పురుషుల్లో థైరాయిడ్ సమస్యను ఎలా గుర్తించాలి? దాని ప్రభావం ఎలా ఉంటుంది..

సాధారణంగా థైరాయిడ్ సమస్యతో మహిళలు ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయితే అయితే పురుషులకు కూడా ఈ సమస్య ఉంటుందని మీకు తెలుసా? పురుషులలో థైరాయిడ్ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. హైపర్ థైరాయిడిజం అనేది మీ థైరాయిడ్ గ్రంథి మీ శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ థైరాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. దీనిని "హైపర్ థైరాయిడిజం" అని కూడా అంటారు. సకాలంలో చికిత్స చేయకపోతే, ఇది మీ గుండె, కండరాలు, స్పెర్మ్ నాణ్యతను ప్రభావితం చేస్తుంది. ఈ హైపర్ థైరాయిడిజం సాధారణంగా నియంత్రణలో ఉంచుకోవడానికి మందులు అవసరం. కాబట్టి పురుషులలో థైరాయిడ్‌కు ఎలాంటి చికిత్సలు అందించవచ్చో చూద్దాం. పురుషులలో హైపర్ థైరాయిడిజం యొక్క కారణాలు:  గ్రేవ్స్ వ్యాధి పురుషులలో హైపర్ థైరాయిడిజంకు కారణమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.  గ్రేవ్స్ వ్యాధి  ఆరోగ్యకరమైన థైరాయిడ్ గ్రంధిపై  దాడి చేయడం వల్ల వస్తుంది. దీని వల్ల థైరాయిడ్ హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఎక్కువమొత్తంలో అయోడిన్, దుష్ప్రభావాలను కలిగించే మందులను తీసుకోకుండా ఉండాలని సలహా ఇస్తారు. కాబట్టి పురుషులలో థైరాయిడ్ లక్షణాలను ఎలా గుర్తించవచ్చు? -బరువు తగ్గడం లేదా పెరగడం. -క్రమరహిత హృదయ స్పందన -భయం -చిరాకు -అలసట -వేళ్లు, చేతులు వణకడం -చెమటలు -కండరాల బలహీనత -జుట్టు ఊడుట పురుషులు, మహిళలు సాధారణంగా ఈ హైపర్ థైరాయిడిజానికి సంబంధించి  ఒకే విధమైన లక్షణాలను కలిగి ఉన్నప్పటికీ, పురుషులను మాత్రమే ప్రభావితం చేసే కొన్ని ప్రధాన సమస్యలు ఉన్నాయి. అవి, -అంగస్తంభన లోపం -తక్కువ స్పెర్మ్ కౌంట్ -అకాల బట్టతల -లైంగిక ఆరోగ్యంపై ప్రభావం ఈ థైరాయిడ్ హార్మోన్లు పురుషుల వృషణాలలోని కొన్ని కణాల పనితీరును ప్రభావితం చేస్తాయి. హైపర్ థైరాయిడిజం స్పెర్మ్ కణాలను ప్రభావితం చేస్తుంది. ఇది స్పెర్మ్ సాంద్రత, చలనశీలతను తగ్గించడమే కాకుండా, స్పెర్మ్ యొక్క అసలు ఆకారం లేదా రూపాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. అంగస్తంభన పనితీరును ప్రభావితం చేయవచ్చు.వంధ్యత్వానికి కారణం కావచ్చు.తక్కువ స్పెర్మ్ కౌంట్ దారితీస్తుంది. థైరాయిడ్‌కు మందులు, శస్త్రచికిత్స ద్వారా చికిత్స చేయవచ్చు. స్త్రీలు లేదా పురుషులు సంవత్సరానికి ఒకసారి థైరాయిడ్ పరీక్ష చేయించుకోవాలని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. అదనంగా, ఆరోగ్యకరమైన ఆహారం, రోజువారీ వ్యాయామం శరీరానికి చాలా ముఖ్యమైనవి.

మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా? ఈ ఆకులు ఆహారంలో భాగం చేసుకుంటే సరి..

ఈ రోజుల్లో, ప్రజల జీవన విధానం వేగంగా మారుతోంది. రోజురోజుకూ పెరుగుతున్న పనిభారం,బిజీ షెడ్యుల్ ప్రజల శారీరక, మానసిక ఆరోగ్యంపై  ప్రభావం చూపిస్తోంది. ఈ కారణంగా  చుట్టూ ఉన్న చాలా మంది మానసిక ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్నారు. ఈ రోజుల్లో చాలా మంది ఒత్తిడి, డిప్రెషన్‌కు గురవుతున్నారు. ఇలాంటి  పరిస్థితిలో ఆరోగ్యాన్ని సరిగ్గా చూసుకోవడం చాలా ముఖ్యం.  అలవాట్లు  జీవనశైలితో పాటు,  ఆహారం కూడా మన ఆరోగ్యంపై గొప్ప ప్రభావాన్ని చూపుతుంది. అందుకే ఆహారంలో సరైన మార్పులు చేయడం ద్వారా శారీరకంగానే కాకుండా  మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుచుకోవచ్చు.  కొన్ని సహజ మూలికలను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవచ్చు. అశ్వగంధ అశ్వగంధలో చాలా  అద్భుత లక్షణాలు ఉంటాయి. ఇది అనేక సమస్యలకు  దివ్యౌషధంగా పనిచేస్తుంది.  దీనిని సాధారణంగా ఇండియన్ జిన్సెంగ్ అంటారు. అనేక ఆరోగ్య సంబంధిత సమస్యల నుండి ఉపశమనాన్ని అందించడమే కాకుండా, మెదడు పనితీరును పెంచడంలో కూడా ఇది సహాయపడుతుంది, ఇది  మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడం ద్వారా డిప్రెషన్ ను తగ్గిస్తుంది. మానసిక ఒత్తిడికి లోనయ్యేవారు అశ్వగంధ చూర్ణం లేదా అశ్వగంధ టాబ్లెట్స్ తీసుకోవచ్చు. బ్రహ్మి లేదా సరస్వతి..  బ్రహ్మి  మానసిక ఆరోగ్యానికి  చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది మానసిక ఆరోగ్య సమస్యలు లేదా అనారోగ్యాలకు చికిత్స చేయడంతోపాటు దైనందిన జీవితంలోని ఒత్తిళ్లను ఎదుర్కోవడానికి శక్తివంతమైన మూలిక.  బ్రాహ్మీ టీ తీసుకోవచ్చు. పసుపు.. అనేక ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న పసుపు , ఎన్నో ఏళ్ళ నుండి అనేక ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయడంలో ఉపయోగిస్తున్నారు.  జలుబు, దగ్గు లేదా ఏదైనా గాయం ఇలా ఏదైనా సరే  పసుపు అన్నింటికీ దివ్యౌషధం. వీటన్నింటితో పాటు ఇది  మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే సహజ నివారణ. పసుపు పాలు తీసుకుంటే ఒత్తిడి తగ్గుతుంది. తిప్పతీగ.. దీనినే గుడుచి అని కూడా అంటారు. తిప్పతీగ చాలా కాలంగా అనేక సమస్యలకు ఆయుర్వేదంలో ఉపయోగించబడుతున్నప్పటికీ, కరోనా కాలం నుండి  ప్రజాదరణ మరింత పెరిగింది. రోగనిరోధక శక్తిని పెంచే ఈ మూలిక డిప్రెషన్ చికిత్సలో చాలా సహాయపడుతుంది. అంతేకాకుండా ఇది ఒత్తిడిని తగ్గించడంలో,  జ్ఞాపకశక్తిని పెంచడంలో కూడా సహాయపడుతుంది. తులసి.. హిందూ మతంలో తులసికి చాలా ప్రాముఖ్యత ఉంది. మతపరమైన ప్రాముఖ్యతతో పాటు తులసి  ఆరోగ్య ప్రయోజనాల వల్ల  కూడా ప్రసిద్ధి చెందింది. మానసిక ఆరోగ్యం విషయానికి వస్తే, ఇది చాలా ప్రభావవంతమైన మూలికలలో ఒకటి. ఇది మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది.                                                           *నిశ్శబ్ద.  

ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. రెండు నిమిషాలలో కడుపు ఉబ్బరం అంతా తగ్గిపోతుంది..

 తరచుగా అపానవాయువు, బరువు పెరగడం, గ్యాస్, అసిడిటీ, అజీర్ణం, ఉబ్బరం వంటి కడుపు సమస్యలు చాలామంది ఎదుర్కొంటున్నారు. వీటిని అధిగమించానికి చాలామంది జీర్ణశక్తిని పెంచే టాబ్లెట్స్, సిరప్ వంటి వాటిపై ఆధారపడుతుంటారు. కానీ ఇవన్నీ సహజమైన జీర్ణవ్యవస్థను దెబ్బతీసేవే. వీటి వాడకం వల్ల సహజంగా ఆహారం జీర్ణం కాదు.కానీ ఆయుర్వేదం ఈ సమస్యలకు అన్నింటికి మంచి పరిష్కారాలు సూచించింది. అది కూడా ఇంటిపట్టున తక్కువ ఖర్చుతో ఈ సమస్యలు అధిగమించవచ్చు. కడుపు సమస్యలను అన్ని పరిష్కరించడంలో  సొంపు లేదా సోపు చక్కగా సహాయపడుతుంది. అసలు సోపులో ఉన్న ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి? సోపును ఎవరు ఏ విధంగా తీసుకుంటే ఏ సమస్యలు పరిష్కారం అవుతాయి పూర్తీగా తెలుసుకుంటే.. సోపు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు.. సోపు తినడం వల్ల బలం చేకూరుతుంది.  రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది పిత్త దోషం సాధారణంగా  వేడి ఎక్కువ కావడం వల్ల కలుగుతుంది.  అధికవేడి  వల్ల కలిగే రక్తస్రావ రుగ్మతలలో కూడా సోపు ఔషదంగా  ఉపయోగపడుతుంది జీర్ణ శక్తిని పెంచుతుంది.  గుండెకు మంచి టానిక్ లాగా పనిచేస్తుంది.  బహిష్టు సమయంలో నొప్పి నుండి ఉపశమనం కలిగించడంలో ఉపయోగకరంగా ఉంటుంది. సోపు నీరు శరీరంలోని ధాతువులపై ప్రత్యేక ప్రభావాన్ని చూపుతుంది, ఇది పాలిచ్చే స్త్రీలలో తల్లి పాలను పెంచుతుంది. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది సోపులోని సాత్విక లక్షణాలు మనస్సును రిఫ్రెష్ చేస్తుంది. తద్వారా  మానసిక ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. ఇది కళ్ళకు రిఫ్రెష్‌గా కూడా సహాయపడుతుంది. శ్వాసకోశ,  ఊపిరితిత్తులలో పేరుకుపోయిన పెరిగిన కఫాన్ని కూడా తగ్గిస్తుంది.  సోపును ఎవరు ఎలా ఉపయోగించాలంటే.. జీర్ణ సమస్యలకు - అసిడిటీ,  పిత్త సమస్యలకు, అర టీస్పూన్ పంచదారతో 1 టీస్పూన్ సోపు విత్తనాలు కలపాలి. ఈ మిశ్రమాన్ని నమిలి తినాలి. బరువు తగ్గడం, దగ్గు, జలుబు, నెలసరి తిమ్మిర్లు, వికారం, కడుపులో నులిపురుగులు వంటి సమస్యల కోసం సోపుతో హెర్బల్ టీని తయారు చేసుకుని తాగాలి.  సోపు టీ  కోసం..  1 టీస్పూన్ సోపును 1 గ్లాసు నీటిలో 3-5 నిమిషాలు ఉడకబెట్టి, ఫిల్టర్ చేసి, సిప్ బై సిప్ త్రాగాలి. మెరుగైన జీర్ణక్రియ కోసం భోజనానికి ఒక గంట ముందు లేదా తర్వాత సోపు టీని త్రాగాలి. 1 గ్లాసు నీటిలో ఒక చెంచా జీలకర్ర, కొత్తిమీర,  సోపు వేసి 5 నిమిషాలు ఉడికించి వడపోసి, సిప్ బై సిప్ త్రాగాలి. ఇలా చేస్తే కేవలం రెండే రెండు నిమిషాలలో కడుపు శుభ్రమవుతుంది.                                                           *నిశ్శబ్ద

