? మొదలైన విషయాలు వివరంగా తెలుసుకుంటే.. పరిశోధనలు ఏం చెప్పాయంటే.. మగవారిలో ఆరోగ్యకరమైన వీర్యం, వీర్యంలో శుక్రకణాల  సంఖ్య, ఆ శుక్రకణాల కదలిక, వీర్యం చిక్కదనం మొదలైన విషయాలపై మగవారిలో పిల్లలను కనే సామర్థ్యం ఆధారపడి ఉంటుంది.  సంతానోత్పత్తిపై ధూమపానం కలిగించే ప్రభావం గురించి 2016లో జరిగిన ఒక పరిశోధనలో పొగాకు స్పెర్మ్ కౌంట్ ను దారుణంగా దెబ్బతీస్తుందని తెలిసింది. ధూమపానం చేసేవారి  వీర్యంలోని  శుక్రకణాలు అండాలను చేరుకుని ఫలదీకరణం చెందే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ధూమపానం ఎక్కువగా చేసేవారు తమ భాగస్వామితో సంభోగం చేసే సమయంలో అంగస్థంభన విషయంలో చాలా పేలవంగా ఉంటారని సర్వేలు వెల్లడిస్తున్నాయి.  ధూమపానం వల్ల శరీరంలో కలిగే ఆక్సీకణ ఒత్తిడి, తద్వారా ధమనుల పనితీరు మందగించడం వంటి ఇతర కారణాలు కూడా  సంభోగ సమయంలో అంగస్థంభన వైఫల్యానికి దారితీస్తాయి. అందుకే ధూమపానం అలవాటున్నవారు సంభోగం విషయంలో అసంతృప్తిని ఎదుర్కొంటుంటారు.   ఇద్దరికీ నష్టమే.. ధూమపానం చేసేవారు కేవలం వారు మాత్రమే నష్టపోరు. వారి జీవిత భాగస్వాములు కూడా నష్టాన్ని భరించాల్సి వస్తుంది. ఎందుకంటే ధూమపానం చేయడమే కాదు, ఇతరులు ధూమపానం చేసినప్పుడు ఆ పొగను పీల్చడం కూడా దాదాపు అలాంటి నష్టాన్నే కలిగిస్తుంది. అంటే మగవారు ధూమపానం చేస్తే దానికారణంగా ఆడవారు కూడా పిల్లలను కనడంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. కేవలం ఇలా పిల్లలను కనలేకపోవడమే కాదు, పిల్లలు కలగడానికి తీసుకునే వివిధ రకాల చికిత్సలు కూడా ధూమపానం చేసేవారికి సమర్థవంతమైన ఫలితాలు ఇవ్వవు.  అందుకే ధూమపానం చేసే అలవాటు ఉంటే అది పిల్లలు  కలగడంలో దాని ప్రభావాన్ని చూపించకముందే దాన్నిమానేయడం మంచిదని వైద్యులు చెబుతున్నారు. పిల్లల కోసం ప్రయత్నించేవారు తప్పనిసరిగా ధూమపానం మానేయాలని, ఆరోగ్యకరమైన జీవనశైలిని పెంపొందించుకోవాలని హెచ్చరిస్తున్నారు. ఈ సమస్య కూడా పొంచి ఉంది.. ధూమపానం చేసేవారిలో COPD అనే సమస్య వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. COPD అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్. ఇది ఊపిరితిత్తుల నుండి వాయు ప్రసరణకు ఆటంకం కలిగించే దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దగ్గు, శ్లేష్మం  ఉత్పత్తి,  ఊపిరితీసుకునేటప్పుడు  గురక వంటి లక్షణాలు ఇందులో  ఉంటాయి.  COPD ఉన్న వ్యక్తులలో  గుండె జబ్బులు, ఊపిరితిత్తుల క్యాన్సర్  తో పాటు అనేక ఇతర సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది.                                                    *నిశ్శబ్ద.