'శ్రీమంతుడిని' పొగిడిన వర్మ.. 'బాహుబలికి' కౌంటర్

  రాంగోపాల్ వర్మ అంటేనే మనకు గుర్తొచ్చేది విమర్శలు. విమర్శలకు బ్రాండ్ అంబాసిడర్ మారిపోయాడు. కానీ అప్పుడప్పుడు పొగడ్తలు కూడా చేస్తుంటారు. కానీ ఒకరిని పొగిడేప్పుడు మరోకరిని విమర్శించకుండా ఉండలేరు. మొత్తానికి విమర్శించడం రాంగోపాల్ వర్మకు చాలా ఇష్టం. ఇంతకీ ఎవరిని ప్రసంశించారనే కదా మీ సందేహం. అదే తాజాగా విడుదలైన మహేష్ బాబు మూవీ ‘శ్రీమంతుడు' సినిమాను వర్మ ప్రశంసించారు. బాహుబలి లాంటి భారీ సినిమా తర్వాత వచ్చిన ‘శ్రీమంతుడు' సింపుల్ అండ్ ప్లేన్ మూవీ అని.. సినిమా విజయం సాధించే అవకాశం ఉందని పొగిడేశారు. పొగిడితే పొగిడారు కాని అటు బాహుబలికి కూడా కౌంటర్ ఇచ్చారు. వందల కోట్లతో వందలాది రోజులు షూటింగ్ చేస్తేనే కాదు... సింపుల్ స్టోరీతో కూడా ప్రేక్షకులని ఆకట్టుకోవచ్చని అది శ్రీమంతుడు సినిమా రుజువు చేసిందని వర్మ పేర్కొన్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ విటోరియో స్టోరారో కూడా ఇదే చెప్పారని.. చార్మింగ్ ఉన్న నటుడు క్లోజప్ తో నటిస్తే అంతకంటే అద్భుతమైన విజువల్స్ ఏమీ అవసరం లేదని దానిని మహేష్ బాబు చక్కటి ఉదాహరణ అని ప్రశంసించారు.

సోనియాకు స్మృతి కౌంటర్

  పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన దగ్గరనుండి కాంగ్రెస్ నేతలు ఇప్పటివరకూ సభను సజావుగా సాగించింది లేదు. లలిత్ మోదీ వ్యవహారంలో సుష్మా స్వరాజ్ ను వసుంధరా రాజేలు రాజీనామా చేయాలని పట్టుబడుతూనే ఉన్నారు. అయితే ఈ వ్యవహారంపై సుష్మా స్వరాజ్ స్పందిస్తూ నేను తాను కేవలం క్యాన్సర్‌తో బాధపడుతున్న లలిత్‌ మోడీ భార్యకు మాత్రమే సహాయం చేశానని, నా స్థానంలో సోనియాగాంధీ ఉంటే ఏం చేసేవారని ప్రశ్నించారు. దీనికి సోనియా గాంధీ కూడా తనదైన శైలిలో సమాధానమిచ్చారు. సుష్మా స్వరాజ్ మాటల గారడీలో ఎక్స్‌పర్ట్ అని.. ఒకవేళ తాను కనుక అలాంటి పరిస్థితిలో ఉంటే డబ్బు సహాయం చేసేదాన్నని.. ఇలా చట్ట విరుద్దంగా చేసే దాన్ని కాదని అన్నారు. అయితే ఇప్పుడు సోనియా గాంధీ సుష్మా స్వరాజ్ పై చేసిన వ్యాఖ్యలకు ధీటుగా కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కౌంటర్ ఇచ్చారు. సోనియా గాంధీ ఏదైనా ప్రసంగం ఇవ్వాలంటే అంత సులభం కాదు.. ప్రసంగాన్ని పేపర్ పైన రాసుకొని చదువుకున్నాకే మాట్లాడగలరని ఎద్దేవా చేశారు.