బాదం పప్పు తింటే ఎన్ని లాభాలో అనుకున్నాం కానీ ఈ నిజాలు తెలిస్తే..

బాదం పప్పు తినడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రోజూ  బాదంపప్పును రాత్రి నానబెట్టి ఉదయాన్నే తింటె  గుండె ఆరోగ్యంగా ఉంటుంది, మధుమేహం నియంత్రణలో ఉంటుంది, మెదడును చురుగ్గా మార్చుతుంది.  బరువు తగ్గడానికి, బీపీని అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది.  క్యాన్సర్ రాకుండా చేయడంలోనూ, జుట్టు పెరుగుదలలోనూ చర్మాన్ని యవ్వనంగా మార్చడంలో సహాయపడుతుంది. అయినప్పటికీ, బాదం  హానికరం. బాదం పప్పు తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలే కాదు నష్టాలు కూడా ఉన్నాయి. దీనివల్ల  ఎలాంటి నష్టాలు ఉంటాయో తెలుసుకుంటే.. తరచుగా కడుపులో మంట లేదా యాసిడ్స్ ఉత్పత్తి అవ్వడం  గురించి ఫిర్యాదు చేసేవారు,  బాదం తీసుకోవడం తగ్గించాలి, ఇది  సమస్యను మరింత కడుపులో యాసిడ్ సమస్యను మరింత పెంచుతుంది. బాదంపప్పులో ఆక్సలేట్ ఎక్కువగా ఉంటుంది. బాదం పప్పులను ప్రతిరోజూ తీసుకుంటే మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవారికి తీవ్రమైన హాని కలిగిస్తుంది. అందుకే మూత్రపిండాల సమస్య ఉన్నవారు, మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవారు బాదం పప్పుకు దూరంగా ఉండాలి. బాదంపప్పులో పీచుపదార్థం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల బాదం పప్పును ఎక్కువగా తీసుకోవడం లేదా నానబెట్టకుండా   తీసుకోవడం వల్ల కడుపులో భారం అంటే ఉబ్బరం, విరేచనాలు,  పొత్తికడుపు నొప్పి వంటివి కూడా కలుగుతాయి. బాదంపప్పులను ఎక్కువగా తీసుకోవడం వల్ల, ముఖ్యంగా పచ్చి బాదంపప్పులు తీసుకోవడం వల్ల నోటి అలర్జీలు, గొంతు నొప్పి,  పెదవుల వాపు వంటివి ఏర్పడతాయి. అందుకే బాదం పప్పు లిమిట్ గా తీసుకోవాలి. బాదంపప్పులో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఈ  అధిక  పైబర్   శరీరానికి ఇతర ఆహారాల  వల్ల లభించే ఐరన్, జింక్  కాల్షియం వంటి పోషకాలను గ్రహించడంలో ఇబ్బంది కలిగిస్తుంది. ఐరన్ తక్కువైతే శరీరంలో రక్తహీనత ఏర్పడుతుంది. ఇది చాలా రకాల అనారోగ్యాలకు మూలమవుతుంది.                                                           *నిశ్శబ్ద.  

పచ్చి పాలు తాగితే ప్రమాదమా?

పచ్చిపాలు తాగితే చాలా లాభాలు సురక్షితం అనికొందరు.  కాదు కాదు పచ్చిపాలు ఆరోగ్యానికి హానికరం అని ఇంకొందరు అంటున్నారు మరి అందులో నిజం ఏది? అనితేలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే. ఇక వివరాల లోకి వెళ్తే మనం ప్రతిరోజూ పాలు ఎదో రూపం లో వాడుతూ ఉంటాము.మనం ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండేందుకు పాలు లాభదాయకంగా ఉంటుంది. అని అందరూ అంగీకరిస్తారు.మరి మీరు తేల్చుకోవాల్సిన అంశం ఏమిటి అంటే పచ్చిపాలు లాభదాయకమని లేదాపేస్టూ రైజ్డ పాలు లాభమా అన్నది ప్రశ్న. మీరు రోజూ పాలు తాగుతారా ?అయితే ఇది చదవడం అత్యవసరం.పాలు మనం ప్రతిరోజూ ఎదోరూపం లో వాడతాము.అసలు పాలు లేకుండా రోజు గడవడం కష్టం.అంటే పాలు లేకుండా ఉండడం కొంచం కష్టం.మీ ఇమ్యునిటీ నిపెంచడం దగ్గరనుంచి ఎముకలు,పళ్ళు బలంగా ఉండేందుకు మెటాబాలిజం పెంచేందుకు పాలు దోహదం  చేస్తాయని అనడంలో సందేహం లేదు. అయితే మీరు పాలను సరైన పద్దతిలో తాగాకుంటే పాలలో ఉండే సంపూర్ణ పోషకాలు లేకుండా మీ శరీరానికి ఉపయోగ పడదు. పచ్చిపాలు తాగ వచ్చా? ఇందులో ఆశ్చర్య పోవాల్సింది ఏమిలేదు మనశరీరానికి పచ్చిపాల లో ఉన్న పోషక తాత్వాలను అందిస్తుంది.ఎందుకంటే గడ్డితిని ఆవులు లేదా గేదెల నుండే పాలు తీస్తారు.ఈ విధంగా పాలు ఎంజయిం ఆరోగ్యం ప్రోటీన్లతో సంపూర్ణంగా ఉంటుంది.ఆయితే కొన్నిరకాల కీటకాలు ,జీవాణువులను చంపాలంటే పాలను ఒకక్రమ పద్దతిలో సాగుతాయి.ఈ కారణంగా ఎలర్జీ తో పాటు గుండె సంబందిత రోగాలు రావచ్చు. పాల వల్ల లాభాలు... కొన్ని ఏళ్లుగా పాలు తాగడం వల్ల కలిగే లాభాలు చెపుతూనే ఉన్నాము.నష్టాలు గురించి తక్కువే చెప్పుకుంటాము పాలలో కాల్షియం,పోస్ఫరస్,విటమిన్ బి,పొటాషియం,విటమిన్ డి,వంటి పోషక తత్వాలు సంపూర్ణంగా ఉంటాయి.దీనితోపాటు ప్రోటీన్ అధికసంఖ్యలో లభిస్తుంది.మన ఎముకలను పటిష్టంగా ఉంచేందుకు పాలు దోహదం చేస్తాయి.కణాలు టిష్యులు రీజేనేవేషన్,లేదా మెదడు చురుకుగా పనిచేసేందుకు ఆరోగ్యంగా ఉంచేందుకు సహకరిస్తుంది.మరి మీరు సరైన పద్దతిలో పాలు తీసుకుంటున్నారా.? పాలు తాగాలంటే సరైన పద్ధతి ఏమిటి? పాలను వినియోగించాలంటే మిల్క్ షేక్,స్మూదీ,టీ,మిటాయి, ఎక్కడైనా ఏరూపంలో ఐనా వాడతారు.ప్రతివ్యక్తి పాలను వాడే సరైన పద్ధతి వేరు వేరుగా ఉంటుంది. కాని చాలామందికి పచ్చి పాలు  తాగడం ఇష్ట పడతారు.ఇది ఏ మాత్రం కలుషితం లేనిదని పవిత్ర మైనవిగా భావిస్తారు. పచ్చిపాలను తాగడం మంచిదేనా? సురక్షితమా? కొన్ని ఏళ్ళుగా ఒక పరంపరగా పచ్చిపాలను తాగడం ఆరోగ్యానికి మంచిదని ధర్మంగా భావిస్తారు.వీటిలో ఏ రకమైన పదార్ధాలు తీయకుండా నేరుగా తాగడం కాలాను గుణంగా ఆలోచనలు పెరిగి మార్పులు వచ్చాయి. ఇప్పుడు పచ్చిపాలు తాగడం సురక్షితం కాదని నిర్ధారించారు. పచ్చి పాలు తాగితే ఏమౌతుంది? పచ్చి పాలు తాగడం వల్ల హానికలగ వచ్చు ఎందుకంటే ఇందులో బ్యాక్టీరియా లిస్టేరియా,ఈ కోలి,కాక్సిఎలా ,సాల్మనేల్ల,కేండి లో బెక్టర్,యార్సినియా,ఆరోగ్యం పంచెంద్రియాల పై సమస్యలు సృష్టించ వచ్చు. ఒక వేళ ఆయా ఆవులు గేదేలలో శరీరం లో ఏమైనా వైరస్ సంక్రమించి ఉంటె సమస్యలు వస్తాయి. గర్భవతులు పాలిచ్చే తల్లుల ఆరోగ్యం పై ప్రభావం చూపుతుంది.

లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ తో ఇన్ని ప్రయోజనాలు ఉంటాయని మీకు తెలుసా...

