మట్టి పాత్రలలో వండుకుని తింటే జరిగే అద్భుతం ఇదే...

పూరీ జగన్నాధ స్వామి ఆలయంలో ప్రసాదం మట్టిపాత్రలలోనే వండబడుతుంది, మట్టిపాత్రలోనే అందించబడుతుంది. ఎందుకంటే మట్టి పరమపవిత్రమైనది. శరీరం తగులబెట్టినప్పుడు మిగిలేది 20 గ్రాముల మట్టిమాత్రమే. అందులోనే 18 రకాల మైక్రోన్యూట్రియన్స్ ఉంటాయి. దాన్నే మనం బూడిద అంటాము. ఈ వైజ్ఞానిక విషయం అక్కడి పూజారులకు తెలియకపోవచ్చు. ఎందుకంటే వారు సైన్స్ చదువలేదు కాబట్టి. అయినా కూడా శాస్త్రవేత్తలయినవారు ఎన్నో సంవత్సరాలు పరిశోధించి తెలుసుకునే విషయం వారికి తెలియకపోయినా వారు ఆచరిస్తున్నారు. పవిత్రమైన ఆలయంలో భగవంతుని ప్రసాదం కూడా అంతే పవిత్రమైన మట్టి పాత్రలోనే వండి సమర్పించాలి అని మాత్రం తెలుసు.  ఒకసారి కొందరు ఈ ప్రసాదాన్ని తీసుకుని భువనేశ్వర్ లోని C.S.I.R. లేబరేటరీ అంటే (కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ ఇండస్ట్రియల్ రిసర్చ్) రీజనల్ రిసర్చ్ లేబరేటరీలో పరిశోధించమని అడిగారు.  వారు దీనికి చాలా సమయం అంటే దాదాపు ఆరు నెలల సమయం పడుతుంది అన్నారు. అయినా దానికి కావల్సిన పనిముట్లు మావద్దలేవు. మీరు ఈ ప్రసాదాన్ని డిల్లీ తీసుకువెళ్ళి టెస్ట్ చేయించుకోండి అన్నారు.  మళ్ళీ అక్కడ నుండి డిల్లీదాకా తీసుకెళ్తే అప్పటిలోపు అది పాడవుతుంది కదా అని వాళ్ళకు డౌటొచ్చింది.  అదే విషయం అక్కడి శాస్త్రజ్ఞులకు చెబితే..  అక్కడి శాస్త్రజ్ఞులు ఇలా అన్నారు..  పూరి ఆలయంలోని ప్రసాదం మట్టిపాత్రలో వండబడుతుంది కాబట్టి, ఇది పాడవ్వదు అని చెప్పారు. అప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే.. మట్టిపాత్రలో వండే ఆహారం ఎంత విలువైనదో అనే విషయం. అయితే భునేశ్వర్ నుండి డిల్లీకి వెళ్ళాలంటే సుమారు 36 గంటల సమయం పడుతుంది. అయినా తీసుకెళ్ళి అక్కడ రీసెర్చ్ చేయించిన తరువాత  రిపోర్ట్ వచ్చింది. ఈ పదార్థంలో ఒక్క మైక్రో న్యూట్రియన్స్ కూడా తగ్గలేదు అని వారన్నారు. వెంటనే ప్రెషర్ కుక్కర్లో వండిన పదార్ధాన్ని కూడా టెస్ట్ చేయించారు. దానికి  వచ్చిన రిపోర్ట్ కేవలం 13 శాతం మాత్రమే న్యూట్రియన్స్ ఉన్నాయి. 87 శాతం న్యూట్రియన్స్ దెబ్బతిన్నాయి, లోపించాయి. అంతేకాదు మట్టిపాత్రలో వండిన పదార్థానికి రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. ఇది మన భారతీయ సంస్కృతీ సంప్రదాయం కనుక మన పూర్వీకులు ఈ సంప్రదాయం ప్రకారం జీవించినంతవరకు వారికి కళ్ళజోడు రాలేదు. జీవితాంతం వరకు పళ్ళు ఊడిపోలేదు. మోకాళ్ళ నొప్పులు డయాబెటీస్ వంటి సమస్యలు రాలేదు. శరీరానికి కావల్సిన నూట్రియన్స్ సక్రమంగా అందుతుంటే జీవితాంతం మన అన్ని పనులు మనమే ఎవరిమీద ఆధారపడకుండా జీవించగలం. అది ఒక్క మట్టిపాత్రలో వండిన ఆహారం తినడం వలన మాత్రమే సాధ్యమవుతుంది. అందుకనే భారతదేశం నేలలో అల్యూమినియం తయారీకి కావల్సిన ముడిసరుకు ఎంత ఉన్నప్పటికీ, మనవారు మట్టి వస్తువులకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ఇంతగా మనకి మట్టిపాత్రలు తయారుచేసే కుమ్మరివాళ్ళు మనకి ఎంత గౌరవనీయులో కదా. ఏమట్టి కుండగా పనికివస్తుందో ఎలాంటి మట్టితో వంటపాత్రలు చేయవచ్చో గుర్తించి ఏ యూనివర్శిటీలో చదువుకోకుండానే మనకి ఇంత గొప్ప సేవచేసి మన ఆరోగ్యాన్ని అందిస్తున్నారు కుమ్మరివారు.  మనం కుమ్మరి వారిని ప్రోత్సహించి వారికి భవితను ఇవ్వాలి. ఫ్రిజ్ లు, కుక్కర్ లు  ఉన్నాయి కదా అని మట్టి పాత్రలను దూరం పెడితే మనకు మిగిలే న్యూట్రియన్స్ సున్నానే…  ఆరోగ్యంగా జీవితాంతం బ్రతకాలంటే గాలి, సూర్యరశ్మి తగిలేలాగా ఆహారం వండుకోవాలి.  దానిలో అత్యుత్తమమైన పాత్ర మట్టిపాత్ర.. లోనే వండాలి.                                       ◆నిశ్శబ్ద.

రక్తానికి వైద్యం చేసుకోండి ఇలా...

మన శరీరంలో ఆక్సిజన్, హార్మోన్లు, విటమిన్లు, మినరల్స్, ఇతర ముఖ్యమైన పోషకాలు రక్తం ద్వారానే శరీర అవయవాలకు రవాణా అవుతాయి. అయితే విషపూరిత కణాలు రక్తంలో కలవడం వల్ల బ్లడ్ పాడవుతుంది. ఫలితంగా రక్తం పనితీరుపైనా ప్రభావం పడుతుంది… విషపూరిత పదార్థాలను లేదా కణాలను మనం నియంత్రించాలి. లేదంటే అవి వివిధ వ్యాధులకు కారణమవుతాయి. ◆రక్తం ఎందుకు శుద్దిగా ఉండాలంటే.. శరీరంలోని అన్ని అవయవాలు, టిష్యూ కణాలు రక్తంతో అనుసంధానం అయి ఉంటాయి. బ్లడ్ పాడవడం వల్ల గుండెపోటు,  పీసీఓడీ, మధుమేహం, ఊబకాయం, రక్త పోటు, బ్లడ్ క్యాన్సర్, కిడ్నీ వ్యాధులు, అల్జీమర్స్ వంటి దీర్ఘకాలిక సమస్యలు తలెత్తుతాయి. వాటి నుంచి బయటపడాలంటే రక్తం శుద్ధిగా ఉండటం అవసరం. ◆మన రక్తం పరిశుభ్రంగా లేదని ఎలా తెలుసుకోవచ్చు? అపరిశుభ్రమైన రక్తం యొక్క లక్షణాలు చర్మ సమస్యలు ఎక్కువగా జుట్టు రాలిపోవడం ఆకలి మందగించడం అతిగా నిద్రపోతున్న ఫీలింగ్ ముదురు పసుపు రంగులో మూత్రం రక్తస్రావం అయ్యే వ్యాధులు ◆కారణమేమిటంటే.. రక్తం విషతుల్యం కావడానికి మూల కారణం 'పిత్త దోషం'(శరీరంలో వేడి), ప్రతికూల భావోద్యేగాలని ఆయుర్వేదంలో ఉంది. ◆రక్తాన్ని అపరిశుభ్రంగా మార్చే అలవాట్లు కార్బోహైడ్రేటెడ్ డ్రింక్స్, చిప్స్, బిస్కెట్లు, చాక్లెట్లు, వేపుడు పదార్థాలు, ఉప్పు అధికంగా ఉన్న లేదా స్పైసీగా ఉండే ఆహార పదార్థాలను తినడం వల్ల రక్తం అపరిశుభ్రంగా మారుతుంది.. ఫుడ్ కాంబినేషన్ సరిగ్గా లేకపోవడం కూడా ఇందుకు ఓ కారణమే.. ఉదాహరణకు ఉప్పగా ఉండే స్నాక్స్ తింటూ టీ తాగడం, పిండిలో ఉప్పు, పాలు కలపడం. యాంటీబయోటిక్స్ ఎక్కువగా వాడటం, పొగ తాగడం, మందు సేవించడం, సమయానికి తినకపోవడం, నిద్ర విషయంలో రాజీ పడడం ఇందుకు ప్రధాన కారణాలు. టాక్సిక్ ఓవర్లోడ్ను తగ్గించుకోవాలి రక్తాన్ని అపరిశుభ్రంగా మార్చే అలవాట్లకు దూరంగా ఉండడం వల్ల టాక్సిక్ ఓవర్లోడ్ను తగ్గించుకోవచ్చు" అనుసరించాల్సిన మార్గాలు 15 రోజులకు ఒకసారి ఉపవాసం డిన్నర్ను రాత్రి 7 గంటలలోపు తినాలి ఆల్కహాల్ కు దూరంగా ఉండాలి. తగినన్ని నీళ్లు తాగాలి ఉప్పు వినియోగం తగ్గించాలి. చురుకుగా ఉండాలి. వేపాకు వేప శరీరాన్ని కూల్గా ఉంచుతుంది. ఇది రక్తాన్ని సహజంగా శుద్ధి చేస్తుంది. చర్మ సమస్యలకు చక్కని పరిష్కారంగా ఉంటుంది. వరుసగా ఐదు రోజుల పాటు పరగడుపున 4-5 వేపాకులను తినాలి ◆ఆరోగ్యకరమైన రక్తానికి కావాల్సిన ఆహారం క్యారెట్లు, బీట్రూట్లు, సొరకాయ, చిన్న పొట్లకాయను రోజూవారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. ఆకు కూరలు, ముఖ్యంగా రుచిలో వగరుగా ఉండే ఆహార పదార్థాల వల్ల రక్తంలో విషతుల్యమైన కణాలను తొలగించవచ్చు. దానిమ్మ, మామిడి పండ్లు. అల్ల నేరేడు, ఉసిరి వంటి పండ్లు తరచుగా తింటూ ఉండాలి. ఇవన్నీ పాటిస్తే మీ రక్తాన్ని సులువుగా శుద్ధి చేసుకోవచ్చు.                                        ◆నిశ్శబ్ద.

కిడ్నీల గుట్టు తెలుసుకోండి!

