Read more!

భార్యాభర్తల మధ్య గొడవలు పరిష్కారం కావాలంటే మొదట ఈ పని చెయ్యాలి..

 భార్యాభర్తల మధ్య గొడవలు పరిష్కారం కావాలంటే మొదట ఈ పని చెయ్యాలి..   భారతదేశంలో వివాహ బంధానికి చాలా గొప్ప ప్రాధ్యాన్యత  ఉంది. అయితే దురదృష్టవశాత్తు నేటికాలంలో  ఈ వివాహ బంధం చాలా  పెలుసుగా మారిపోయింది. నిన్నటిదాకా ఎంతో నవ్వుతూ గడిపిన భార్యాభర్తలు సడన్ గా గొడవ పడతారు. ఆ తరువాత విడాకులు అంటారు. ఇలాంటి సంఘటనలే ఎక్కువ ఉన్నాయి చాలాచోట్ల. పెళ్ళిళ్ళు ఏమో ఆకాశమంత పందిరి వేసి ఎంతో ఘనంగా చేసుకుంటారు కానీ బంధాన్ని నిలబెట్టుకోవడంలో మాత్రం చతికిలబడుతున్నారు. ఇద్దరి మధ్య గొడవలు జరిగినా, విడిపోవాలనే నిర్ణయం తీసుకున్నా దానికి ముఖ్యకారణం ఇద్దరి మధ్య మూడవ వ్యక్తి ప్రమేయం ఉండటమేనని అంటున్నారు. మరీ ముఖ్యంగా భార్యాభర్తల మధ్య గొడవలు ఏమైనా ఉంటే వెంటనే చేయాల్సిన పని ఒకటుంది. షేరింగ్ వద్దు.. భార్యాభర్తల మధ్య ఏదైనా గొడవ ఉంటే  చాలామంది తమకు దగ్గరగా ఉన్న వ్యక్తితో షేర్ చేసుకుంటూ ఉంటారు. అమ్మాయిలు అయితే తల్లులు, స్నేహితురాళ్లు,ఎవరూ ఊహించని విధంగా వారి నుండి దూరమైన పాత ప్రియుడికి కూడా తన భర్తతో ఉన్న విభేధాల గురించి చెబుతుంటారు. ఇలా భార్యాభర్తల గొడవ గురించి అందరికీ చెప్పుకోవడం వల్ల బంధం పట్ల ఇతరుల్లో చులకన భావం ఏర్పడుతుంది, మనుషుల మీద కూడా చిన్న చూపు కలుగుతుంది. ఇలాంటి సందర్బాలలో చాలామంది రెచ్చగొడుతుంటారు. నువ్వలా చెయ్యి, ఇలా చెయ్యి అని సలహాలు ఇస్తుంటారు. ఆ సందర్భంలో ఉన్నప్పుడు వాళ్ళు చెప్పేవన్నీ నిజమేనని అనిపిస్తాయి. కానీ వాళ్ళు చెప్పినట్టు చేస్తే బంధం మరింత బలహీనం అవుతుంది తప్ప తిరిగి బలంగా తయారవ్వదు. వీళ్ళకు దూరంగా ఉండాలి. లైఫ్ పార్టనర్ తో గొడవలు జరిగినప్పుడు పొరపాటున ఎప్పటినుండో పరిచయం ఉన్నవారికి చెప్పుకుంటే వారు కొన్ని సలహాలు ఇస్తారు. నిజానికి మంచి కోరేవారు అయితే  బంధాన్ని ఎందుకు నిలబెట్టుకోవాలో వారికి తెలిసి ఉంటుంది. సందర్భానికి తగినట్టు మంచి సలహా ఇస్తారు. కానీ అవతలి వారి జీవితంలో కూడా భార్యాభర్తల గొడవలుండి వారితో బంధం తెంచుకుని ఉంటే మాత్రం వారి సలహాలు తీసుకోకూడదు. ముఖ్యంగా జీవితంలో వివిధ సమస్యలతో డిప్రెషన్ అనుభవిస్తున్న వారి సలహాలు తీసుకోవడం, వారికి దగ్గరగా ఉండటం చేయకూడదు. డిప్రెషన్ ఉన్నవారికి సహాయం చేయవచ్చు కానీ వ్యక్తిగత బంధాలు,  వాటి నిర్ణయాలు వారి చేతిలో పెట్టకూడదు.  ఎంటర్టైన్మెంట్ కావొద్దు.. కొందరికి  గొడవలంటే భలే ఇష్టం ఉంటుంది. ఇలాంటి వారు భార్యాభర్తల మధ్య గొడవలను చూసి పైకి అయ్యో పాపం అంటున్నా లోలోపల సంతోషపడుతుంటారు. వీరిది కాస్త మానసిక శాడిజం అని చెప్పవచ్చు. అక్కడి మాటలు ఇక్కడ, ఇక్కడి మాటలు అక్కడా చెప్పేవారు కూడా ఎంతో స్నేహితులు అయినట్టు ఉంటారు. వీరినుండి కూడా దూరం ఉండాలి. ఇలాంటి వ్యక్తులకు భార్యాభర్తల విషయాలు చెప్పడం కానీ, వారి సలహా తీసుకోవడం కానీ చేయకూడదు. భార్యాభర్తల మధ్య గొడవలు జరగకూడదని అనుకున్నా, జరిగిన గొడవలు పరిష్కారం కావాలన్నా  కచ్చితంగా పైన చెప్పుకున్న మనుషులకు దూరంగా ఉండాలి.                                           *నిశ్శబ్ద.

భారతదేశానికి కీర్తి తెచ్చిన బచేంద్రి పాల్.. ఆమె ప్రయత్నం ఇదే..

భారతదేశానికి కీర్తి తెచ్చిన బచేంద్రి పాల్.. ఆమె ప్రయత్నం ఇదే.. మనిషి దృఢ సంకల్పంతో ఉంటే ఎంత పెద్ద పని అయినా  సులభంగా చేయగలుగుతాడు. ఈ  విషయం అందరికీ తెలిసిందే. దీనికి ఎంతోమంది వ్యక్తుల  జీవితాలు ఉదాహరణగా నిలుస్తాయి. ఇలాంటి వారిలో బచేంద్రి పాల్ కూడా ఒకరు. బచేంద్రి పాల్ అనే పేరు వినగానే చాలామందికి ఈ పేరు ఎక్కడో విన్నట్టు ఉందే అనిపిస్తోందా?  చిన్నప్పుడు  జి.కే బిట్స్ చదువుకున్న ప్రతి ఒక్కరికీ ఈ పేరు పరిచయమే. ఎవరెస్టు శిఖరాన్ని అధిగమించిన తొలి భారతీయ మహిళ ఎవరంటే బచేంద్రి పాల్ అని టక్కున చెప్పేవాళ్ళం.  1984లో మహిళలకు ఈ సమాజంలో ఏమాత్రం ప్రోత్సాహం లభించని కాలంలో బచేంద్రి పాల్ సాధించిన ఈ ఘనతకు ప్రపంచం యావత్తు సలామ్ చేసింది. మహిళలకు స్పూర్తిని రగిలించే ఈమె గురించి తెలుసుకుంటే.. బచేంద్రి పాల్ ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లా నకూరి గ్రామంలో 1954 మే 24న జన్మించారు. ఈమె అప్పటికే  బిఎలో గ్రాడ్యుయేషన్,  సంస్కృతంలో మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేసింది. మాస్టర్స్ పూర్తి చేసిన తర్వాత, బచేంద్రి పాల్ తన బి.ఎడ్ పూర్తీ చేసింది. ఆమె ఉపాధ్యాయురాలు కావాలని ఆమె కుటుంబం ఆశించింది. అందుకు తగ్గట్టే ఆమెను భోదనా రంగంవైపు వెళ్లమని సూచించింది. కానీ బచేంద్రి పాల్ కు మౌంటెనింగ్ మీద చాలా ఆసక్తిగా ఉండేది. ఆమె లక్ష్యం, కుటుంబ సభ్యుల అభ్యర్థన వేరు వేరు ఉండటంతో ఆమె ఏం చేయాలనే విషయం పై గందరగోళం అనుభవించింది. కానీ చివరికి తన అభిరుచినే ఆమె కొనసాగాలని నిర్ణయించుకుంది.  కానీ పర్వతారోహకురాలు కావడానికి పాల్‌కు  కుటుంబం నుండి ఎటువంటి మద్దతు లభించలేదు. బచేంద్రి పాల్ తండ్రి కిషన్ పాల్ సింగ్ సాధారణ వ్యాపారవేత్త. లక్ష్యం వైపు ఎలా వెళ్ళిందంటే.. బచేంద్రి పాల్ మౌంటెనీరింగ్ మీద  ఆసక్తితో   నెహ్రూ మౌంటెనీరింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరింది.  ఈ  ఇన్‌స్టిట్యూట్‌ వారు 1984లో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించేందుకు ఒక సాహసయాత్ర బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆ బృందం పేరు  పేరు ఎవరెస్ట్ 84. ఈ టీమ్‌లో బచేంద్రి పాల్ కూడా ఉన్నారు. ఎవరెస్ట్ ఎక్కడానికి వీరికి శిక్షణ ఇవ్వబడింది. ఈ శిక్షణ తర్వాత వీరి  బృందం అదే సంవత్సరం మేలో ఎవరెస్ట్ అధిరోహణకు  బయలుదేరింది. మే 23, 1984న, బచేంద్రి పాల్  ఎవరెస్ట్ అధిరోహిస్తున్న సమయంలో వాతావరణం చాలా వ్యతిరేకంగా ఉంది, మంచు  తుఫాను ప్రభావం అధికంగా ఉంది. అయనా ఆమె ఎక్కడా వెనుదిరగకుండా  కఠినమైన మార్గం గుండా ప్రయాణించి  ఎవరెస్ట్‌ను అధిరోహించి చరిత్ర సృష్టించింది. ఈమె  భారతదేశానికి తెచ్చిన గుర్తింపుకు గానూ 1984లో పద్మశ్రీ, 1986లో అర్జున అవార్డు అందుకున్నారు. ఇది కాకుండా, ఈమె 2019 లో పద్మ భూషణ్ అవార్డును కూడా అందుకున్నారు. ఇలా ఈమె ఎంతో మంది మహిళలకు స్పూర్తిగా నిలిచారు.                                                                   *నిశ్శబ్ద  

సైనికుల‌కు స‌లాం చేస్తున్న జ‌య `జై- హింద్‌`! (ఆగస్టు 15 స్పెషల్)