  ఎసెన్షియల్ ఆయిల్స్ గత కొంతకాలంగా బాగా ప్రాచుర్యం పొందాయి. ప్రతి ఒక్కరూ ఈ  నూనెల  సువాసనను ఇష్టపడతారు.  ఇది కేవలం సువాసనే కాదు ఎన్నో సమస్యల్లో ఉపశమనం కూడా ఇస్తుంది. ఇది కాకుండా,  ఈ నూనెలను ఏదైనా ఇతర నూనెతో మిక్స్ చేసి చర్మానికి అప్లై చేయవచ్చు, డిఫ్యూజర్‌లో ఉపయోగించవచ్చు లేదా వాసన చూడవచ్చు. ఈ ఎసెన్షియల్ ఆయిల్స్ లో   లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ కూడా ఒకటి. దీని అద్భుతమైన ప్రయోజనాల గురించి  తెలుసుకుంటే.. ఫంగల్ ఇన్ఫెక్షన్ తో పోరాడుతుంది.. చర్మం నుండి బ్యాక్టీరియాను చంపడమే కాకుండా, లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ లో  యాంటీ ఫంగల్ లక్షణాలు కూడా ఉన్నాయి. గోళ్ళలో ఫంగస్ లేదా చుండ్రు ఉన్నట్లయితే  టీ ట్రీ ఆయిల్‌కు బదులుగా లెమన్ ఆయిల్‌ని కూడా ఉపయోగించుకోవచ్చు.  దీన్ని చర్మంపై అప్లై చేయడమే కాకుండా, ఎయిర్ డిఫ్యూజర్‌గా కూడా ఉపయోగించవచ్చు. దీని సువాసన గదిలో ఉండే ఫంగస్ మరియు బ్యాక్టీరియాను తగ్గిస్తుంది. యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు.. లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ లో  యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి  ఇన్ఫెక్షన్‌కు కారణమయ్యే బ్యాక్టీరియా నుండి రక్షిస్తాయి. నిమ్మకాయతో తయారు చేయబడిన ఎసెన్షియల్ ఆయిల్  స్టెఫిలోకాకస్ ఆరియస్,  ఇ.కోలి వంటి బ్యాక్టీరియా నుండి రక్షించడంలో ప్రభావవంతంగా ఉంటుందని 2019లో చేసిన పరిశోధనలో కనుగొనబడింది. ఈ ఎసెన్షియల్ ఆయిల్ ను  ఏదైనా ఇతర క్యారియర్ ఆయిల్ తో  కలిపిన తర్వాత మాత్రమే ఉపయోగించాలి.  అప్లై చేసే ముందు ప్యాచ్  టెస్ట్ చేయాలి.  ఈ జాగ్రత్త వల్ల  అలెర్జీలను నివారించవచ్చు. గాయాలను త్వరగా నయం చేస్తుంది.. లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ లో  ఉండే యాంటీమైక్రోబయల్ లక్షణాలు  గాయాలను త్వరగా నయం చేయడంలో సహాయపడతాయి. లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ తో గాయాన్ని శుభ్రం చేయవచ్చు. అయితే ఇతర క్యారియర్ ఆయిల్ తో కలిపే వాడాలి. ఇది బ్యాక్టీరియాను తొలగిస్తుంది.  గాయాలను త్వరగా నయం చేస్తుంది. చలికాలానికి ది బెస్ట్.. చలికాలంలో తలనొప్పి, జలుబు కారణంగా తలంతా బరువుగా ఉన్నా, గొంతులో నొప్పి,  వాపు వంటి సమస్య ఉన్నా లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ చక్కగా  ఉపయోగపడుతుంది. ఈ నూనెను  డిఫ్యూజర్‌లో ఉపయోగించడం వల్ల దాని సువాసన శ్వాస ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇది ఓ రకంగా అరోమా థెరపీ అనుకోవచ్చు.  ఇది  గొంతులో వాపు,  నొప్పిని తొలగిస్తుంది. అదే సమయంలో, ఇందులో ఉండే విటమిన్-సి జలుబ,  ఫ్లూ నుండి ఉపశమనం ఇస్తుంది. వికారం వదిలించుకోవడానికి.. వికారం  బాధపెడుతుంటే, నిమ్మ నూనె  సహాయం చేస్తుంది. గర్భిణీ స్త్రీలలో కూడా కలిగే వేవిళ్ళు, ఇతర సందర్భాలలో సాదారణ ప్రజలకు ఎదురయ్యే వికారానికి   ఈ నూనె చక్కగా సహాయపడుతుంది. ఒత్తిడిని దూరం చేస్తుంది.. నిమ్మ నూనె సువాసన  మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. ఈ సువాసన ఆందోళన,  టెన్షన్‌ని దూరం చేస్తుంది.  దీనివల్ల  రిలాక్స్‌గా ఉండచ్చు.   సాధారణంగా లావెండర్ లేదా రోజ్ ఎసెన్షియల్ ఆయిల్‌ను ఆందోళన, డిప్రెషన్  లక్షణాలను తగ్గించడానికి ఉపయోగిస్తారు, అయితే నిమ్మ నూనె ఈ రెండు నూనెల కంటే మెరుగైనది. చర్మానికి మేలు చేస్తుంది.. చర్మంపై మొటిమలు,  చీము తగ్గించడానికి లెమన్ ఎసెన్షియల్ ఆయిల్  ఉపయోగించవచ్చు.  ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. ఇది సహజంగానే  రక్తస్రావ నివారిణిగా పనిచేస్తుంది.  చర్మం మీది మృత కణాలను శుభ్రపరచడం, మూసుకుపోయిన  రంధ్రాలను తెరవడం ద్వారా పనిచేస్తుంది. నిమ్మకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని కాంతివంతం చేసి  ఆరోగ్యంగా కనిపించేలా చేస్తాయి. అయితే నిమ్మకాయ చర్మాన్ని సున్నితంగా మార్చుతుంది కాబట్టి ఎండలోకి వెళ్లేటప్పుడు సన్‌స్క్రీన్‌ని అప్లై చేయాలి.                                                               *నిశ్శబ్ద.

విటమిన్ బి12 లోపం..ఈ వ్యాధులకు కారణం..!!

శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి అత్యంత అవసరమైన విటమిన్లలో  విటమిన్ బి-12 కూడా ఒకటి . విటమిన్ B12 శరీరంలో సహజంగా ఉత్పత్తి అవ్వదు. ఇది ఆహారం, పానీయాల నుండి మాత్రమే లభిస్తుంది. ఈ విటమిన్ ఎర్ర రక్త కణాలు, DNA ఏర్పడటానికి అవసరం. మెదడు, నరాల కణాల అభివృద్ధిలో విటమిన్ B-12 చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అంటే మన శారీరక, మానసిక ఆరోగ్యానికి ఈ విటమిన్ చాలా అవసరం. వృద్ధాప్యంలో దాని లోపం కారణంగా, డిమెన్షియా సమస్య ఉండవచ్చు. పెద్దలు మాత్రమే కాకుండా పిల్లలు కూడా దాని లోపానికి గురవుతారు. అల్జీమర్స్ వ్యాధి, చిత్తవైకల్యం మెదడుకు సంబంధించిన సమస్యలు. 60 సంవత్సరాల వయస్సులో, ఈ రెండు వ్యాధుల ప్రమాదం పురుషుల నుండి స్త్రీలకు పెరుగుతుంది. ఈ వ్యాధిలో ఆలోచించే, అర్థం చేసుకునే సామర్థ్యం ప్రభావితమవుతుంది. కొన్ని విటమిన్ల లోపం వల్ల కూడా డిమెన్షియా వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అందులో ఒకటి విటమిన్ బి-12. విటమిన్ బి12 లోపం వల్ల డిమెన్షియా వచ్చే ప్రమాదం: డిమెన్షియా అనేది ఒక వ్యాధి, దీనిలో వయస్సు పెరుగుతున్న కొద్దీ మరచిపోయే సమస్యలను కలిగి ఉంటారు. దీనికి ప్రధాన కారణం శరీరంలో విటమిన్ బి12 లోపం. ఇది మన మనస్సును నేరుగా ప్రభావితం చేస్తుంది. డిమెన్షియాలో, ఒక వ్యక్తి ఆలోచించే, అర్థం చేసుకునే సామర్థ్యం ఎక్కువగా ప్రభావితమవుతుంది. విటమిన్ B-12 వల్ల కలిగే ఇతర సమస్యలు: కీళ్లు,ఎముకల నొప్పి: శరీరంలో విటమిన్ బి-12 లోపం వల్ల ఎముకలు, కీళ్ల నొప్పుల సమస్య కూడా రావచ్చు. దీని కారణంగా, నడుము, వెన్నులో నిరంతర నొప్పి ఉండవచ్చు. గర్భంలో సమస్య: విటమిన్ B-12 లోపం యొక్క ప్రభావం గర్భిణీ స్త్రీలలో కూడా కనిపిస్తుంది. ఈ కారణంగా, పిల్లల అభివృద్ధి సమయంలో, గర్భధారణ సమయంలో సమస్యలు పెరుగుతాయి. దాని లోపం కారణంగా, గర్భం ధరించడంలో ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది. చర్మ వ్యాధి: శరీరంలో విటమిన్ బి12 లేకపోవడం వల్ల చర్మానికి సంబంధించిన సమస్యలు కూడా వేధిస్తాయి. దాని లోపం వల్ల జుట్టు కూడా చాలా వేగంగా రాలిపోతుంది. రక్తహీనత: శరీరంలో విటమిన్ బి-12 లోపం వల్ల రక్తహీనత వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. విటమిన్ బి-12 లోపం వల్ల ఎర్ర రక్త కణాలు సరిగా ఉత్పత్తి కావు. అటువంటి పరిస్థితిలో, హిమోగ్లోబిన్ తగ్గడం ప్రారంభమవుతుంది. రక్తహీనత పూర్తి అవకాశాలు ఉన్నాయి. విటమిన్ B-12 లోపానికి చికిత్స చేసే ఆహారాలు: విటమిన్ B12 లోపాన్ని అధిగమించడానికి, మీ ఆహారంలో పాలు, చీజ్, ఇతర పాల ఉత్పత్తుల మొత్తాన్ని పెంచండి. మీరు మాంసాహారులైతే, ముఖ్యంగా మీ ఆహారంలో గుడ్లు, మాంసాన్ని చేర్చుకోండి. మీరు డాక్టర్ సలహాపై ఈ విటమిన్ యొక్క సప్లిమెంట్లను కూడా తీసుకోవచ్చు.

అధిరిపోయే ఆరోగ్యానికి రెయిన్ బో డైట్..

  శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఆరోగ్యకరమైన,  పోషకమైన ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం చాలా ముఖ్యం. పౌష్టికాహారం  తీసుకుంటేనే  మనకు అవసరమైన అన్ని పోషకాలు లభిస్తాయి. అనారోగ్యకరమైన ఆహారం, శారీరక శ్రమలేకపోవడం  అనే రెండు చెడు అలవాట్లే ప్రస్తుతం చాలా వ్యాధులకు ప్రధాన కారణమని డైటీషియన్లు చెబుతున్నారు.ఆహారంలో పోషక విలువలపై మాత్రమే శ్రద్ధ వహిస్తే, మధుమేహం,  గుండె వంటి ప్రాణాలను బలికొనే వ్యాధుల   ప్రమాదాన్ని 40 శాతం తగ్గించవచ్చు. అయితే చాలామందికి పోషకాహారం తినడమే కాదు, దాన్ని సమకూర్చుకోవడం, పోషకాహరంలో ఏ ఆహారం ఉండాలి?  ఎలాంటి ఆహారం ఉండాలి అనే అవగాహన ఉండదు.  ఆరోగ్యకరమైన పోషకాహారానికి,  మంచి ఆరోగ్యానికి  మధ్య ఉన్న సంబంధాల గురించి ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 1 నుండి 7 వరకు జాతీయ పోషకాహార వారోత్సవాలను జరుపుకుంటారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, మొత్తం శరీరం ఆరోగ్యంగా,  ఫిట్‌గా ఉండాలంటే రెయిన్‌బో డైట్‌ను అనుసరించడం చాలా ముఖ్యం. అసలు రెయిన్ బో డైట్ అంటే ఏంటి? ఇందులో ఏయే ఆహారాలు, కూరగాయలు, పండ్లు ఉండాలి?   ఈ విషయాల గురించి పూర్తీగా తెలుసుకుంటే.. రెయిన్‌బో డైట్ సమర్థవంతమైన ఆరోగ్యానికి రెయిన్ బో డైట్ చాలా ముఖ్యమైనది. ఇది పూర్తీ శరీర సామర్థ్యానికి సహాయపడుతుంది.  రెయిన్‌బో డైట్ అంటే వివిధ రంగుల పండ్లు  కూరగాయలను ఆహారంలో చేర్చడం. రంగురంగుల పండ్లు,  కూరగాయలలో  విటమిన్లు, ఖనిజాలు,  యాంటీఆక్సిడెంట్లు సమృద్దిగా ఉంటాయి, ఇవి శరీరానికి అనేక విధాలుగా ప్రయోజనాన్ని చేకూరుస్తాయి.  రెయిన్‌బో డైట్‌లో ముఖ్యమైనవి ఏవంటే.. ఎరుపు రంగు పండ్లు,  కూరగాయలు.. ఎరుపు రంగు పండ్లు,  టమోటాలు, స్ట్రాబెర్రీలు  లాంటి  ఇతర కూరగాయలు విటమిన్లు, పోషకాలను సమృద్ధిగా కలిగి  ఉంటాయి. చాలా పండ్లలో విటమిన్ ఎ, పొటాషియం,  యాంటీఆక్సిడెంట్లు  ఉంటాయి, ఇవి శరీరానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి. రోజువారీ ఆహారంలో ఎరుపు రంగు పండ్లు, కూరగాయలను చేర్చుకోవాలి. ఆరెంజ్ పండ్లు,  కూరగాయలు.. ఎరుపు రంగు పండ్లతో పాటు నారింజ రంగు పండ్లు  కూరగాయలను కూడా ఆహారంలో చేర్చుకోవాలి. ఎరుపు,  నారింజ కూరగాయలలో అధిక మొత్తంలో విటమిన్ ఎ ఉంటుంది, ఇది నోటిలోని లాలాజల గ్రంథులు,  శ్లేష్మ కణజాలాల ఆరోగ్యానికి అవసరం. ఈ విటమిన్ లోపం వల్ల దంతాలు బలహీనపడతాయి. విటమిన్ ఎ  కళ్ళ ఆరోగ్యానికి చాలా అవసరం.  నారింజ రంగు పండ్లు, కూరగాయల ద్వారా విటమిన్ ఎ శరీరానికి సమర్థవంతంగా అందుతుంది. తెలుపు రంగులో ఉండే  పండ్లు, కూరగాయలు.. తెల్లటి పండ్లు,  కూరగాయలు   శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంతో పాటు అధిక రక్తపోటు సమస్య నుండి ఉపశమనాన్ని అందిస్తాయి.  వాటిని తీసుకోవడం వల్ల గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో  చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది శరీర రోగనిరోధక శక్తిని పెంచే ప్రభావాన్ని కూడా కలిగి ఉంటుంది. తెల్లటి పండ్లు,  కూరగాయలలో లభించే పోషకాలు పెద్దప్రేగు, ప్రోస్టేట్ మరియు రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి. క్యాలీ ఫ్లవర్, అరటిపండు, సీతాఫలం, పచ్చి టమోటా, ముల్లంగి వంటివి ఇందులో భాగంగా తీసుకోవచ్చు. ఆకు కూరలు, ఆకుపచ్చ కూరగాయలు, పండ్లు.. ఆకుకూరల్లో  ఫోలేట్‌లో సమృద్ధిగా ఉంటుంది. ఇది న్యూరోట్రాన్స్‌మిటర్ ఉత్పత్తికి,  మానసిక స్థితి స్థిరత్వానికి బాగా పనిచేస్తుంది. అలాగే ఆకుపచ్చ రంగులో ఉండే బ్రోకలి, క్యాప్సికమ్, కాకర వంటి కూరగాయలు, ఆకుపచ్చ రంగులో ఉండే పండ్లలో ఫోలెట్ పొందవచ్చు. పర్పుల్ కలర్ ఆహారాలు.. ద్రాక్ష, బ్లాక్‌బెర్రీలు, రేగు వంటి ఊదారంగు పండ్లను ఆహారంలో చేర్చుకోవాలి. వీటిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ,  న్యూరోప్రొటెక్టివ్ ప్రభావాలను కలిగి ఉన్న ఆంథోసైనిన్‌లు ఉంటాయి. తృణధాన్యాలు.. క్వినోవా, బ్రౌన్ రైస్,  హోల్ వీట్ వంటి రంగురంగుల తృణధాన్యాలను ఎంచుకోవాలి. ఈ ధాన్యాలు స్థిరమైన శక్తిని అందిస్తాయి,  మెరుగైన మానసిక స్థితిని,  అభిజ్ఞా పనితీరును మెరుగు పరుస్తాయి. గింజలు,  విత్తనాలు.. బాదం, వాల్‌నట్‌లు, చియా గింజలు,  అవిసె గింజలు వంటి వివిధ రకాల  గింజలను అల్పాహారంలో భాగం  చేయాలి.  వీటిలోని ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్  మెదడు ఆరోగ్యానికి తోడ్పడే అవసరమైన పోషకాలను అందిస్తాయి. కొవ్వులు.. చేపలు, చికెన్, చిక్కుళ్ళు,  టోఫు వంటి  ప్రోటీన్ మూలాలను ఆహారంలో భాగం చేసుకోవాలి. ఈ ఆహారాలు న్యూరోట్రాన్స్మిటర్ ఉత్పత్తికి అవసరమైన అమైనో ఆమ్లాలను అందిస్తాయి. మూలికలు, సుగంధ ద్రవ్యాలు.. పసుపు, అల్లం,  రోజ్మేరీ వంటి మూలికలు, సుగంధాలను తీసుకోవాలి. అవి యాంటీ ఇన్ఫ్లమేటరీ,  కాగ్నిటివ్-పెంచే లక్షణాలను కలిగి ఉండే సమ్మేళనాలను కలిగి ఉంటాయి.                                                        *నిశ్శబ్ద.  

ఈ పండ్లు తిన్న తర్వాత నీళ్లు తాగకూడదని మీకు తెలుసా?

చాలామంది ఆహారం తిన్న వెంటనే లేదంటే భోజనం చేయగానే నీళ్లు తాగుతుంటారు. ఆహారం తిన్న వెంటనే నీళ్లు తాగకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలా చేస్తే జీర్ణసమస్యలు వస్తాయని పేర్కొంటున్నారు. అలాగే కొన్ని పండ్లను తిన్న వెంటనే మంచినీళ్లు తాగడం వల్ల కడుపు సంబంధిత సమస్యలు వస్తాయంటున్నారు. అవేం పండ్లు? అవి తింటే ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో తెలుసుకుందాం. ఆమ్ల ఫలాలు: నారింజ, ఉసిరి, ద్రాక్ష వంటి పుల్లని పండ్లను తిన్న తర్వాత  నీరు త్రాగకూడదు. ఇలా చేయడం వల్ల శరీరంలోని pH స్థాయికి భంగం కలుగుతుంది. ఇది జీర్ణవ్యవస్థకు ఆటంకం కలిగిస్తుంది. పియర్స్: ఫైబర్, విటమిన్ ఎ, విటమిన్ సి పుష్కలంగా ఫోలిక్ యాసిడ్, పొటాషియం, పియర్స్ జీర్ణక్రియకు సహాయపడతాయి. పియర్స్ తిన్న తర్వాత నీళ్లు తాగడం వల్ల జీర్ణక్రియ దెబ్బతింటుంది. పుచ్చకాయ: శరీరంలో నీటి కొరతను అధిగమించడానికి పుచ్చకాయ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. తిన్న తర్వాత నీళ్లు తాగితే జీర్ణవ్యవస్థ చెడిపోతుంది. లూజ్ మోషన్ అయ్యో అవకాశం ఉంటుంది. అరటిపండు: అరటిపండులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. మలబద్ధకం, కడుపు సమస్యల నుండి ఉపశమనం పొందుతుంది. కానీ అరటిపండు తిన్న తర్వాత నీళ్లు తాగితే జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. దానిమ్మ: శరీరంలో రక్తాన్ని పెంచడానికి, రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి దానిమ్మ ఉపయోగపడుతుంది. దానిమ్మ తిన్న తర్వాత నీళ్లు తాగడం వల్ల వికారం, అసిడిటీ, వాంతులు అవుతాయి.

మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఈ పండ్లు తింటే ఎంత ప్రమాదమో తెలుసా?