రక్తంలోని పనికిరాని పదార్థాల్ని వేరుచేసి బయటకు పంపడానికి, రక్త శుద్ధితో పాటు రక్తపోటుని పరిరక్షించడానికి, శరీరంలో నీటి పరిమాణంతోపాటు మిగతా ద్రవ పదార్థాల స్థాయిని పరిరక్షించేవి మన దేహంలోని అత్యంత ముఖ్య భాగాలైన మూత్రపిండాలు. చర్మంలోని స్వేద గ్రంధులు చెమట రూపంలో కొన్ని మెటబాలిక్ వ్యర్థ పదార్థాల్ని, నీటిని బయటకు పంపుతున్నా వీటిని బయటకు పంపడానికి వుద్దేశించిన శరీరంలో ప్రత్యేకంగా వున్న అవయవాలు మూత్రపిండాలు. మూత్రపిండాలు చిక్కుడు గింజ ఆకారంలో వున్న రెండు చిన్న అవయవాలు. ఒక్కొ మూత్రపిండం 10 సెం.మీ. పొడవు 6 సెం.మీ. వెడల్పు వుండి వెన్నెముక దిగువ భాగంలో రెండు పక్కలా రెండు వుంటాయి. చివరి రెండు రిబ్స్ మూత్రపిండాలకు రక్షణ నిస్తుంటాయి. ఒక్కో మూత్రపిండం 140 గ్రాముల బరువుంటుంది. దాదాపు మిలియన్ నెఫ్రానులు అనే వడపోత భాగాలు ఒక్కో మూత్రపిండంలో వుంటాయి. ప్రతీ నిముషం ఒక లీటరు రక్తం వాటి గుండా ప్రవహిస్తూంటుంది. 24 గంటల్లో ఈ నెఫ్రానులు 16 లీటర్ల ద్రావకాన్ని వేరు చేస్తుంటాయి. వాటిలోంచి చాలా భాగం మూత్రపిండాల నాళాలు తిరిగి గ్రహించగా ఆఖరికి 1 నుంచి లీటర్ల వ్యర్థ దావకం మూత్ర రూపంలో బయటకు పోతుంటుంది. మూతము, మూత్రపిండాలు సాధారణంగా క్రిములు లేకుండా వుంటాయి. లోపల లేకపోయినా మూత్రాశయంలో ఆడ, మగ ఇద్దరిలో ఇన్ఫెక్షన్ రావడానికి అవకాశముంది. మూత్ర మార్గము, మర్మావయవము ఒక చోటవుండడంతో సంపర్కము వల్ల క్రిములు లోపలకు ప్రవేశించి, మూత్రాశ యాన్ని చేరుకునే ప్రమాదముంది. దీనినే 'యురెథ్రయిటిస్' అంటారు. పైలోనె ఫ్రయిటిస్ పోస్టేట్ గ్రంధులు పెద్దవైనప్పుడు మూత్రాశయ ద్వారం మూసుకుపో తుంది. దాంతో మూత్రాశయంలో మూత్రం నిల్వ వుండిపోయే ప్రమాదముంది. ఇన్ ఫెక్షన్ ని కలిగించే సూక్ష్మజీవులు మూత్రంలో అధిక సంఖ్యలో పెరుగుతాయి. అందుకనే అలాంటి పరిస్థితుల్లో అతి త్వరగా ఇన్ ఫెక్షన్ వచ్చే ప్రమాదముంది. మూత్రాశయం వరకే ఇన్ ఫెక్షన్ వస్తే అది త్వరగానే తగ్గిపోతుంది. అలాకాకుండా ఇన్ ఫెక్షన్ మూత్రపిండాల వరకూ వ్యాపిస్తే 'పైలో నెఫ్రయిటిస్' అనే వ్యాధి రావచ్చు. మూత్ర పిండాలలో రాళ్ళు మూత్రపిండాలు పని చేసుకుపోతున్నప్పుడు వ్యర్థాలతో పాటు కొన్ని పదార్థాలు డిపాజిట్ అయి అవి చిన్న చిన్న రాళ్ళలా మారి మూత్రపిండాలలో, మూత్రనాళాలలో అడ్డంపడుతుంటాయి. అవి రకరకాల పరిమాణాల్లో వుంటాయి. కాల్షియమ్ లేక యూరిక్ యాసిడ్ డిపాజిట్ లతో ఇవి తయారవుతుంటాయి. కొన్ని రాళ్లు పెద్దవిగా కూడా వుంటాయి. అవి మూత్రనాళాలలో అడ్డం పడి మూత్ర విసర్జనకి అవరోధాన్ని కలిగిస్తాయి. మూత్ర పిండాలు చెడిపోవడం రెండు రకాలు. అవి. 1. ఎక్యూట్ రీనల్ ఫెయిల్యూర్  2. క్రానిక్ నల్ ఫెయిల్యూర్. ఎక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ అయితే మూత్రం తగ్గవచ్చు. వాపు రావచ్చు. రక్తపోటు పెరగవచ్చు. శరంలో నీరు తగ్గి అతిసార వ్యాధి రావచ్చు. క్రానిక్ ఫెయిల్యూర్ లో మూత్రపిండాలు నెమ్మదిగా, పూర్తిగా చెడతాయి. తిరిగి వాటిని బాగు చేయడాని వీలుకాదు. మూతపిండాల మార్పిడి అవసరమవుతుంది. నెఫ్రోటిక్ సిండ్రోమ్ మూత్రపిండాలలో నెఫ్రోటిక్ సిండ్రోమ్ అనే అనారోగ్యము వస్తుంది. రక్తంలోంచి మూత్రపిండాలు పనికిరాని పదార్థాలు వేరు చేసేప్పుడు ప్రొటిన్ కూడా లీక్ అయి మూత్రం ద్వారా బయటికి వెళ్ళిపోయే జబ్బును 'నెఫ్రోటిక్ సిండ్రోమ్' అంటారు. అధిక రక్తపోటుతో... అధిక రక్తపోటు వల్ల మూత్రపిండాలు దెబ్బ తింటాయి. అధిక రక్తపోటు వల్ల క్రమంగా మూత్రపిండాలలోని చిన్న ఆర్టెరీస్ దెబ్బ తింటాయి. క్రమంగా మూత్రపిండాల పనితీరు పూర్తిగా దెబ్బ తింటుంది. దెబ్బతిన్న మూత్రపిండాల వల్ల రక్తపోటు మరింత పెరుగుతుంది. మూత్రపిండాలలోని రెనిన్ రక్తపోటు పెంచుతుంది. మూత్రపిండాల్ని పాడుచేసే మరికొన్ని కారణాలు కొన్ని కొన్ని జబ్బులవల్ల కూడా మూత్రపిండాలు దెబ్బ తింటాయి. కొన్ని మందులు, విషపదార్థాలు తీసుకున్నా మూత్రపిండాలు చెడిపోతాయి.  'మూత్రపిండాల అనారోగ్యాన్ని పసిగట్టడానికి చేసే పరీక్షలు' బ్లడ్ ప్రెజర్, ఎక్సరే, కిడ్నీబయాప్సీ, యూరిన్ అనాలిసిస్, బ్లడ్ అనాలిసిస్ మొదలయిన పరీక్షలు చేసి మూత్రపిండాల పనితీరుని శోధించి ఒకవేళ ఏమైనా అనారోగ్యాలుంటే కనుగొనడంతో పాటు అవి ఏ స్థాయిలో వున్నాయో కూడా తెలుసుకుంటారు. మొదట్లోనే చికిత్సని ప్రారంభిస్తే మూత్రపిండాల జబ్బులన్నింటినీ నయం చేయవచ్చు. మూత్రపిండాలు సరిగ్గా పనిచేయనప్పుడు ఉప్పు నీరు, మాంసకృత్తులు (ప్రొటీన్స్) ఒక పద్ధతి ప్రకారమే తీసుకోవాలి. బాక్టీయావల్ల మూత్రపిండాలు కొద్దిగా పాడైతే యాంటి బయాటిక్స్ వాడాలి.                                  ◆నిశ్శబ్ద.

మీ దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తెలుసుకుని తీరాలి..

దంత సంరక్షణ మన ఆరోగ్య సంరక్షణలో ఒక భాగం. కానీ చాలామంది ఆరోగ్య సంరక్షణకు ఇచ్చినంత ప్రాధాన్యత దంత సంరక్షణకు ఇవ్వరు. చక్కని దంతాలు చక్కనైన రోజును నడిపిస్తాయనడంలో సందేహం లేదు. దంతాలు బాగుంటేనే రోజువారీ అవసరమైన ఆహారాన్ని సరిగ్గా తీసుకోగలుగుతాం. అదే పంటి నొప్పి, పన్ను ఊగడం, పళ్ళ మధ్య దూరం, పిప్పి పన్ను మొదలైనవి ఉన్నప్పుడు దేన్నీ సరిగ్గా తినలేం, తాగలేం. అందుకే దంత ఆరోగ్యం చాలా ముఖమైంది. దంతాల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటే.. పుట్టకముందే దంతాలు ఏర్పడటం మొదలవుతుంది:  పిల్లలు పళ్లతో పుట్టకపోయినప్పటికీ, అవి తల్లి కడుపులో పిల్లలు ఉన్నట్టే ఏర్పడటం ప్రారంభిస్తాయి.  ఈ దంతాలు శిశువు పుట్టకముందే అభివృద్ధి చెందడం మొదలవుతుంది. సాధారణంగా శిశువుకు 6 మరియు 12 నెలల వయసులో పళ్ళు రావడం ప్రారంభమవుతుంది.   దంతాలే స్ట్రాంగ్..:  మన దంతాల మీద ఉండే ఎనామిల్ మానవ శరీరంలో అత్యంత గట్టి పదార్థం, మన ఎముకల కంటే కూడా ఇది చాలా గట్టిది.  పంటి ఎనామిల్‌లో కనిపించే ప్రధాన ఖనిజాన్ని హైడ్రాక్సీఅపటైట్ అంటారు.   దంతాలను స్ట్రెయిట్ చేయవచ్చు:  వంకరగా ఉండటం, ఎత్తు పళ్ళు, పన్ను మీద పన్ను రావడం వంటి సమస్యలను సరిచేయవచ్చు. వీటిని  అలైన్‌నర్‌లతో స్ట్రెయిట్ చేయవచ్చు.  ఈ ఆర్థోడోంటిక్ చికిత్సలు దంతాలను క్రమంగా సరైన స్థానాల్లో పళ్ళు ఉండేలా చేయడానికి  సున్నితమైన ఒత్తిడిని తీసుకొస్తాయి.  ప్రతి వ్యక్తికి దంతాలు ప్రత్యేకంగా ఉంటాయి:  మన వేలిముద్రల మాదిరిగానే, మన దంతాలు ప్రతి వ్యక్తికి ప్రత్యేకంగా ఉంటాయి.  ఇద్దరు వ్యక్తుల దంతాలు ఎప్పుడు ఒకేలా ఉండవు, వాటిని గుర్తించడానికి ఇది  ఒక అద్భుతమైన మార్గం. మాటకు ముఖ్యం: దంతాలు కొన్ని పదాలను స్పష్టంగా ఉచ్చరించడంలో సహాయపడతాయి. దంతాలు సరిగా లేకపోయినా, తొందరగా వీటిని కోల్పోయిన కొన్ని పదాలను పలకడంలో ఇబ్బంది స్పష్టంగా కనిపిస్తుంది. కొన్నిసార్లు ఇది నత్తి అనే భావన చాలామందిలో ఏర్పడిపోతుంది. తెలుగు వ్యాకరణంలో నోటిలో ఏ భాగం దంతాలతో ఏ అక్షరాలు ఉత్పన్నం అవుతాయనే విఆహాయం కూడా ఉంటుంది. కాబట్టి దంతాలు మన మాటకు మూలం. నోటి పరిశుభ్రత ఉంటే:  సాధారణ దంత సంరక్షణతో పాటు అప్పుడప్పుడు వైద్యులను కలవడం, దంతాల ఆరోగ్యాన్ని చెక్ చేయించుకోవడం ముఖ్యం. దంతాలు తొందరగా పాడయ్యేందుకు సహకరించే ఆహారాలు, కూల్ డ్రింక్స్, తీపి పదార్థాలు ఎక్కువ తీసుకోరాదు.   ఓరల్ హెల్త్ మొత్తం ఆరోగ్యంతో ముడిపడి ఉంది:  పేలవమైన నోటి ఆరోగ్యం ద్వారా గుండె జబ్బులు, మధుమేహం మరియు అల్జీమర్స్ వ్యాధితో సహా అనేక రకాల ఆరోగ్య సమస్యలు ముడిపడి ఉంటాయి.  మీ దంతాల సంరక్షణ మీ మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో దోహదం చేస్తుంది.   నోటి పరిశుభ్రత, చక్కని అలవాట్లు, సమతుల్య ఆహారం తీసుకోవడం క్రమం తప్పకుండా దంతవైద్యుడిని కలవడం మొదలైనవి చేయడం వల్ల మరింత ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండొచ్చు. చక్కగా నవ్వుతూ..                                       ◆నిశ్శబ్ద

నీటితో వైద్యం నమ్మలేని ఫలితం!!

చలికాలంలో నీటికి దూరంగా ఉంటారు చాలామంది. నీరు తాగాలన్నా బద్ధకమే. చాలామంది వేడిగా కాఫీలు, టీలు తాగుతూ గడిపేస్తారు. కానీ శరీరానికి తగినంత నీరు కచ్చితంగా అవసరం.  ఆరోగ్యంగా ఉండటానికి నీటి అవసరం చాలావుంది. అయితే నీటి అవసరాన్ని, ఉపయోగాన్ని గుర్తించక చాలామంది నిర్లక్ష్యంతో అనారోగ్యానికి గురి అవుతున్నారు. శరీర నిర్మాణంలో 60 నుండి 70 శాతం నీటితో కూడి వుంది. కండరాలలో కూడా 70 శాతం నీరు వుంటుంది. గట్టిగా ధృడంగా ఉండే ఎముకలలో కూడా మూడవవంతు నీరు ఉంటుంది. రక్తంలో కూడా ఎక్కువశాతం నీరు  వుంటుంది. ముఖ్యంగా మెదడు కణాలలో 70 శాతం వరకూ నీరు ఉంటుంది. మానవ శరీరానికి మన ఊహకు మించిన ప్రాధాన్యత నీటికి ఉంది. సరిపడినంత నీరు  ఉండకుండా లోపిస్తే శరీరంలో అనేక మార్పులు కలుగుతాయి. ఏ వైద్యుని సలహా అడిగిన నీరు బాగా త్రాగటం చాలా అవసరమనే విషయాన్ని చెప్తారు. ప్రతిరోజూ ఉదయం నిద్రలేవగానే రెండు గ్లాసులు వెచ్చటి నీరు త్రాగడం అలవాటు చేసుకుంటే మలవిసర్జనకు ఎంతగానో దోహదం చేస్తుంది. ఎన్నో మందులకన్నా ఈ పద్ధతి చాలా చక్కగా పని చేస్తుంది. వెచ్చటి నీరు అలవాటులేనివారు, క్రమబద్ధంగా రోజుకు కొంచెము కొంచెముగా అలవాటు చేసుకుంటూ రెండు గ్లాసులు త్రాగ గలిగేంతవరకూ అలవాటు చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. రాత్రి అలాగే ఉంచిన  నీరు రెండు గ్లాసులు ఉదయాన్నే త్రాగితే వాత, పిత్త, కఫరోగములు నశిస్తాయి. రాత్రి పడుకునేముందు రెండు గ్లాసులు నీరు త్రాగితే ఉదర రోగములు, ఆర్మమొలలు, వాపులు, నేత్ర వ్యాధులు తగ్గిపోతాయి. .  ప్రతిఒక్కరూ నీటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం అవసరము. అవి ఏంటంటే…  ప్రతి ఉదయం నిద్ర లేవగానే రెండు గ్లాసులు నీరు త్రాగడం మంచిది. ఉదయం అల్పాహారానికి, మధ్యాహ్నం భోజనానికి మధ్యలో రెండు గ్లాసులు త్రాగాలి. భోజనం చేస్తున్న సమయంలో మధ్యలో ఎక్కువగా నీరు త్రాగకూడదు. మధ్యాహ్న భోజనానికి, రాత్రి భోజనానికి మధ్య సమయంలో రెండు గ్లాసుల నీరు త్రాగడం అవసరం. నిద్రపోయేముందు మళ్ళీ రెండు గ్లాసుల నీరు త్రాగడం మంచిది. ఇలా ప్రతిరోజు 8 గ్లాసుల నీరు తీసుకోవడంవల్ల శరీర క్రమంలో మార్పులు కలుగకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. నీటి ద్వారా సామాన్య వ్యాధుల నివారణ ఎలా సాధ్యమంటే…  జలుబు, దగ్గు, ఉబ్బసం వ్యాధులకు కాచిన నీరు ఎక్కువగా త్రాగడం, ఆవిరిపీల్చడం వలన రిలీఫ్ చేకూరుతుంది. బెణుకులు, వాపులకు, వేడినీటి కాపడం పెట్టడం వలన తగ్గుతాయి. ముక్కులు బిగిసినప్పుడు ఉప్పునీటిని ముక్కుతో పీల్చాలి. గొంతు నొప్పికి, వేడినీటిలో ఉప్పుకలిపి గొంతులో పోసుకుని పుక్కిలించడం వలన బాధ తగ్గుతుంది. మలబద్ధకంతో బాధపడేవారు పడుకునే ముందు, ఉదయం లేవగానే నీరు తాగితే సమస్య తగ్గుతుంది. దురదలు, మంటలు ఏర్పడినప్పుడు చన్నీటి కాపడం పెడితే ఉపశమనం కలుగుతుంది. కాచిన నీరు తాగుతూ, శరీర అవయవాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా  అంటువ్యాధుల నుండి రక్షణ పొందవచ్చు. జ్వర తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు చల్లని నీటిలో శుభ్రమైన గుడ్డను తడిపి నుదుటిమీద వుంచితే తీవ్రత తగ్గుతుంది. ఇలా  నీటితో లెక్కలేనన్ని ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి నీటికి దూరం  ఉండకండి.                                       ◆నిశ్శబ్ద.