హరీష్ కు దేవినేని కౌంటర్.. ఇరు రాష్ట్రాలకు అక్షింతలు

  ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుపై ఎప్పటినుండో వివాదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఏపీ రాష్ట్రంలోని పాజెక్టులపై తెలంగాణ.. తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ రెండూ వాదులాడుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల మధ్య లేఖల యుద్దాలు జరిగాయి. తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు పాలమూరు ప్రాజెక్టు, దిండి ప్రాజెక్టులు ఎప్పటినుండో ఉన్నాయని.. అనవసరం ఏపీ ప్రభుత్వ వీటిపై రాద్ధాంతం చేస్తుందని అన్నారు. ఈ ప్రాజెక్టులు కొత్తవి కాదు అని చెప్పడానికి చాలా సాక్ష్యాలు ఉన్నాయని అన్నారు. ఈ ప్రాజెక్టు గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే హామీ వచ్చిందని.. దీనిపై కిరణ్ కుమార్ రెడ్డి సర్వే చేసి జీవో ఇచ్చారని స్పష్టం చేశారు. దీనికి ఏపీ నీటి పారుదలశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు హరీష్ రావుకి కౌంటర్ ఇచ్చారు. సాగు నీటి పైన హరీష్ రావు వ్యాఖ్యలు ఏమాత్రం సరికాదని.. పాలమూరు - రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులు అక్రమమని అన్నారు. హంద్రీనీవా, గాలేరు నగరి ప్రాజెక్టులు పాతవేనని చెప్పారు. సుప్రీం కోర్టులో చెప్పిన దానికి భిన్నంగా పాలమూరు, డిండి ప్రాజెక్టులు ప్రారంభించారన్నారు. ఇరు రాష్ట్రాలకు అక్షింతలు మరోవైపు నీటి ప్రాజెక్టులపై విమర్శలు చేసుకుంటూ రెండు రాష్ట్రాలు అసలు విషయం మరచిపోయినట్టున్నాయి. 2014-15 జల సంవత్సరానికి సంబంధించి వినియోగించుకున్న నీటికి సంబంధించిన వివరాలు తెలుపమని కృష్ణా జలాల యాజమాన్య బోర్డు కొద్ది రోజుల క్రితమే ఇరు రాష్ట్రాలను కోరింది. అయితే రెండు రాష్ట్రాలు మాత్రం ఈ విషయాన్ని పక్కన బెట్టి నీటి వాటాలపై నిత్యం తగవులాడుకుంటున్నాయి. దీంతో కృష్ణా రివర్ బోర్డు నీటి వాటాలపై లెక్కలు సమర్పించడంలో తాత్సారం చేస్తున్న విషయమై ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే ఏఏ ప్రాజెక్టులకు ఎంత వాటా వినియోగించుకున్నారో ప్రాజెక్టుల వారీగా పూర్తి వివరాలు తెలపాలని ఆదేశాలు జారీ చేసింది.

తెలంగాణలో కోదండరాం కొత్త పార్టీ?

  తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న టీఆర్ఎస్ కు ఆ రాష్ట్రంలో ఎలాంటి డోకా లేదు. ప్రతిపక్ష పార్టీలు ఉన్నా పోటీ చేసి అధికారంలోకి వస్తాయన్న నమ్మకం లేదు. కాని ఇప్పుడు తెలంగాణలో మరో పార్టీ రాబోతుంది అనే వార్తలు జోరుగాసాగుతున్నాయి. అది ఎవరో కాదు తెలంగాణ ఉద్యమం సమయంలో ఆ రాష్ట్రాన్ని సాధించడానికి ముఖ్య పాత్ర పోషించిన టీజేఏసీ చైర్మన్‌ కోదండరాం. ఆ పార్టీకి ఈయన సారథ్యం వహించనున్నారా అంటే అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి. దీనికి కారణం ఢిల్లీలో ఆప్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ముఖ్య కారకులైన యోగేంద్ర యాదవ్‌ అని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై చాలామంది అసంతృప్తి కరంగానే ఉన్నారు. ఉద్యమ సమయంలో అందరిని కలుపుకున్న కేసీఆర్ ఆ తరువాత ఎవరిని పట్టించుకోకపోవడం.. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం.. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడం వీటన్నింటిపై కోదండరాం ఇంతకుముందే వ్యతిరేకించారు.   అయితే ఆప్‌ నుంచి బయటకు వచ్చిన యోగేంద్ర యాదవ్‌ ఆ తర్వాత ‘స్వరాజ్‌ అభియాన్‌’ అనే కొత్త వేదికను ప్రారంభించారు. ఈ ‘స్వరాజ్‌ అభియాన్‌’ వేదిక ద్వారా ఆయా రాష్ట్రాల ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఎండగట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ వేదిక ద్వారానే తెలంగాణ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై దృష్టి సారించారు. ఈనేపథ్యంలోనే కోదండరాంతో కూడా చాలా సార్లు సమావేశమయ్యారు. దీనిలో భాగంగానే యోగేంద్ర యాదవ్ కోదండ రాంతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అసలే టీఆర్ఎస్ వైఖరితో ఆసంతృప్తితో ఉన్న కోదండరాం యోంగేంద్ర యాదవ్ తో కలిసి పని చేయడానికి సముఖత చూపినట్టు రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు. దీనిలో భాగంగానే ఆప్‌ తరహాలో తెలంగాణలో జాప్‌ (జాయింట్‌ యాక్షన్‌ పార్టీ)ని ఏర్పాటు చేయాలని కూడా యోగేంద్ర సూచించినట్లు తెలిసింది. అయితే, దీనిపై ఇంకా కోదండరాం తుది నిర్ణయం తీసుకోలేదు అలాగని తోసిపుచ్చనూ లేదు. ఈ నేపథ్యంలో ఈనెల పదిన వీరిద్దరి మధ్య కీలక సమావేశం జరగనుందని అత్యంత విశ్వసనీయ వర్గాలు వివరించాయి. మరి ఇన్ని రోజులు మాకు ఎవరూ పోటీరారని ఎగిరిపడుతున్న టీఆర్ఎస్ కు ఒకవేళ కోదండరాం కనుకు పార్టీ పెడితే టీఆర్ఎస్ కు చెక్ పడినట్టే అని భావిస్తున్నారు.

ఇరు రాష్ట్రాల వాదనలు పక్కన పెట్టండి..

  ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు విద్యార్ధుల విషయంలో వ్యవహరిస్తున్న తీరుపై ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు మండిపడింది. విద్యార్ధుల వివాదంలో ఇరురాష్ట్రాలు వాదనలు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర పభుత్వం కేవలం తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే నోటిఫికేషన్లు జారీ చేసే విధంగా నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అంబేద్కర్ యూనివర్శిటీ ఏపీ విధ్యార్ధులకు అందిస్తున్న సేవలను నిలిపి వేసింది. అంతేకాదు ఈ వర్శిటీలో పనిచేసే ఉద్యోగులకు ఈ నెల నుండి జీతాలు కూడా చెల్లించేది లేదని తేల్చి చెప్పింది. అయితే ఈ విషయంపై విచారణ జరిపిన హైకోర్టు మీ రెండు రాష్ట్రాల వాదనలు పక్కన పెట్టి విద్యార్ధులకు నష్ట జరగకుండా చూడండి అని సూచించింది. అయితే ఈ విషయంపై తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది వాదిస్తూ ‘‘బీఆర్‌ఏవోయూ పదో షెడ్యూలులో ఉంది. తెలంగాణ రాష్ట్ర విడిపోయిన తరువాత కూడా ఏడాది వరకూ ఇరు రాష్ట్రాల్లోని విద్యార్ధులకు సేవలు అందించాం.. తెలంగాణలోనే కాదు అటు ఆంధ్రాలో ఉన్న 93 బీఆర్‌ఏవోయూలో ఉన్న శాశ్వత, కాంట్రాక్టు, తాత్కాలిక సిబ్బందికి కూడా తెలంగాణ ప్రభుత్వమే జీత భత్యాలు చెల్లిస్తుంది. కానీ చట్ట ప్రకారం చట్ట ప్రకారం ఏడాది ముగిసిన తర్వాత వర్సిటీతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉంది. దీనికి సంబధించి ఏపీ ప్రభుత్వానికి లేఖలు కూడా రాశాం. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం స్పందించలేదు’’ అని కోర్టు దృష్టికి తెచ్చారు.   దీంతో హైకోర్టు ఏపీ ప్రభుత్వం ఉద్దేశించి మీ రాష్ట్రంలో విద్యార్ధులు నష్టపోతుంటే మౌనంగా ఎందుకు ఉంటున్నారు? మీ వాదనల వల్ల విద్యార్ధులు ఎంత నష్ట పోతున్నారో తెలియడం లేదా అని మండిపడింది. అయితే ఏపీ ఏజీ పి.పి.వేణుగోపాల్‌ మాట్లాడుతూ 10వ షెడ్యూల్‌లోని సంస్థలపై వివాదం కొనసాగుతోందని, దీనిపై ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించిందని, అక్కడ కేసుల విచారణ పెండింగ్‌లో ఉందని వేణుగోపాల్‌ తెలిపారు. దీంతో ధర్మాసనం కల్పించుకొని మేము పదో షెడ్యూల్‌లోని సంస్థలపై ఉన్న వివాదంలోకి వెళ్లడం లేదు మీ రెండు రాష్ట్రాల వివాదాల వల్ల విద్యార్ధులు నష్ట పోతున్నారు.. వారి కోసం మీ వివాదాలు పక్కనపెట్టి ఇరు రాష్ట్రాల అధికారులు, ఏజీలు మాట్లాడుకొని ఓ నిర్ణయం తీసుకోండి అంటూ సూచించింది. దీనిపై రెండు రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయమేమిటో తెలపాలంటూ తదుపరి విచారణను ఈనెల 13కి వాయిదా వేసింది.

ఏపీ సచివాలయం 50 అంతస్తులు!

  ఏపీ రాజధాని అమరావతిలో ప్రభుత్వ కార్యలయాల నిర్మాణానికి గాను, వాటికి సంబధించిన ప్రణాళికకు గాను ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే నెల రోజుల్లో తాత్కాలిక రాజధానిని ఏర్పాటు చేసి హైదరాబాద్ లో ఉన్న కొన్ని శాఖలను ఏపీ ప్రభుత్వం అక్కడి నుండి ఇక్కడికి తరలించాలని నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే ప్రజలకు దగ్గరగా పాలన చేయాలనే ఉద్దేశంతో ముందుగా ప్రభుత్వ కార్యాలయాలను నిర్మించాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. దీనిలో భాగంగానే ముందుగా అమరావతిలో ఫేజ్‌-1 భాగమైన అసెంబ్లీ, సచివాలయం, ప్రధాన కార్యాలయాలు, ఉద్యోగుల గృహాలు తదితర భవనాల నిర్మాణ కార్యక్రమాలను త్వరితగతిన చేపట్టేందుకు సీఆర్‌డీఏ సన్నద్ధమవుతోంది.   ఈ నేపథ్యంలో ఏపీలో అసెంబ్లీ, సచివాలయాల నిర్మాణాలను ప్రపంచస్థాయి కట్టడాలుగా నిర్మించాలని సన్నాహాలు చేస్తున్నారు. రాజధానిలో సచివాలయాన్ని 50 అంతస్తుల్లో విశాలమైన గదులతో.. అందే విధంగా సీఎం క్యాంపు కార్యాలయాన్ని దీనిలోనే 47 లేదా 48వ అంతస్తులో నిర్మించాలని సీఆర్‌డీఏ భావిస్తోంది. ఇప్పటికే వీటి నిర్మాణానికి సరైన డిజైన్ ను ఇచ్చేందుకు కొన్ని సంస్థలు ముందుకొచ్చాయి. అయితే మరో రెండు మూడు రోజుల్లో వీటిలో ఒక మంచి సంస్థకు ఈ డిజైనింగ్ బాధ్యతను ఇవ్వనున్నారు. అంతేకాదు అసెంబ్లీని కూడా తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా నిర్మించాలని భావిస్తున్నారు.