పండ్లు తినడం మంచి అలవాటు. ఆరోగ్యానికి అన్నివిధాలా మేలు చేస్తాయి. అంతేకాదు మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడుతాయి. కానీ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం...మీరు ఏం తింటున్నారో దానిపై శ్రద్ధ వహించడం ముఖ్యం. కొన్ని పండ్లు మధుమేహవ్యాధిగ్రస్తులు అస్సలు తినకూడదు. ఎందుకంటే అవి రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతాయి. షుగర్ పేషంట్లు ఎలాంటి పండ్లను తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. అరటిపండు: అరటిపండు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ప్రతిరోజూ అరటి పండు తినడం వల్ల ఫైబర్, ప్రొటీన్లు, విటమిన్లు, మాంగనీస్, పొటాషియం మొదలైన అనేక పోషకాలు లభిస్తాయి.  NCBI అధ్యయనం ప్రకారం, అరటిపండ్లు తినడం వల్ల రక్తంలో చక్కెర ఎక్కువగా ఉంటుంది.  ఎందుకంటే వాటిలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులకు అరటిపండు తినడం మంచిది కాదు. అనాస పండు: మధుమేహ వ్యాధిగ్రస్తులు పైనాపిల్‌ను మితంగా తినాలి. విటమిన్ సి పుష్కలంగా ఉన్న ఈ రుచికరమైన పండ్లను ఎక్కువగా తినడం వల్ల రక్తంలో చక్కెర వేగంగా పెరుగుతుంది. ఇందులో అధిక మొత్తంలో కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇది రక్తంలో త్వరగా కరిగి గ్లూకోజ్‌ని పెంచుతుంది. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ పండు తినకపోవడమే మంచిది. పుచ్చకాయ: పుచ్చకాయను వేసవిలో హైడ్రేషన్ కారణంగా తినాలి. అయితే దీన్ని ఎక్కువగా తినకూడదు. దీని GI విలువ సుమారు 72, ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా ప్రమాదకరం. ఖర్జూర: ఖర్జూరం చాలా చక్కెరను కలిగి ఉంటుంది.  ఇది ఎండిన తర్వాత ఇందులో చక్కెర శాతం పెరుగుతుంది. ఎంతగా అంటే అందులోని విటమిన్లు, మినరల్స్ కూడా దాని ముందు తక్కువగా కనిపించడం ప్రారంభిస్తాయి. అందుకే మధుమేహ వ్యాధిగ్రస్తులు దీనిని తినకూడదు.

డ్రైఫ్రూట్స్ లో తేనె కలిపి తింటే ఎన్నో లాభాలో తెలుసా?

డ్రై ఫ్రూట్స్‌లోని పోషకాలు ఒక్క వ్యక్తిని ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతగానో సహాయపడతాయి.  అనారోగ్యానికి వ్యతిరేకంగా మీ శరీరాన్ని బలోపేతం చేయడానికి దోహదపడతాయి. తేనె అంటువ్యాధులతో పోరాడుతుంది. ఇది మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. డ్రైఫ్రూట్స్ లో కొవ్వు, కేలరీలు తక్కువగా ఉంటాయి. తేనె అనేది యాంటీఆక్సిడెంట్లు, ఇతర పోషకాలను కలిగి ఉన్న సహజ స్వీటెనర్. పోషణ,శక్తికి మూలం: తేనె పూసిన డ్రై ఫ్రూట్స్ రెండింటిలోని పోషక ప్రయోజనాలను మిళితం చేస్తాయి. వాటిలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటాయి, అవసరమైన పోషకాల యొక్క సాంద్రీకృత మూలాన్ని అందిస్తాయి. తేనె, డ్రైఫ్రూట్స్‌లోని సహజ చక్కెరలు త్వరిత శక్తిని ప్రోత్సహిస్తాయి. శారీరక కార్యకలాపాల శక్తి స్థాయిలను తిరిగి నింపడంలో సహాయపడతాయి. రోగనిరోధక శక్తిని పెంచుతుంది: తేనె దాని సంభావ్య యాంటీ బాక్టీరియల్ లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. డ్రైఫ్రూట్స్ లోని విటమిన్లు, ఖనిజాలతో కలిపినప్పుడు, ఇది మొత్తం రోగనిరోధక వ్యవస్థకు సపోర్టు చేస్తుంది. శరీరాన్ని ఇన్ఫెక్షన్ నుండి రక్షించడంలో సహాయపడుతుంది.వాటి పోషకాలు జింక్, సెలీనియం, పొటాషియం, కాపర్ , మెగ్నీషియం. అవి విటమిన్లు B, C , ఐరన్ కు  మంచి మూలం. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది: డ్రై ఫ్రూట్స్ లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియలో సహాయపడుతుంది. సాధారణ ప్రేగు కదలికలను ప్రోత్సహిస్తుంది. డ్రై ఫ్రూట్స్‌ని తేనెతో కలిపి తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. హృదయనాళ ఆరోగ్యం: ఎండుద్రాక్ష, ఆప్రికాట్ వంటి డ్రైఫ్రూట్స్  తేనెతో కలిపి తీసుకుంటే గుండె ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. ఇవి పొటాషియం, ఫైబర్,ఫినాలిక్ సమ్మేళనాలు వంటి పోషకాలను కలిగి ఉంటాయి, ఇవి హృదయ ఆరోగ్యానికి తోడ్పడతాయి. యాంటీఆక్సిడెంట్ రక్షణ: తేనె, డ్రైఫ్రూట్స్‌లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవడంలో సహాయపడుతుంది. శరీరంలో హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను తటస్థీకరించడం ద్వారా దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది బరువును నిర్వహించడానికి: డ్రై ఫ్రూట్స్ శక్తికి మంచి మూలం.  తేనె బరువును తగ్గించడంలో సహాయపడుతుంది. బాదం, ఖర్జూరం, అంజీర, ఎండుద్రాక్ష మొదలైన డ్రై ఫ్రూట్స్‌లో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి, హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడానికి, దృష్టిని మెరుగుపరచడంలో సహాయపడతాయి.  

స్త్రీలకు ఇలాంటి సమస్యలు ఉంటే గర్భం దాల్చడం కష్టం..!!

  జనాభాలో మన భారతదేశం అగ్రస్థానంలో ఉన్న మాట నిజమే. అయినప్పటికీ చాలా మంది దంపతులు బిడ్డను కనేందుకు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. మీరు ఆరోగ్యకరమైన ఆహారం, సంతానోత్పత్తి మందులను ఉపయోగిస్తున్నప్పటికీ మీరు గర్భవతి కాకపోతే, దానికి గల కారణాలు ఇప్పుడు తెలుసుకుందాం. క్రమరహిత ఋతు చక్రం: ప్రతి 28 లేదా 30 రోజులకు రుతుక్రమం రాని స్త్రీలకు సంతానోత్పత్తి సమస్యలు ఉంటాయి. మీ యుక్తవయస్సు దాటిన తర్వాత, మీ ఋతు చక్రాలు సక్రమంగా ఉండాలి. క్రమరహిత సైకిల్ వంధ్యత్వానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే, ఇది అండోత్సర్గ సమస్యను ప్రోత్సహిస్తుంది. నిజానికి, క్రమరహిత కాలాలు అనేక కారణాలను కలిగి ఉంటాయి. కారణాలు: -అధిక బరువు లేదా తక్కువ బరువు -విపరీతమైన వ్యాయామం -హైపర్ప్రోలాక్టినిమియా -తక్కువ అండాశయ నిల్వ -ప్రాథమిక అండాశయ లోపం -థైరాయిడ్ సమస్య. 35 ఏళ్లు పైబడిన వారికి వంధ్యత్వ సమస్య: వైద్యుల ప్రకారం, 35 ఏళ్ల తర్వాత మహిళల్లో సంతానోత్పత్తి తక్కువగా ఉంటుంది. ఇది సహజంగా వంధ్యత్వానికి దారితీస్తుంది. స్త్రీ, పురుష సంతానోత్పత్తి వయస్సుతో తగ్గుతుంది. 35 సంవత్సరాల వయస్సులో స్త్రీలలో వంధ్యత్వానికి గురయ్యే ప్రమాదం పెరుగుతుంది. మగ వంధ్యత్వం: సంతానం లేని స్త్రీలు వారి వంధ్యత్వానికి నేరుగా నిందించాల్సిన అవసరం లేదు. పురుషులు కూడా వంధ్యత్వాన్ని అనుభవించవచ్చని తెలుసుకోండి. పురుషులలో తక్కువ స్పెర్మ్ గణనలు లేదా నిరోధించబడిన స్పెర్మ్ చలనశీలత వీర్యం విశ్లేషణ ద్వారా నిర్ణయించబడుతుంది. అటువంటి సమస్యను గుర్తించడానికి సంతానోత్పత్తి పరీక్షను ఉపయోగించవచ్చు. దీర్ఘకాలిక వ్యాధులు: మీకు దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే.. చికిత్స పొందుతున్నట్లయితే, ఇది సంతానోత్పత్తిని కూడా ప్రభావితం చేస్తుంది. ఉదాహరణకు, అధిక రక్తపోటు, మధుమేహం, ఉదరకుహర వ్యాధి, హైపోథైరాయిడిజం, అనేక ఇతర సమస్యలు వంధ్యత్వ ప్రమాదాన్ని పెంచుతాయి . అలాగే, థైరాయిడ్ హార్మోన్లు సక్రమంగా పీరియడ్స్ రావడానికి కారణమవుతాయి.  గర్భస్రావం: సాధారణంగా గర్భం దాల్చడానికి అసమర్థతతో ముడిపడి ఉంటుంది. అయినప్పటికీ, పదేపదే గర్భస్రావాలు అనుభవించే స్త్రీకి ఆరోగ్యంగా గర్భం దాల్చడం కష్టమవుతుంది. మీరు వరుసగా రెండు గర్భస్రావాలు కలిగి ఉంటే, గర్భం ధరించడానికి ముందు మీ వైద్యుడిని సంప్రదించండి.

ఏ వయసులో ఎలాంటి మానసిక సమస్యలు వస్తాయో తెలుసా?