బాబోయ్.. మధుమేహం వల్ల కంటి చూపు పోయే ప్రమాదముందా?

ఆధునిక విజ్ఞానం, మనిషికి ఎంతో సుఖవంతమైన జీవితాన్ని ప్రసాదించింది. యంత్రాల హవా పెరిగిన తరువాత  శారీరక శ్రమ తగ్గి యంత్రాలతో పని చేయించడం ఎక్కువయ్యింది. దీనివల్ల మనం తినే ఆహారానికి, చేసే శ్రమకు మధ్య చాలా వ్యత్యాసం ఏర్పడింది. దానితో ఆహార పదార్థాల నిల్వలు అవసరాన్ని మించి, శరీరంలో పేరుకుపోతున్నాయి. రక్తంలో వుండే, గ్లూకోజ్, మాంసకృత్తులు, కొవ్వులు, లవణాలు, హార్మోనులు నిర్ణీతమైన స్థాయిలోనే వుండాలి. ఆహారం ఎక్కువగా తీసుకున్నా, తక్కువగా తీసుకున్నా, వీటిస్థాయి మాత్రం నిలకడగా వుండేలా శరీరం జాగ్రత్త తీసుకుంటుంది.  అవసరాన్ని బట్టి ఆహారపదార్ధాలు వినియోగించబడతాయి. అవసరాలకు మించిన నిల్వలను దాచి పెట్టడం లేక విసర్జించడం జరుగుతుంది. ఈ విధంగా అదుపు చేయడానికి ఇన్సులిన్ అనే హార్మోను కృషి చేస్తుంది. రక్తంలో వుండే చక్కెర పదార్థాలు అదుపులేకుండ పేరుకోవడాన్ని మధుమేహం అంటారు. ఇది రక్తానికి సంబందించిన వ్యాధి కాబట్టి, శరీరంలో అన్ని అవయవాలకు వ్యాపిస్తుంది. మధుమేహం శరీరానికి ఇతర వ్యాధులు రావటానికి అనువైన వాతావరణాన్ని ఏర్పాటు చేస్తుంది. అంతేకాక దీని కారణంగా శరీరానికి  నెమ్మదిగా ఏర్పడే వ్యాదులు వేగంగా ఏర్పడతాయి. దృష్టిలోపం తొందరగా మొదలౌతుంది. మధుమేహం ఉన్నవారు కంటి అద్దాలు త్వరత్వరగా మార్చుకోవలసి వస్తుంది. రక్తంలో చక్కెర మార్పులను బట్టి, ఒకే అద్దాలు, వివిధ సమయాలలో, వేరువేరుగ కనినిస్తాయి. కంటిలో శుక్లము: మధుమేహము ప్రత్యేకంగా కంటిలో శుక్లం కలిగించడం అరుదు. అయినప్పటికి కొన్ని ప్రత్యేక లక్షణాలు కలిగిన మధుమేహం కంటిలో శుక్లానికి కారణం అవుతుంది. మధుమేహం ద్వారా ఏర్పడే శుక్లాన్ని మంచుపొడి (స్నోఫ్లేక్) శుక్లము అంటారు. ఇవి కటకపు సంచి సమీపంలో హెచ్చుగా ఏర్పడతాయి. రెండు కళ్ళలోనూ ఒకే రీతిగా వుంటాయి. మంచి వైద్యసదుపాయాలు అందుబాటవ్వడంతో మధుమేహపు రోగుల జీవన ప్రమాణం పెరిగింది. ఇలా జరగడం వలన మరొకరకం సమస్య ఉత్పన్నమయ్యింది. రక్తప్రసరణంలో వచ్చిన మార్పులవలన "రెటినోపతి" అనే వ్యాధి అధికమయ్యింది. దీంట్లో నాడీకణాలు మరణిస్తాయి. నాడులలో కొవ్వు పేరుకుంటుంది. రక్త సరఫరా అధికం చేద్దామని కొత్త రక్త నాళాలు పుడుతుంటాయి, పుడితే ప్రమాదం లేదు కాని ఇందులో నుండి రక్తం లీకవుతుంటుంది. లీకయిన రక్తం యొక్క పరిమాణాన్ని బట్టి వివిధ పొరల్లో పేరుకొంటుంది. ఇలా పేరుకొన్న రక్తం, కాంతి కిరణాలకు ఆటంకంగా తయారయ్యి దృష్టి మాంద్యం ఏర్పడుతుంది. శరీర భాగాలలో ఎక్కడైన రక్తం పేరుకొంటే, దాని పరిమాణం, దాని ప్రదేశము బట్టి ఫలితం వుంటుంది. కంటి సాసలో రక్తం చిమ్మితే, ఆరక్తం త్వరగా పీల్చుకోబడదు. కనీసం మూడునెలల పాటు అలాగే వుండిపోతుంది. చిమ్మిన రక్తం, కాంతి కిరణాలను రెటీనాపై కేంద్రీకరించకుండా అడ్డుకొని అంధత్వం కలిగిస్తుంది. నాడిపొరల్లో ఏర్పడ్డ కొత్త రక్త నాళాలు ఇందుకు కారణం. కొన్నాళ్లకు కరిగిపోయినా, మరలా మరలా అలా రక్తం చిమ్ముతూనే వుంటుంది. చివరకు అంధత్వంతో ఇది ఆగిపోతుంది.  రెనల్ డిటాచ్మెంట్ :  నాడి పొరలకే పరిమితమైన కొత్త రక్తనాళాలు పేరుకొన్న ఈ రక్తం వెంబడి కంటి సొనలోనికి ప్రవేశిస్తాయి. ఇవి ఎలాస్టిక్ ధర్మం కలిగి వుండటం వలన మధ్యలో పొరను లాగుతుంటుంది. నాడిపొర అసలే వదులుగ అతుక్కొని వుంటుంది కాబట్టి సులువుగా విడిపోతుంది. . దీనిని రెటినల్ డిటాచ్మెంట్ అంటారు. మధుమేహం ఉంటే ఇలా ఇన్నిరకాల కంటి సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి మధుమేహం ఉన్నవారు ఎప్పటికప్పుడు కళ్ళు చెకప్ చేయించుకుంటూ ఉండాలి. లేకపోతే ఊహించని విధంగా దృష్టిలోపం సమస్య పెరిగే అవకాశం ఉంటుంది.                                   ◆నిశ్శబ్ద. 

యూత్ మెంటల్ ఎమెర్జెన్సి  హెల్త్ ...

రేపటి తరానికి ప్రతినిధి యువతే వారిఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిది. ఈనేపధ్యంలో  అమెరిక దేశంలోని  యువత తీవ్ర మానసిక అనారోగ్యం బారిన పడుతున్నట్లు పలు పరిశోదనలు వెల్లడిస్తున్నాయి. ప్యాండ మిక్ తరువాత  యువత తీవ్ర మానసిక సమాస్యలను ఎదుర్కుంటోంది. ఈనేపధ్యం లో ఒమైక్రాన్ ను  ఎదుర్కోవాలంటే బూస్టర్ రక్షణ కల్పిస్తుందా అన్నదే సందేహం. ప్యాండమిక్ ప్రజలకు సహాయం చేసిందా? హానిచేసిందా ? మానసిక సంబంధమైన అనారోగ్య  సమస్యను ఎదుర్కుంటున్నారు. ఇక తాగిన వారు తాము త్గాగినా బండి నడపగలం అని నమ్ముతారు. ప్యాండమిక్ వచ్చినట్లుగా భ్రమ పడుతూ ఉంటారు.ముఖ్యంగా  ఆరోగ్యకార్యకర్తలు ఎక్షగ రేషన్ ఎదుర్కుంటున్నారు. అమెరిక లోని యుక్త వయస్సులో ఉన్న యువత మానసిక అనారోగ్యం తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అని సర్జన్లు హెచ్చరించారు. అత్యవససమయంలో యుక్తవయస్సులో ఉన్న ఆడపిల్లలు ఆత్మహాత్యలు చేసుకోవడం గమనించవచ్చు. 2౦19 -2౦21 మధ్యకాలం లో 51% అంటే 4% పెరిగిందని అంచనా వేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా యుక్త వయస్సులో ఉన్నవారిలో యాంగ్ జై  టి,డిప్రషన్ శాతం రెండింతలు  పెరిగింది. యు ఎస్ లో  ఇంకా మానసిక అనారోగ్య సమస్యలు పెరుగుతూనే ఉన్నాయని అంటున్నారు నిపుణులు. డిప్రషన్ మూలంగా ఇ ఆర్ విజిట్లు పెరిగాయని యాంగ్ జైటీ  లాంటి లక్షణాలు 2౦11 -2౦15  నాటికి 28% పెరిగాయి.  యుక్తవయస్సులో ఉన్న యువత మనసిక అనారోగ్యం బారిన పడడానికి కారణాలు... ముఖ్యంగా యుక్తవయస్సులో ఉన్నవారు పూర్తిగా పరిణతి చెందక పోవడం.వేగంగా పెరుతున్న మీడియా ముఖ్యంగా సోషల్ మీడియా వ్యవస్థ, కుటుంబ  వ్యవస్థలో లోపాలు చుట్టూ ఉన్న స్నేహితులు, యువత పై పడుతున్న మెసేజ్ బాంబులు,కురుస్తున్నాయి. మెసేజ్ లు,కొన్ని కొన్ని సందర్భాలలో వ్యక్తి గతంగా ఆలోచన నసించి పోతుంది. సన్నగా చూడడానికి బాగుంటే చాలు, పెద్దగా వారు ప్రాచుర్యంలో లేక పోయినా అంటే పాపులర్  కాక పోయినా పరవాలేదు. కొంత తెలివిగా స్మార్ట్ గా ఉంటె చాలు, కొంచం ఆర్ధికంగా బలం గా  ఉంటె చాలు, తన చుట్టూ ఉండే వాతావరణం సరిగా లేకపోవడం, ఆదాయంలో వ్యత్యాసాలు, సామాజిక వివక్ష, సామాజిక న్యాయం,లేకపోవడం, గన్ వైలెన్స్  వంటి సమస్యలు ఎదుర్కుంటున్నారు. బోని నాగేల్  పిడియాట్రిక్ న్యూరో సైకాలజిస్ట్ హెల్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయానికి చెందిన  వైద్యులు యుక్త వయస్సులో ఉన్న వారికి చికిత్స చేసారు. ఇలాంటి వారికి ఆన్ లైన్ లో చికిత్స సాధ్యం కాదని నూతన పరిశోదనలో వారి సాహోద్యోగులు  ఒంటరిగా ఉండాలనే భావన వారిని తీవ్ర ఒత్తిడికి గురిచేస్తుంది.  కోవిడ్ నేపధ్యంలో వారు  ఇతరులతో మాట్లాడక పోవడం, సానాజికంగా ఎటైనా వెళితే వారికి కోరోనా వస్తుందేమో అని భావించడం. అందరితో కలిసి ఉండక పోవడం,బంధం,బంధుత్వం అన్న పదాలకు వీరి డిక్షనరీలో ఆపదాలకు చోటు లేదు. వారు ఇతరులతో మాట్లాడే ఉదానం, లో ఒక అసంతృప్త భావన అయినా వారితో అయినా సరే వేరెవరి తోనో మాట్లాడుతున్నా మన్న భావన వారిలో చోటుచేసుకుంటుంది. యుక్త వయస్సులో ఉండే వారి ఆరోగ్యం అంటే మనాసిక అనారోగ్యం పై దృష్టి పెట్టాలి. అమెరికన్ అకాడమి ఆఫ్ పిడియాట్రిక్స్ అమెరికన్ అకాడమి ఆఫ్  చైల్డ్ అడాలసెంట్ సైక్రియాట్రి పిల్లల ఆసుపత్రి  నేషనల్ ఎమర్జన్సీ యూత్ మెంటల్  హెల్త్.ప్రకటించాలని సూచించారు. 

మెదడుకు, కంటికి లింక్ ఇదే!