సైనికుల‌కు స‌లాం చేస్తున్న జ‌య `జై- హింద్‌`! వాళ్లు ఎండావాన‌ల‌కి చ‌లించ‌రు, కొండాకోన‌ల‌కి త‌ల‌వంచ‌రు. ప‌చ్చ‌ద‌న‌మే ఎరుగ‌ని ఎడారిలో ఉన్నా, నేల‌నేది క‌నిపించ‌ని న‌డిసంద్రంలో ఉన్నా... వాళ్ల మ‌న‌సుల్లో ఒకటే ఆలోచ‌న‌, వాళ్ల జీవితాల్లో ఒక‌టే ల‌క్ష్యం, వాళ్ల చేత‌ల్లో ఒక‌టే త‌ప‌న‌ - అదే దేశ ర‌క్ష‌ణ‌! మ‌న భ‌ద్ర‌తా ద‌ళాల గురించి ఇలా ఎన్ని విష‌యాలు చెప్పుకున్నా, చెప్పాల్సింది ఇంకా మిగిలిపోయిన‌ట్లే తోస్తుంది. వారికి ఎన్ని వేల కృత‌జ్ఞ‌త‌లు అందించినా, మిగిలిపోయే రుణం ఏదో ఉంది. అందుకే వారి ఔన్న‌త్యం గురించి ప్ర‌జ‌ల‌కు తెలిపేందుకు, వారి మ‌న‌సులోని మాట‌ల‌ను మ‌న‌కి చేర‌వేసేందుకు ఒక కార్య‌క్ర‌మాన్ని రూపొందించారు `జ‌యపీస‌పాటి`. అదే జై - హింద్‌!!! హాంగ్‌కాంగ్ నుంచీ తెలుగువారందికీ ఆత్మీయ‌వార‌థిగా నిలిచేందుకు `టోరీ` అనే ఇంట‌ర్నెట్ రేడియోని మొద‌లుపెట్టింది `తెలుగువ‌న్` సంస్థ‌. అందులో భాగంగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న తెలుగువారు ఉన్న‌చోట నుంచే కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తూ టోరీని విజ‌య‌వంతం చేశారు. హాంగ్‌కాంగ్ నుంచి కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించే జ‌య‌పీస‌పాటి వారిలో ఒక్క‌రు. అప్ప‌టికే జ‌య హాంగ్‌కాంగ్‌లో ఉంటున్న తెలుగువారికోసం కె.పి.రావు దంప‌తుల‌తో క‌లిసి `హాంక్‌కాంగ్ తెలుగు స‌మాఖ్య‌` అనే సంస్థ‌ను ఏర్పాటు చేశారు. వంద‌కు పైగా తెలుగు కుటుంబాల‌కు ఆ స‌మాఖ్య ఒక వేదిక‌గా ఉంది. సైనికుల కోసం ఏద‌న్నా మొద‌ట్లో జ‌యపీస‌పాటి శ‌ని, ఆదివారాల్లో రెండేసి గంట‌ల పాటు రేడియో కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించేవారు. ఇవ‌న్నీ స‌ర‌దాస‌ర‌దాగా సాగిపోయేవి. కానీ దాంతో ఆమెకు ఎందుకో తృప్తి క‌ల‌గ‌లేదు. జ‌య‌కు చిన్న‌ప్ప‌టి నుంచి సాయుధ‌ద‌ళాల‌కు అనుబంధంగా ప‌నిచేయాల‌నే కోరిక తీవ్రంగా ఉండేది. అదెలాగూ సాధ్య‌ప‌డ‌లేదు. క‌నీసం మ‌న చీక‌టి రాత్రులు సుర‌క్షితంగా ఉండేందుకు త‌మ జీవితాల‌ను వెలిగిస్తున్న సైనికుల కోసం ఏద‌న్నా చేయాల‌న్న ప‌ట్టుద‌ల‌తో ఉండేవారు. సైనికుల గురించి ఎక్క‌డో స్కూళ్ల‌లోనో, కాలేజీల్లోనో చెప్ప‌డం త‌ప్ప మిగ‌తా మాధ్య‌మాలు అంత శ్ర‌ద్ధ వ‌హించ‌డం లేద‌ని గ్ర‌హించారు జ‌య‌. దేశం కోసం త‌మ ఆశ‌ల‌ను ప‌ణంగా పెట్టిన వారి మ‌న‌సులో ఏముంటుంది! ఆ ఉన్న‌త భావాలు మిగ‌తా ప్ర‌జ‌ల‌కు చేరితే అవెంత ప్ర‌భావ‌వంతంగా ఉంటాయో క‌దా అనిపించింది ఆమెకు! అలా రూపుదిద్దుకున్న‌దే `జై- హింద్` కార్య‌క్ర‌మం! సైనికులు మాట్లాడితే `జై-హింద్‌` కార్య‌క్ర‌మం గురించిన ఆలోచ‌న‌ను చెప్ప‌గానే చాలా ప్ర‌శ్న‌లు వ‌చ్చాయి. ఒక చిన్న‌పాటి కార్య‌క్ర‌మంలో మాట్లాడేందుకు సైనికులు ఒప్ప‌కుంటారా! ఒక‌వేళ వాళ్లు ఒప్పుకుని ఏద‌న్నా మాట్లాడినా అది చ‌ట్టాన్ని ఉల్లంఘంచిన‌ట్లు కాదా! సెల‌బ్రిటీలు కాకుండా ఎవ‌రో సైనికులు మాట్లాడితే వినేది ఎవ‌రు!... లాంటి స‌వాల‌క్ష స‌వాళ్ల‌ను జ‌య ఎదుర్కొన్నారు. కానీ జ‌య వాట‌న్నింటినీ దాటి విజ‌యం సాధించారు. సెల‌బ్రిటీలు మాట్లాడితే ఆస‌క్తితో వింటార‌నీ, సైనికులు మాట్లాడితే అభిమానంతో వింటార‌నీ నిరూపించారు.  మూడేళ్ల విజ‌యం 2012 మ‌ధ్య‌కాలంలో మొద‌లైన జైహింద్ కార్య‌క్ర‌మం ఇప్ప‌టికి మూడు సంవ‌త్స‌రాల‌ను విజ‌య‌వంతంగా పూర్తిచేసుకుంది. ఈ మూడు సంవ‌త్స‌రాల ప్ర‌యాణం ఏమంత తేలిక‌గా సాగ‌లేదు. మొద‌ట్లో...  సైనికుల‌ను ఎలా సంప్ర‌దించాలి. మాట‌ల సంద‌ర్భంలో ఎలాంటి ఇబ్బందులూ రాకుండా ఎలా మెల‌గాలిలాంటి స‌మస్య‌లెన్నో ఆమె ఎదుర్కొన్నారు. పైగా జ‌య‌కు ఇంట్లో ఇద్ద‌రు చిన్న‌పిల్ల‌లు ఉన్నారు. భ‌ర్త ఉద్యోగ‌రీత్యా త‌ర‌చూ ప్ర‌యాణాలు చేయాల్సి రావ‌డంతో, ఆ ఇద్ద‌రి పిల్ల‌ల బాధ్య‌త‌నీ పూర్తిగా చూసుకోవాల్సి వ‌చ్చేంది. పైగా తాను ఒక పాఠ‌శాల‌లో ప‌నిచేస్తున్నారు. ఇన్ని బాధ్య‌త‌ల మధ్య కూడా, ఆమెకు దేశం ప‌ట్ల ఉన్న నిబ‌ద్ధ‌తే `జై-హింద్‌` కార్య‌క్ర‌మాన్ని ముందుకు న‌డిపించింది. నొప్పించ‌క తానొవ్వ‌క‌ `జై-హింద్‌` కార్య‌క్ర‌మం కేవ‌లం సైనికుల‌తో స‌ర‌దాగా సాగిపోయే సంభాష‌ణ‌లా ఉండ‌దు. వారి నేప‌థ్యం ఏమిటి, సైనిక‌ద‌ళాల‌లో చేరేందుకు వారిని పురికొల్పిన ప‌రిస్థితులు ఏంటి, వారి అభిరుచులు, కుటుంబం... వంటి విష‌యాల‌ను చ‌ర్చిస్తూనే వాటిని తిరిగి శ్రోత‌ల‌కు తెలుగులో చెబుతారు జ‌య‌. ఒక‌వైపు సైన్యంలో ఉండే ద‌ళాలు ఎంత‌టి క‌ష్ట‌న‌ష్టాల‌ను ఎదుర్కొంటాయో తెలియ‌చేస్తూనే,  సైన్యంలో ఉండేవారికి ప్ర‌భుత్వం క‌ల్పించే స‌దుపాయాలను సంద‌ర్భానుసారంగా వివ‌రిస్తుంటారు. సైనికుల‌తో ఒకో ముఖాముఖి సాగే కొద్దీ `నొప్పించ‌క తానొవ్వ‌క‌` రీతిలో సంభాష‌ణ‌ను సాగించే నేర్పు జ‌య‌కు పూర్తిగా అల‌వ‌డిపోయిన‌ట్లే తోస్తుంది. సైనికుల బాధ్య‌త ఒక్క స‌రిహ‌ద్దుల‌కే ప‌రిమితం అనుకునే సామాన్య‌ల‌కు, సైన్యం అందించే సేవ‌లు విని ఆశ్చ‌ర్యం క‌లుగుతుంది. ఉదా|| ప్ర‌భుత్వ రంగ ఉద్యోగులు ఏద‌న్నా స‌మ్మెను చేప‌డితే, దానివ‌ల్ల ర‌వాణా ఆగిపోకుండా ఉండేంద‌కు `రైల్వే టెరిటోరియ‌ల్ ఆర్మీ` స‌దా సిద్ధంగా ఉంటుంద‌న్న విష‌యం చాలామందికి తెలియ‌దు. సైన్యానికి చేతులెక్కి మొక్కాల‌నిపించే ఇలాంటి విష‌యాలు కోకొల్ల‌లుగా `జై-హింద్‌`లో వినిపిస్తాయి. కార్య‌క్ర‌మం తీరుతెన్న‌లు: సైనికుల కోసం జరిగే `జై-హింద్‌` జాతీయ గేయంతో మొద‌లై, జాతీయ గీతంతో ముగియ‌డం స‌ముచితంగా తోస్తుంది. మ‌న కోసం ప్రాణాలు అర్పించ‌డానికి కూడా వెనుకాడ‌రు సైనికులు. అందుకే వారు నిండునూరేళ్లూ జీవించాలంటూ, ఈ కార్య‌క్ర‌మం ద్వారా పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లను అంద‌చేస్తారు. ఆ త‌రువాత ప్రోగ్రాంలోకి విచ్చేసే విశిష్ట అతిథులు చెప్పే విష‌యాల‌కు మ‌న‌సంతా దేశ‌భ‌క్తితో నిండిపోతుంది. మ‌ధ్య‌మ‌ధ్య‌లో మంచిమంచి పాట‌లూ విన‌వ‌స్తాయి, శ్రోత‌ల‌ ప్ర‌శ్న‌లూ కార్య‌క్ర‌మానికి మ‌రింత వ‌న్నె తెస్తాయి. ఇందులో పాల్గొనే ప్ర‌తి ఒక్క సైనికుడూ ప్ర‌త్యేక‌మే! మ‌న సికింద‌రాబాదులోనే ప‌నిచేస్తున్న మేజ‌ర్ నిషాసింగ్ చిన్న‌నాటి క‌బుర్లు; కార్గిల్ పోరులో కాలు పోగొట్టుకుని, రెండు సంవ‌త్స‌రాలు ఆసుప‌త్రిలో గ‌డిపినా కూడా మార‌థాన్లో పాల్గొంటున్న మేజ‌ర్ డి.పి.సింగ్ పోరాటం;  కార్గిల్ యుద్ధంలో వీర‌మ‌ర‌ణం పొందిన కేప్ట‌న్ సౌర‌భ్ కాలియా గురించి ఆయ‌న తండ్రి ఎన్‌.కె.కాలియా పంచుకున్న జ్ఞాప‌కాలు... ఇలా ఒక్కో కార్య‌క్ర‌మం ఒక్కో స్ఫూర్తిచిహ్నంగా మిగిలిపోతుంది. జ‌య‌పీస‌పాటి నిర్వ‌హించే ఈ కార్యక్ర‌మం గురించి జాతీయ‌, అంత‌ర్జాతీయ ప‌త్రిక‌ల్లో వార్త‌లు వ‌చ్చాయి. `జై-హింద్‌` అనే కార్య‌క్ర‌మం ఒక‌టి న‌డుస్తోంద‌ని అంద‌రికీ తెలిసింది. కానీ ఎవ్వ‌రికీ తెలియ‌కుండా... జ‌రుగుతున్న ఓ నిశ్శ‌బ్ద విప్ల‌వం కూడా ఉంది. బ‌తికితే రాజాలాగానే బ‌త‌కాలి, సంపాదిస్తే ల‌క్ష‌ల్లోనే సంపాదించాలి అనుకునే యువ‌త దీని నుంచి ప్ర‌భావితం అవుతోంది. ఏదో ఒక రోజున ఒక సైనికుడిని `మీరు సైనికుడిగా ప్రేర‌ణ క‌లిగించిన సంద‌ర్భం ఏంటి?` అని జ‌య‌పీస‌పాటి అడిగితే `మీ కార్య‌క్ర‌మాన్ని వినే సైనికుడిగా మారాల‌నుకున్నాను` అని ఎవ‌ర‌న్నా చెప్పే రోజు కూడా వ‌స్తుందేమో! - జై - హింద్‌!!! - నిర్జ‌ర‌.