ప్రపంచవ్యాప్తంగా, మానసిక ఆరోగ్య సమస్యల కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా కరోనా  తర్వాత దాని ప్రమాదం మరింత పెరిగింది. అన్ని వయసుల వారిలోనూ మానసిక ఆరోగ్య రుగ్మతల కేసులు నమోదవుతున్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. భారతదేశంలో మానసిక ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు తొందరగా బయటపడవు. ఈ కారణంగా మానసిక సంబంధ వ్యాధుల బాధితులు ఎక్కువ మంది ఉన్నారు.  ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, దేశంలో ప్రతి ఐదుగురిలో ఒకరికి భావోద్వేగ,  ప్రవర్తనా సమస్యలు ఉన్నాయి. దేశంలో 60 నుండి 70 మిలియన్ల మంది ప్రజలు తేలికపాటి,  తీవ్రమైన మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారు. ఒక్క ఏడాదిలోనే ఆత్మహత్యల కేసులు కూడా పెరిగాయి. WHO డేటా ప్రకారం భారతదేశంలో ప్రతి లక్ష మందిలో సగటు ఆత్మహత్యల రేటు 10.9గా ఉంది. కాబట్టి  మానసిక ఆరోగ్య సమస్యల గురించి అవగాహన పెంచుకోవడం ఎంతో అవసరం. పిల్లలు,  యువతలో పెరుగుతున్న సమస్య..  విచారించాల్సిన విషయం ఏమిటంటే భారతదేశంలోని పిల్లలు, యువత కూడా మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. చాలామంది కనీసం తమది మానసిక సమస్య అనే విషయం గ్రహించలేని పరిస్థితులలో ఉన్నారని  మానసిక ఆరోగ్య నిపుణులు అంటున్నారు. సామాజంలో జరిగే తప్పుడు పనులు, పిల్లల మీద జరిగే చర్యలు, మానసిక ఆరోగ్యం పట్ల ప్రతికూల దృక్పథాలు, యువత సహాయం కోరకుండా అడ్డుపడుతున్నాయి. ఇంకా దేశంలో మానసిక ఆరోగ్య సంరక్షణ సులభంగా అందుబాటులో లేకపోవడం కూడా ఈ విషయంలో ప్రమాదాలను పెంచుతోంది. నేషనల్ మెంటల్ హెల్త్ సర్వే (NMHS) 2015-16 ప్రకారం, 18 ఏళ్లు పైబడిన వారిలో ఈ  ప్రమాదం పెరుగుతోంది. గణాంకాలు ఎలా ఉన్నాయంటే.. మానసిక ఆరోగ్య సంరక్షణ కోసం ఆన్‌లైన్ సహాయ కేంద్రముంది. ఇదే  TeleManas. ఇది వెల్లడించిన  గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. Tele Manas Cell  షేర్ చేసిన సమాచారం ప్రకారం, సహాయం కోసం కాల్ చేసేవారిలో 80 శాతం కంటే ఎక్కువ మంది 18-45 ఏళ్ల మధ్య వయస్కులే, అంటే ఈ వయస్సులో ఆరోగ్య సమస్యలు ఎక్కువగా నమోదవుతున్నాయి. టెలి మనస్ అనేది నిపుణుల నుండి మానసిక ఆరోగ్య సంబంధిత సహాయాన్ని పొందడానికి దేశంలోని ఏ మూల నుండి అయినా కాల్ చేయగల టోల్-ఫ్రీ హెల్ప్‌లైన్. దీని కోసం 14416 లేదా 18008914416 నంబర్లకు కూడా కాల్ చేయవచ్చు. యువతలో సమస్యలు.. టెలి మనస్  పంచుకున్న డేటా ప్రకారం, యువత జనాభాలో మానసిక ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. 12 ఏళ్లలోపు పిల్లల్లో మేధో వైకల్యం, దృష్టి లోపం సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. పరీక్ష సంబంధిత ఒత్తిడి, కోపం సమస్యలు, ప్రవర్తన లోపాలు  డిప్రెషన్ కేసులు 13-18 సంవత్సరాల వయస్సులో కనిపిస్తున్నాయి. అదే సమయంలో, 18-45 సంవత్సరాల వయస్సు గల వారిలో డిప్రెషన్, ఆందోళన,  కుటుంబ సమస్యల కారణంగా మానసిక ఆరోగ్యం దెబ్బతినడం వంటి కారణాలు ఉంటాయి. వృద్ధులలో  సమస్యలు.. 46-60 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులలో మానసిక ఆరోగ్య రుగ్మతల కేసులు నమోదవుతున్నాయి.  కానీ ఈ కేసుల సంఖ్య తక్కువగానే ఉంది. ఈ వయస్సులో చాలా మంది డిమెన్షియాతో పాటు డిప్రెషన్,  కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారు. అదే సమయంలో 60 ఏళ్లు దాటిన వారిలో డిమెన్షియా, జ్ఞాపకశక్తి సంబంధిత సమస్యలు, కుటుంబ సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.  ఏ వయసు వారికి ఎలాంటి సమస్య వచ్చే అవకాశం ఉందో తెలుసుకుని వాటిని పరిష్కరించడం వల్ల మన కుటుంబంలోని వారే డిప్రెషన్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు.                                                            *నిశ్శబ్ద.

శాకాహారుల కోసం ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు!

నేటికాలంలో చాలామంది అనారోగ్యం బారిన పడుతున్నారు. కారణం తప్పుడు జీవనశైలి, ఆహారపు అలవాట్లు. బిజీలైఫ్ కారణంగా ఇంటి ఆహారానికి బదులుగా బయట ఆహారానికి అధిక ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఫలితంగా అనారోగ్యాలను కొనితెచ్చుకుంటున్నారు. వయస్సు సంబంధం లేకుండా డయాబెటిస్, అధికబీపీ, గుండె జబ్బులు, ఊబకాయం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మనం తీసుకునే పండ్లు,కూరగాయాలు, చిరుధాన్యాల నుంచి ఎక్కువ ప్రొటీన్ లభిస్తుంది. కానీ వీటికి బదులుగా జంక్ ఫుడ్ వైపు మొగ్గు చూపుతున్నారు. మన శరీరంలో వివిధ రకాల ఆరోగ్యకరమైన పదార్థాలు ఉత్పత్తి అవుతాయి. కానీ ప్రోటీన్ కంటెంట్ మాత్రమే స్వయంగా ఉత్పత్తి కాదు. మాంసహారంలో లభించే ప్రొటీన్ కంటెంట్ కు సమానంగా మనకు శనగ, చిక్‌పీ, ఉరడ్, కాయధాన్యాలు, బీన్స్ లలో లభిస్తుంది. చిక్‌పీస్‌లో ప్రొటీన్లు కూడా పుష్కలంగా ఉంటాయి. మాంసాహారం తీసుకోని వారికి వీటి ద్వారా ప్రొటీన్ లభిస్తుంది. శాకాహారులకు అందుబాటులో ఉన్న ఆహార పదార్థాలను సక్రమంగా వినియోగించుకుంటే మంచి మోతాదులో ప్రొటీన్లు శరీరానికి అందుతాయి. 1. పప్పు,ధాన్యాలు: మీరు ప్రతిరోజూ తీసుకునే ఆహారంలో పప్పు, ధాన్యాలు సమతుల్యంగా ఉండేలా చూసుకోవాలి. ఫైబర్ కంటెంట్, మినరల్ కంటెంట్ తోపాటు ప్రొటీన్ కూడా చాలా అవసరం. మీ రోజువారి ఆహారంలో గోధమలు, జొన్నలు,బార్లీ, ఓట్స్ వంటివి చేర్చుకోవాలి. ఇది మీ ఆరోగ్యానికి ఎంతగానో దోహదం చేస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. మీ శరీరానికి కావాల్సిన బలం, శక్తిని అందిస్తాయి. 2. డ్రైఫ్రూట్స్: జంక్ ఫుడ్ కు బదులుగా వీలైనంత వరకు డ్రైఫ్రూట్స్ ను స్నాక్స్ గా ఎంచుకోండి. బాదం, చియా, గుమ్మడి, అంజీర్, వంటివాటిని మీ డైట్లో చేర్చుకునేలా ప్లాన్ చేసుకోండి. వీటితోపాటు సలాడ్స్, స్మూతీస్ కూడా మీ శరీరానికి కావాల్సిన అదనపు ప్రొటీన్ ను అందిస్తుంది. 3. పాలఉత్పత్తులు: మీ డైట్ లో పాలఉత్పత్తులు ఉండేలా చూసుకోండి. పాలు, పెరుగు, మజ్జిగ, వెన్న,నెయ్యి వంటివి శరీరానికి సరిపడా ప్రొటన్లు, ఇతర మినరల్స్ ను అందిస్తాయి. పిల్లలకు చిన్నప్పటి నుంచి పాల ఉత్పత్తులు ఇస్తే కండరాలు, ఎముకల్లో, ఎలాంటి సమస్యలు ఉండవు. వృద్ధాప్యం తర్వాత ఎముకల వ్యాధులు రావు. 4. సమతుల్య ఆహారం: మనం తీసుకునే ఆహారంలో ప్రొటీన్ పుష్కలంగా ఉండేలా చూసుకోవాలి. కూరగాయలు,  చిక్కుళ్ళు, తృణధాన్యాలు, పాల ఉత్పత్తులు ఉండాలి. మీ ఆహారం సమతుల్య ఆహారంగా ఉండాలి. కూరగాయల పల్యా, సాగు, సాంబారు, కూతు వంటి వాటిల్లో ప్రొటీన్ అధికమొత్తంలో ఉంటుంది. ఇవే కాకుండా ప్రొటీన్ సప్లిమెంట్స్ కూడా మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. మీ వైద్యుడి సూచనమేరకు వాటిని కూడా తీసుకోవచ్చు. ఇవి మీలో ప్రొటీన్ లోపాన్ని నివారించేందుకు సహాయపడతాయి.

హైబీపీ కంట్రోల్లో ఉండాలంటే ఈ నేచురల్ డ్రింక్స్ తాగండి!