ఫోన్ ట్యాపింగ్.. లోకేష్, బ్రాహ్మణి ఫోన్లు కూడా

  ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఏపీ పోలీసుల దర్యాప్తులో కొత్త కొత్త అంశాలు వెలుగుచూస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఏపీ అధికారుల ఫోన్లు ట్యాపింగ్ చేసిందని దానికి సంబంధించిన పలు ఆధారాలతో కూడిన నివేదికను ఏపీ ప్రభుత్వం పదిరోజుల క్రితమే కేంద్ర ప్రభుత్వానికి అందజేసింది. అంతేకాదు దానిలో ఫోన్ ట్యాపింగ్ కు తలపడిన పలు అధికారుల పేర్లును కూడా పేర్కోంది. ఏపీ సీఎం చంద్రబాబు, తనయుడు నారా లోకేశ్ తోపాటు పలు అధికారుల ఫోన్లు జరిపినట్టు చెపుతున్నారు. అయితే ఇప్పుడు ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఒక్క నోటుకు ఓటు వ్యవహారం విషయంలో కాకుండా మరెన్నో లక్ష్యాలతో ఏపీ ప్రభుత్వ పెద్దల ఫోన్లను ట్యాప్ చేసినట్టు ఏపీ పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి. ఏపీ రాజధానిలో పెట్టుబడులు పెట్టడానికి గాను చంద్రబాబు సింగపూర్ జపాన్ ప్రతినిధులతో మాట్లాడిన సంభాషణలు, ఇంకా ముఖ్యమైన అధికారుల కుటుంబ సభ్యుల సంభాషణలు కూడా తెలంగాణ ప్రభుతం ట్యాపింగ్ చేసినట్టు ఏపీ పోలీసులు పేర్కొంటున్నారు. అంతేకాదు సీఎం తనయుడు నారా లోకేశ్ తన భార్య బ్రహ్మిణి ల ఫోన్ సంభాషణలు.. వ్యాపార, వ్యక్తిగత విషయాలనూ తెలంగాణ పోలీసులు ట్యాపింగ్‌ ద్వారా తెలుసుకున్నట్లు ఏపీ పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. ఏపీ ప్రభుత్వం హైకోర్టులో ఈ వ్యవహారంలో కౌంటర్ పిటిషన్ దాఖలు చేయనున్న నేపథ్యంలో ఈ అంశాలన్నీ పొందుపరచనున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.   అయితే ఈ కేసులో ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అవును మేము ట్యాపింగ్ చేశాము.. అది మా హక్కు.. చట్టప్రకారమే ఫోన్ ట్యాపింగ్ చేశామని బహిరంగంగానే వెల్లడించాయి. వారు చెప్పిన చట్టం ప్రకారం అంటే టెలిగ్రాఫ్‌ చట్టంలోని సెక్షన్‌ 52 ఆధారంగా దేశ భద్రత, శాంతి భద్రతలకు భంగం కలిగించే వ్య క్తుల ఫోన్లు ట్యాపింగ్‌ చేయవచ్చు. అలా ట్యాపింగ్ చేయడానికి కూడా కొన్ని షరతులుంటాయి.. ముందుగా దీనికి సంబంధించి కేంద్ర హోంశాఖ నుండి అనుమతి తీసుకొని అప్పుడు ట్యాపింగ్ చేయాలి. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం అవేమీ లేకుండా తనకి ఇష్టం వచ్చినట్టు వ్యవహరించింది. ఇప్పుడు వాళ్లు చట్ట ప్రకారమే అంటున్నా ఆచట్టాన్నే కనుక తీసుకుంటే వాళ్లు చెప్పిన దాని ప్రకారం దేశ భద్రత, శాంతి భద్రతలకు భంగం కలిగించే వ్య క్తుల లిస్టులోకి ఎవరూ రారు. ఆ ప్రకారం తెలంగాణ ప్రభుత్వం ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అడ్డంగా బుక్కయింది. మొత్తానికి తీగ లాగితే డొంకంతా కదిలి అన్నట్టు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చాలా కొత్త విషయాలు బయటపడుతున్నాయి. ఇంకా ఎన్ని విషయాలు బయటపడతాయో చూడాలి.

వాళ్లను తిడితే వీళ్ల కడుపు నిండుతుందా.. రేవంత్ రెడ్డి

  తెలంగాణ సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ఏడాది పాలనలో ఆయన రాష్ట్రానికి చేసిందేమీ లేదని.. తెలంగాణ సిద్దాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ గ్రామాన్ని చూస్తే తెలంగాణ పాలన ఎంత దారుణంగా ఉందో అర్ధమవుతుందని ఎద్దేవ చేశారు. లేచిన దగ్గర నుండి ఆంధ్రా వాళ్లను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని.. వాళ్లని తిట్టడంవల్ల తెలంగాణ రాష్ట్రానికి వచ్చేది ఏం లేదని.. వాళ్లని విమర్శించినంత మాత్రాన తెలంగాణ ప్రజల కడుపు నిండదని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కొనుగోలు చేసిన వందలాది కార్లు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కుమారుడి షోరూమ్‌లో కొన్నవేనని చెప్పారు. యాదగిరి గుట్ట డిజైన్ ఇచ్చింది కూడా ఆంధ్రాకు చెందిన వ్యక్తే అని తెలిపారు. ప్రతి పనిని ఆంధ్రా వారితోనే కలసి చేస్తున్న కేసీఆర్... హైకోర్టు విభజనకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అడ్డొస్తున్నారని ఎలా అంటారని ప్రశ్నించారు. తన మీద కక్ష్యతో తన నియోజకవర్గమైన కొడంగల్ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని.. అది సరికాదని.. అలా చేస్తే ప్రభుత్వాన్ని నిలదీస్తానని అన్నారు.