Face in the index of the Mind అన్నట్టుగా Eye is the mirror of the Brain అంటారు. మెదడు పనిచేసే తీరు తెన్నులు తెలుసుకోవడానికి కన్ను అనేక వివరాలు అందజేస్తుంది. కొన్ని అవయవాలు, అవిచేసే పనులు, వాటిలో వుత్పన్నమయ్యే లోపాలు, సమస్యలు పరోక్షంగ తెలుసుకోగలమే తప్ప తలుపుతీసి గదిలో ప్రవేశించి గదిలోని వస్తువులను పరిశీలించినట్లు చేయడానికి అవకాశం లేదు. అలాంటి వాటిలో మెదడు ఒకటి. మెదడుకు సంబంధించిన సమాచారము పరోక్షంగా ఇతర అవయవాలనుండి తెలుసుకోవడమేతప్ప మెదడు కోసి చూడలేము. మెదడు బలిష్టమైన ఎముకల గదిలో వుంటుంది. అందుచేత మెదడును పరీక్షించాలంటే సామాన్య పద్దతులలో వీలుపడదు. మెదడు నుండి సరాసరి విడుదలయ్యే నాడులు 12 జతలు. ఈ 12 జతలు శరీరంలోని కన్ను, ముక్కు, చెవి, గొంతు, నాలుక, గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, ప్రేవులకు సంబందించి ఇవి వివిధ కర్తవ్యాలు నిర్వహిస్తుంటాయి. ఇందులో 6 జతల నాడులు కంటికి సరఫరా అవుతాయి. దృష్టి నాడి, దృష్టి క్షేత్రం వర్ణదృష్టి, కంటి చలనము, కన్నుమూసుకోవడం తెరుచుకోవడం, కంటి స్పర్శ, కంటినొప్పి మొదలైనవి, మెదడులోని కొన్ని కేంద్రాలనుండి కంటిలో వివిధ భాగాలతో ముడివేస్తాయి. వీటిలో వచ్చే మార్పులను బట్టి దెబ్బతిన్న భాగాన్ని అందుకు సంభంధించిన కారణాలను తెలుసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది.  మెదడుకు, కంటికీ రక్తం సరఫరా అవుతుంది. ఈ రెండూ ఒకేచోట పుట్టి చీలిక మెదడంతా వ్యాపిస్తుంది. మెదడులో నుండే కొన్ని కంటికి చేరతాయి. అందుచేత కంటిలోని రక్తనాళాల తీరుతెన్నులు, మెదడులోని రక్తనాళాలు ఒకేలా వుంటాయి. రక్తనాళాలు రక్తాన్ని సరిగ పంపిణీచేయగల స్థితిలో వున్నవా లేక నాళాలు సన్నబడి రక్త ప్రసరణకి ఆటంకం ఏర్పడుతుందా? రక్తనాళాలలో కొవ్వు పేరుకొందా? రక్తం గడ్డకట్టి ప్రవాహం అంతరాయం ఏర్పడిందా? కొత్త నాళాలు పుడుతున్నాయా? నాళాలనుండి రక్తం లీకవుతోందా? మొదలైన సమాచారం కంటిలోని రెటినాల్ నాళాలను పరిశీలించి తెలుసుకోవచ్చును. మెదడులో కంతులు ఏర్పడితే కంతి యొక్క స్వరూపము, ఏ భాగములో ఏర్పడ్డదో తెలుసుకోవడానికి కంటి పరీక్షలు ఎనలేని అవకాశం కల్పిస్తుంది. కంటికి సరఫరా చేసే 6 నాడులలో ఒకటి గాని, అంతకంటే ఎక్కువగాని, పాక్షికంగ గాని, పూర్తిగా కాని దెబ్బతినడం కనిపెట్టవచ్చును. కొన్ని సమయాలలో దృష్టి క్షేత్రంలో మార్పులు ఏర్పడవచ్చును. మెల్ల ఏర్పడ వచ్చును. కంటినాడి వుబ్బవచ్చును. వీటిని తెలుసుకోవడం ద్వారా వ్యాధి లక్షణాలు, వ్యాధిస్థితి, చికిత్స యొక్క ఫలితము మొదలైన విషయాలను అంచనా కట్ట వచ్చును. నాడి పొరలోనుండి బయలుదేరిన నాడులు, పోగులు పోగులుగ చేరి చివరకు కంటినుండి ఆప్టిక్ నాడి ద్వారా మెదడుకు చేరుతాయి. మెదడుకు బయలు దేరేముందు రెటీనాలో కనిపించే భాగాన్ని, నాడీ నాభి (ఆప్టిక్ డిస్క్) అంటారు. ఈ భాగాన్ని పరిశీలిస్తే, మెదడుకు సంబందించిన అతి ముఖ్యమైన సమాచారం తెలుస్తుంది. మెదడుకు వాపు వచ్చినప్పుడు, మెదడులో కంతి, చీము మొదలైనవి  చేరినపుడు ఆ వాపు దృష్టి నాడి ద్వారా నాడీ నాభి వరకు ఎగబాకుతుంది. కంటినాడి వుబ్బుతుంది. దానిని మనం ఆప్తాల్మాస్కోపు అనే పరికరం ద్వారా తెలుసుకోవచ్చును. అంతేకాదు, వ్యాధి యొక్క తీవ్రత, వ్యాది వైద్యానికి లొంగుతుందా లేదా అనేది కూడ తెలుసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అందువల్ల మెదడులో సంభవించే అనేక పరిణామాలను తెలుసుకోడానికి కంటి పరీక్షలమీద ఆధారపడవలసి వస్తుంది.                                     ◆నిశ్శబ్ద.

గ్యాస్ట్రిక్ ట్రబుల్ అంటే ఏంటి?? ఎందుకు వస్తుంది??

ఈమధ్య కాలంలో చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ వేధిస్తున్న సమస్య గ్యాస్ట్రిక్ ట్రబుల్. అయితే ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య ఎందుకొస్తుంది?? అసలు గ్యాస్ట్రిక్ ట్రబుల్ అంటే ఏంటి?? తెలుసుకుంటే..  మనం ఆహారంతో పాటు గాలిని మింగుతుంటాం. ఈ అలవాటున్నా కార్బొనేటెడ్ పదార్థాల్ని ఎక్కువగా తీసుకుంటున్నా, చూయింగ్ గమ్ తినే అలవాటున్నా, ధూమపానం చేస్తున్నా త్రేన్పులు ఎక్కువగా వస్తుంటాయి.  ఇలాంటి వారిలో కడుపులోపల బాగా ఉబ్బరించినట్లుంటుంది. కడుపులో ఉత్పత్తి అయ్యే ఆ వాయువు కారణం చేతనే గుండె మండుతున్నట్లుంటుంది. జఠరాశయంలోని ఈ గాలి చిన్న ప్రేగులలోకి వెళ్తుంది. ఇక్కడ ఇది చిన్నప్రేగుల గోడలద్వారా పీల్చిబడుతుంది. లేకపోతే గ్యాస్ రూపంలో  బయటికి నెట్టివేయబడుతుంది. కడుపుబ్బరించే గాస్ తో బాధపడుతున్నా మనిపించినప్పుడు ఏ పదార్థాలు గ్యాస్ ని ఉత్పత్తి చేయడానికి కారణం అవుతున్నాయో వాటిని తినడం మానేయాలి. అలాగే గ్యాస్ ఉత్పత్తికి కారణమైన అలవాట్లని మానుకోవాలి. చాలా మంది త్రేన్పులు వస్తుంటే లోపలి గాలి బయటకు వెళ్ళి పోతోందని అనుకుంటారు. కాని వాస్తవానికి ఈ త్రేన్పుల వల్ల లోపలి పరిస్థితి మరింతగా దెబ్బతింటుంది. ఒక్కోసారి జీర్ణాశయంలో ఆహారం జీర్ణమయ్యేప్పుడు కూడా రకరకాల రసాయనిక మార్పులు కారణంగా కూడా గ్యాస్ ఉత్పత్తి కావచ్చు. జఠరాశయం, పెద్ద, చిన్న ప్రేగులు గాలితో నిండి ఇబ్బందిగా అనిపిస్తుండవచ్చు. త్రేన్పుల ద్వారా వెళ్ళే గాలిలో నైట్రోజన్, ఆక్సిజన్ వుంటాయి. అదే గ్యాస్ రూపంలో వెళ్ళే గాలిలో నైట్రోజన్, ఆక్సిజన్ లతోపాటు హైడ్రోజన్, కార్బన్ డయాక్సైడ్ మిధేన్ కూడా వుంటాయి. పిండి పదార్థాలు సరిగ్గా జీర్ణం కానప్పుడు ఆ పదార్థాలు చిన్నపేగులలో పేరుకు పోయినప్పుడు బాక్టీరియా అనే సూక్ష్మజీవులు అక్కడ చేరతాయి. ఈ బాక్టీరియా వున్నప్పుడు హైడ్రోజన్, కార్బన్ డయాక్సైడ్ మిథెన్ గ్యాస్ లు ఉత్పత్తి అవుతాయి. ఈ కుళ్ళిన పదార్థాల దగ్గరే చెడ్డ వాసన పుడుతుందన్నమాట! ఇలా గ్యాస్ సమస్యతో ఇబ్బందికి గురువుతున్నప్పుడు ద్రవ పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. వాటిని ఒక్కసారిగా తాగేయకూడదు.  కొద్దికొద్దిగా చప్పరిస్తూ త్రాగాలి. ఆహారాన్ని పెదాలు మూసుకుని బాగా నమిలి తినాలి. మనస్సు ఆందోళనగా వున్నప్పుడు కాక ప్రశాంతంగా వున్నప్పుడు తినాలి. కొద్ది కొద్దిగా తినాలి. ఎక్కువెక్కువ తినకూడదు. గుండె ప్రాంతంలో మంట ఈ గ్యాస్ ఉత్పత్తి కారణానో, యాసిడ్ ఉత్పత్తి కారణానో వస్తుంటుంది. ఈ మంట లోపలి మార్పులను సూచించే ఒకానొక సిస్టమే కానీ జబ్బుకాదు. ఈ మంట లోపల ఆహారం పులియడం వల్లగాని, నోటిలో కొంత జీర్ణమైన ఆహార పదార్థాలు ఉండడంవల్ల కూడా కలగవచ్చు. ఆహారం జీర్ణమవడానికి జఠరాశయంలో హైడ్రోక్లోరిక్ యాసిడ్, పెప్సిన్ ఎంజైమ్స్ కలుస్తాయి. ఈ కారణంగా గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య వొస్తుంది.                                       ◆నిశ్శబ్ద.

ఈ 7 రకాల నొప్పులను నిర్లక్షం చేస్తే అంతే సంగతులు!