విద్యతో.. సేవతో.. భారతదేశాన్ని పునీతం చేసిన వీర వనిత.. కొమ్మఱ్ఱాజు అచ్చమాంబ

విద్యతో.. సేవతో.. భారతదేశాన్ని పునీతం చేసిన వీర వనిత.. కొమ్మఱ్ఱాజు అచ్చమాంబ.. 'కలకంఠి కంట కన్నీరొలికిన సిరియింట నిలవద"ని పండితుడు, చరిత్ర కారుడు, విజ్ఞానచంద్రికా మండలి స్థాపకుడు అయిన శ్రీ కొమ్మ జాజు లక్ష్మణ రావుగారి భావన. సంఘ సంస్కారి, సేవాతత్పరురాలు, విద్యావతి, అబలా సచ్చరిత్ర రత్నమాల అనే బృహద్గ్రంధ రచయిత్రి అయిన శ్రీమతి భండారు అచ్చమాంబ శ్రీ లక్ష్మణరావు సోదరి. ఆమె అకాలమరణం చెందగా  ఆమె పట్లగల ఎనలేని  గౌరవ అభిమానాల కారణంగా ఆయన తన కూతురుకి అచ్చమాంబ అని పేరు పెట్టుకున్నారు. ప్రాణాధికంగా పెంచి తనలో చెలరేగే వున్నత భావాలను, ఆదర్శాలను, సంస్కార భావాలను పసితనంనుంచే ఆమెకు నూరి పోశారు. అందుకే ఆమె దృష్టిలో స్త్రీ అంటే చీటికి మాటికి బేలగా కన్నీరుకార్చే బలహీనురాలు, వాజమ్మకాదు. ఎదురయ్యే సమస్యలను ధైర్యంతో పరిష్కరించుకుని నిబ్బరంగా ముందుకు సాగిపోగల ఆత్మాభిమాని, కరుణామయి. సానుభూతికి బదులు గౌరవం అందుకోవలసిన మానవ జాతిలో సగభాగం స్త్రీ అని భావన. ఆమె 1906 అక్టోబరు 6న గుంటూరులో జన్మించారు. ఆమె తల్లి శ్రీమతి రామకోటమాంబ. ఆమె పెరగటం, చదవటం మద్రాసులో జరిగింది. అశాంతి, కల్లోలం తొలగించి ప్రశాంతత నెలకొల్పాలని అవసరంలో వున్నవారికి చేయి అందించాలని ఆమెకు చిన్ననాటినుంచే అనిపించేవి. వస్తుతః స్వతంత్రభావన అధికంగాగల ఆమె చదువుకునే రోజుల్లోనే జాతీయోద్యమం వైపు ఆకర్షితుసాలైంది. విదేశీ వస్తు వస్త్రాలను బహిష్కరించింది. నూలు వడికేది, ఖాదీ ధరించేది ఉబుసుపోక కాలక్షేపానికి యేపని చేయటం ఆమెకు నచ్చదు. ప్రతిదాని గురించి చాల తీవ్రంగా ఆలోచించటం అలవాటు.  1923లో అనుక్షణం ఆమెను తీర్చిదిద్దుతున్న తండ్రి అకస్మాత్తుగ గుండెపోటుతో మరణించారు. జీవితానికొక లక్ష్యమంటూ ఉండాలన్న సంకల్పంతో ఆమె మెడికల్ కాలేజిలో చేరారు. ఎప్పుడూ యేవో సభల్లో సమావేశాలలో పాల్గొంటు ధాటిగా వుపన్యసించేవారు. సైమన్ కమిషన్ పట్ల నిరసన ప్రదర్శనలలో పాల్గొన్నారు. శ్రీమతి రుక్మిణీ లక్ష్మీపతి స్థాపించిన యూత్ లీగ్ లో చేరి జాతీయోద్యమ ప్రచారం చేశారు. తల్లి రామకోటమాంబగారితో సహా ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. లాఠీ దెబ్బలు తిన్నారు. విద్యార్థి వుద్యమం నడిపారు. తుపాకి పోట్లకి, లాఠీ దెబ్బలకు క్షతగాత్రులయిన వాలంటీర్ల సపర్యలకు చికిత్సకు ఆసుపత్రి నెలకొల్పారు. 1931 నాటికి మెడికల్ కాలేజీలో చదువు ముగిసింది. కాని ఆమెకు సంతృప్తి కలగలేదు. శిశు సంరక్షణ, ప్రసూతి శాస్త్రాలు యింకా బాగా చదివి, దేశంలోని స్త్రీలకు మరింతగా వైద్య సహాయం అందించాలన్న తలంపుతో ఇంగ్లండులో  చదివి, మూడు ప్రత్యేక పరీక్షలు నెగ్గి డిగ్రీలతో వచ్చారు.  స్త్రీలకు విజ్ఞాన వికాసాలు కల్పించాలనే కోరికతో ప్రసూతి, శిశు పోషణ అనే గ్రంథాన్ని తెలుగులో సులభ శైలిలో అందరికి అర్థమయ్యే పదాలతో వ్రాశారు. ఆనాటివరకు అటువంటి వైద్య పుస్తకం సామాన్య ప్రజల అందుబాటులోకి రాలేదు. అందువల్ల ఆ పుస్తకం  ప్రచారంపొంది ఆమె ఆశయం తీరింది. అధిక ఆహారోత్పత్తి ప్రచార సందర్భంలో డాక్టరు అచ్చమాంబ స్వయంగా గునపం పట్టుకుని ప్రతి రోజు కొన్ని గంటలకాలం తవ్వటం, మట్టి మోయటం వంటి పనులు చేశారు. అతి నాజూకైన సూక్ష్మ పరికరాలు పట్టి ఆపరేషన్లు చేసే డాక్టరు గునపంపట్టి యెండలో తవ్వుతుంటే మరి అనుసరించే అభిమానులకు కొరత వుండదుగదా. ప్రజలకు అత్యంత సన్నిహితులై నారు. 1940లో వఝల వెంకటరామశాస్త్రి గారిని వివాహం చేసుకున్నారు. శ్రీమతి లక్ష్మీ వారి ఏకైక సంతానం.   పసివారిని చిన్నప్పటి నుంచి తగిన జాగ్రత్తతో పెంచి, తీర్చి దిద్దితే వాళ్లు మానసికంగా, శారీరకంగా, ఆరోగ్యవంతులైన చక్కని భావి పౌరులు కాగలరని ఆమె నమ్మకం. 20 మంది పిల్లలు, 11 మంది టీచర్లతో ఆమె విజయవాడలో స్థాపించిన మాంటిసోరీ స్కూలు ఈనాడు వేలకొద్దీ పిల్లలతో, వందమంది టీచర్లతో, బ్రహ్మాండమైన గ్రంథాలయంతో స్వంత భవనాలతో విజయవంతంగా నడుస్తోంది. 1948 జూన్లో శాసనోల్లంఘనం చేసి జైలుకు వెళ్లారు. రాయవేలూరులో 7 నెలలు గడిపి వచ్చారు. 1957లో కాంగ్రెసు తరఫున శాసన సభకు ఎన్నికయినారు.  1964 అక్టోబరు 20న గుండె పోటుతో మరణించారు. ఆ సమయంలో ఆమె గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ కంట తడిపెట్టుకున్నారు. ఇలా కొమ్మఱ్ఱాజు అచ్చమాంబ మహిళా లోకానికి స్ఫూర్తిగా నిలిచింది.                                           *నిశ్శబ్ద. 

మహిళలు భర్తల కోసం చేయకూడని పనులు!

మహిళలు భర్తల కోసం చేయకూడని పనులు ఈ ప్రపంచంలో అతి గొప్ప బంధం వివాహబంధమే. మధ్యలో ముడిపడే ఈ బంధం జీవితం చివరికంటా తోడుగా ఉంటుంది. అంతేనా.. జీవితంలో దైర్యం, నమ్మకం, జీవితం మీద ఆశ కలిగించేది ఈ బంధమే. చాలావరకు వివాహ బంధంలో మహిళలు చాలా మారిపోతారు. వస్త్రాధారణ నుండి ఆహారపు అలవాట్ల వరకు ఎన్నో విషయాలలో మారతారు. కొత్తగా పెళ్ళయ్యాక భార్యలు భర్తలను ఇంప్రెస్ చేయడానికి వారికి నచ్చినట్టు మారతారు. భర్తలు కూడా భార్యలను సంతోషపెట్టడానికి ఎన్నెన్నో చేస్తారు. అయితే మొత్తం మీద చెప్పుకుంటే భర్తల కోసం మారిపోయే మహిళలే ఎక్కువ. అదంతా ప్రేమ అని అనుకుంటారు. కానీ భర్తల మీద ఎంత ప్రేమ ఉన్నా సరే కొన్ని పనులు అస్సలు చేయకూడదు. కొన్ని ఇష్టాలు మార్చుకోకూడదు. ఇలా చేస్తే మొదట్లో వారికోసం అంటూ చేసిన పనులు ఆ తరువాత మహిళల జీవితాలకే పెద్ద సమస్యలుగా మారతాయట. అసలు మార్చుకోకూడనివి ఏంటి? చేయకూడనివి ఏంటి? పూర్తీగా తెలుసుకుంటే.. నియంత్రణకు లోను కావొద్దు.. పెళ్ళైన కొత్తలో అమ్మాయిలు భర్తలకు నచ్చినట్టు ఉండటానికి ఇష్టపడతారు. అయితే ఇందులో భాగంగా భర్త ఆ పనులు చేయకు, ఈ పనులు చేయకు, ఆ దుస్తులు వేసుకోకు, ఆ తిండి తినకు, వారితో మాట్లాడకు అలా ఉండకు, ఇలా ఉండకు అని చెబుతూ ఉంటాడు. అవన్నీ వినకపోతే భార్యకు భర్తమీద గౌరవం లేదని, ప్రేమ లేదని అనుకుంటారేమోననే సంకోచంతో మహిళలు ఈ మాటలను గౌరవిస్తారు. ఫలితంగా భర్త చెప్పినట్టు చేస్తారు. మొదట్లో భార్యలు గౌరవం అనుకున్నది కాస్తా ఆ తరువాత ఇబ్బందిగా మారుతుంది. భర్త పూర్తీ భార్య జీవితాన్ని నియంత్రించే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది. భర్తకు, అతని ఇంటికి ఎలాంటి ఇబ్బంది కలగనంతవరకు భార్యలు చేసే పని ఏదైనా మానుకోవాల్సిన పని లేదు. తిట్టడం, చెయ్యిచేసుకునే అలుసు ఇవ్వద్దు.. భార్యలు అంటే భర్త దగ్గర మాటలు పడటానికి, వారి చేతిలో దెబ్బలు తినడానికి దొరికిన ఆప్షన్ కాదు. చాలామంది భర్తలు వారి మానసిన అసంతృప్తిని, ఇతరుల మీద కోపాన్ని భార్యలపైన చూపిస్తుంటారు. తిట్టడం, చెయ్యిచేసుకోవడం మొదలైన విషయాలకు వారికి అవకాశం ఇవ్వద్దు. అదేవిధంగా మహిళలు తమకు ఇష్టం లేకుండా పడక గది కార్యాకలాపాలలో పాల్గొనద్దు. ఇది ఒకసారి  అలవాటైతే జీవితాంతం మహిళలకు ఇష్టం లేని సమయంలో భర్తల చేతుల్లో సెక్స్ డాల్స్ గా మారే ప్రమాదం ఉంది. దూరంగా ఉండకండి.. చాలామంది మహిళలకు తమ భర్తలు పనిచేసే ఆఫీసు, అతని కొలీగ్స్, అతని స్నేహితులు వంటి విషయాల గురించి పెద్దగా తెలియదు. ఒకవేళ మహిళలు  అడిగినా నీకెందుకు ? అని దబాయించే మగవారుంటారు. కానీ మగవారి స్నేహితులు, ఆఫీసులు కొలీగ్స్, ఇతర పరిచయస్తుల నుండి దూరంగా ఉండద్దు. భర్త మీద అనుమానం కాదు, అతనికి తెలిసిన వారితో టచ్ లో ఉండటం వల్ల కొన్నిసార్లు  కొన్ని పనులు, ఇబ్బందులు చాలా సులువుగా పరిష్కరించుకోవచ్చు. ఇష్టాల్ని మార్చుకోకండి.. భర్తలు భార్యల మీద కొన్ని విషయాల్లో ఒత్తిడి తెస్తారు. వీటలో ముఖ్యమైనది శరీరానికి సంబంధించినవే. వాళ్లకు నచ్చని దుస్తులు వేసుకుంటే ఎగతాళి చేయడం, వారికి  నచ్చని ఆహారం తింటే లావైపోయావనో, మరే ఇతర కారణంతోనో బాడీ షేమింగ్ చేయడం చేస్తుంటారు. మరీ ముఖ్యంగా నా పెళ్లాం నేను చెప్పినట్టు వింటుందనో, అతనొక హిట్లర్ మొగుడిలా బంధువులు, స్నేహితుల ముందు బిల్డప్ ఇవ్వడానికో భార్య మీద అజమాయిషీ చేస్తుంటారు. ఇలాంటి వాటికి అస్సలు ఆస్కారం ఇవ్వకండి. భార్యల్ని ఇష్టపడే భర్తలు ఎప్పుడూ తమ భార్యలను నియంత్రించాలని కోరుకోరు. మరీ ముఖ్యంగా భార్య ఇష్టాలను, కోరికలను గౌరవిస్తారు. ఎవరిముందూ కించపరచరు. తమకోసం ఏమీ మారక్కర్లేదనే విషయాన్ని ప్రవర్తనలోనే స్పష్టం చేస్తారు. భార్యలు పూర్తీగా భర్తలకు అనుకూలంగా మారిపోతే భార్యలకంటూ ఎలాంటి విలువా ఉండదనే విషయం గుర్తుపెట్టుకోవాలి.                                                          *నిశ్శబ్ద.

బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన ఈమె గురించి తెలిస్తే ఆశ్చర్య పోతారు!

బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన ఈమె గురించి తెలిస్తే ఆశ్చర్య పోతారు! “విజయమో వీరస్వర్గమో అంతుతేలాలి. శాంతి సమరంలో ఇది ఆఖరు ఘట్టం. బ్రిటిష్ సామ్రాజ్యవాదులారా భారతదేశాన్ని వదలివెళ్లిపొండి. క్విట్టిండియా" అని 1942 క్విట్టిండియా కాలంలో ఒక వీరనారి సివంగివలె గర్జిస్తూ ఉండేది. గట్టివరస శరీరంతో, తేజోవంతమైన ముఖంతో ఖాదీ నిక్కరు, చొక్కా ధరించి ఒక యూరోపియన్ వనిత ఈ నినాదాలు ఇవ్వటం వినిన పొరుగూరువారు క్షణకాలం బిత్తరపోయి చూసేవారు. ఆమె శ్రీమతి మెల్లీ షోలింగరు. సరిగ్గా చెప్పాలంటే ఆంధ్రుల అభిమానం సంపూర్ణంగా పొందిన తెలుగింటికోడలు.  శ్రీమతి ఉప్పల మెల్లీ షోలింగరు లక్ష్మణరావు. ఈమె 1898 వ సంవత్సరం మార్చి మూడవ తేదీన స్విట్జర్లాండు ముఖ్యపట్టణమైన జూరిచ్ లో జన్మించారు. శ్రీ అధల్ఫ్, శ్రీమతి బెర్తా షోలింగర్ లకు కుమారులు ఉన్నారు గాని కూతురు ఈమె ఒకరే కావటాన ఇష్టంగా చదివించారు. దానితో ఈమె హోంసైన్స్ పట్టభద్రురాలు అయింది. మెడికల్ కాలేజీ పంపించారు. రెండు సంవత్సరాలు చదువు ముగిసింది. ఇంతలో మొదటి ప్రపంచయుద్ధ కారణంగా తండ్రి ఆస్థి అంతా విధ్వంసమై ఆమె చదువు నిలిపివేశారు.  తండ్రికి వ్యాపార నిర్వహణలో సాయపడుతూ ఉండేవారు. వ్యాపారరీత్యా దక్షిణ జర్మనీలో ఉన్న ట్యూబెన్గెన్ నగరంలోవున్న మిత్రులను కలుసుకోవటానికి వెళ్లవలసివచ్చేది. ఆ సమయంలో అక్కడ డాక్టరేటుకు చదువుతున్న శ్రీ ఉప్పల లక్ష్మణరావును కలుసుకోవటం జరిగింది. ఆమె మాతృభాష జర్మన్, అప్పటికే ఆమె జర్మన్ భాషలో సుప్రసిద్ధ ఇండాలజిస్ట్ శ్రీ ఓల్టెన్బర్లు పండితుడు వేదాలను గురించి, బౌద్ధమతాన్ని గురించి వ్రాసిన గ్రంధాలను చదివారు. బహుమతి గ్రహీత ప్రఖ్యాత రచయిత శ్రీ హెర్మొన్ హెన్సే హిందూ దేశాన్ని గురించి, సింహళ దేశాన్ని గురించి వ్రాసిన పుస్తకాలు చదివారు. మనదేశంపట్ల సంస్కృతిపట్ల ఎంతో అభిమానం, సద్భావము కలిగాయామెకు. అందువల్ల శ్రీ లక్ష్మణరావు పట్ల గౌరవము, స్నేహము ఏర్పడ్డాయి. అప్పటికే భారత దేశ రాజకీయాలలో గాంధీయుగం ఆరంభమయింది. ఆమెకు సోషలిజం పట్ల ప్రపంచ కార్మికోద్యమంపట్ల అంతకు పూర్వంనుంచే అభిమానం ఉండేది. అందువల్ల భారతదేశంలో బ్రిటిష్ వారి దమన నీతిని, హింసాకాండను ఏవగించుకుంటూ భారతదేశ స్వాతంత్ర్యోద్యమంపట్ల సహానుభూతి కనపరచేవారు. మిత్రులైన శ్రీ లక్ష్మణరావు గారి ద్వారా మత, సాంఘిక, రాజకీయ, సాంస్కృతిక విషయాలను సవిస్తరంగా తెలుసుకుంటూ ఉండేవారు. పర్యవసానంగా హిందూదేశం చూసితీరాలన్న కోరిక కలిగింది. తండ్రి అనారోగ్య కారణంగా ఆమె 1934 చివరన స్వదేశం వెళ్లి పోయినారు. 1937 ఆగస్టు 30న మాస్కోలో డాక్టరు శ్రీ ఉప్పల లక్ష్మణ రావుగారితో ఆమె వివాహం జరిగింది. 1937 లో భారతీయ వనితగా ఆంధ్ర మహిళగా విజయవాడలో భర్తతో స్థిరపడ్డారు. క్విట్టిండియా ఉద్యమంలో  ఆమె వుద్రేకం గమనించిన బ్రిటిష్ ప్రభుత్వం ఎందుకయినా మంచిదని శ్రీమతి ఉప్పల మెల్లీ షోలింగర్ ను 1942 సెప్టెంబరులోనే ఆరెస్టుచేశారు. ఆ ఊళ్లోనే తాలూకా ఆఫీస్ సబ్ జైలులో రెండు నెలలపాటు రిమాండులో ఉంచారు. అక్కడ ఒక్క నదుపాయం లేకపోగా మహిళా ఖైదీలకు కనీసపు అవసరాలు అయిన మరుగుదొడ్లు, స్నానాల గదులుకూడాలేవు. ఎందరెందరో విన్నవించుకున్నారు. బ్రతిమలాడుకున్నారు, విసుక్కున్నారు. ప్రయోజనం లేకపోయింది. ఇక ఇదిమార్గం కాదని శ్రీమతి మెల్లీ నిరశనవ్రతం పూనారు. పచ్చి మంచినీళ్లు ముట్టకుండా వారం గడిచింది. ఆమె ఆరోగ్యం క్షీణించింది. చాలా నీరస స్థితిలో ఉన్నారు. శక్తి కూడతీసుకుని "క్విట్టిండియా” అని ఉచ్చరిస్తూనే ఉన్నారు. జైలు అధికారులకు కొంచెం జంకు కలిగింది. ఆమె కోరిక ప్రకారం జైలులో శ్రీ ఖైదీలకు కనీనపు సదుపాయాలు కల్పించారు. ఆమె కేసు విచారణ చేసి ఒకటిన్నర సంవత్సరాలు కఠినశిక్ష వేశారు. "సి" కాను ఇచ్చి రాయ వేలూరు పంపారు. రాయవేలూరు జైలుకు వెళ్లటం ఆమెకది మొదటిసారికాదు, రెండవ సారికాదు. మూడవసారి. అందుకనే కసితీర ఆమెకు శిక్ష ఘాటుగా వేశారు. ఆ  నిరశనవ్రతం సందర్భంలో క్షీణించిన ఆరోగ్యం ఆమె తిరిగి కోలుకోనేలేదు.  1957లో తన సోదరులను చూడటానికి, ఆమె భర్తతో సహా తూర్పు జర్మనీకి వెళ్లారు. అక్కడ ఉన్న రెండు సంవత్సరాల కాలంలోను అనేక పట్టణాలలో భారతదేశ స్వాతంత్ర్యోద్యమం, భారత మహిళాభ్యుదయం వంటి అనేక విషయాలపై ఉపన్యసించేవారు, గోష్టులు జరిపేవారు. 1959లో దంపతులు మాస్కో వెళ్లారు. 1965 జూలై 27న ఒక రోడ్డుప్రమాదంలో ఆమె తనువు చాలించారు. ఆనాటికీ ఆమె ఖాదీ ధారణ మానలేదు. ఆమె పట్టుదల, సేవానిరతి, త్యాగం భారతీయులు గుర్తుంచుకోవాలి.                                   ◆నిశ్శబ్ద.  

తన జీవితాన్ని తనే మలుచుకున్న తెలుగు శక్తి పెరంబుదూరు సుభద్రమ్మ!

తన జీవితాన్ని తనే మలుచుకున్న తెలుగు శక్తి పెరంబుదూరు సుభద్రమ్మ! కొంతమంది జీవితాలు సాఫీగా ఒక పద్ధతిలో గడిచిపోతాయి. మరి కొందరి జీవితాలు ఏ క్షణాన ఏ మలుపు తిరుగుతాయో తెలియకుండ వింతనడకలు నడుస్తుంటాయి. అందుకు చక్కని ఉదాహరణ శ్రీ పెరంబుదూరు సుభద్రమ్మ గారి జీవితం.  వైష్ణవ సాంప్రదాయానికి చెందిన మామిళ్లపల్లి రామానుజాచార్యులు తాయారమ్మగార్ల కుమార్తెగా ఆమె 1904 లో జన్మించారు. తూర్పు గోదావరిజిల్లా, కాకినాడ ఆమె స్వస్థలం. అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు వున్నారు. చాలా చిన్నతనంలోనే ఆమెకు శ్రీ పెరంబుదూరు బుచ్చయాచార్యులుగారితో వివాహం జరిగింది. మరి కొద్దికాలానికే విధి వక్రించింది. నందనవనం అవుతుందనుకున్న ఆమె జీవితం తల్లిదండ్రులకొక విషమ సమస్యగా తయారయింది. 4-5 తరగతులవరకు చదివించటం తప్ప యేమి చేయటానికి వారికి తోచలేదు. ఆమె చిన్నన్నగారయిన గోపాలాచారిగారికి చెల్లిలిపైన ఎంతో అభిమానం, జాలి ఉండేవి. ఆయన ఉద్యోగరీత్యా మెసపొటేమియాలో ఉంటున్నా..  ఆయన చెల్లెలిని క్రమవిధానంలో చదివించమని తల్లితండ్రులకు ధైర్యం కలిగించి, తగిన ధనసహాయం చేశారు. 15 సంవత్సరాల వయసు వచ్చిన అమ్మాయి వున్న పూళ్లో చిన్న క్లాసులు చదవటం బాగుండదని చాలా సాహసంచేసి ఆమె తల్లిదండ్రులు ఆమెను విశాఖపట్నంలో క్వీన్ మేరీ గర్ల్స్  హైస్కూల్లో 5వ తరగతిలో చేర్పించారు. ఆమెకి హాస్టలులో వసతి ఏర్పాటు చేయించారు. ఇలా ఆమె 1927 లో స్కూలు ఫైనలు ముగించారు. కాకినాడ పిఠాపురం రాజావారి కాలేజీలో ఇంటరు ముగిసింది. ఆమెకొక స్వతంత్ర జీవనోపాధి మార్గం చూపించి, స్థిరమైన భవిష్యత్తు కల్పించాలనుకున్న చిన్నన్నగారికి విశాఖపట్నంలో వుద్యోగమయింది. ఇక చెల్లెలి చదువు నిరాఘాటంగా సాగుతుందన్న తలంపుతో ఆమెను విశాఖపట్నం రప్పించి అక్కడ బి. ఏ. ఆనర్సులో చేర్పించాడు. కాని అప్పటికే ఆమెకు ఇంగ్లీషు చదువులమీద మోజుపూర్తిగా నశించి, జాతీయావేశం దృఢ పడింది. జాతీయోద్యమంలో చేరి, స్వరాజ్య సంపాదనకు పాటుపడితీరాలని నిశ్చయించుకుంది. ఆనర్సు చదువు ముగియకుండానే బహిరంగ సభల్లో వుపన్యసించటం, సత్యాగ్రహం చేయడం ప్రారంభించింది. ఆ సమయంలో పాదర్తి సుందరమ్మ గారితో ఈమెకు సాన్నిత్యం పెరిగింది.  1980 ఉప్పు సత్యాగ్రహంలో నాయకులందరు అరెస్టయిన తరువాత పుద్యమం చల్లారి పోకుండ యీమె, సుందరమ్మగారు బందరు కోనకు వెళ్లి వుప్పువండేవారు. కల్లుసారా దుకాణాల దగ్గర పికెటింగు చేసేవారు. చివరకు 1980 లో అరెస్టు అయినారు. 8 నెలల కఠినశిక్ష అనుభవించటానికి రాయవేలూరు జైలుకు వెళ్లారు. తోడుగా వెళ్లి జైలులో దింపివచ్చిన సుందరమ్మగారు 27-8-1980న అరెస్టయి ఆ జైలుకే వెళ్లారు. 1980 సత్యాగ్రహ సందర్భంలో పశ్చిమ కృష్ణాజిల్లాలో అరెస్టయిన 188 మందిలోను స్త్రీలు వీరిద్దరే. శాసనోల్లోంఘన ఉద్యమం కోసం ఆంధ్రరాష్ట్రం తరపున సుభద్రమ్మగారు కర్రసాము, గస్తీ తిరగటం, నగర సంకీర్తనం వంటి విద్యలనభ్యసించారు.  1981 డిశంబరు 31న దేశ వ్యాప్తంగ శాసనోల్లంఘనం చేయటానికి గాంధీజీ అనుమతించారు. దాంతో వుద్యమంలో కొత్త కెరటం ఉవ్వెత్తున లేచింది. ఆంధ్రులు, స్త్రీలు పురుషులు అమితమైన సాహసంతో పట్టుదలతో పాల్గొన్నారు. ఆ కార్యకలాపాలను ఆపకుండానే శ్రీమతి సుభద్రమ్మ తీవ్రకృషిని సాగించారు. ఆంధ్ర రాష్ట్ర నియంతగా వ్యక్తిగత సత్యాగ్రహంలో పాల్గొన్నారు. 1992 ఏప్రిల్ 2న గుంటూరు జిల్లా పెనుమాకలో అరెస్టయినారు. అప్పుడు జైలులో వుండగానే ఆమెకు మళ్లీ చదువుపైన ధ్యాన కలిగి పరిక్ష వ్రాసి బి. ఏ పాసయినారు. జైలు నుండి విడుదలయివచ్చిన తరవాత బ్రిటిష్ ప్రభుత్వం కింద వుద్యోగం చేయరాదని నిశ్చయించుకున్నారు. ఆరోజుల్లో విజయవాడలో తంగిరాల రాఘవయ్యగారు నేషనల్ ఇండియన్ లైఫ్ ఇన్సూరెన్సు కంపెనీ నిర్వహిస్తూ దానిలో స్త్రీలకు ప్రత్యేక విభాగం ఏర్పరచారు. ఆ కంపెనీ ఏజెంటుగా ఆమె అతిసమర్థవంతంగా పనిచేశారు. అప్పట్లో ఇన్సూరెన్సు రంగంలో అంత పేరు తెచ్చుకున్న మహిళలు లేరు. ఆమె ఆ పనిమీద తరుచు మద్రాసు వెళ్లవలసి వస్తుండేది. చివరకు మద్రాసుకే మకాం మార్చారు. ఆమెకు చిన్ననాటి నుంచి తనది, తనకోసం అనేమమత తక్కువ, ఉన్నదానిని అవసరమైన నలుగురికీ వుపయోగపరచాలనే తత్వం, దాంతో ఆమె సహాయం పొందేవారితో ఇల్లు నిండుగా వుండేది. కులమత భేదాల పట్టింపు ఆమెకు బొత్తిగాలేదు. నిరాధారులు సహాయము అడిగితే ఆశ్రయమిచ్చి ఏదో ఒక చేతి పనివృత్తి నేర్చుకోవటానికి సహకరించేవారు. చదువుపట్ల అభిరుచి వున్నవారికి పరీక్షలకు కట్టటానికి తోడ్పడేవారు. ఆమె విద్యావంతురాలు, సమర్ధురాలు. ఏ రంగంలోను శృంఖలాలను భరించలేని స్వేచ్ఛావాది. తన భవిష్యజీవనానికి బంగారుబాట అయిన ఆనర్సు చదువును కాలదన్ని దేశ సేవచేసి జైలు నరకం అనుభవించారు. పరప్రభుత్వం కింద బానిసగా వుండనంటు స్వతంత్ర జీవితాన్ని ఎన్నుకొన్నారు. ఆంధ్ర బాలలకు, మహిళలకు సేవచేశారు. ఆర్తులకు, నిస్సహాయులకు, అనాధలకు ఆఖరు పైసా వరకు సహాయం అందించారు. 1974లో హైదరాబాదులో శాశ్వతంగా కన్నుమూశారు.                                ◆నిశ్శబ్ద.