ఫోన్ ట్యాపింగ్ ఆధారాలు.. చంద్రబాబు దూకుడు

  ఓటు నోటు కేసు వ్యవహారంలో ఫోన్ ట్యాపింగ్ ఉదంతంలో ఆసక్తికర విషయాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే సర్వీసు ప్రొవైడర్లు కాల్ డేటాను కోర్టుకు సమర్పించారు. అయితే ఇప్పుడు సీఎం చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ పై తన దూకుడుని ప్రదర్శించబోతున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం తమ ఫోన్లు ట్యాపింగ్ చేశారని గతంనుండి చెబుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో సర్వీసు ప్రొవైడర్లు కూడా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఫోన్లు ట్యాపింగ్ చేశామని కూడా చెప్పారు. దీనిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ ఫోన్లను ట్యాప్ చేయడానికి బాధ్యులైన కొంతమంది తెలంగాణ అధికారుల పేర్లతో తయారు చేసిన నివేదికను క్రితమేకేంద్రానికి సమర్పించినట్లు తెలుస్తోంది. ఇందులో ఇద్దరు ఐఎఎస్, ఇద్దరు ఐపిఎస్ అధికారులు పేర్లు నమోదు చేసినట్టు తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు ఆయన కుమారుడు నారా లోకేష్ తోపాటు పలువురు అధికారుల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్టు దానికి సంబంధించిన ఆధారాలు ఏపీ ప్రభుత్వం సాధించినట్టు చెబుతున్నారు.   ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై చంద్రబాబు కూడా తెలంగాణ ప్రభుత్వంపై గట్టిగానే చర్యలు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆధారాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని.. వివరమైన నివేదిక ఉండాలని ఏసీబీ అధిపతిని ఆదేశించినట్టు సమాచారం. గతంలో ఉన్న నివేదిక కంటే ఇప్పుడు తయారుచేసే నివేదిక మరింత క్లియర్ గా ఉండాలని ఆదేశించినట్టు తెలుస్తోంది. అయితే మొదటి నుండి ఫోన్ ట్యాపింగ్ చేయలేదని చెప్పిన తెలంగాణ ప్రభుత్వం మొత్తుకుంది.. కానీ ఆతరువాత సర్వీసు ప్రొవైడర్లు చేశామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వ అధికారులు మేం ఫోన్ ట్యాపింగ్ చేశాం.. ఫోన్ ట్యాపింగ్ చేయడం తెలంగాణ హక్కు అని చెప్పారు. మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ పై తెలంగాణ ప్రభుత్వం కూడా పరోక్షంగా ఫోన్ ట్యాపింగ్ చేశానని చెప్పింది. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కూడా దీనికి సంబంధించిన ఆధారాలు కూడా సేకరించింది. మరి ఇప్పుడు ఈ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం ఎలా తప్పించుకుంటుందో చూడాలి మరి.

యాకుబ్ ను ఉరితీసిన తలారికి 10వేల చెక్

  ముంబై వరుస పేలుళ్ల కేసులో ముంబై పేలుళ్ల దోషి యాకుబ్ మెమెన్‌ను ఉరి తీసిన సంగతి తెలిసిందే. అయితే యాకుబ్ ను ఉరితీసిన తలారికి పదివేల రూపాయల చెక్ ను పంపించారు. కర్ణాటకకు చెందిన అంబికా పదవి పూర్వ విద్యాలయకు చెందిన కొందరు విద్యార్థి నాయకులకు తలారికి పదివేలు చెక్ పంపిస్తూ.. ముంబైలో యాకుబ్ చేసిన మారణ హోమంలో ఎంతోమంది అమాయకుల ప్రాణాలను బలిగొన్నారని.. అలాంటి యాకుబ్‌ను ఉరి తీసిన తలారిని గౌరవించడం తమకు చాలా గర్వంగా ఉందని మహారాష్ట్ర డీజీపీకి లేఖ రాశారు. అందుకే తలారికీ పదివేల చెక్ ను పంపించాలని నిర్ణయం తీసుకున్నామని లేఖలో పేర్కొన్నారు.

