చెన్నైలో మళ్లీ వర్షం..
చెన్నై మహానగరంలో మళ్లీ వర్షం మొదలైంది. వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించినట్టే మళ్లీ వర్షం ప్రారంభమైంది. చెన్నైలోని తాంబరం, తరమణి, ముడిచూర్, రామాపూర్, అడయార్, అశోక్ నగర్, విల్లిపాక్కం, మనపాక్కం మొదలైన నగరాలు జలమయమయ్యాయి. ఇప్పటికే గత నాలుగైదు రోజుగా కురుస్తున్న వర్షం కారణంగా వరదలతో భవనాలు, అపార్ట్ మెంట్లు, అన్నీ నీటితో నిండిపోగా ఇప్పుడు మళ్లీ వర్షం కురుస్తుండటంతో సహాయ చర్యలకు ఆటంకం కలుగుతుంది. మరోవైపు ఆహారం, నీటి కోసం చెన్నైవాసుల ఎదురుచూస్తున్నారు.