ప్రతిఒక్కరు ఎదో ఒక నొప్పితో బాధ పడుతూ ఉంటారు. అసలు ఆ నొప్పులు ఎలా ఉంటాయి అంటే కొంచం గుచ్చుకున్నట్లుగా ఉంటె తీవ్రంగా  ఉంటుంది.సహజంగా సందర్బోచితంగా శరీరంలో నొప్పులు వస్తూనే ఉంటాయి.లేదా అంచెలు అంచెలుగా నొప్పులు వస్తూనే ఉంటాయి.అయితే కొన్నిరకాల్ నొప్పులు వచ్చినప్పుడు పరీక్షలు చేయించుకోండి. ఈ నొప్పులు మీలోపల ఉన్న వాస్తవ పరిస్థితిని తెలియచేస్తుంది. క్యాన్సర్, ఆర్ధరైటిస్, ఇంఫ్లామేషణ్, వంటి వాటిని నిర్లక్ష్యం చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవు వీటిని ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా జీవితం ప్రమాదంలో ఉన్నట్లే అనిగమనించాలి. 7 రకాల నొప్పులను మీరు ఏమాత్రం నిర్లక్ష్యం  చేయకండి.ప్రత్యేకంగా చాలా తీవ్రంగా ఉన్న లేదా దీర్ఘకాలం పాటు నొప్పులు కొనసాగినా సమస్యలే అన్నవిషయం గ్రహించాలి. 1 )పొట్టలో తీవ్రమైన నొప్పి.. పొట్టలో నొప్పి లేదా పొత్తికడుపులో నొప్పి రావడం సహజం.మీరు తీసుకున్న ఆహారం కావచ్చు.లేదా గ్యాస్ వల్ల కావచ్చు ఒకవేళ తీవ్రమైన నొప్పి కిన్దిభాగం లో ఎడమవైపు వస్తే అదితీవ్రంగా ఉంటె తక్షణం పరీక్షించాల్సిందే.ఆనోప్పి అపెండిసైటిస్ కావచ్చు. అపెన్ డిక్స్ లో ఇంఫ్లా మేషన్ కావచ్చు. ఇంఫ్లామేషన్ ను తొలగించేందుకు సర్జరీ చేయాల్సి రావచ్చు. ఇంఫ్లామేషన్ వచ్చిఅది బరస్ట్  కాక ముందే అభాగాన్ని తొలగించడం అనివార్యం.అలా కాక నిర్లక్ష్యం చేస్తే మరణించే అవకాసం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే పొట్ట మధ్యలో లేదా పైభాగం లో అది లేదావెనుక వైపు పై భాగం లో అసహనంగా గాబరా పడడం. లేదా ఊపిరి తీసుకోవడం ఇబ్బంది పడడం ప్యాంక్రియాస్ కారణం కావచ్చు. అందులో గాల్ బ్లాడర్ లో రాళ్లు ఉండవచ్చు.వాటిని సర్జరీ ద్వారా తొలగించాల్సి ఉంటుంది. 2) వ్యాయామం అనంతరం అసహజంగా వచ్చే నొప్పి...  మీరు వ్యాయామం చేసే సమయంలో బరువులు ఎత్తడం మీరు ఇబ్బందులు పడతారు.ఒకవేళ మీకు నొప్పి తీవ్రంగా ఉంటె పాదం అరికాలు నొప్పితో బాధపడితే డాక్టర్ ను సంప్రదించాలి. ముఖ్యంగా వర్క్ అవుట్ తరువాత నొప్పి వారం రోజులపాటు అలాగే కొనసాగితే కాస్త అలోచించాల్సిందే.అక్కడ అరగడం లేదా విరగడం లేదాటీర్ కావడం అయ్యిఉండవచ్చు.అది మీనోప్పికి  కారణంగా చెప్పవచ్చు. ౩ )నొప్పితో పాటు వాపు... ఏదైనా   వాపుతోపాటు నొప్పి వస్తే సంకేతం ఏమిటి అంటే అది ఇన్ఫెక్షన్ కావచ్చు.కొన్ని గంటల తరువాత వాపు నొప్పి తగ్గనట్లయితే అది మరింత తీవ్రంగా మారితే డాక్టర్ ను తప్పనిసరిగా సప్రదించాలి.  4)తీవ్రమైన తలనిప్పి... తలనొప్పి తీవ్రంగా ఉంటె అది మైగ్రైన్ కావచ్చు.లేదా బ్రెయిన్ ట్యూమర్ కావచ్చు చికిత్చలో భాగంగా ఉపసమనం కొసం వైద్యసహాయం తీసుకోవాలి  లేదా నొప్పినివారించే మండువడాలి. లక్షణాలు మరింత తీవ్రంగా ఉంటె ఎప్పుడు అనుభవించని నొప్పి మిమ్మల్ని బాధిస్తుంటే.ఏదైనా ఒకవ్యాది వచ్చి ఉండవచ్చు.అదిఎదొ తెలుసుకోవాలంటే పరీక్షలు నిర్వహించాలి.కార్బన్ మోనాక్సైడ్ విషతుల్య పదార్ధాలు ఉండవచ్చు.దీనివల్ల బ్రెయిన్ స్ట్రోక్ లేదా బ్రెయిన్ ట్యూమర్ కణి తలు ఏర్పడి ఉండవచ్చు.మీ జీవితం లో ఎప్పుడూ ఎవరూ ఎదుర్కిని తీవ్రమైన తలనొప్పి తప్పనిసరిగా అత్యవసర చికిత్చ అవసరం కావచ్చు. 5)చాతి నొప్పి... అన్నిరకాల చాతినోప్పులు గుండె పోటు కాదు అన్న విషయం తెలుసుకోవాలి.అయితే చాతిలో నొప్పి అన్నది హార్ట్ ఎటాక్ గుండేనోప్పి లక్షణంగా చెప్పవచ్చు.మీచాతిపై ఎదో బరువుపెట్టినట్ట్లుగా ఉంటె మీరే కారు నడపడం మంచిది కాదు. చాతి లో నొప్పి వచ్చినప్పుడు అంబులెన్స్ ను పిలిపించుకుని ఆసుపత్రికి వెళ్ళండి.మీసమస్యను వివరించండి తగిన సమయంలో చికిత్చ అందించడం ద్వారా గుండెపోటుతో మరణం నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ముఖ్యంగా ఇటీవలి కాలం లో ఉదయం వేళ లో మాత్రమే వ్యాయామం అనంతరం  గుండెపోటుతో మరనిస్తున్నఘటనలు  చూస్తున్నాం. కాబట్టి చాతి పై బరువుగా ఉన్న ఊపిరి పీల్చుకోడం కష్టంగా ఉన్న వెంటనే డాక్టర్ ను సంప్రదించడం అవసరం అని నిపుణులు పేర్కొన్నారు. 6)పెద్ద పాదం లో నొప్పి...   మీపాదం లో నొప్పి వస్తే అది గౌట్ కావచ్చు దీనిని వైద్య పరిభాష లో గౌట్ ఆర్తరైటిస్ అంటారు. ఇది ఆర్తరైటిస్ నుండి వస్తుంది.చాలా నొప్పిగా ఉంటుంది. శరీరంలో యూరిక్ యాసిడ్ పెరగడం కారణంగా ఆహార పదార్ధాలు అరగక పోయినా ఆల్కాహాల్ ఎర్రమామ్సం సాఫ్ట్ డ్రింక్స్ ఇతర ఆహార పదార్ధాలు అయితే వీటినుండి ఉపసమనం పొందనికి పెయిన్ కిల్లర్స్ వాడవచ్చు.ఈసమస్యకు నిపుణుడైన ప్రత్యేక డాక్టర్ నుండి చికిత్చ తీసుకోవడం అవసరం. గౌట్ కు సరైన చికిత్చ చేయనట్లయితే ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయి.కిడ్నీ ఫెయిల్యూర్ కు దారి తీయవచ్చు.  7)నెలసరి వచ్చే సమస్యలో క్రామ్ప్... నెలసరి సమస్యల కాలం లో స్త్రీలు తీవ్రమైన నొప్పులతో బాధపడుతూ ఉంటారు.ఈసమస్యను వైద్య పరిభాష లో మేన్స్టురియల్ క్రామ్స్ వల్ల కింది భాగం లో నొప్పి తీవ్రంగా ఉంటుంది.అయితే అది ప్రతినెలా స్త్రీలను వేదిస్తూ ఉంటుంది. అది చాలా సహజమైన నొప్పిగానే స్త్రీలు భావిస్తారు.అయితే నొప్పి తీవ్రత అధికంగా ఉంటె మీరు గైన కాలజిస్ట్ ను కలిసి డాక్టర్ సూచనల మేరకు పరీక్షలు నిర్వహించాలని లేదా తీవ్ర ద్సమస్యలు తప్పవు. అది ఒవేరియన్ క్యాన్సర్ ఎస్ టి డి క్యాన్సర్ కాని కణితలు కావచ్చు.అదనంగా వచ్చే నొప్పి ఏందో మెట్రిసెస్ కావచ్చు.అది త్వరితగతిన పరీక్షించాలి అలాగే ఉత్తమ చికిత్చ తీసుకోవాలి. ఏండో మెట్రిసెస్ వల్ల సంతనలేమి సమస్యలు వస్తాయి.కొన్ని సందర్భాలలో డాక్టర్స్ సర్జరీకి సిఫార్స్ చేయవచ్చు.సర్జరీ ద్వారా టిష్యు ను తొలగిస్తారు దీనివల్ల పిల్లలు కలిగే అవకాసం ఉందని  నిపుణులు తేల్చి చెప్పారు. నెప్పి ఎలాంటిదే అయినా ప్రాధమిక స్థాయిలో తక్షణం గుర్తించి అందుకు తగిన చికిత్చ తీసుకోవాలని సూచించారు. 

గుప్పెడంత గుండెకు కొండంత భరోసా ఇలా సాధ్యం!

చలి పంజాకు ఈ సంవత్సరం చాలా గట్టిగానే దెబ్బ తిన్నారు ప్రజలు. ఈ చలి ప్రభావం వల్ల ఎంతో మంది శ్వాశ సంబంధ సమస్యలతో ఇబ్బంది పడ్డారు. మరికొందరు మరణించారు కూడా. చలి ముఖ్యంగా శ్వాస నాళం మీద ప్రభావం చూపినప్పటికీ శరీరంలో కీలకమైన ఊపిరితిత్తులు, గుండె ఈ చలి ప్రభావానికి ఎక్కువగా గురవుతాయి. ప్రస్తుతం శివరాత్రి గడిచిపోయిన తరువాత చలి ప్రభావం క్రమంగా తగ్గుతూ వస్తోంది. వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. చలి తగ్గిపోయి మెల్లగా వేసవి వైపు అడుగులు పడుతున్నాయి. చాలామందికి ఈ సమయం ఎంతో విలువైనది. ముఖ్యంగా బరువు తగ్గాలని అనుకునేవారికి, వ్యాయామం చక్కగా చేసి ఫ్యాట్ బర్న్ చెయ్యాలని అనుకునేవారికి ఇది బెస్ట్ సీజన్. అయితే ఈ మూమెంట్ లో గుండె ఆరోగ్యం గురించి కూడా జాగ్రత్త వహించాలండోయ్.. జిమ్ లలోనూ.. ఆరు బయట, రోడ్ల మీద నడక నుండి విభిన్న రకాల వ్యాయామాలు చేస్తూ చేస్తూనే గుండె ఆగిపోయి ప్రాణాలు వదిలేస్తున్న వారు ఉన్నారు ఇప్పట్లో. అందుకే ఈ సీజన్ లో గుండె ఆరోగ్యం ఇలా.. పదిలం చేసుకోండి. గుండె పర్ఫెక్ట్ ఉండాలంటే.. అందరూ గుర్తుంచుకోవలసిన అయిదు విషయాలు.. హైడ్రేటెడ్ గా ఉండాలి గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి తగిన మోతాదులో నీరు తాగడం చాలా అవసరం.  నీరు శరీరం నుండి టాక్సిన్స్ బయటకు పంపుతుంది. గుండెను సరైన రీతిలో పని చేయడానికి సహకరిస్తుంది.  రోజుకు కనీసం 8 గ్లాసుల నీరు త్రాగాలని గుర్తుపెట్టుకోవాలి.  వ్యాయామం ఇలా..   రెగ్యులర్ గా చేసే వ్యాయామం గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.  ఇది  హృదయాన్ని బలంగా ఉంచడంలో సహాయపడుతుంది మరియు మీ మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.  మీరు ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేస్తే ఎంతో గణనీయమైన మార్పు కనిపిస్తుంది.  గుడ్ ఫుడ్.. శరీర ఆరోగ్యానికి ఆహారమే గొప్ప ఔషధం. అలాగే గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా అవసరం.  యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే ఆహారాలను చేర్చుకోవాలి.  ప్రాసెస్ చేసిన ఆహారాలలో షుగర్, కార్బోహైడ్రేట్లు చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయి. అలాగే గుండెకు చేటు చేసే కొవ్వులు వాటిలో పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వాటిని అవాయిడ్ చెయ్యడం మంచిది.  ఒత్తిడి మీద మంత్రం.. ఒత్తిడి  గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.  ఈ ఒత్తిడి కారణంగానే చాలా వరకు అనారోగ్య సమస్యలు, హైపర్ టెన్షన్ వంటి పరిస్థితులు ఏర్పడతాయి. యోగా లేదా ధ్యానం వంటి  విశ్రాంతినిచ్చే మార్గాలను ఎంచుకోవడం, వాటిలో పాల్గొనడం ద్వారా  ఒత్తిడి స్థాయిలను తగ్గించుకోవడానికి ప్రయత్నించవచ్చు.  బ్యాడ్ హాబిట్స్ కు బై బై..  గుండె జబ్బులకు ప్రధాన కారణాలలో ధూమపానం ఒకటి. అలాగే ఊపిరితిత్తుల వినాశనానికి కూడా ఇదే కారణం.   ధూమపానం మానేయడం వల్ల మీ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. ప్రత్యక్ష పరోక్ష ధూమపానం వల్ల అందరి ఆరోగ్యాలు పాడవుతాయి. అదే ధూమపానం మానేస్తే మీ ఆరోగ్యంతో పాటు అందరి ఆరోగ్యం బాగుంటుంది. కాబట్టి గుండె పదిలంగా, ఆరోగ్యం అద్భుతంగా ఉండాలంటే ఈరోజే ఈ చెడు అలవాటుకు చెక్ పెట్టేయండి.  పైన చెప్పుకున్న అయిదు విషయాలు చాలా సింపుల్ గా పాటించేవి. కానీ వాటి వల్ల కలిగే బెనిఫిట్ మాత్రం మీ జీవిత కాలాన్ని పొడిగిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం గుప్పెడంత గుండెకు కొండంత భరోసా ఇచ్చేయండి.                                   ◆నిశ్శబ్ద.

వ్యాయామం ఒకే సమయానికి చెయ్యాలంటారు ఇందుకే!

వ్యాయామం ప్రతి ఒక్కరి జీవితంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. సాధారణంగా రోజు వ్యాయామం చేసేవారికంటే.. వ్యాయామం జోలికి వెళ్ళని వారి శరీరం  విభిన్నంగా ఉంటుంది. వ్యాయామం మనిషిని చురుగ్గానూ, ఆరోగ్యంగానూ ఉంచేందుకు దోహపడే గొప్ప మార్గం. ఇందులో అనే రకాలు కూడా ఉన్నాయి. రన్నింగ్, జాగింగ్, యోగా, ఆసనాలు, జిమ్ ఇలా బోలెడు ఉన్నాయి. అయితే వ్యాయామం గురించి నిపుణులు ఒకమాట చెబుతున్నారు. అదేంటంటే.. వ్యాయామం అనేది ఒక సమయానికి ఒక ప్రణాళికతో చేసేది. దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి?? తెలుసుకుంటే.. వ్యాయామం  నిర్ణీత సమయానికి ఎందుకు చేయాలో కూడా అర్థమవుతుంది.  మానవ శరీరంలో జీవ ప్రక్రియలు కణాల సిర్కాడియన్ కలయికలపై ఆధారపడి ఉన్నందున రోజులో వేర్వేరు సమయాల్లో శారీరక శ్రమ శరీరాన్ని వివిధ మార్గాల్లో ప్రభావితం చేస్తుంది.  వ్యాయామం చేసే రోజు సమయం కొవ్వును కరిగించడానికి కొన్ని ఎలా ప్రభావితం చేస్తుందో కొన్ని అధ్యయనాలు కూడా ప్రయోగపూర్వకంగా తెలిపాయి.  వ్యాయామం వల్ల కలిగే బెనిఫిట్స్ ఏమంటే.. ఆహారం తీసుకునే విషయంలో ఫ్రీడమ్ వస్తుంది.   వ్యాయామం మొదలు పెట్టినప్పుడు శారీరక శ్రమ వల్ల  కొవ్వు కణజాలంలో  థర్మోజెనిసిస్ (వేడి ఉత్పత్తి) మరియు మైటోకాండ్రియా విచ్ఛిన్నానికి సంబంధించిన జన్యువుల వ్యక్తీకరణను పెంచుతుంది. ఇది అధిక జీవక్రియ రేటును సూచిస్తుంది.  ఈ ప్రభావాల వల్ల ఒకే సమయానికి వ్యాయామం చేయడం అనేది ఎంత ముఖ్యమో అర్థమవుతుంది.  జీవక్రియను పెంచడం మరియు కొవ్వును కరిగించడం వంటి అంశాలలో సాయంత్రం వ్యాయామం కంటే మార్నింగ్ వ్యాయామం మరింత ప్రభావవంతంగా ఉంటుంది.  దీని వల్ల తీసుకునే ఆహారం విషయంలో ఛాయిస్ మనదే అవుతుంది. వ్యాయామంతో  ఆరోగ్యాన్ని  మెరుగుపరుచుకోవచ్చు.  శరీరం బ్యాలెన్స్డ్ గా అంటే శరీర ఆరోగ్యం మరింత మెరుగవుతుంది. ఆహారం, ఔషధాలు, లైఫ్ స్టైల్ ఎంత బాగున్నా వ్యాయామం వల్ల మెరుగయ్యే స్థాయి చాలా బాగుంటుంది. అలాగే వ్యాయామం వల్ల శారీరక ఆరోగ్య సమస్యలు ఉంటే మెల్లగా అవే తగ్గుముఖం పడతాయి. దీనికి కారణం, నిర్ణీత సమయంలో నిర్ణీత వ్యాయామం, ఈ వ్యాయామం కారణంగా నిర్ణీత వేళకు ఆహారం తీసుకోవడం కూడా జరుగుతుంది. కాబట్టి ఆరోగ్యం అనేది వ్యాయామం, ఆహారం రెండింటి సమతుల్యత వల్ల మనకు అందే గొప్ప బహుమానం.                                      ◆నిశ్శబ్ద.