నేటికాలంలో చాలా మంది రక్తపోటు సమస్యతో బాధపడుతున్నారు. అయితే మనం తీసుకునే ఆహారం ద్వారా అధికబీపీని సులువుగా తగ్గించుకోవచ్చు. హైబీపీని ఎలా కంట్రోల్లో ఉంచుకోవాలో తెలుసుకుందాం. ఆధునిక జీవితంలో మనిషి లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. ఉద్యోగంలో ఒత్తిడి, కుటుంబ సభ్యలతో ఆందోళనకు గురవుతున్నారు. ఉద్యోగ, వ్యాపార పనుల్లో చాలామంది క్షణం తీరిక లేకుండా గడుపుతూ ఆరోగ్యంపై అశ్రద్ధ చేస్తున్నారు. ఆహారం సరైన సమయంలో తీసుకోకపోవడం, సరైన డైట్ పాటించకపోవడం వల్ల అధిక రక్తపోటుకు సమస్యను ఎదుర్కొంటున్నారు. అధికరక్తపోటు శరీరంలో అవయవాలు, వాటి పనితీరుకు హాని కలిగిస్తుంది. దీంతో ఇతర వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే బీపీ స్థాయిలను అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. అధికరక్తపోటును నియంత్రించి తక్కువ బీపీ స్థాయిలను కలిగి ఉండాలంటే ఎలాంటి ఆహారంతోపాటు కొన్ని హెల్తీ డ్రింక్స్ తీసుకుంటే బీపీ స్థాయిలున తగ్గించుకోవచ్చు. అవేంటో చూద్దాం. గూస్బెర్రీ అల్లం రసం: మన శరీరంలోని ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించే గుణం జామకాయలో ఉంది. ఇది రక్తపోటును నియంత్రిస్తుంది. అల్లంలో వాసోడైలేటింగ్ గుణాలు ఉన్నాయి. తద్వారా రక్తప్రసరణ సాఫీగా సాగి రక్తపోటు తగ్గుతుంది. ధనియాల నీరు: ధనియాలు మూత్రవిసర్జన లక్షణాలను కలిగి ఉంటాయి.  అవి మన శరీరంలోని సోడియంను మూత్రం ద్వారా విసర్జిస్తాయి. ఇది ఆటోమెటిగ్గా రక్తపోటును తగ్గిస్తుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ డ్రింక్ తాగడం అలవాటు చేసుకోండి. బీట్‎రూట్, టమోటా రసం: బీట్‌రూట్‌లో నైట్రేట్‌లు ఉంటాయి.  ఇవి రక్తపోటును తగ్గిస్తాయి. నైట్రేట్ స్థాయిలు మన రక్తంలో నైట్రిక్ ఆక్సైడ్ పేరుకుపోవడానికి కారణమవుతాయి. ఇది రక్తపోటును తగ్గిస్తుంది. టొమాటోలో లైకోపీన్, బీటా కెరోటిన్, విటమిన్ ఇ ఉన్నాయి, ఇది సమర్థవంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది ఫ్రీ రాడికల్ ఎలిమెంట్స్ ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ముల్లంగి రసం: విటమిన్ సి సమృద్ధిగా ఉండటంతో పాటు, ముల్లంగిలో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు, కాల్షియం, పొటాషియం వంటి ఖనిజాలు కూడా అధికంగా ఉంటాయి. ఇలా అధిక రక్తపోటుతో బాధపడేవారు రోజూ ఒక గ్లాసు ముల్లంగి జ్యూస్ తాగడం అలవాటు చేసుకుంటే అధిక రక్తపోటు అదుపులో ఉండడమే కాకుండా గుండెకు ఎదురయ్యే సమస్యను దూరం చేస్తుంది. -మీరు ఇప్పటికే రక్తపోటు సమస్యతో బాధపడుతున్నట్లయితే, ఖాళీ కడుపుతో రెండు జామకాయలు తినడం లేదా దాని రసం తాగడం అలవాటు చేసుకోండి. -నల్ల ఎండు ద్రాక్షలో పొటాషియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతిరోజూ అల్పాహారానికి ముందు నాలుగైదు నానబెట్టిన నల్లని ఎండు ద్రాక్షలను తినడం అలవాటు చేసుకుంటే రక్తపోటు వ్యాధిని అదుపులో ఉంచుకోవచ్చు. -రోజూ అరగంట నడక సాధన చేయండి. -కృత్రిమ చక్కెర అధికంగా ఉన్న ఆహారాలు, ప్రాసెస్ చేసిన ఆహారాలు, ఉప్పు అధికంగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండండి

నెయ్యి తింటున్నారా... ఈ నిజాలు తెలిస్తే షాకవుతారు

నెయ్యి భారతీయులు ఎన్నో ఏళ్ళ నుండి ఉపయోగిస్తున్న నూనె పదార్థం. ఇది పాలనుండి తయారుకావడం వల్ల పవిత్రమైనదిగానూ, ఆరోగ్యకరమైనదిగానూ భావిస్తారు. కానీ నెయ్యిలో కేలరీలు ఎక్కువ ఉంటాయని, నెయ్యి  తింటే బరువు పెరుగుతారని, సన్నగా స్లిమ్ గా ఉండాలంటే నెయ్యి అవాయిడ్ చెయ్యాలని చెబుతారు. కానీ.. నెయ్యి వల్ల బరువు పెరగడం కాదు తగ్గుతారని చెబుతున్నారు ఆహార నిపుణులు. ఈ మాట వినగానే షాకింగ్ గా అనిపిస్తుంది.  అసలు ఇదెలా సాధ్యమనే డౌట్ కూడా వస్తుంది. నెయ్యి తింటే బరువు ఎలా తగ్గుతారో తెలుసుకుంటే..  బరువు తగ్గడానికి ప్రయత్నించే చాలా మందిని  నూనె,  వెన్న,  నెయ్యి మొదలైన పదార్థాలను ఆహారం నుండి  తొలగిస్తారు. అయితే ఇది అస్సలు చేయకూడదు. నిజానికి బరువును డీల్ చెయ్యాలి అంటే సమతుల ఆహారం తీసుకోవాలి. ఇందులో నెయ్యి చాలా ప్రముకమైందని ఆయుర్వేదం చెబుతోంది. నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వులు,  అవసరమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. దీన్ని జాగ్రత్తగా వాడితే బరువును చాలా సులువుగా తగ్గించుకోవచ్చు. నెయ్యి ఎలా వాడాలంటే.. నెయ్యిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే  కేలరీలు కూడా ఉంటాయి.అదనపు కేలరీల తీసుకోవడం నిరోధించడానికి ఆహారంలో నెయ్యి తీసుకోవడంలో  జాగ్రత్త తీసుకోవాలి. రోజూ కేవలం ఒక టీస్పూన్‌ నెయ్యి శరీరానికి కావలసిన కేలరీలనుకూడా అందిస్తుంది. దీని తరువాత బయటి నూనెలు, నూనె పదార్థాలు తినడం మానేస్తాం. కేలరీల భయంతో వాటికి దూరంగా ఉంటాం.   నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి కాబట్టి ఇది ఆరోగ్యానికి మంచి చేస్తుంది తప్ప చెడు చేయదు. చాలామంది పామాయిల్,  నూనె ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇవి అనారోగ్యకరమైన కొవ్వులకు కారణమవుతాయి. ఇవి చాలా తొందరగా ఆక్సీకరణం చెందుతాయి.  కానీ నెయ్యిలో ఆరోగ్యకరమైన సంతృప్త కొవ్వులు ఉంటాయి, ఇవి అధిక ఉష్ణోగ్రతల వద్ద ఆక్సీకరణం చెందే అవకాశం తక్కువగా ఉంటుంది. నెయ్యిలో ఉండే సంతృప్త కొవ్వుల కారణంగా ఇది  ఎక్కువసేపు  శక్తిని అందిస్తుంది. వ్యాయామానికి ముందు ఒక స్పూన్ నెయ్యిని తీసుకోవం వల్ల శరీర పనితీరు, అవయవాల చురుకుదనం పెరుగుతుంది. అవయవాల చురుకుదనం, శరీర స్పందన రేటు పెరగడం వల్ల శరీరంలో చెడు కొవ్వులు కరుగుతాయి. నెయ్యివల్ల బరువు తగ్గుతారని, ఇది మంచి కొవ్వులను కలిగి ఉంటుందని తెలుసుకున్నవారు నెయ్యిని ఎడాపెడా ఇష్టమొచ్చినట్టు వాడకూడదు. అతి సర్వత్రా వర్జయేత్ అనే మాటను ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. నూనెలు, నూనె ఆహారాలు తగ్గించుకుని పరిమిత మోతాదులో నెయ్యిని వాడితేనే బరువు తగ్గుతారు. దీని వల్ల కలిగే అదనపు ప్రయోజనం ఏమిటంటే ఒకవైపు బరువు తగ్గడం, శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తొలగి మంచి కొలెస్ట్రాల్ ఏర్పడటం. దీని వల్ల బరువు తగ్గడంతో పాటు గుండె జబ్బులు, కాలేయం, రక్తనాళాలు సేఫ్ అవుతాయి.                                                                       *నిశ్శబ్ద.

మొలకెత్తిన ఈ గింజలతో ఆరోగ్య ప్రయోజనాలెన్నో..!!

  నేటికాలంలో ప్రతివ్యక్తి ఏదొక వ్యాధితో బాధపడుతున్నారు. అధిక రక్తపోటు, మధుమేహం, వాపు, కొలెస్ట్రాల్ సమస్యలు ఇలాంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీటన్నింటికి కారణం మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లు. ఇవన్నీ కూడా రకరకాల వ్యాధులకు గురిచేస్తున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా ఊబకాయంతో బాధపడేవారి సంఖ్య ఎక్కువే ఉంది. అంతేకాదు మధుమేహం నేటికాలంలో చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య. అయితే వీటన్నింటిని నుండి విముక్తి పొందాలంటే మన జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకోవాలి. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ముఖ్యంగా చాలా మంది మొలకెత్తిన గింజలు తింటుంటారు. అందులో ప్రొటిన్, కార్బోహైడ్రెట్స్ వంటివి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే ఇప్పుడు మీకో అద్భుతమైన హోం రెమెడీని పరిచయం చేస్తాం. ఈ మొలకలను నిరంతరం మీ డైట్లో చేర్చుకున్నట్లయితే  ఎనిమిది రకాల వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. అవేంటో చూద్దాం. నానబెట్టిన మెంతిగింజలు: నానబెట్టిన మెంతి గింజలను తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అల్పాహారంలో మొలకెత్తిన మెంతిగింజలను తప్పకుండా తినాలని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.  50 ఏళ్ల తర్వాత ఇది చాలా ముఖ్యమైన అల్పాహారం. ఎందుకంటే ఇందులో అనేక పోషక అంశాలు ఉంటాయి. ఒక టీస్పూన్ మెంతి గింజల్లో ప్రోటీన్, ఫైబర్, కార్బోహైడ్రేట్లు, ఐరన్, మాంగనీస్, మెగ్నీషియం ఉంటాయి. ఇది కొలెస్ట్రాల్,  డయాబెటిస్ తగ్గిచడంతోపాటు.. జీవక్రియను వేగవంతం చేస్తుంది. మెంతి గింజల ప్రయోజనాలు: రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది అధిక రక్తపోటును తగ్గిస్తుంది విటమిన్, ఐరన్ లోపాన్ని తగ్గిస్తుంది. బాలింతల బలహీనతను తొలగిస్తుంది జుట్టు, గోర్లు పెరుగుదలకు ఉపయోగపడుతుంది. అధిక రక్త చక్కెరను నియంత్రిస్తుంది. ప్రోటీన్ లోపాన్ని తొలగిస్తుంది. మీ మెదడును మెరుగుపరచడానికి మీరు అల్పాహారంగా మెంతి గింజలను నువ్వులతో కలిపి తినవచ్చు. మెంతి గింజలు, జీలకర్రను రాత్రంతా నానబెట్టండి. ఉదయం మొలకెత్తిన ఖాళీ కడుపుతో తినండి. చక్కటి ఫలితం ఉంటుంది.