'శ్రీమంతుడిని' తెగ పొగిడేస్తున్న యాంకర్

    ఇప్పటికే 'శ్రీమంతుడు' సినిమా కోసం థియేటర్లన్నీ హౌజ్ ఫుల్ అయిపోయాయి. ఈ సినిమా కోసం అభిమానులు అందరూ ఎంతో ఆత్రురతగా ఎదురుచూస్తున్నారు అందులోనూ మహిళా అభిమానులు. ఎందుకంటే మహేశ్ బాబు లేడీ ఫ్యాన్స్ ఎక్కువని చెప్పనవసరం లేదు. సినిమా పేరుకు తగ్గట్టుగానే ఈ సినిమాలో మహేశ్ బాబు లుక్ కూడా అదుర్స్ అనిపించేలా ఉంది. బాహుబలి తర్వాత ప్రేక్షకులు ఎదురుచూస్తున్న సినిమా ఏదంటే అది 'శ్రీమంతుడే' అందులో సందేహం లేదు. మరి అలాంటి 'శ్రీమంతుడు' మన ముందుకు వచ్చేస్తున్న సందర్భంగా ఒక లేడీ ఫ్యాన్ మహేశ్ బాబును తెగ పొగిడేస్తుంది. మరి ఆమె పొగడ్తలు మీరే చూడండి ఒకసారి.  

సోనియమ్మ.. అంత పెద్ద మాటలెందుకమ్మా

  పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుండి కాంగ్రెస్ నేతలు చేసే రచ్చ అంతా ఇంతాకాదు. సమావేశాలు ప్రారంభమైనప్పటి నుండి లలిత్ మోదీ విషయంలో సుష్మా స్వరాజ్, వసుంధరా రాజేలు రాజీనామా చేయాలంటూ పార్లమెంట్ లో ఆందోళనలు చేశారు. ఈ నేపథ్యంలో స్పీకర్ 25 ఎంపీలను 5 రోజులపాటు సస్పెండ్ చేశారు. ఇప్పుడు ఈ ఎంపీలను సస్పెండ్ చేసినందుకు గాను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ నేతలు పార్లమెంట్ ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద నల్లబ్యాడ్జీలు కట్టుకొని నిరసనలు చేస్తున్నారు. అయితే సోనియాగాంధీ చేస్తున్న ఉద్యమానికి అటు మద్దుతు సంగతి పక్కన బెడితే పాపం విమర్శించేవాళ్లే ఎక్కువగా ఉన్నారు. వాళ్లు చేసే విమర్శల్లో నిజంకూడా లేకుండా పోలేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు తెలుగు ప్రజలను విడగొడుతూ అతి దారుణంగా రాష్ట్ర విభజన చేసిన సోనియాగాంధీ ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం చాలా ఆశ్చర్యంగా ఉందంటూ విమర్శల బాణాలు విసురుతున్నారు.     రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ లో వ్యవహరించిన తీరు చూస్తే అప్పుడు తప్పు అనిపించని సోనియాగాంధీకి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎంపీలను సస్పెండ్ చేస్తే ఇప్పుడు తప్పునిపిస్తుందా అని రాజకీయ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నారు. తమ పార్టీ ఎంపీలను ఏదో 5 రోజులపాటు సస్పెండ్ చేసినందుకు ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని ఆమె అరిచిగీపెడుతున్నారు. రాష్ట్ర విభజన చేసేప్పుడు పార్లమెంట్ లో ఆందోళన చేస్తున్న ఏంపీలను సస్పెండ్ చేసి.. తలుపులు మూసేసి ఆఖరికి మీడియా కూడా ఆపేసి బిల్లును పాస్ చేసినప్పుడు సోనియాకు అప్పుడు తను ప్రజాస్వామ్యాన్నిఖూనీ చేశారని గుర్తకు రాలేదేమో. ఆఖరికి తన పార్టీ ఎంపీ అయిన లగడపాటి రాజగోపాల్‌ను సైతం పార్లమెంట్ నుండి బయటకు పంపించి మరీ రాష్ట్రాన్ని విడదీశారు. రాష్ట్రంలో మొత్తం 8 కోట్ల మంది తెలుగు ప్రజలను వారి పార్టీ ప్రయోజనాల కోసం రాజకీయ కుతంత్రాలు చేసి ఇప్పుడు నీతులు వల్లిస్తున్నారు. అయితే తెలంగాణ ప్రజలు రాష్ట్ర విభజనకు ఒప్పుకున్నా మరోవైపు ఏపీ రాష్ట్ర ప్రజలు నాలుగు కోట్లు జనాభా రాష్ట్రాన్ని విడదీయొద్దు అంటూ ఎన్ని ఆందోళనలు చేశారో.. మూడు నెలలు పాటు అందరూ వారి పనులు మానుకొని రోడ్ల మీదకొచ్చి మరీ అంత పోరాటం చేసినా ఏదో బర్తడే కేక్ కట్ చేసి తలో ముక్క ఇచ్చినట్టు కూడా రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా విడదీసిన సోనియాను ఏమనాలి.   అందుకే దీనికి సరైన రీతిలో కాంగ్రెస్ ను చిత్తు చిత్తుగా ఓడించి అధికారం లేకుండా చేశారు. ఇంక కొన్ని సంవత్సరాలు అయినా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనే నమ్మకం అయితే ఎవరికీ లేదు. అయినా వీళ్లు మాత్రం మారారా అంటే మారలేదు. పైగా ఇప్పుడు రైతు ఆత్మహత్యలకు గాను రైతు భరోసా యాత్రలు చేయడం.. అసలు గత పదేళ్ల ప్రభుత్వ హయాంలో ఎన్నడూ రైతు హత్యల గురించి మాట్లడని రాహులు ఈ యాత్రలు చేయడం ఎవరిని మభ్యపెట్టడానికి అని రాజకీయ వర్గాలు కూడా మండిపడ్డాయి. ఇన్ని చేసిన కాంగ్రెస్ పార్టీకి తాము తప్పు చేసింది తెలియదు కాని ఇప్పుడు ఎన్డీయే ప్రభుత్వం చేసింది తప్పని గగ్గోలు పెడుతుంది. అప్పుడు తప్పుకానిది ఇప్పుడు తప్పుకాదా? అప్పుడు ప్రజాస్వామ్యం కూనీ కాలేదు కాని ఇప్పుడు కూనీ అయ్యిందా? వాళ్లు చేస్తే న్యాయం అనిపించింది ఇప్పుడు అన్యాయం అనిపిస్తుందా? ఇలా అనుకుంటే ఎన్నోప్రశ్నలు తలెత్తుతాయి. కాబట్టి సోనియా గాంధీ గారు ధర్నా చేస్తే చేశారు కాని.. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారు.. ఇది అన్యాయం అంటు పెద్ద పెద్ద మాటలు మాట్లాడకుంటే చాలు.