కాబోయే భర్తతో అమ్మాయిలు తప్పక మాట్లాడాల్సిన విషయాలివి!

కాబోయే భర్తతో అమ్మాయిలు తప్పక మాట్లాడాల్సిన విషయాలివి! పెళ్లిళ్లు.. నిశ్చితార్థాల సందడి మొదలైపోయింది. పెళ్లిళ్లు అంటే ఇక ఎలాగూ పెద్దవాళ్ళు ప్లాన్ చేసినట్టు జరుగుతాయి. కానీ ముడిపడిన తరువాత జీవితాన్ని డీల్ చేసుకోవాల్సింది అమ్మాయి, అబ్బాయే..  అయితే పెళ్లి తరువాత ఇలా జరగాల్సింది, ఇలా జరుగుతుందని అనుకున్నాను, ఇలా ఉండాల్సింది  కానీ అలా లేదు, అంతా నీ ఇష్టమేనా?? నాకు విలువ లేదు, నువ్వు చెప్పినట్టే వినాలా?? బాద్యతలన్నీ ఒక్కరే మోయాలా?? నేను విసిగిపోయాను.. నీతో వేగలేను.. లాంటి మాటలతో ఒకరినొకరు బాధపెట్టుకుని బంధాన్ని తెంచుకునే వరకు వెళతారు చాలామంది. మరీ ముఖ్యంగా పెళ్లి తరువాత అమ్మాయిలే ఎక్కువ ఇబ్బందులు పడుతుంటారు. బాధ్యతల దగ్గర నుండి కెరీర్ వరకు ఎన్నో విషయాలు కాబోయే జీవితభాగస్వామితో చర్చించడం ఎంతో అవసరం. చాలా వరకు విషయాలను లైఫ్ పార్టనర్ తోనే చెప్పగలరు. కాబట్టి అమ్మాయిలు  కాబోయే భర్తతో ఈ కింది విషయాలను తప్పకుండా చర్చించాల్సిన అవసరం ఉంది. నిశ్చితార్థం, పెళ్లికి మధ్య సమయంలో భాగస్వామితో మాట్లాడటం ద్వారా వారి స్వభావాన్ని తెలుసుకోవచ్చు. దీంతో పాటు పెళ్లి తర్వాత ఒకరినొకరు నిందించుకోకుండా ఉండొచ్చు. వైవాహిక జీవితంలో ఎలాంటి సమస్య రాకుండా ఉండాలంటే బాధ్యతల గురించి మాట్లాడాలి.. నిశ్చితార్థం తర్వాత, భాగస్వామితో కుటుంబం మరియు సంబంధాల గురించి బహిరంగంగా మాట్లాడాలి. భవిష్యత్తులో ఎవరు ఏ బాధ్యతను నిర్వర్తించాలనేది ముందుగా నిర్ణయించుకోవాలి. పెళ్లి తర్వాత ఇది చాలా సులభం అవుతుంది. ఈ విషయం మాట్లాకపోతే పెళ్లి తరువాత ఒకరిమీధ ఒకరు నిందలేసుకునేదాకా సమస్య వెళుతుంది. అడ్జెస్మెంట్ గూర్చి మాట్లాడకపోతే అట్టర్ ప్లాప్ అవుతారు..  పెళ్లికి ముందు అడ్జస్ట్‌మెంట్‌ గురించి మాట్లాడాలి . మీ సమస్యలతో పాటు, మీ భాగస్వామికి మీ మనసును  విప్పి చెప్పాలి. ఇష్టాఇష్టాలు, ఇష్టం లేని విషయాలు మాట్లాడటం చాలా ముఖ్యం. అవతలి వారి ఇష్టాలు తెలుసుకుని ఒకరినొకరు అర్థం చేసుకోవడం ముఖ్యం.  కెరీర్ చాలా ముఖ్యం.. ఈ అంశం అమ్మాయిలకు చాలా ముఖ్యమైనది. అసలే నేటికీ చాలా చోట్ల అమ్మాయిలు పెళ్లి తర్వాత ఉద్యోగాలు చేయడం లేదు. అబ్బాయిలు కూడా మొదట ఒకే చెప్పి ఆ తరువాత వొద్దు నాటారు.  దానివల్ల చాలా ఇబ్బందులు మొదలవుతాయి. ఇలా జరగకూడదు అంటే ముందుగానే కెరీర్ గురించి ఫైనల్ చేయాలి. ఉద్యోగం గురించి, ఆర్థిక అవసరాల గురించి ధైర్యంగా చెప్పాలి. కుటుంబ నియంత్రణ.. పెళ్లయిన కొద్ది రోజుల వరకు పిల్లలు వొద్దని ప్రఝీ జంట అనుకుంటారు. కానీ పెద్దలు మాత్రం పెళ్లయ్యక అమ్మాయి ఎప్పుడెప్పుడు శుభవార్త చెబుతుందా అని ఎదురుచూస్తుంటారు. ఈ విషయం గురించి గురించి కాబోయే భార్యాభర్తలు ముందుగానే మాట్లాడుకోవడం చాలా బాగుంటుంది. దీనివల్ల పిల్లల చదువులు, వారికి మంచి కెరీర్ ఇవ్వవడానికి ఆర్థిక భరోసా ఏర్పాటుచేసుకోవడం బాగుంటుంది.   తల్లిదండ్రుల బాధ్యత  నేటి కాలంలో అమ్మాయిలు కూడా వారి తల్లిదండ్రులకు సహాయం చేస్తారు. అటువంటి పరిస్థితిలో, వారు తమ భాగస్వామితో ముందుగానే దాని గురించి మాట్లాడాలి. తద్వారా తర్వాత ఎలాంటి ఇబ్బంది ఉండదు. లేకపోతే అమ్మాయిలకు తమ తల్లిందండ్రుల విషయంలో  చేదు అనుభవాలు ఎదురవుతాయి.                                      ◆నిశ్శబ్ద.

మేరీ కాం- బాక్సింగ్ చేసే అమ్మ!

  మేరీ కాం- బాక్సింగ్ చేసే అమ్మ!     ఆడది అమ్మయితే ఇక ఆమె వ్యక్తిగత జీవితం ఆఖరు అనుకుంటారు చాలామంది. కానీ జీవితంలో ఎదగాలన్న తపనే ఉంటే అటు కుటుంబ జీవితంలోను, ఇటు లక్ష్య సాధనలోనూ అద్భుతాలు సాధించవచ్చని నిరూపించిన మనిషి మేరీ కాం. మహిళలకు అనువుగాని ఆటలనీ, అందులోనూ తల్లి అయ్యాక దూరంగా ఉండాల్సిన పోటీలని భయపడిపోయే బాక్సింగ్‌లో పతకాల పంటని పండిస్తున్న మేరీ కాం గురించి మరికొంత... పేదరికం... మేరీ కాం మణిపూర్‌లోని కన్‌గెతే అనే మారుమూల గ్రామంలో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు పొలం పనులు చేసుకునే కూలీలు. మేరీ కాం కూడా పూట గడిచేందుకు తరచూ ఆ పొలం పనులకు వెళ్లి తల్లిదండ్రులకు సాయపడాల్సి వచ్చేది. లక్ష్యం... మేరీ కాంకు చిన్నప్పటి నుంచి ఆటలంటే ఇష్టంగానే ఉండేది. కానీ తన రాష్ట్రానికే చెందిన డింగ్‌కో సింగ్‌ ఎప్పుడైతే ఆసియా క్రీడలలో బాక్సింగ్‌లో బంగారు పతకాన్ని తీసుకువచ్చాడో, అప్పటి నుంచి తాను కూడా బాక్సింగ్‌లో రాణించాలని నిర్ణయించేసుకుంది. పోరాటం... మేరీ ఆశయాన్ని ప్రపంచమంతా ఎగతాళి చేసింది. బాక్సింగ్‌ అనేది పురుషుల ఆటనీ, ఆడవాళ్లకు తగిన సున్నితమైన ఆటని వెతుక్కోమని హెచ్చరించింది. ఆఖరికి మేరీ తల్లిదండ్రులు కూడా ఆమె ఆసక్తిని తీవ్రంగా వ్యతిరేకించారు. అయినా మేరీ తన పట్టు వీడలేదు. మణిపూర్‌ రాజధాని ఇంఫాల్‌కు చేరుకుంది. అక్కడ నర్జిత్‌ సింగ్‌ అనే బాక్సింగ్‌ శిక్షకుడి వద్దకు తనకు బాక్సింగ్‌ నేర్పమంటూ ప్రాథేయపడింది. శిక్షణ... తొలుత నర్జిత్‌ సింగ్‌ మేరీని తేలికగా తీసుకున్నాడు. కానీ ఇతరులకంటే తీవ్రమైన ఆమె సంకల్పాన్ని గ్రహించిన తరువాత తన శిక్షణపటిమనంతా ఆమెకు అందించాడు. నర్జిత్‌ ఆశలకు అనుగుణంగా మేరీ కాం రాష్ట్ర స్థాయి నుంచి ఒకో పోటీలో గెలుస్తూ 2001 నాటికి ప్రపంచ బాక్సింగ్‌ పోటీలలో రజతాన్ని సాధించింది. ఆ తరువాత మరో ఐదు సార్లు ప్రపంచ బాక్సింగ్‌ పోటీలలో బంగారు పతకాన్ని గెల్చుకుని, ఆ పోటీలలో ఆరు పతకాలను గెల్చుకున్న ఏకైక మహిళగా రికార్డు సాధించింది. పెళ్లి... 2001లో మేరీ, ఆన్లర్‌ కామ్‌ను కలుసుకుంది. మేరీ ప్రతిభతో ముగ్ధుడైన ఆన్లర్‌ ఆమెతో ప్రేమలో పడిపోయాడు. 2005లో ఆ జంట వివాహం చేసుకుంది. మేరీ వివాహం చేసుకుంటే ఆమె కెరీర్‌ నాశనం అయిపోతుందని నర్జిత్‌ సింగ్‌ వంటి పెద్దలంతా భయపడ్డారు. వారు ఊహించినట్లుగానే మేరీ 2006-08 కెరీర్‌కు దూరమయ్యింది. ఈ మధ్యలో ఆమెకు కవల పిల్లలు కూడా జన్మించారు. కుటుంబం అడ్డుకాలేదు... అందరి భయాలనూ తిప్పికొడుతూ మేరీ 2008లో తన కెరీర్‌ను తిరిగి ప్రారంభించింది. మళ్లీ ఒకదాని తరువాత ఒక పోటీని నెగ్గుకుంటూ పతకాల పంటని ప్రారంభించింది. ఒక పక్క గుండెజబ్బుతో బాధపడుతున్న పిల్లవాడిని గమనించుకుంటూ, ఆ బాధని దిగమింకుకుంటూనే రికార్డుల మోత మోగించింది. ఈ సందర్భంగా ఆమె భర్త ఆన్లర్‌ కామ్‌ అందించిన ప్రోత్సాహం కూడా అసామాన్యం. 2011 ఆమె ఆసియా కప్‌లో స్వర్ణాన్ని సాధించి వచ్చేనాటికి ఆమె పిల్లవాడికి ఆపరేషన్‌ కూడా విజయవంతంగా పూర్తయ్యింది. చరిత్ర ముగిసిపోలేదు... 2012లో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి మహిళగా రికార్డు నెలకొల్పడమే కాదు, ఆ ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని సాధించి తన పతకాల రికార్డుని మరింత పదిలం చేసింది. మేరీ కామ్‌ ప్రతిభను గమనించిన కీర్తి ఆమె వెంటపడింది. పద్మవిభూషణ్ వంటి ప్రతిష్టాత్మక పురస్కారాలు ఎన్నో ఆమెను వరించాయి. మేరీ కాం జీవిత చరిత్ర ఆధారంగా 2013లో ‘అన్‌బ్రేకబుల్‌’ అనే పుస్తకాన్నీ, ఆ పుస్తకం ఆధారంగా ప్రియాంక చోప్రా ముఖ్యపాత్రతో చలనచిత్రాన్ని రూపొందించారు. మేరీకాం ప్రతిభను, పోరాటపటిమను గమనించిన కేంద్ర ప్రభుత్వం ఆమెను రాజ్యసభకు ఎంపికచేసింది. అయినా మేరీ కాం ప్రస్థానం ఇక్కడితో ఆగేట్లు లేదు. ఈ ఏడాది బ్రెజిల్‌లో జరగనున్న ఒలింపిక్స్‌లో అర్హత సాధించడం మీదే ఆమె దృష్టంతా! - నిర్జర.