వాకింగ్ వెళ్ళేముందు చేయవలసిన.... చెయ్యకూడని పనులేంటో తెలుసుకోండి!

ఆరోగ్యం మీద స్పృహ ఉన్న ఎంతోమంది వాకింగ్ వెళుతుంటారు. ముఖ్యంగా మార్నింగ్ వాక్ చేయడం వల్ల ఆరోగ్యం బాగుంటుందని నమ్ముతారు. ఇది శరీరానికి మేలు చేస్తుంది, కండరాలను బలపరుస్తుంది, ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది, బరువును నియంత్రిస్తుంది,  గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. కానీ మార్నింగ్ వాక్ సరిగ్గా చేయకపోతే అది  ఆరోగ్యానికి  హానికరం. తప్పుగా చేసే  మార్నింగ్ వాక్ వల్ల శరీరానికి  ప్రయోజనాలు అంతగా  అందవు. అందుకే మార్నింగ్ వాక్ వెళ్లేముందు చెయ్యవలసిన, చెయ్యకూడని పనులేంటో తెలుసుకున్న తరువాత మార్నింగ్ వాక్ వెళ్లడం మంచిది. చెయ్యవలసిన పనులు.. నీళ్ళు తప్పక త్రాగాలి: మార్నింగ్ వాక్ కి వెళ్ళే ముందు కొంచెం మొతాదులో నీరు త్రాగటం అవసరం. నడక సమయంలో శరీరంలో సరైన ఆర్ద్రీకరణను నిర్వహించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఉదయాన్నే నడకకు వెళ్లేముందు నీళ్లు తాగడం వల్ల శరీరంలో ఎనర్జీ లెవెల్ పెరిగి చురుగ్గా ఉంటుంది. అందుకే మార్నింగ్ వాక్ కు వెళ్లే ముందు నీళ్లు తాగడం మంచిది. సరైన పాదరక్షలను ఎంచుకోవాలి: ఉదయం నడకకు సరైన పాదరక్షలను ఎంచుకోవడం చాలా ముఖ్యం. దీని కోసం, సౌకర్యవంతమైన, పాదాలకు సరిపోయే వాకింగ్ షూస్  ఎంచుకోండి. ఇవి కాళ్ళకు సరిగ్గా సెట్టవ్వాలి. చిన్న సైజు షూస్ లో పాదాలను ఇరికించడం చేయకూడదు, బాగా లూజుగా ఉన్నవి అస్సలే ఎంచుకోకూడదు. దీనివల్ల నడవడానికి బదులు షూస్ సవరించకోవడానికి, కాళ్ళను విదిలించుకోవడానికి సమయం సరిపోతుంది.  అందుకే మంచి గ్రిప్ ఉన్న బూట్లు ఎంచుకోవాలి. వార్మప్ కావడం తప్పనిసరి: ఉదయం నడకకు ముందు వార్మప్ కావడం  అవసరం. వార్మప్   శరీరాన్ని వేడి చేస్తుంది.  నడక కోసం  శరీర కండరాలను సిద్ధం చేస్తుంది. వైద్య శాస్త్రం ప్రకారం నడకకు ముందు 5-10 నిమిషాలు శరీరాన్ని  వార్మప్ చేయడం   అవసరం. ఇది  శరీరాన్ని వాకింగ్ కు సన్నద్దం  చేయడంలో సహాయపడుతుంది వాకింగ్ కారణంగా శరీరంలో గాయాలు కావడం, కండరాల నొప్పులు రావడం వంటి సమస్యలకు దారితీసే అవకాశాలు తగ్గిస్తుంది.   అందుకే వాకింగ్ కు ముందు వార్మప్ తప్పనిసరి. వాకింగ్ కు ముందు చెయ్యకూడనివి.. వేగం వద్దు: వాకింగ్ చేసేవారు మొదట గుర్తుపెట్టుకోవలసిన విషయం వార్మప్ తరువాత  వాకింగ్ ను మెల్లగా మొదలుపెట్టి ఆ తరువాత వేగం పెంచాలి. అంతేకానీ వార్మప్ అవ్వగానే రాముడు వదిలిన బాణంలా వేగంగా పరిగెడుతున్నట్టే నడవడం మంచిది కాదు. వేగవంతమైన నడక వల్ల లాభాలు ఉన్నప్పటికీ వాకింగ్ విషయంలో ప్రారంభంలోనే వేగం ఎప్పుడూ మంచిది కాదు. ఆహారం: చాలామంది మార్నింగ్ వాక్ వెళ్లేముందు డైటింగ్ పేరుతో బాగా తింటుంటారు. ఇందులో పోషకాహారాలే ఉన్నప్పటికీ భారీ ఆహారం తినడం వాకింగ్ కు ముందు విరుద్దమైన పని. ఒకవేళ వాకింగ్ సమయంలో నీరసంగా అనిపిస్తుందనే ఫీలింగ్ ఉంటే అరటిపండు, ఓట్స్, చిలగడదుంపలు, మంచినీళ్ళు, కొబ్బరినీళ్లు వంటి తేలికపాటి   అల్పాహారం తీసుకోవచ్చు. కానీ అల్పాహారం పేరుతో వీటిని భారీగా తీసుకోకూడదు. చాలా సింపుల్ గా అనిపించే ఈ  విషయాల గురించి అవగాహన లేకుండా వాకింగ్ చేస్తే వీటి వల్ల  ఫలితాలు లేకపోగా శరీరం దుష్ఫ్రభావాలకు లోనవుతుంది. ఒక్కోసారి పోషకాహార లోపం ఏర్పడే అవకాశం ఉంటుంది.                                                       *నిశ్శబ్ద.

అల్లం వల్ల కలిగే ఈ లాభాలు తెలుసుకుంటే దీన్ని ఇష్టపడనివారు కూడా వాడేస్తారు!

అల్లం ప్రతి ఇంట్లో ఉపయోగించే  పదార్థం.  ఇది ఆహార రుచిని పెంచడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంటుంది. దీని  లక్షణాలు, పోషకాల కారణంగా ఇది శక్తివంతమైన మూలికగా పరిగణించబడుతుంది. అల్లంలో  కార్బోహైడ్రేట్లు ,ప్రోటీన్లు, విటమిన్ సి, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్,  జింక్ వంటి అవసరమైన మూలకాలు ఉంటాయి. దీని ఔషధ గుణాలు తీవ్రమైన వ్యాధులతో సహా అనేక  సమస్యలను నివారించడంలో  నయం చేయడంలో సహాయపడతాయి. ఉదర వ్యాధులను నయం చేసే శక్తి, బరువు తగ్గించే శక్తి, జలుబు, దగ్గు నుంచి ఉపశమనం కలిగించే శక్తి అల్లంకు ఉందని, రక్తపోటును అదుపులో ఉంచే శక్తి ఉందని నమ్ముతారు. అల్లం ఎలా ఉపయోగించాలో మీరు తెలుసుకోవాలి. అల్లం ను ఎలా తీసుకోవాలి? దీనివల్ల కలిగే ఫలితాలు ఏంటి పూర్తీగా తెలుసుకుంటే.. జీర్ణశక్తికి, కడుపు నొప్పికి.. 'జింజెరాల్' అనే మూలకాలు అల్లంలో ఉంటాయి, ఇవి జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడతాయి. అల్లం తినడం వల్ల గ్యాస్, ఎసిడిటీ, అపానవాయువు లేదా ఉబ్బరం, యాసిడ్ ఏర్పడటం మొదలైన వాటి నుండి ఉపశమనం లభిస్తుంది. ఇందులో 'షోగోల్' అనే శక్తివంతమైన పదార్థాలు ఉన్నాయి, ఇది నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. జలుబు, దగ్గు, ఇన్ఫెక్షన్.. అల్లం దగ్గు, జలుబు,  ఫ్లూ సమస్యల్లో  సహజ నివారణగా ఉపయోగించబడుతుంది. అల్లంలో ఉండే శక్తివంతమైన సమ్మేళనాలు వైరస్‌లకు వ్యతిరేకంగా పోరాడటానికి,  ఇన్‌ఫెక్షన్ నుండి రక్షించడంలో సహాయపడతాయి. రక్తపోటును నియంత్రిస్తుంది.. అల్లంలో ఉండే పొటాషియం అధిక రక్తపోటును అదుపులో ఉంచుతుంది. ఇది కాకుండా, అల్లంలో ఉండే యాంటీఆక్సిడెంట్ మూలకాలు శరీరం యొక్క అంతర్గత నిర్మాణాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.  వివిధ వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడతాయి. ఒత్తిడి తగ్గిస్తుంది, కంటి చూపు మెరుగుపరుస్తుంది.. అల్లం తీసుకోవడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది.   మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది కాకుండా, అల్లంలో ఉండే విటమిన్ ఎ మరియు యాంటీఆక్సిడెంట్లు కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడతాయి. మధుమేహాన్ని నియంత్రిస్తుంది.. బరువు తగ్గేలా చేస్తుంది.. అల్లం రెగ్యులర్ గా తీసుకుంటే  రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. అల్లం తీసుకోవడం వల్ల జీర్ణక్రియతో పాటు జీవక్రియ కూడా పెరుగుతుంది కాబట్టి బరువు తగ్గడంలో సహాయపడుతుంది. అల్లం తీసుకునే పలు మార్గాలు.. అల్లాన్ని వంటలలో జోడించడమే  కాకుండా టీలో తీసుకోవచ్చు. అల్లం రసాన్ని  తేనె లేదా నిమ్మరసంతో కలిపి తీసుకోవచ్చు.  మీరు అల్లం పచ్చడి లేదా ఊరగాయగా ఉపయోగించవచ్చు. అల్లం ముక్కను ఎండబెట్టడం వల్ల అందులోని విటమిన్లు, మినరల్స్,  ఇతర పోషకాల పరిమాణం పెరుగుతుంది. తాజా అల్లం ఉత్తమమైనది, ఎందుకంటే  దానిలో అన్ని పోషకాలను పొందవచ్చు. తాజా అల్లం ముక్కలను బ్లెండర్‌లో గ్రైండ్ చేసి దాని రసాన్ని తీయాలి. ఈ జ్యూస్ను భోజనానికి  ముందు త్రాగాలి. సలాడ్‌లలో అల్లం చేర్చడం వల్ల ఆహార రుచి మెరుగవుతుంది.  ఆరోగ్య ప్రయోజనాలను కూడా  పొందవచ్చు. ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం రసం తాగడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.                                                   *నిశ్శబ్ద.