శ్రీవారి లడ్డూకి 300 ఏళ్లు

తిరుపతి శ్రీవారి లడ్డూ అంటే ఇష్టపడని వారు ఉండరూ. దానికున్న ప్రత్యేకతే వేరు. మరి అంతమంది ఇష్టపడే ఈ లడ్డూ తయారీ ఇప్పటికీ 300 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ లడ్డూను మొదట ఆగష్ట్ 2, 1715 సంవత్సరంలో శ్రీ వెంకటేశ్వరునికి ప్రసాదంగా తయారుచేసినట్టు అధికారులు తెలిపారు. తిరుమల ఆలయం ప్రపంచంలోనే అత్యదిక సంపద కలిగిన హిందూ దేవాలయం. ఈ ఆలయం ఎంత ఫేమస్సో లడ్డూ కూడా అంతే ఫేమస్సు. ఈ ఆలయానికి ఎక్కడెక్కడినుండో జనాలు వస్తుంటారు. ధన, పేద అనే తేడా లేకుండా అందరూ ఈ ఆలయానికి వస్తుంటారు. శ్రీవారిని దర్శించుకుని వచ్చే ప్రతి ఒక్కరికీ ఈ లడ్డూలను ప్రసాదంగా అందిస్తారు. 300 గ్రాముల బరువున్న ఈ లడ్డూను రూ. 25 ధరపై విక్రయిస్తారు. సబ్సిడీ కింద ఈ లడ్డూను రూ. 10కే విక్రయిస్తుంటారు. తిరుమల తిరుపతి దేవస్ధానం లెక్కల ప్రకారం 2014లో మొత్తం 9 కోట్ల లడ్డూలను భక్తులకు విక్రయించారు.

రెండు రాష్ట్రాలు పట్టించుకోవడం లేదు..

  రాష్ట్రవిభజన సమయంలో ముఖ్యంగా భద్రాచలంలోని ముంపు మండలాలపై ఇరు రాష్ట్రాల మధ్య చాలా గొడవలే జరిగాయి. ఆ ముంపు మండలాలు కూడా మమ్మల్ని తెలంగాణలోనే కలపండి అని మొత్తుకున్నాయి. కానీ కేంద్రం నాలుగు మండలాలను ఏపీలో కలిపింది. అయితే ఇప్పుడు ఈ విషయంపై సిపిఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య ఆవేదన వ్యక్తం చేశారు. భద్రాచలం నియోజకవర్గంలోని నాలుగు మండలాలను అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ఏపీలో కలిపిన నాలుగు రాష్ట్రాలను ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని.. వాటి అభివృద్ధికి ఏపీ, తెలంగాణలు నిధులివ్వాలన్నారు. ప్రజలకు ఎలాంటి న్యాయం చేయలేకపోతున్నానని వాపోయారు. ఏపీ అసెంబ్లీలో తనకు అసోసియేటెడ్ సభ్యుడిగా అవకాశం కల్పించాలని అక్కడి ప్రభుత్వానికి సూచనలు చేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ను కలిసి ఆయన వినతి పత్రం ఇచ్చారు.

చంపడం.. చావడంలో మజా ఉంది..