ఇంటి పని.. ఉద్యోగం.. లక్ష్మీబాయమ్మ గురించి తెలుసుకోవాలి!

ఇంటి పని.. ఉద్యోగం.. లక్ష్మీబాయమ్మ గురించి తెలుసుకోవాలి! 1970 వ సంవత్సరం ఆగస్టు నెల నాలుగోవారంలో శ్రీమతి ద్రోణంరాజు లక్ష్మీ బాయమ్మగారు అనారోగ్యంగ పడుకొని ఉన్నారు. అలవాటు ప్రకారం మహిళా సమాజ కార్యకర్తలు, మిత్రులు, సమావేశమై వున్నారు. సమాజం సంగతులు చర్చించుకుంటు వున్నారు. అప్పుడు ఆమె "ఏదో భగీరథ  ప్రయత్నం చేసి, భీమవరం వాళ్ళనడుమ చక్కని స్థలం సమకూర్చగలిగాము, కాని ఆ మున్సిపల్ వారి ఆమోదముద్ర మన ప్లానుల మీద యెప్పటికి పడుతుందో, ఈ లోపల నిరుత్సాహపడి, మాట యిచ్చిన వాళ్ళు విరాళాలు పంపడం అశ్రద్ధ చేస్తారేమో. మరికొంతమంది కొత్త వాళ్ళను కూడ కలుసుకొని యింకా కొంతడబ్బు వచ్చే ఏర్పాటు చేసుకోవాలి. అనుకున్న ప్రకారం 'బా- బాపు భవనం' నిర్మాణం వీలయినంత త్వరగా జరిగిపోవాలి" అని చెపుతూనే వున్నారు. మరికొంతసేపటికి ఆమె మాట పడిపోయింది. అవే ఆమె చివరి మాటలు. మరి మూడురోజులకు 27-8-1970 ఆమె భగవత్సాన్నిధ్యాన్ని చేరుకున్నారు. ఇంతటి కార్య దీక్షత కలిగిన మహిళ లక్ష్మీబాయమ్మ. ఇప్పటికాలం మహిళలు ఇంటి పని ఉద్యోగం పెద్ద టాస్క్.. అని అంటూ ఉంటారు. ఒకప్పుడు మహిళలు అందరూ ఉద్యోగాలు ఏమీ చేయలేదు.. వారికేం తెలుసు ఇంత పెద్ద టాస్క్ ల గురించి అని కూడా అనుకుంటారు. కానీ అందరూ లక్ష్మీబాయమ్మ గురించి తెలుసుకోవాలి.  శ్రీమతి లక్ష్మీబాయమ్మ 1898 లో శ్రీ చన్నా ప్రగడ సుందర రామయ్య-శ్రీమతి రామ లక్ష్మాంబల కడగొట్టు బిడ్డగా జన్మించారు. పశ్చిమ గోదావరి జిల్లా, నర్సాపురం తాలుకా లోని ముత్యాలవల్లి ఆమె జన్మ స్థలం. అదొక విద్వత్కుటుంబం. అందరు కవులు, పండితులే. నిత్యం పండిత గోష్టులు, సాహిత్య చర్చలు జరుగుతు వుండేవి. తన రెండవ యేటనే తల్లిని పోగొట్టుకున్న లక్ష్మీబాయమ్మ కవులు, పండితుల మధ్య తండ్రివడిలో పెరిగారు. సంస్కృత పద భూయిష్టమైన భాషనే యింట్లో అందరు మాట్లాడటంతో ఆభాషే ఆమెకు సహజంగ వచ్చేసింది. భోజనానికి వెళ్ళబోతూ "అన్నయ్యా యీవేళ సూపమాః చోష్యమాః భక్ష్యములేమిటి" అని అడిగే వారట.  లక్ష్మీబాయమ్మది బడికి వెళ్ళి నేర్చిన చదువుకాదు. అంతా స్వయం కృషివల్ల సాధించినదే. హిందీ, ఇంగ్లీషు భాషలు చక్కగా చదవడం, వ్రాయడం వచ్చు. సంస్కృత, ఆంధ్రభాషలలో గొప్ప విద్వత్తుగలవారు. కవిత అల్లగల వారు. చిన్న వయసులోనే ఆమె కంద పద్యాలలో 'కృష్ణ శతకం' వ్రాశారు. మరి మూడేళ్లకు 'వీరమతి' అనే నవలను వ్రాశారు. 'శాంతి కాముడు' అనే పద్య కథానికను, ఇంటరంటే ఏమిటనే వ్యాసం, నారాయణ రావు అనే కథానిక, 'దుర్గా దండకం', శ్రీకృష్ణ పరంగా 'ప్రభూ' అనే శీర్షికతో పద్య వ్యాసం వ్రాశారు. గృహ లక్ష్మి పత్రికలో అనేక కథలు, గేయాలు, వ్యాసాలు వ్రాశారు. భారతి పత్రికలో కూడ అసంఖ్యాకంగ గద్య పద్యరచనలు వ్రాశారు. విదుషిగా, కవయిత్రిగా తెలుగు నాట పేరుపొందగలిగారు. ఎక్కడ ఏ అవకాశం వచ్చినా దానిని సద్వినియోగం చేసుకుని తన కష్టార్జితాన్ని యితరులకు సంతోషంగ పంచారు. శ్రీమతి దుర్గాబాయి దేశ్ ముఖ్ ఆధ్వర్యాన నడుస్తున్న కేంద్ర స్త్రీ సంక్షేమ సంఘంలో శ్రీమతి లక్ష్మీబాయమ్మ 1955 నుంచి సభ్యురాలుగా వున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఇంప్లిమెంటింగు కమిటీ చైర్మన్ గా నాలుగయిదు సంవత్సరాలు సేవ చేశారు. తాలూకాలలో, గ్రామాలలో విరివిగా సెంటర్లు నెలకొల్పి వాటి తరపున స్త్రీలకు చదువుకునే అవకాశాలు, కుట్లు అల్లికలవంటి వుపయోగ కరమైన చేతిపనులు, ప్రసూతి కేంద్రాలు, వైద్య సౌకర్యాలు యెన్నో ఆమె కల్పించి యెనలేని సహాయం చేశారు. ఎంతోమంది స్త్రీలకు తమకాళ్ళపైన తాము నిలబడగల శక్తిని కల్పించారు. మహిళాభ్యున్నతి ఆమెకు అతి ప్రధానం అని చెప్పవచ్చు.                                    ◆నిశ్శబ్ద.

మహిళలూ ఇది సబబేనా?

మహిళలూ ఇది సబబేనా? సాధారణంగా ఆడపిల్లల జీవితంలో ఓ దశ దాటిన తరువాత  ఎంతో నెమ్మదితనం చోటుచేసుకుంటుంది. రజస్వల కావడం అనే విషయం జరరగానే ప్రతి ఆడపిల్లా ఇంటి వాళ్లతో నెమ్మదిగా ఉండు అనే మాటలను తప్పనిసరిగా ఫేస్ చేస్తుంది. అయితే వాళ్లు మంచికే చెబుతారు. కానీ ఇప్పటికాలం మహిళల్లో చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య నెలసరి. నెలసరి సరిగా రాకపోవడం అనే సమస్య మహిళల జనాభాలో సగానికి పైగా ఎదుర్కొంటోంది. సమస్య రాగానే డాక్టర్ల కన్సల్టేషన్ లు వారు చెప్పే మందులు ఇదే 90శాతం మహిళల్లో కనిపిస్తూ ఉంటుంది. అయితే ప్రతి ఒక్కరూ ఇలా మందులూ మాకులూ వాడటానికి అలవాటుపడిపోవడమే కానీ అసలు సమస్య ఏంటి ఎందుకిలా అవుతోంది నేను చేస్తున్న పొరపాటు ఏంటి వంటి ప్రశ్నలు ఎప్పుడైనా వేసుకున్నారా??   మీరే గనుక ఎందుకిలా అనే ప్రశ్నలు వేసుకుంటే మీరు చేస్తున్న పొరపాట్ల మీద  మీకే ఓ ఖచ్చితమైన అవగాహన వస్తుంది. ఇంతకూ ఆ ప్రశ్నల వైపు వెళ్లడం ఎలాగో తెలుసా??  ఇదిగో ఇలా… ఇలా చేస్తున్నారా??  చాలా మందిలో అమ్మాయి అంటే ఇదిగో ఇలా ఉండాలి అని ఒక ఫిక్సషన్ ఉంది. సన్నగా, నాజూగ్గా ఉండాలి. చాలా తక్కువగా తినాలి. ఎంత సుకుమారంగా కనిపిస్తే అమ్మయిలు అంత బాగుంటారు అనే ఫీల్ ఉంటుంది. ఫలితంగా అమ్మాయిలలో సహజంగానే పోషకార లోపం, రక్తహీనత, హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. కొందరు అలా ఉంటే మరికొందరు దానికి వ్యతిరేకంగా ఉంటారు. ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ అంటే ప్రాణం పెట్టేస్తారు. కేవలం రుచి మీద ఇష్టం పెట్టుకుని ఆరోగ్యం గురించి ఏమాత్రం ఆలోచించకుండా వాటిని బాగా తినేసేవాళ్ళు విపరీతంగా లావు పెరిగిపోవడం జరుగుతుంది. ఇక్కడ వచ్చే చిక్కు ఏమిటంటే… అతిగా తినడం, అసలు తినకపోవడం రెండూ హార్మోన్ల మీద ప్రభావం చూపిస్తాయి. ఈ హార్మోన్ల ప్రభావం వల్ల మహిళల్లో నెలసరిలో అసమతుల్యత చోటు చేసుకుంటుంది. కాబట్టి ఆహారం అనారోగ్యానికి కారణం అవ్వకుండా చూసుకోవాలి. ఏమి తింటున్నాం?? అనే ప్రశ్నను సంధించుకోవాలి. ఒక్కోసారి ఒక్కోలా… ఎందుకూ?? ఆడపిల్లలు రజస్వల అవ్వగానే అటు ఇటు తిరగొద్దు అనడంతో శారీరక వ్యాయామం అనేది తగ్గుతోంది. దానికి తగ్గట్టు చదువు గోలలో పడి ర్యాంకుల వేటలో మునిగిపోయి సరిగా తినీ తినక శారీరకంగా బలహీనంగా ఉండేవాళ్ళు కొందరు అయితే ఒత్తిడి వల్ల అతిగా తిని చిన్న వయసులోనే ఊబకాయం సమస్యను తెచ్చిపెట్టుకునేవాళ్ళు కొందరు. ఏ చదువుల దశ మొత్తం ఇలా సాగితే ఆ తరువాత ఉద్యోగాల టార్గెట్స్ లో తినడానికి సమయం ఉండక కొందరు బలహీనులు అయితే రెడి టూ ఈట్ ఫుడ్స్, ఆన్లైన్ ఆర్డర్స్, పిజ్జాలు ఇలాంటివి తిని అనారోగ్యానికి గురయ్యే వాళ్ళు కొందరు. దీని తరువాత మళ్ళీ పెళ్లి అయితే మరొక అదనపు బాధ్యత. మల్టి టాస్కింగ్ పెరిగి తీరిక దొరకని జీవితం అయిపోతుంది. మీకోసం మీరు ఏమి చేస్తున్నారు?? ఎలా ఉంటున్నారు అనేది చాలా ముఖ్యం. కాబట్టి నాకోసం నేను ఏమి చేసాను ఈరోజు అని ప్రతిరోజూ ప్రశ్నించుకోవాలి.  ముప్పేట దాడి… అంతా ఒత్తిడి!! సమస్యలు ఒకటికి మించి ఎక్కువగా ఉంటే… ఆహారం, ఉద్యోగం, ఇంటి బాధ్యతలు, ఇతర ఆరోగ్య సమస్యలు ఇలా అన్ని కలిపి మహిళలకు ఒత్తిడిని కలిగిస్తాయి. ఈ ఒత్తిడి వల్ల హార్మోన్ల అసమతుల్యత కలుగుతుందనేది అందరికీ తెలిసిందే… అందుకే ఒత్తిడి భూతం దరిచేరక ముందే దానికి అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నించాలి.  ఎలాంటి సమస్య అయినా మహిళల్లో నెలమీదకే టర్న్ అవుతుంది. నెలసరి సరిగా రాకపోవడం, అతిగా రతుస్రావం అవడం, పిసిఓయస్, థైరాయిడ్, డయాబెటిస్ వంటి సమస్యలు చుట్టూ ముడతాయి. ఈ సమస్యలు మహిళలను పూర్తిగా ఇబ్బంది పెట్టకముందే డాక్టర్లను కలవాలి. చాలామంది సమస్య పెద్దది అయితే తప్ప డాక్టర్లను కలవరు. అందుకే సమస్య చిన్నగా ఉన్నప్పుడే దాన్ని పరిష్కరించుకోవాలి. ప్రశ్నించుకుంటే… సమాధానం వైపు ప్రయాణం మొదలవుతుంది…                                        ◆నిశ్శబ్ద.

