ప్రారంభమైన మహా సంకల్ప సభ..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన నవ నిర్మాణదీక్ష ముగింపు కార్యక్రమం కడప నగరంలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా కడప మున్సిపల్ మైదానంలో మహా సంకల్ప సభను చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి గంటా శ్రీనివాసరావు, నారా లోకేశ్, ఎంపీ సీఎం రమేష్, ఏపీ ఎన్జీవో సంఘం నేత అశోక్బాబు, పలువురు మంత్రులు హాజరయ్యారు.