  పాకిస్తాన్ ఉగ్రవాది ఉస్మాన్ దీ కాశ్మీర్‌లో బిఎస్ఎఫ్ జవాన్లపై కాల్పులు జరిపి నిన్న పోలీసులు చిక్కిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఉస్మాన్‌దీ ని చూస్తుంటే గతంలో పట్టుబడ్డ కసబ్ కు మరో రూపంలో ఉండటం ఆశ్చర్యం. కసబ్ పట్టుబడినప్పుడు కూడా అతడి కళ్లలో భయం కాని.. బాధ కాని కనిపించలేదు సరికదా.. పైగా వెకిలి నవ్వులు చేష్టలు చేసేవాడు. సాధారణంగా ఇలాంటి ఉగ్రవాదులను వాళ్లను ట్రైనింగ్ చేసేప్పుడే చాలా కఠినంగా చేస్తారు. అందుకే వాళ్లుకు భయం కాని ప్రాణాల మీద ఆశ కాని ఉండవు. ఇప్పుడు ఉస్మాన్‌దీ కూడా అంతే ఎలాంటి భయం లేకుండా కెమెరా ముందు కూర్చుని పోలీసులు వారు అడిగే ప్రశ్నలకు చాలా ప్రశాంతంగా సమాధానం చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు. పైగా అతని మాటలు తనలోకి పైశాచికానికి నిదర్శనంగా నిలిచాయి. తాను చెప్పిన వివరాలు.. తాను నెలరోజుల కిందటే భారత్ లోకి రావడానికి ప్రయత్నించి తమకు దారి చూపించాల్సిన వ్యక్తి రాకపోవడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారట. అయితే మళ్లీ తాను తన సహచరుడు మొమిన్ ఖాన్ తో కలిసి 12 రోజుల కింద్రటే కాశ్మీర్ లోకి అడుగుపెట్టామని.. ఇక్కడి హిందువులను చంపడానికి వచ్చామని చెప్పాడు. అయితే ఈ పదిరోజులు అడవుల్లో తిరిగి నిన్నబీఎస్‌ఎఫ్‌ జవాన్లపై దాడి చేశామని చెప్పాడు. అయితే ఈ కాల్పుల్లో తనతో వచ్చిన మొమిక్ ఖాన్ చనిపోయాడని నేను పట్టుబడ్డానని ఎంచక్కా నవ్వుకుంటూ సమాధానం చెపుతున్నాడు. తాను కూడా మొమిక్ లాగా చనిపోయినా బాధ పడేవాడికి కాదని.. అదంతా అల్లా కార్యం అని అనుకునేవాడినని.. అయినా చంపడం.. చావడంలో మజా ఉంటుందని చెప్పేసరికి అందరూ ఆశ్చర్యపోయారు. మరీ కసబ్ ను పట్టుకుని అతనిని శిక్షించడానికి చాలా సంవత్సరాలు పట్టింది. దానికి తోడు కోట్లకు కోట్లు ఖర్చు. ఇప్పుడు ప్రాణాలతో పట్టుబడ్డ ఈ ఉన్నాదిని శిక్షించేసరికి ఎన్నిసంవత్సరాలు పడుతుందో ఎంత ఖర్చవుతుందో మన ప్రభుత్వానికి.

అదే మా లక్ష్యం.. జైట్లీ

  రాష్ట్ర విభజన వల్ల ఆంధ్రరాష్ట్ర ఆర్ధికంగా ఎంతో ఇబ్బంది పడుతోందని.. ఒక్క హైదరాబాద్ లేకపోవడంవల్ల ఏపీ ఆదాయానికి గండి పడిందని కేంద్ర కేంద్ర ఆర్థికశాఖా మంత్రి అరుణ్‌జైట్లీ అన్నారు. హైదరాబాద్ నగరం దేశంలోనే గర్వించదగ్గ నగరమని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాపై ఆలోచనలు చేస్తున్నామని.. భవిష్యత్ లో ఏపీకి ఆర్ధికంగా సహాయపడటమే తమ లక్ష్యమని.. ప్రత్యేకహోదా అనేది తమ అంజెండాలో ఉందని అన్నారు. ఆర్థికలోటు భర్తీ, రాజధాని నిర్మాణానికి సహకరిస్తామని తెలిపారు. అభివృద్ధి అంశంలో తమకు ఏపీ ప్రధానమైనదని జైట్లీ పునరుద్ఘాటించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విడదీసి ఏపీకీ తీరని నష్టాన్ని మిగిల్చిందని.. అలాంటి కాంగ్రెస్‌కు ఏపీ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు.

జనసేనలోకి చిరంజీవి..!

  ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ ఎంటంటే సినీనటుడు, ప్రస్తుత కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు చిరంజీవి, తన తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయంటూ రాజకీయ వర్గాలు చెవులుకొరుక్కుంటున్నారు. త్వరలోనే ఈ అన్నాదమ్ములిద్దరూ చేతులు కలుపుతారని ఊహాగానాలు చెలరేగుతున్నాయి. అయితే వీళ్లిద్దరూ కలవడానికి ఒక వ్యక్తి ప్రయత్నిస్తున్నాడట. అది ఎవరో కాదు చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజట. గత కొంత కాలంగా ఈ అన్నాదమ్ములిద్దురూ ఎడమొహం, పెడమొహంగా ఉంటున్నారన్న సంగతి తెలిసిందే. ఏదో పైకి అలా ఏం లేదు అని వారు చెప్పినా చూసే వారికి మాత్రం అర్ధమవుతోంది. అయితే ఇప్పుడు మన హీరో రామ్ చరణ్ తేజ నాన్న బాబాయి లను కలిపేందుకు ఇద్దరినీ ఒకే గొడుగు కిందికి తెచ్చేందుకు మధ్యవర్తిత్వం చేస్తున్నారట. అంతేకాదు రామ్ చరణ్ తేజకు అల్లు అర్జున్ కూడా సహకరిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా జనసేన పార్టీలోకి రావడానికి చిరంజీవి కూడా సముఖత చూపించినట్టు.. ఎప్పటినుండో వెయిటింగ్ లో ఉన్న తన 150 వ చిత్రం అయిపోయిన వెంటనే జనసేనలోకి వచ్చి రాజకీయాలను పూర్తి స్థాయిలో నడిపే ఆలోచనలో చిరంజీవి ఉన్నట్లు చెబుతున్నారు. మరి అన్నాదమ్ములిద్దరూ ఒకే పార్టీలోకి ఉండి రాజకీయాల్లో ఎంత వరకూ అదరగొడతారో చూడాలి.