అందంగా ఉంటేనే గుర్తిస్తారా!

అందంగా ఉంటేనే గుర్తిస్తారా!   పురుషాధిక్య సమాజం, మహిళా సాధికారత... లాంటి మాటలు పెద్దవే కావచ్చు. ఫెమినిజం అనేది ఓ పట్టాన కొరుకుడపడకపోవచ్చు. కానీ సంస్కారం అనేది ఒకటి ఉంటుంది. సమాజం ఆ సంస్కారాన్ని మరచినప్పుడు ఎవరో ఒకరికి ఒళ్లు మండి గొంతెత్తి తీరుతారు. అలాంటి ఓ సంఘటనే ఇప్పుడు సంచలనంగా మారింది. ఇటీవల దైనిక్‌ భాస్కర్‌ అనే హిందీ పత్రికకు చెందిన భాస్కర్‌.కాం ఒక నివేదికను తయారుచేసింది. పది చూడదగ్గ ప్రదేశాలు, పది తినదగ్గ వంటలు... అని జాబితాలు రూపొందించినట్లు ‘అందమైన పదిమంది మహిళా IAS, IPS  అధికారులు’ అంటూ ఓ జాబితాను తయారుచేసి వదిలింది.   ఈ జాబితాలో కేరళకు చెందిన మెరిన్‌ జోసెఫ్‌ ఒకరు. కేరళ ఐపీఎస్‌ క్యాడర్‌కు చెందిన మెరిన్‌... అత్యంత చిన్న వయసులో ఆ హోదాను దక్కించుకున్న వ్యక్తిగా, ప్రతిభావంతురాలైనా అధికారిణిగా ఈపాటికే వార్తల్లో నిలిచారు. కానీ ఆమెను తరచూ తన ప్రతిభతో కాకుండా అందంతో గుర్తించడం మెరిన్‌కు మొదటినుంచీ బాధగా ఉండేది. ‘ఇలాంటి అందమైన అధికారి ఎదుట ఎవరైనా లొంగిపోతారు’ తరహా వ్యాఖ్యలు ఆమెను ఇబ్బంది పెట్టేవి. అలాంటిది ఇప్పుడు ఏకంగా ‘అందమైన అధికారుల’ పేరుతో ఒక జాబితాను విడుదల చేసేసరికి మెరిన్‌ కోపం కట్టలు తెంచుకుంది. పోలీసు, రక్షణ శాఖలో ఉండే అధికారులు సాధారణంగా వివాదాలకు అతీతంగా ఉంటారు. కానీ మెరిన్‌ భాస్కర్‌.కాం వంటి జాబితాలకు ఒక ముగింపు పలకాలని అనుకున్నారు. తన ఫేస్‌బుక్‌ ద్వారా గతవారం ఆ వార్త మీద తీవ్రంగా విరుచుకుపడ్డారు.   మన దేశంలోని పత్రికలు, ముఖ్యంగా ప్రాంతీయ పత్రికల వైఖరి ఎంత దారుణంగా ఉందో ఈ వార్తను చూస్తే తెలిసిపోతుందన్నారు మెరిన్‌. మహిళల ప్రతిభను, భౌతికమైన అందం స్థాయికి ఈ వార్త దిగజార్చిందన్నారు. కష్టతరమైన పరిస్థితుల మధ్య బాధ్యతలను నిర్వహిస్తూ, నానారకాల రాజకీయాలను ఎదుర్కొంటున్న సదరు ఆఫీసర్లను..... గుడ్లప్పగించుకుని చూసేలా మార్చేశారన్నారు. తెలివితోనూ, స్వయంకృషితోనూ పైకెదిగిన తమలాంటి వారికి నిజంగా ఇదొక అవమానమంటూ ఉతికిపారేశారు. చివరగా... అందమైన మగ IAS, IPS అధికారులు అంటూ ఏనాడన్నా మనం ఓ జాబితాను చూశామా? అంటూ జవాబు లేని ప్రశ్న వేశారు. మెరిన్‌ సమాధానం ఇప్పుడు సోషల్‌ మీడియాలో ఓ సంచలనం. మీడియాకు ఒక చెంపపెట్టు. ఎందుకంటే మన ప్రకటనల దగ్గర్నుంచీ పెళ్లి చూపుల దాకా.... ‘ఆడవాళ్లకి ప్రతిభ ఉంటే సరిపోదు, అందం కూడా ఉండాల్సిందే’ అన్న మాటల తాకిడి ఎక్కువవుతోంది. ఆఖరికి ఎమ్మెల్యేగా ఎన్నికైనవారిని కూడా అల్లరి మూకలు వదలడం లేదు. మొన్నటికి మొన్న అసోం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ‘అంగూర్‌లతా దేకా’ గురించి ఇలాంటి మాటలు చాలానే వినిపించాయి. మన తెలుగుజాతి ముద్దుబిడ్డ రామ్‌గోపాల్‌ వర్మ సైతం అంగూర్‌లత గురించి తనదైన శైలిలో నానా రాతలూ రాశారు. ఇలాంటి ఆలోచనా ధోరణని ఎంత త్వరగా అడ్డుకుంటే అంత మంచిది. అందం అనేది కేవలం బాహ్యపరమైనదే అనీ, పైపై మెరుగులకు మించిన విలువలు ఈ జీవితంలో చాలా ఉంటాయనీ... ఇప్పటి యువత తెల్సుకోవాల్సిన అవసరం ఉంది. - నిర్జర.

మీ దాంపత్యలో మూడవ వ్యక్తి ఉన్నారని తెలుసుకోవడం ఎలా?

మీ దాంపత్యలో మూడవ వ్యక్తి ఉన్నారని తెలుసుకోవడం ఎలా? పెళ్లంటే జన్మజన్మల బంధంగా భావించేవారు చాలామంది. అయితే, కాలక్రమేణా ఇంత గొప్ప బంధం కూడా చీలికలు ఏర్పడుతోంది. ఇప్పటితరం వారు విడిపోవడానికి చాలా సులభంగా అంగీకారం తెలుపుతున్నారు. కారణాలు ఏమైనా విడిపోవడం తప్పనిసరిగా జరుగుతూ వస్తోంది. అయితే ఇలా భార్యాభర్తలు విడిపోవడానికి ముఖ్య కారణం భార్యలోనో.. భర్తలోనో వస్తున్న మార్పులు అనే అభిప్రాయంతో బంధాన్ని మనిషిని వదులుకోవడానికి సిద్ధపడుతున్నారు.  అయితే ఇలా విడిపోవడానికి దారి తీస్తున్న బంధాల మధ్యలో మూడవ వ్యక్తి ప్రమేయం ఉండటం వల్లే ఎక్కువ శాతం కాపురాలు మునుగుతున్నాయి. కొన్నిసార్లు జీవిత భాగస్వాములను తోచిపుచ్చి ఆ స్థానంలో కూర్చునేవారు కొందరుంటారు. స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, జెండర్ ద్వారా ఆకర్షించేవారు కావచ్చు. వీరి వల్లనే బంధాలు విరిగిపోతున్నాయి. అయితే భాగస్వాముల జీవితంలో  మరొక వ్యక్తి ఉన్నాడనే విషయం ముందుగానే గ్రహిస్తే చాలావరకు బంధాలు కాపాడుకోవచ్చు. దీన్ని ఎలా గుర్తించాలంటే.. భర్త అలవాట్లు మారిపోతాయి. ఎన్నో ఏళ్ల నుండి సాగుతున్న అలవాట్లలో మార్పులు, కొత్త అలవాట్లు పుట్టడం, కొన్నింటిని విస్మరించడం చేస్తుంటారు. దీని అర్థం అవతల ఉన్న ఇంకొకమనిషి వైపు ఆకర్షించబడ్డారని. అందుకే అలా మారుతున్నారని అర్థం. భాగస్వామి మూడవ వ్యక్తి కోసం తనను తాను మార్చుకోవడం ప్రారంభిస్తాడు, అప్పుడు ఆ మూడవ వ్యక్తి మీ సంబంధంలో దూరాన్ని పెంచుతారు. ఇంటిపట్టున ఎక్కువగా ఉండకపోవడం కూడా ఒక కారణమే.. పని ఉందని తొందరగా బయటకు వెళ్లడం, ఆ తరువాత బయటి పనుల్లో ఉన్నానని ఇంటికి రాకపోవడం, ఎప్పుడూ ఇలానే చేస్తుండటం జరుగుతుంది. ఇలా జరిగితే అతనికి అవతల స్పెషల్ పర్సన్ వేరు ఉన్నారని అర్థం. సంబంధంలో మూడవ వ్యక్తి  ఉన్నప్పుడు, కుటుంబాలకు ప్రాధాన్యత తగ్గుతుంది. పని సాకుతో టూర్లు, దూర ప్రాంతాలకు వెళ్లడం ప్రారంభిస్తారు. ఇంట్లో ఎంత ముఖ్యమైన కార్యక్రమం ఉన్నా అతను వాటికి ప్రాధాన్యత ఇవ్వడు. మరీ ముఖ్యంగా భార్యతో సమయాన్ని గడపటానికి ఆసక్తి చూపించడు. సాధారణంగా సోషల్ మీడియా ఖాతాలో లైఫ్ పార్ట్నర్స్ ను ట్యాగ్ చేయడం, వారిని జోడించడం జరుగుతూ ఉంటుంది. కానీ ఇంకొక రిలేషన్ ఉన్నప్పుడు తన ఖాతాను చాలా రహస్యగా మైంటైన్ చేస్తారు. లైఫ్ పార్ట్నర్ ఊసే ఎత్తడం లేదంటే సోషల్ మీడియాలో అతనిని మరొక పార్ట్నర్ గమనిస్తారనే కారణంతో మిమ్మల్ని దూరం పెట్టినట్టు.  అబద్ధం చెప్పడం మెల్లిగా  ప్రారంభిస్తారు. విషయాలు దాచిపెట్టినప్పుడు, జీవితానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలను మీతో పంచుకోవడం ఆపివేసినప్పుడు, అతని జీవితంలో మరొకరు ఉన్నారని, అతను తన విషయాలను అవతలి వారితో పంచుకోవడం ప్రారంభించాడని అర్థం. ఆ మూడవ వ్యక్తి మీ సంబంధాన్ని పాడు చేస్తోందని అర్థం. సోషల్ మీడియా ఖాతాలు, మొబైల్ ఫోన్ చాటింగ్స్ చాలా రహస్యంగా మైంటైన్ చేసుకుంటే అతని పర్సనల్ మరేదో ఉందని అర్థం.  ఈ విషయాలు గమనించుకుని ఆడవారు జాగ్రత్త పడితే వారి సంసార నావను కాపాడుకోవచ్చు.                                  ◆నిశ్శబ్ద.