నాడీ వైద్యంలో వందకు పైగా చికిత్చలు

కొస్మెటిక్ ఆక్యుపంక్చర్... ఈ చికిత్చలో ఒక సూదిని వినియోగిస్తారు. వ్యాధి లక్ష్నాలను బట్టి శరీరంలో ఎంపిక చేసిన ప్రత్యేక పాయింట్స్ లో ముఖ్యంగా ముఖం పై ఇది పూర్తిగా సహజమైన చికిత్చ ఈ చికిత్చ వల్ల రక్త ప్రసారం ముఖం పై సజావుగా ఉంటుంది . మీముఖం లో లో అందమైన గ్లో వస్తుంది మీముఖంలో అవయవ నిర్మాణం లేదా ముడతలు కాంతికింద నలుపు ముడతలు లేకుండా ముఖం అందంగా ఉంటుంది .శరీరంలో ఏర్పడే హార్మోన్ల మార్పులు వాతావరణం లో వచ్చే సమస్యలు వయస్సు రీత్యా వచ్చే మార్పులు ముఖంలో శరీర ఆకృతి లో మార్పులు చోటుచేసుకుంటాయి. లేదా మీముఖం వచ్చే గ్లో తేజస్సు తరిగిపోతుంది. నేడు చాలా మంది యువతులు తమ ముఖం అందంగా కనపడడానికి కొన్ని రకాల కొస్మెటిక్స్ వాడడం వల్ల కొన్నిరకాల సైడ్ ఎఫ్ఫెక్ట్స్ వస్తున్నాయి. మేరు మీ ముఖం కాంతి వంతం గా చేసేందుకు వినియోగించిన రసాయానాలవల్ల  మీ ముఖం పై వచ్చిన సైడ్ ఎఫ్ఫెక్ట్స్ వంటి వాటిని నాడీ పతి ద్వారా అక్యు పంక్చర్ కొస్మెటిక్ థెరఫీ సహజమైన థెరఫీ గా పేర్కొన్నారు నిపుణులు .చాలా మంది స్త్రీలు అవాంఛిత రోమాలు పెరగడం పై  శరీరంలో చోటు చేసుకోడానికి  శరీరంలో ఏర్పడే హార్మోన్ మార్పు కారణం  గా నిపుణులు పేర్కొన్నారు .నాడీ పతి ద్వారా అలాంటి సమస్యలకు సహజమైన థెరఫీ ద్వారా హార్మోన్ లలో వచ్చే మార్పులు మీముఖం  పై ఆయిల్ ఫేస్ .లేదా ద్రై స్కిన్ , ముఖం పై మొటిమలు కంటి కింద మచ్చలు ముడతలు తగ్గించడానికి మందులు లేకుండానే చికిత్చ చేయవచ్చని తెలిపారు. మ్యాగ్నెట్ థెరఫీ... ఒక శాస్త్రజ్ఞుడు ఆల్బర్ట్ రాయ్ డేవిస్ చేసిన పరిశోదనలో కొన్ని ఫలితాలు పొజిటివ్ గాను కొన్ని నెగెటివ్ గాను మేగ్నెట్ లో మార్పులు చేశారు. దీని వల్ల వివిధరకాల ప్రభావాలు మనావ జీవితం లో వచ్చే బయో లాజికల్ పద్దతులు ఉన్నాయాని పేర్కొన్నారు.  వాస్తవానికి భూమి ని ఒక మ్యాగ్నెటిక్ గా భావించారు.  ఒక ఇస్ కాంతం లో శక్తి ఉంది . చాలా మందికి ఐస్  కాంతం పై అవగాహన లేనాందువల్లే మానవ శరీరంలో  వివిదారకాల అనారోగ్యాలకి కారణం గా చెప్పవచ్చు.చర్మ సమస్యలు, ఆర్థరైటిస్ మహిళ ల లో వచ్చే నెలసరి సమస్యలు ,రక్త హీనాథ ,ఒళ్ళు నొప్పులు కంటి సమస్యలు, సైనస్, తల నొప్పులు తగ్గాలంటే ఆయా ప్రాంతాల లో నొప్పుల కు వీపు భాగం లో బలామ్ శక్తి నిచ్చేందుకు ఐస్ కాంతానికి తగ్గిచే శక్తి ఉందని నిపుణులు నిరూపించ గలిగామని నిపుణులు స్పష్టం చేశారు. ఇస్ కాంత చికిత్చ ఉపయోగాలు... ఆర్థరైటిస్ .తల నొప్పులు, మైగ్రైన్, నొప్పులు ఒత్తిడి, ఎముకలు విరిగినసరికేయడం , రక్త ప్రసారం మెరుగుపడడం. మీశరీరంలో ఉన్న అరుగుదల వ్యాధులు క్యాన్సర్ నివారణ, నిద్రలేమి, జలుబు,సర్వైకల్, వంటి సమస్యకు ఐస్ కాంతం తో అద్భుతాలు చేస్తున్నామని ఇతర వ్యాధుల నివారణకు ఇతర థెరఫీ లతో పాటు రోగులకు చికిత్స చేస్తున్నారు. ఇందులో సుజోక్ మినీ మ్యాగ్నెట్స్ అంటే చిన్న ఐస్ కాంతం అతికిస్తామని తాత్కాలికంగా శరీరం పై ఆత్మపై పెడతామని.ఇవి అంధికశక్తిని ఇస్తాయని ఈకారణంగానే తీవ్రంగా నోపులు ఉన్నపటికీ తగ్గించగలిగామని ఆదేరకమైన మ్యాగ్నెట్స్ ను మేరీడియన్స్ పై శక్తి నిచ్చి నొప్పిని నివారిస్తుంది.

యోగాతో థైరాయిడ్‌కు అడ్డు కట్ట

థైరాయిడ్ ఎలాంటి వ్యాధి అంటే నేడు ప్రపంచంలో నేడు ప్రతి ఐదు గురిలో థైరాయిడ్ బాధితులు ఉన్నారన్నది వాస్తవం. నేటి పరిస్థితులలో పురుషులకంటే మహిళల లోనే ఈ సమస్య ఎక్కువ చూడవచ్చని ఆరోగ్యనిపుణులు భావిస్తున్నారు. థైరాయిడ్ హార్మోన్ మన శరీరం పనిచేయడం లో కీలకంగా ఉంటుంది.శరీరంలో థైరాయిడ్ హార్మోన్ ఎక్కువైనా తక్కువ అయినా ఆరోగ్యం పై తీవ్రప్రభావం చూపిస్తుంది. థైరాయిడ్ వల్ల వస్తున్న మార్పులు స్పష్టం గా కనిపిస్తాయి. థైరాయిడ్ హార్మోన్ ఇచ్చే సంకేతాలు కొన్ని ఉపచారాలఅవసరం అలా థైరాయిడ్ ను నియంత్రించడం లో యోగా సహకరిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. థైరాయిడ్ లో రకాలు... హైపర్ థైరాయిడ్ -- ఇందులో థైరాయిడ్ చాలా ఎ క్కువ సంఖ్యలో తయారు అవుతుంది.ఈ కారణంగా శరీరంలో బరువు చాలా త్వరగా త్గగ్గిపోతుంది. హైపో థైరాయిడ్ --- ఇందులో థైరాయిడ్ చాలా తక్కువగా సంఖ్యలో తయారు అవుతుంది.దీనికి తోడు పంచేంద్రియాలలో  సమస్యలు ప్రారంభ మౌతాయి. ఊబకాయం,సంతాన లేమి సమస్యలు వేదిస్తాయి. థైరాయిడ్ లక్షణాలు /హార్మోన్ సమస్యలు... థైరాయిడ్ హార్మొన్ నియంత్రణలో లేకపోవడం వల్ల మీ జుట్టు ఊడిపోవడం,మీ కనుబొమ్మలు తగ్గిపోతాయి.రాత్రి అంతా నిద్ర పోయినప్పటికీ పగలు అంతా తీవ్రమైన అలసట అనిపిస్తుంది.బలహీనంగా ఉన్నట్లు అనిపిస్తుంది. లక్షణాలలో భాగంగా.. --కారణం లేకుండానే చింతించడం-ఒత్తిడికి గురికావడం-- --థైరాయిడ్ హార్మోన్ నియంత్రణ లేనికారణం గా ఊబకాయం పెరుగుతుంది.లేదా ఒక్కోసారి బరువు తగ్గిపోతారు. ---మహిళలలో థైరాయిడ్ హార్మోన్ తగ్గడం వల్ల స్త్రీలలో నెలసరి సమస్యలు వస్తాయి. --థైరాయిడ్ కారణం గానే ఎప్పుడూ వేడిగా ఉన్నట్లు అనిపిస్తుంది.చాలా వేడిగా ఉన్నట్లు అనిపిస్తుంది. --థైరాయిడ్ గ్రంధిలో వాపు దీనివల్ల స్వరంలో మార్పు ఉంటుంది. --పైన పేర్కొన్న అంశాలాలో ఏ లక్షణం మీకు కనిపించినా అలస్యం డాక్టర్ ను సంప్రదించండి.డాక్టర్ సూచనలు పాటించండి థైరాయిడ్ నియంత్రణ  చేసుకోండి ఆరోగ్యంగా ఉండండి. ఖర్చులేకుండా సహజ పద్దతుల ద్వారా థైరాయిడ్ నియంత్రించ వచ్చు.దీనిప్రభావం చాలా త్వరగా ఉంటుంది. థైరాయిడ్ సమస్యకు చికిత్స లేదన్నది వాస్తవం కాదు.సమయాను గుణంగా నియంత్రించడం ద్వారా అన్ని సమస్యల మాదిరిగాదీనిని నియంత్రించ వచ్చు ఇతర చికిత్స లో ఖర్చులేకుండా యోగ సాధన ద్వారా థైరాయిడ్ ను నియంత్రించవచ్చు. మన శరీరంలో ఎన్నో రకాల గ్రంధులు ఉంటాయి.శరీరంలో ఒక్కో భాగం ఒక్కొరకం గా పని చేస్తాయి.అందుకోసం అత్యవసరమైన హార్మోన్లు ఉత్పత్తి  చేస్తుంది.థైరాయిడ్ గ్రంధి ఒక చిలక బటర్ ఫ్లై రూపంలో ఉంటుంది.అక్కడ నుంచి థైరాయిడ్ హార్మోన్ ను ఉత్పత్తి చేస్తుంది.అది మన శరీరానికి అవసరం ఒక్క సారి థైరాయిడ్ ఉత్పత్తి ఎక్కువగా తక్కువగా ఉత్పత్తి అవుతూ ఉంటుంది.దీనివల్ల శరీరంలో పనితీరు పై తీవ్ర ప్రభావం చూపుతుంది.దీనిని నియంత్రించేందుకు కొంత సేపు యోగా చేయడం ద్వారా ప్రభావం చూపవచ్చని నిపుణుల విశ్లేషణ అసలు ఎలాంటి ఆసనాలు వేయాలి వాటివల్ల ప్రయోజనం ఏమిటో చూద్దాం. సర్వాంగ ఆసనం... సర్వాంగ ఆసనం థైరాయిడ్ ని నియంత్రించడం లో చాలా ప్రభావ వంత మైన అసనంగా పేర్కొన్నారు.దీనివల్ల పైన పేర్కొన్న అంశాలలో రక్త ప్రసారం సరైన పద్దతిలో జరుగుతుంది.ఈ ఆసనం సాధన చేయడం ద్వారా థైరాయిడ్ గ్లాండ్ యాక్టివ్ అవుతుంది.దానిపని తీరు మెరుగు పడుతుంది. హలాసనం... హలాసనం ద్వారా థైరాయిడ్ పిట్యుటరీ గ్రంధుల పనితీరు మెరుగు పడుతుంది.ఆసనం వల్ల మన శరీరం లో ముఖ్యంగా వెన్నుపూసలోని మెరుగు పాడేందుకు ఉపయోగ పడుతుంది.దీనితోపాటు పొట్ట పెరగడాన్ని చాలా ఫలప్రదంగా ఉపయోగ పడుతుంది.ఈ ఆసనం సాధన చేయడం ద్వారా మాంసం కండరాలు పై ఒత్తిడి తగ్గుతుంది. మస్చ్య ఆసన... వెనుక వైపుకు ఒంగే ఈ ఆసనం గొంతు,చాతి,భుజాలు,పొట్ట ను పెంచుతుంది.లేదా తెరుస్తుంది.యోగాలో వేసే ఈముద్ర పొట్ట శరీరం పై భాగాలను యాక్టివ్ చేస్తుంది. అవిసక్రమంగా తమ పని చేసుకుపోతాయి.' విపరీత కారిణీ... ఈ ఆసనం వల్ల లాభాలు ఏమిటి అంటే సర్వాంగ ఆసనం లాగానే ఉంటుంది.ఇందులో కూడా పొట్ట పైకి తల క్రిందికి ఉంటుంది.ఆసనం సాధన చేస్తున్నప్పుడు మనం వీపుతో పాటు గొంతు ఒత్తిడి పెరుగుతుంది.ఆసనం వేస్తున్నప్పుడు మనం వీపుతోపాటు గొంతు పై ఒత్తిడి పెరుగు తుంది.దీనివల్ల థైరాయిడ్ గ్రంధి యాక్టివ్ గా ఉంటుంది. ప్రపంచ థైరాయిడ్ దినోత్సవం సందర్భంగా థైరాయిడ్ ను నిర్లక్ష్యం చేయవద్దని సరైన వైద్యం తో పాటు సాంప్రదాయ యోగాసధనాల ద్వారా థైరాయిడ్ కు అడ్డకట్ట వేయవచ్చని నిపుణులు 

గుండె మీద గుదిబండ హైపర్ టెన్షన్!

