రాజ్యసభలో రచ్చ...షటప్ అంటూ తిట్టుకున్నారు..
పార్లమెంట్ ఉభయసభల్లో పశ్చిమ బెంగాల్ లో సైన్యం మోహరింపుపై ఆందోళనలు తలెత్తుతున్నాయి. ఈ ఆందోళనలు కాస్త తీవ్ర పదజాలం ఉపయోగించేవరకు వెళ్లింది. పశ్చిమ బెంగాల్ లో సైన్యం మోహరింపుపై టీఎంసీ సభ్యుడు సుఖేందు శేఖర్ రాయ్ మాట్లాడుతుండగా...అధికార పక్షం నుంచి వ్యాఖ్యలు వినిపించడంతో ఆయన ఆవేశం పట్టలేకపోయారు. ''వాట్ నాన్సెన్స్ ఆర్ యూ టాకింగ్.. షటప్, షటప్'' అంటూ అధికారపక్షం మీద తీవ్రంగా మండిపడ్డారు. ఇదేమైనా జాతీయ అత్యవసర పరిస్థితా అని ప్రశ్నించిన రాయ్.. మంత్రి సభకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీనికి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు స్పందించి... సైన్యం ఇలా వెళ్లడం ఇదేమీ మొదటిసారి కాదని, గత సంవత్సరం కూడా ఇదే సమయంలో అదే రాష్ట్రానికి వెళ్లిందని చెప్పారు. దీనిని రాజకీయం చేయోద్దని అన్నారు. ఈశాన్య రాష్ట్రాలు, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాలలో కూడా ఇలాగే జరుగుతోందని అన్నారు.