మనిషిలో ఆందోళన, గందరగోళం, కంగారు ఎక్కువైనప్పుడు చోటు చేసుకునే పరిస్థితి హైపర్ టెన్షన్. హైపర్ టెన్షన్ అనేది  జబ్బు కాకపోవచ్చు కానీ ఇది చాలా జబ్బులకు దారి తీస్తుంది. మరీ ముఖ్యంగా ఇది  గుండె జబ్బులకు కారణం అవుతుంది! ఈ మధ్య కాలంలో గుండెపోటు వచ్చిందనే విషయం మనం చాలా ఎక్కువగా వింటుంన్నాం. ఇంతకూ గుండెపోటు ఎందుకు వస్తుంది?? ఎలా వస్తుంది?? అన్ని అవయవాలకు రక్తం సరఫరా చేయడానికి రక్తనాళాలు ఉన్నట్లే గుండెకి రక్తం సరఫరా చేయడానికి 'కరోనరి ఆర్టెరీ' అనే ధమని వుంటుంది. దీంట్లో అడ్డం ఏర్పడితే గుండెకి రక్తం సరఫరా సరిగ్గా జరగదు. దాంతో ఆ భాగం ఆహారం అందక నశిస్తుంది. గుండె, మెదడు కండరాలలోని కణాలు ఒకసారి మరణిస్తే వాటి స్థానంలో మిగతా అవయవాలలోలా క్రొత్తవి ఉత్పత్తి కావు. అందుకని ఒకసారి నష్టం జరిగితే అది శాశ్వత నష్టమే! గుండె కండరాలు దెబ్బతినే సరికి గుండె కొట్టుకోవడం హఠాత్తుగా ఆగిపోతుంది. ఇదే గుండెపోటు రావడం గుండె ఆగితే ఇక ప్రాణం పోయినట్లే.. రక్తప్రసరణ మెదడులోని భాగాలకి సరిగ్గా జరగకపోవడం వల్ల ఆ భాగాలు దెబ్బతిని క్రమంగా మనిషి చనిపోయే అవకాశం ఉంటుంది. లేకపోతే అధిక రక్తపోటువల్ల మెదడులోని అతి సన్నని రక్తనాళాల చివర్లు చిట్లి సెరబ్రల్ హెమరేజ్ కలగవచ్చు. ఈ రక్తపోటు వయసు, జాతిల మీద కూడా ఆధారపడి వుంటుంది. మగవాళ్ళలోను, వృద్ధులలోను ఈ అధిక రక్తపోటు ఎక్కువగా కనిపిస్తుంటుంది. కాబట్టి 40 సంవత్సరాల వయస్సు వచ్చినప్పటినుంచి రక్తపోటు పరీక్షించి, తగు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. రక్తపోటు పెరగడం వల్ల మూత్రపిండాలు కూడా దెబ్బ తింటాయి. ఒక్కోసారి మూత్రపిండాలకు సరిగా రక్తం అందనప్పుడు, అవి రక్తపోటు పెరగడానికి రెవిన్ అనే పదార్థాన్ని ఉత్పత్తి చేసి రక్తంలో కలుపుతాయి. కాబట్టి మూత్ర పిండాలలోపం వల్ల రక్తపోటు పెరుగుతుంది. శరీరబరువు పెరగకుండా జాగ్రత్తపడుతుండాలి. ముఖ్యంగా నలభై ఏళ్ళ తర్వాత! ప్రతి కిలో బరువు పెరుగుదలకి గుండె రోజుకి 300 కి.మీ. దూరం ఎక్కువగా రక్తనాళాల ద్వారా రక్తాన్ని ప్రసరింపజేయాల్సి వుంటుంది. అంటే పెరిగే బరువునిబట్టి గుండెమీద భారం పెరుగుతుందన్నమాట! కాబట్టి బరువు తగ్గడం అవసరం!! ఉప్పు, కారం తగ్గించాలి. పొగ త్రాగడం మానాలి. పొగ త్రాగడం వల్ల కూడా రక్తపోటు పెరుగుతుంది. పొగ త్రాగడం వల్ల 80 నుంచి 120 మి.గ్రా. నికోటిన్ ప్రతిరోజు రక్తంలో చేరుతుంది. ఇది ఆర్టెరీస్ ముఖ్యంగా కాళ్ళలో, చేతుల్లో మూసుకుపోయేటట్లు చేస్తుంది. అలాగే గుండె కొట్టుకోవడాన్ని నిముషానికి 72 సార్లు నుంచి 80 సార్లకి పెరిగేలా చేస్తుంది. ఇలా గుండెమీద భారం పెరుగుతుంది!  కేవలం పొగ త్రాగడం వల్ల మాత్రమే కాదు, మద్యం సేవించడం వల్ల కూడా గుండెకు ముప్పు పొంచి ఉంటుంది.  పైన చెప్పుకున్నవన్నీ మొదట రక్తపోటుకు కారణం అయ్యి అది కాస్తా హైపర్ టెన్షన్ కు దారితీసి గుండె పనితీరు మీద దెబ్బ కొడుతుంది. అందుకే గుండె పనితీరు చక్కగా ఉండాలంటే హైపర్ తేనైన్ కు, రక్త పోటుకు దూరంగా ఉండాలి.                                      ◆నిశ్శబ్ద.

నిలబడి నీళ్ళు తాగితే ప్రమాదమా ?

మన పెద్దవాళ్ళు ఒక సామెత చెప్పిన విషయం గుర్తుకు వస్తుంది. అదే పరుగెత్తి పాలు తాగే కన్నా నిలబడి నీళ్ళు తాగడం మంచిది అని అనేవాళ్ళు.ఇప్పుడు నిలబడి నీళ్ళు తాగితే ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.నిలబడి నీళ్ళు గడగడా తాగడం మంచిది కాదని నాలుగు రకాల అనర్ధాలు వస్తాయని అంటున్నారు నిపుణులు.నీళ్ళు మన జీవితానికి ఎంత అవసరమో మనందరికీ తెలుసు. నిలబడి నీళ్ళు ఎలాతగాలో చాలా తక్కువమందికి మాత్రమే తెలుసు.అంటే నిలబడి నీళ్ళు తాగడం వల్ల వచ్చే అనర్ధాలు అందరికీ తెలియదు. మరి నీళ్ళు తాగే సరైన పద్ధతి ఏమిటి. అసలు నీరు తాగడం కూడా అంతే ప్రాధాన్యత ఉంది.అసలు విషయానికి వస్తే నీళ్ళు తాగే టప్పుడు నిలబడి తాగడం ఒక అలవాటుగా మారిందిఅసలు నిలబడి నీళ్ళు తాగితే ఎలాహాని కలుగుతుంది సమస్యలు వస్తాయి వాటి గురించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. నిలబడి నీళ్ళు తాగడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్... ఊపిరి తిత్తులకు నష్టం కలిగిస్తుంది... మీరు నిలబడి నీళ్ళు తాగినప్పుడు అత్యవసరమైన పోషక తత్వాలు విటమిన్లు లివర్ పంచేంద్రియాలను చేరవు జారుగా ఉండే పదార్ధాలు అతి త్వరగా కరిగిపోతాయి అది మీ ఊపిరి తిత్తులు గుండెకు తీవ్ర నష్టం సంభవిస్తుంది ఆక్సిజన్ స్థాయిలో సమస్యలు వస్తాయి. జీర్ణ సమస్యలు.. మీరు తీసుకున్న ఆహారం ఒక్కోసారి అరుగుదల లేకపోవడం మీఆహారాం పోట్టలోనే చెడి పోవడమే అవకాశం ఉంటుంది.నిలబడి నీళ్ళు తాగడం వల్ల పంచేంద్రియాలకు తీవ్ర నష్టం జరుగుతుంది. మనం నీళ్ళు తాగేటప్పుడు త్వరిత గతిన అన్నవాహిక గుండా పోట్ట కింది భాగం లో కి చేరుతుంది. ఇది మీ కు తీవ్ర హాని కలిగిస్తుంది నిలబడి గటగటా నీల్లుతాగడం వల్ల నరాలు ఒత్తిడికి గురి కావడం మృదువైన మెత్తటి పదార్దాలు లేదా శరీరంలోని సున్నితమైన భాగాలు పట్టుకోల్పోతాయి.టాక్సిన్స్ చేరి అరుగుదలలో సమస్యలు మార్పులు వస్తాయి. కిడ్నీకి సంబందించిన సమస్యలు... మనం నిలబడి నీళ్ళు తాగినప్పుడు మనకిడ్నీ ఆసమయం లో ఒక పద్ధతి ప్రకారం ఫిల్టర్ చేస్తుంది. మనం కూర్చుని నీళ్ళు తాగినప్పుడు,నిలబడి నీళ్ళు తాగినప్పుడు మెత్తటి పదార్ధాలు ఒక్కోసారి ఫిల్టర్ కాకుండానే పోట్టకింది భాగం లోకి చేరుతుంది. నీటిలో ఉన్న మలినాలు మూత్రాశయం లోకి చేరి మూత్రపిండాలు కిడ్నీ చేసే పని పై ప్రభావం చూపుతుంది. యురినరీ ట్రాక్ కు సంబంధించి అనారోగ్య సమస్యలు వస్తాయి. గట్టి పడే ప్రమాదం ఉంటుంది... మీరు నిలబడి నీళ్ళు గడగడా తాగేస్తే మీ ముక్కు నాసికా రంద్రాలలో ఒక్కోసారి నీరు చేరి శ్వాస నాళం లేదా ఇతర భాగాల్ పైన ఒత్తిడి పెరిగి మెత్తటి పదార్ధాలు ఒక్కోసారి శరీరం లోని మెత్తటి భాగాలు గట్టిగా మారడం మెత్తటి పదార్ధాలు పట్టుకోల్పోతాయి శరీరంలో టాక్సికేంట్స్ జీర్ణ వ్యవస్తలోమర్పులు వస్తాయి చెడు పదార్ధం లేదా విష పదార్ధం పేరుకు పోతుంది. మన జాయింట్స్ లో ఉండే మెత్తటి పదార్ధాలు చేరుతాయి  ఈ కారణంగా గట్టిగా మారిపోతుంది దీనివల్ల ఒక్కోసారి ఎముకలకు నష్టం కలుగుతుంది. మరి నీళ్ళు తాగే సరైన పద్దతులు ఏమిటి ?... నిపుణుల సూచనల ప్రకారం నీళ్ళు ఎలా తాగాలి కూర్చుని తాగాలి. కుర్చీపై కూర్చుని మీవీపును నిటారుగా ఉంచి నీళ్ళు తాగాలి దీనివల్ల పోషక పదార్ధాలు మెదడును చేరుతాయి మెదడు పనితీరులో క్రమబద్దీ క రిమ్పబడతాయి అంతే కాదు పంచేంద్రియాల పనితీరు మెరుగు పడుతుంది పొట్టలో వాపు పోట్టపెరగడం వంటి సమస్యలు రావు.  .   

డేంజర్ బెల్స్ కొట్టే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్!

మూత్రపిండాల నుండి విసర్జింపబడే మూత్రము మూత్రనాళము, మూత్రాశయం ద్వారా మాత్రమే బయటకు విసర్జింపబడుతుంది. ఈ మూత్ర అవయవాలు చాలా తరచుగా ఇన్ఫెక్షన్ గురవుతుంటాయి. కొన్నిసార్లు మూత్ర అవయవాల్లో రాళ్ళు, లేదా పోస్ట్రేట్ గ్రంథి వాపు వలన మూత్రనాళాల దారి సంకోచించి ఇన్ ఫెక్షన్ వస్తుంటుంది. అలాంటపుడు ఆ సమస్యను పరిష్కరించవలసి వుంటుంది. మూత్రనాళాలు ఇన్ఫెక్షన్కు గురికాకుండా మూత్రము ఆమ్ల లక్షణాన్ని కలిగి వుంటుంది. దేహరక్షణ వ్యవస్థ పటిష్టంగా వున్నంతకాలం ఏ ఇన్ఫెక్షన్ సోకదని గుర్తుంచుకోవాలి.  ఇన్ఫెక్షన్లో అక్యూట్ మరియు క్రానిక్ అని రెండు రకాలు. అక్యూట్ రకంలో ఇన్ఫెక్షన్ అకస్మాత్తుగా వచ్చి కొన్ని రోజులు బాధ పెట్టి, పూర్తిగా నయమవుతుంది. కొన్ని యాంటీ బాక్టీరియల్ మందులతో వ్యాధి ఆగుతుంది. కొన్నిసార్లు అదే ఇన్ఫెక్షన్ అశ్రద్ధ చేసినట్లయితే క్రానిక్ అవుతుంది.  యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ లో లక్షణాలు:-  మూత్రం పోసే టప్పుడు మంట రావటం, మూత్రం సాఫీగా రాక కొద్ది కొద్దిగా రావటం, నొప్పి కడుపు వరకు పాకినట్టవటం జరుగుతుంది. మూత్రం కొద్దిగా పసుపు పచ్చగా లేదా ఎరుపు రంగుగా రావచ్చు. ఇన్ఫెక్షన్ మోతాదు మించినట్టయితే పెద్ద పెట్టున, చలిజ్వరం రావటం, వణకటం వుంటాయి. వ్యాధి లక్షణాలు సేకరించి, మందును ఎంపిక చేసి వాడినట్టయితే అక్యూట్ యురినరీ ఇన్ఫెక్షన్ పూర్తిగా నయమవుతుంది. నీరు అధికంగా తీసుకోవాలి. క్రానిక్ ఇన్ఫెక్షన్ పూర్తిగా తగ్గించటానికి కొంత సమయం పడుతుది. ఇది ముఖ్యంగా 'గోనోకోకల్ ఇన్ఫెక్షన్' వల్ల వస్తుంది. ఇన్ ఫెక్షన్ క్రానిక్ అయినపుడు మూత్రనాళంలో స్ట్రిక్చర్స్ ఏర్పడుతాయి. మూత్రనాళంలోని జిగురు పొర కలసిపోయి మూత్రనాళం లోపలి పరిమాణం తగ్గుతుంది. మూత్రం పోసే దారి సన్నగా మారి మూత్రం పోసేటప్పుడు రోగి కడుపు కండరాలతో వత్తిడి చేయవలసి వుంటుంది. కొన్నిసార్లు మూత్రం ధార చీలినట్టుగా వస్తుంది. స్ట్రక్చర్ పెద్దదయినట్టయితే మూత్రనాళం పూర్తిగా మూసుకుపోయి మూత్ర విసర్జన ఆగిపోతుంది. మూత్రాశయం ఉబ్బుతుంది. ఆ పరిస్థితుల్లో శస్త్ర చికిత్సచేసి మూత్రాశయ ద్వారం తీయవలసి వుంటుంది. ఇన్ఫెక్షన్ ప్రారంభ దశలో వున్నప్పుడే మందులు వాడినట్టయితే ఇన్ఫెక్షన్ పూర్తిగా నివారించుకోవచ్చు. స్ట్రక్చర్లు ఏర్పడితే కూడా దీర్ఘకాలిక మందులను ఎంపిక చేసి వాడినట్టయితే శస్త్ర చికిత్స అవసరం లేకుండా నయం చేసుకోవచ్చు. క్రానిక్ ఇన్ఫెక్షన్  పూర్తిగా నయం చేయటంలో కొంత సమయం పడుతుంది. ప్రోస్ట్రేట్ గ్రంథి ఇన్ఫెక్షన్ కు గురవటం వలన, లేదా వాపు వలన కూడా మూత్రం ఆగిపోవటం, ఇన్ఫెక్షన్ రావటం జరుగుతుంది. ముఖ్యంగా 60 ఏళ్ళు పైబడినవారిలో ప్రోస్ట్రేట్ గ్రంథి వాపు రావటం జరుగుతుంది. దీనికి కాథటరైజేషన్ చేస్తుంటారు. తాత్కాలికంగా నయమనిపించినా మళ్ళీ మూత్రనాళం సంకోచిస్తుంది. ప్రోస్ట్రేట్ గ్రంథిలో ఒక్కొక్కసారి క్యాన్సర్ కూడా వస్తుంది. తగిన పరీక్షలు చేయించుకుని క్యాన్సర్ కణాలు వున్నాయో లేదో నిర్ణయించవలసి వుంటుంది. ఇన్ని ప్రమాదాలు ఉంటాయి కాబట్టే.. ఇన్ఫెక్షన్ల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి.                                   ◆నిశ్శబ్ద

ఆకలి కావడం లేదా?? అయితే ఇదిగో పరిష్కారాలు..

మనిషిని నిత్యం వేధించే సమస్య ఆకలి. ఇది పూట పూటకు పుడుతుంది. దాన్ని తృప్తి పరచకపోతే మనిషి శరీరాన్ని బాధకు గురిచేస్తుంది. అయితే కొందరిలో ఈ ఆకలి అధికంగా ఉంటుంది. ఎంత తిన్నా కొద్దిసేపటికే ఆకలి మొదలవుతుంది. దీనివల్ల అధికబరువు, మధుమేహం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. ఇకపోతే ఆకలి లేకపోవడం అనేది మనుషుల్ని హింసించే సమస్య. ఇలా ఆకలి లేకపోవడం వల్ల శరీరానికి తగినంత శక్తి, పోషకాలు, అవసరమైన విటమిన్లు మొదలైనవి లభించక పోషకాహార లోపంతోను, బలహీనత తోనూ ఇబ్బంది పడతారు.  ఆకలి తగ్గిపోవడం అనే సమస్య రావడానికి అనేక కారణాలతో ఉంటాయి. ఫ్యాట్స్ ఎక్కువగా వున్న ఆహారపదార్ధాలను అతిగా తినడం, ప్యాక్ చేసిన పదార్థాలు,  రెడి టూ ఈట్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్ మొదలైనవి తీసుకోవడం వల్ల ఆకలి తగ్గిపోతుంది. అలాగే  కొన్ని జీర్ణాశయ, జీర్ణవాహికల వ్యాధులలోనూ ఆకలి లేక పోవచ్చును. కాబట్టి "ఆకలిలేదు!” అని అనుకొనేవారు. ముందుగా అన్ని వైద్యపరీక్షలు చేయించుకోవాలి. ఏదైనా వ్యాధి ఉన్నట్టు నిర్ధారణ అయితే వైద్యుల సూచనల ప్రకారం ట్రీట్మెంట్ తీసుకోవాలి. అదే ఎలాంటి వ్యాధి లేదని నిర్ధారణ అయితే ఆహారం తీసుకోవడం, లైఫ్ స్టైల్ వంటి విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.  భోజనానికి అరగంట ముందుగా కొద్దిగా అల్లం రసం తాగితే బాగుంటుంది, ఒకవేళ అల్లం అందుబాటులో లేకపోతే వాము కొద్దిగా  నమలి తిన్నా మంచి ప్రయోజనమే. ఇవి రెండూ ఆకలిని పెంచుతాయి. అలాగే జీర్ణాశయాన్ని శుద్ధి చేస్తాయి. చాలమందికి టీ.. కాఫీ.. లాంటివి గంటకు ఒకసారి, పూటకు ఒకసారి తీసుకోవడం బాగా అలవాటు. అలాంటి అలవాటు ఉన్నవారు దాన్ని తగ్గించుకోవాలి. అదేవిధంగా తీపి పదార్థాలు తినడం అంటే కొందరికి చెప్పలేనంత ఇష్టం. వాటిని కూడా తగ్గించుకోవాలి. ఇవి ఆకలి మీద చాలా దారుణమైన ప్రభావాన్ని చూపిస్తాయి. అలాగే జీర్ణాశయ గోడలను బలహీనం చేస్తాయి. ఏ అనారోగ్యం వచ్చినా, ఏ డాక్టర్ దగ్గరకు వెళ్లినా, మన పెద్దలు అయినా చెప్పేది ఒకే మాట. సమయానికి తినాలి అని. ఆకలి లేదు అని వంకతో ఆహారం తీసుకోవడం అస్తవ్యస్తం అయితే అది అలాగే అలవాటుగా మారిపోయి జీర్ణశయాన్ని అస్తవ్యస్తం చేస్తుంది. అలాగే ఆకలి లేకపోయినా.. సమయాన్ని చూసుకుని అధికంగా పొట్టలోకి వేయకూడదు. మితంగా ఆహారం తీసుకుంటూ ఉంటే ఆకలికి అదే ఒక మంచి ఔషధంగా మారుతుంది.  ఆహారంలో అన్నం ఎక్కువ ఉండకూడదు. అన్నం తక్కువ, పెరుగు, ఆకుకూరలు, కాయగూరలు,  పీచుఎక్కువగావున్న పదార్థాలను అధికముగా తీసుకొంటూ ఉండాలి. ఇలా చేస్తే జీర్ణక్రియ బాగా జరుగుతుంది, ఆకలి కూడా సమయనికి తగ్గట్టు అవుతుంది.  వేపుడులు, మసాలా పదార్థాలు, ఫ్యాట్ ఎక్కువగా ఉన్నవి, నూనె అధికంగా ఉన్నవి తీసుకోకూడదు. అవి జీర్ణాశయనికి చేటు చేస్తాయి.  పై జాగ్రత్తలతో పాటుగా.... అవసరమైతే వైద్య సల హాల ప్రకారము జీర్ణశక్తికి ఉపకరించే కొన్ని “టానిక్స్” వాడవచ్చు. ఆకలి దగ్గర మాత్రం నిర్లక్ష్యం చేయకండి.                                      ◆నిశ్శబ్ద.  

బరువు చెప్పే బండెడు నిజాలు!

ఈకాలంలో అధికశాతం మందిని వేధిస్తున్న సమస్య అధిక బరువు. మనలో చాలామంది కేజీల కొద్ది బరువు పెరగడం చాలా సులభం. కానీ అదే బరువును తగ్గించుకోవాలంటే చాలా శ్రమపడతారు. పైనున్న తాతలు దిగిరావాలి ఈ బరువు తగ్గాలంటే.. అన్నంత కష్టతరంగా ఫీలవుతారు. అయితే  బరువుకు ఆహారానికి పెద్ద సంబంధమే ఉంది. మనం రోజుకు ఎంత తింటున్నాం?? రోజుకి మనకెన్ని కేలరీలు అవసరమవుతాయి??  ఈ ప్రశ్నకు జవాబు కోసం చాలామంది ఎంతో వెతుకుతూ ఉంటారు. అయితే దీనికి సమాధానం మనం రోజూ చేసే పని ఎటువంటిది??  మన  వయస్సు ఎంత, మన శరీర వ్యవస్థ ఎలాంటిది వంటి  అనేక విషయాల మీద ఆధారపడి ఉంటుంది. అంటే తీసుకునే ఆహారం ఎప్పుడూ చేసే పని, శరీర వ్యవస్థను బట్టి ఉండాలి.  కాయకష్టం చేసే వడ్రంగికి రోజుకి 5,000 కేలరీల అవసరం కావచ్చు. పని సవ్యంగా నడవటానికి అతడు పుష్టిగా తినాలి. మరోవంక చూస్తే, రోజంతా ఓ టేబుల్ ముందు కూర్చుని పని చేసే ఉద్యోగికి రోజుకు 2,200 కేలరీలే కావలసి వుంటుంది. అలాగే రోజంతా ఇంటి చాకిరితో సతమతమయ్యే అతని భార్యకు 2,500 కేలరీల అవసరమై వుంటుంది. అదే ఒక ఆఫీస్ పక్కకు కదలకుండా పనిచేసే ఉద్యోగికి  రోజూ 1,800 కేలరీలు అయినా సరిపోతాయి.   ఈ కేలరీల కథ అంతా, మనం ఎంత చురుకుగా వున్నామనే దాన్ని బట్టి వుంటుంది. పాతికేళ్ళ వయసులో సామాన్యంగా ఎటువంటి ఇబ్బందీ లేకుండానే మనం కేలరీలను సులభంగా కరిగించెయ్యగలుగుతాము. కానీ ముప్పై ఐదేళ్ళప్పుడు పరిస్థితిలో మార్పు ప్రారంభమవుతుంది. అప్పుడు మనలో చురుకుపదనం తక్కువ. ఎక్కువ సేపు కూర్చుంటాం. వీలయినంత వరకూ ఒళ్లు అలసటకు గురికాకుండా వుండేందుకు అనువుగా శ్రమలేని జీవితాన్ని గడపడానికి, రోజులో పనులు సులభతరం చేసే  పరికరాలను వుపయోగిస్తూ వుంటాము. అందుకు తగినట్టుగా మన పనికి అవసరమైన తిండి ఎంత సరిపోతుంది అని మనమే చూసుకోవాలి. అంతేకానీ, ఇతరులు అలా ఉంటున్నారు, అది ఫాలో అవుతున్నారు అని వాటిని పట్టుకుని వేలాడకూడదు.. ఒక వ్యక్తి బరువులో మార్పు కలిగించే పరిస్థితులు ఇంకా ఏమైనా వున్నాయా అని ఆలోచిస్తే..  నిశ్చయంగా వున్నాయని మనకు స్పష్టమవుతోంది. చర్మం క్రింద వున్న ధాతువులలో నీరు చేరడం వల్ల బరువు ఎక్కువ కావచ్చు. ఉదాహరణకు - గుండె పనితీరు తప్పినప్పుడు దానికి గురుతుగా కాళ్లూ, ఇతర అవయవాలూ వాపు కనిపించవచ్చు. ఇలానే కొన్ని రకాల మూత్ర పిండపు వ్యాధులు కూడా. ఈ లోపాలున్న వ్యక్తులు ఉప్పు అధికంగా వాడకూడదు. అయితే, సామాన్యంగా చాలామంది బరువెక్కడానికి కారణం ఇదికాదు. అసలు విషయం, ఎక్కువగా తినడమే. తామేమీ ఎక్కువ తినడం లేదని అంటుంటారు. కానీ చేస్తున్న పనికి మించి ఎక్కువ తింటేనే బరువు పెరుగుతారు.   ఏది ఏమైనా సరే.. మీ బరువు ఎక్కువగా  వున్నట్టయితే మీకొక హెచ్చరిక చెయ్యాలిప్పుడు.  ఇరవై సంవత్సరాలకు పైగా అధిక క్రొవ్వును ఇలా మోసుకు తిరుగుతూ వుంటే, తరువాత జీవిత దశలో, ఈ శ్రమాధ్యికం వల్ల గుండె, మూత్రపిండాలు పని చెయ్యకపోవచ్చు. వాటికి సంబంధించిన జబ్బులు సులువుగా రావచ్చు.  కాబట్టి అధిక బరువు అత్యంత ప్రమాదకరం అన్నమాట ఎన్నటికీ మరువకూడదు. ఇప్పటికైనా బరువు చెప్పే నీతులు కాస్త వినండి.                                    ◆నిశ్శబ్ద.