Sun Shade ideas for Summer

  Sun Shade ideas for Summer   Escaping the Sun is typically impossible during this harsh summer months in India..how to stay cool and safe during this time of the year has become one big concern. Protecting ourselves and our plants, same time, trying to keep the power supply cost low is a tricky thing. Running the ACs and Coolers through the day might make one sitting in the house feel cooler but for the one who is on the other side of the house, it becomes hotter due to radiations and emissions. A green solution to this is installing sun shades outside the windows and doors, or setting up shades on balcony fences is a smart solution. Also keeping this point in mind during constructing a house, not to set up glasses for show on the elevation or for the looks, inorder to eliminate radiation and reduce cooling charges. Come Summer and we see ACs and Coolers everywhere in the market, similarly the root-woven and green netted fabric sun shades are also sold in the market...the DIYers use Burlap and such other fabrics that are dyed in green color for a cooler look..one can purchase such materials in necessary dimensions and hang them outside the windows, especially in the West, South West corner of the house or a building helps make the structure get cooler by a few couple of points. Aesthetically also they offer good looks to a building, making others get a cool, shaded feeling during the hot summer months. Protecting the plants from sun damage is an added advantage, which makes a big difference as plants in turn help purify the air and create a cooler atmosphere. Water consumption for maintaining the plants can be controlled if these sun shades are set up, and they also offer a friendly setting to share a dialog or two and a laughter for a lighter mood when friends and family are around.     Custom Sun shades can be set up outside windows instead of concrete shades that are typically commn in India..these are a little on the higher end for an investment but give the building a cosmo look and serve the purpose without fail. Roller blinds, Canopies, retractible shades are other options for those who like spending a little more for extra comfort...they can be expanded during summer seasons and rains and retractible during the colder months or when not necessary for convenience sake. Expensive or Easily available or ready to install, these Sun shades are cool for those extending hot summer months !! - Prathyusha

స్వీడన్ లో సుధామూర్తి అనుభవం...

స్వీడన్ లో సుధామూర్తి అనుభవం... సుధామూర్తి భారతీయులకు ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేని పేరు. ఇన్ఫోసిస్ ఛైర్మెన్ గానూ.. ఓ సక్సెస్ మహిళగానూ.. మహిళా లోకానికి ఆమె గొప్ప ఆదర్శం.  సుధామూర్తి గారికి ఎదురైన ఓ అనుభవం గురించి చెప్పుకుంటే.. కొన్నాళ్ళ క్రితం మహిళా సమస్యలపై జరిగిన ఒక సదస్సుకు  సుధామూర్తి గారు అతిథిగా హాజరయ్యారు. అంతర్జాతీయంగా మహిళల స్థితిగతులు, వారి ప్రాధాన్యం తదితర అంశాలపై ఆ సదస్సులో ఎంతో మంది దేశవిదేశాల ప్రతినిధులు తమ అమూల్య అభిప్రాయాల్ని అక్కడ వెల్లడించారు. చర్చలో పాల్గొన్న ఒక వక్త చాలా ఆసక్తికరమైన సమాచారంతో ఒక నివేదికను చదివి వినిపించారు. అంతర్జాతీయంగా మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా పొందుతున్న స్వేచ్ఛా స్వాతంత్ర్యా లకు సంబంధించిన కీలకమైన పరిశోధన అంశాల్ని చర్చించారు. భద్రత, సంక్షేమం తదితర విభాగాల్లో స్త్రీలకు ప్రాధాన్యాన్ని ఇస్తున్న దేశాల జాబితాతో కూడిన సమాచారాన్ని ప్రతినిధి సభ ముందు ఉంచారు. మహిళలను గౌరవిస్తూ, వారి సముద్ధరణకు సహకరిస్తున్న దేశాల పేర్లు జాబితాలో అగ్రభాగాన ఉండగా, మహిళలకు సాధికారత కల్పించడంలో వెనుకబడిన దేశాల పేర్లు అడుగున ఉన్నాయి. సుధామూర్తి గారు మన దేశం పేరు పట్టికలో ముందు వరుసలోనో, కనీసం మధ్యలో ఎక్కడో ఉంటుందని ఊహించారు.  కానీ బాధాకరంగా భారతదేశం పేరు జాబితాలో అట్టడుగు నుంచి రెండోస్థానంలో ఉంది. మన కంటే వెనుకబడిన దేశం ఒకే ఒక్కటుందనే ఊహించని చేదునిజం తెలుసుకొని ఆమె ఆశ్చర్యపోయారు.  స్త్రీ సంక్షేమానికి పాటుపడుతున్న మొదటి మూడు దేశాలేవో తెలుసుకోవాలని ఆమె అనుకున్నారు. ఏ అమెరికానో, ఇంగ్లండో  మొదటి స్థానంలో ఉంటాయనుకున్నారామె.  మళ్ళీ ఆమె అంచనాలు తారు మారయ్యాయి. అనూహ్యంగా ఆ మూడు అగ్రదేశాలు స్కాండి నేవియన్ దేశాలే! అంటే - స్వీడన్, నార్వే, డెన్మార్క్ సదస్సుకు హాజరైన ప్రతినిధులంతా విస్తుపోయారట. యూరప్లో ఎక్కడో ఓ మూలన ఉన్న అంత చిన్న దేశాలు మహిళలకు అత్యంత గౌరవం ఇచ్చే దేశాలని తెలిస్తే ఆశ్చర్యం కలగదా మరి! స్వీడన్ రాజకుటుంబంలో చట్టప్రకారం స్త్రీయా, పురుషుడా అన్న దానితో నిమిత్తం లేకుండా, వారి ప్రథమ సంతానానికే వారసత్వ అధికారం సంక్రమిస్తుంది. నేటికీ ఆ దేశంలో అదే చట్టం వర్తిస్తుంది. ఇక నార్వే, డెన్మార్క్లో కూడా అదే స్థాయిలో మహిళలకు గౌరవం లభిస్తుంది. ఆ యా దేశాల్లో మహిళల పట్ల వివక్ష ప్రదర్శించడం చట్టప్రకారం నేరం. సుధామూర్తి ఒకసారి  వ్యక్తిగతమైన పని మీద స్వీడన్ వెళ్ళాల్సి వచ్చింది. అందులో భాగంగా ఆ దేశరాజధాని స్టాక్ హోమ్ లో బస చేశారు. ఒకరోజు అక్కడ రాత్రిపూట హోటల్ కు  చేరుకోవడం ఆలస్యం  అయిపోయింది. చీకటి పడేసరికి హోటల్ కు చాలా దూరంలో ఉండడం వల్ల, టాక్సీలో ప్రయాణించాల్సి వచ్చింది. హోటల్ కు టాక్సీ ఛార్జీ 40 క్రోనాలు అవుతుంది. అయితే చాలా రాత్రి అయింది. కనుక టాక్సీ డ్రైవర్ రెట్టింపు ఛార్జి వసూలు చేస్తాడనుకొని 100 క్రోనాల నోటు ఇచ్చి, చిల్లర కోసం ఆగాను. అతను 80 క్రోనాలు తిరిగి ఇచ్చాడు. పొరపాటుగా ఇచ్చాడనుకొని ఆమె కారణమడిగారు.  'మీరు రాత్రి ఆలస్యంగా ప్రయాణిస్తున్న మహిళ కదా! అందువల్ల అసలు ఛార్జీలో సగమే తీసుకుంటాం. ఇది మా దేశ నియమం' అని చెప్పాడు ఆ టాక్సీ డ్రైవర్. . ఆ దేశ సంప్రదాయాన్నీ, స్త్రీలకు ఇచ్చే గౌరవాన్నీ తలచుకొని ఆమె కదిలిపోయారు. మనదేశంలో అయితే చీకటి పడ్డాక ప్రయాణం చేయడానికే సాహసించేదాన్ని కాదని ఆమె చెప్పారు.  ఒకవేళ ప్రయాణిస్తే టాక్సీడ్రైవర్ అసలు ఛార్జీకి కొన్ని రెట్లు ఎక్కువ సొమ్ము వసూలు చేస్తాడనడంలో సందేహం లేదు. మనం వేదికల మీద మహిళలకు సంబంధించి పెద్ద పెద్ద ఉపన్యాసాలిస్తూ ఉంటాం. దేవతలను పూజిస్తూ ఉంటాం. మన రాజ్యాంగంలో పురుషులతో పాటు మహిళలకు సమాన హక్కులున్నాయని గర్వంగా చెబుతూ ఉంటాం. అయితే వాస్తవంగా మన దేశంలో మహిళలకు తమ భద్రతపై భరోసా ఉందా? 'యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః' లాంటి పవిత్రమైన శ్లోకాలు వల్లిస్తూ, స్త్రీలు పూజలందుకునే చోటు దేవతలకు నిలయమవుతుందని చదువుకుంటాం. కానీ ఆచరణలో విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉంటాం. మనం కేవలం అలాంటి మంచి మాటల్ని వల్లిస్తూ ఉంటాం..  స్కాండినేవియన్ వంటి దేశాలు ఆచరిస్తాయి! అదే తేడా!                                         ◆నిశ్శబ్ద.

కలమూ.. గళమూ.. మన కోకిల సొంతం...

కలమూ.. గళమూ.. మన కోకిల సొంతం.. సరోజిని నాయుడు అనగానే ఓ గొప్ప రచయిత్రి, ఓ గొప్ప నాయకురాలు గుర్తొస్తుంది అందరికీ. సరోజిని నాయుడు జీవితంలో కొన్ని ముఖ్య ఘట్టాలు గుర్తుచేసుకుంటే ఒళ్ళు పులకరించిపోతుంది, తెలియకుండానే మనలో ఒక కొత్త శక్తి పొగవుతుంది. "నేను ఆంధ్రమహిళను. నాది ఆంధ్రదేశం. ఆంధ్రమహిళలను మహాత్మా గాంధీ రాట్నంరాణీగా పేర్కొన్నారు. ఆది వారి ప్రత్యేక వారసత్వమైన అచంచల స్వభావం, మర్యాద లక్షణాలకు తగ్గట్టుగా ఉంది. ఈ మహిళా మణులకు తగిన లక్షణాలు వారి భర్తలకు అబ్బాయి. ఆంధ్ర రాజ్యాన్ని పరిపాలించిన చివరి రాజుల సాంప్రదాయాన్ని నాయకులు, వాలంటీర్లు కూడ కాపాడినందుకు శ్రీకృష్ణదేవరాయల ఆదరణ, సత్కారాలను మిగిలిన భారతదేశానికి ఎరుక పరచినందుకు నేను ఈనాడు గర్విస్తున్నాను. ఆంధ్రులు హృదయ పరిపాకమున శ్రేష్ఠులు" అని 1928 లో కాకినాడ కాంగ్రెసు సందర్భాన శ్రీమతి సరోజినీ నాయుడు అన్నారు. ఆమె 18–2–1878 న హైదరాబాదులో జన్మించారు. ఆ ఊర్లో వున్న లిటిల్ గర్ల్స్ స్కూలులో చదువుకున్నారు. ఆస్కూలే ఇప్పుడు ఉస్మానియా స్త్రీల కళాశాలగా అభివృద్ధి చెందింది. పదమూడవ యేటనే మెట్రిక్యులేషను వున్నత శ్రేణిలో నెగ్గారు. 11వ ఏటనుంచే ఆమె ఇంగ్లీషులో కవితలు అల్లటం చూసిన నిజాముప్రభువు సంవత్సరానికి నాలుగువేల రూపాయల విద్యార్థి వేతనం ఇచ్చి వున్నత విద్యలకు ఆమెను ఇంగ్లండు పంపించారు. లండన్ కింగ్స్ కాలేజిలోను, కేంబ్రిడ్జిలోని గిర్టన్ కాలేజిలోను చదివారు. భారత దేశ వాతావరణ ప్రధానంగా అనేక పుత్తమ కవితలే ముఖ్యంగా వ్రాశారు. ఒకసారి ఈమె ఆల్బర్టు హాల్లో జలియన్ వాలాబాగ్ దురంతాలను, స్త్రీలకు జరిగిన అవమానాలను గురించి చెపుతువున్నప్పుడు కొంతమంది రౌడీలు కావాలని అల్లరిచేయడం మొదలుపెట్టారు. ఆమె భద్రకాళిలాగ నోరుమూయండి అని పెట్టిన కేక ప్రతివాళ్లను ఆశ్చర్యపరచింది. 1928 సెప్టెంబరులో ఆమె అమెరికా వెళ్లారు. ఒకరోజు ఒక చర్చిలో ఉపన్యాసం ఇస్తున్నారు. ఇసుక వేస్తేరాలనంత జనం ఆమె మాట్లాడుతున్న తీరు చూసి ఆశ్చర్యంతో వింటున్నారు. ఆమె అందరి ముందు ప్రస్తావించిన  నమస్యలకు వారిలో ఎవరు జవాబులు ఇవ్వలేక పోయారు. అప్పుడొక గొప్ప వ్యాపారవేత్త "ఇటువంటి శక్తి నేను ఏ స్త్రీలోను చూడలేదు. నిజం చెప్పాలంటే ఎంత గొప్ప పురుషులు అయినా ఆమెకు నరితూగలేరు” ఆని సరోజీ నాయుడు ప్రతిభను మెచ్చుకున్నాడు.  స్వేచ్ఛా భావాలపట్ల, దేశ స్వాతంత్ర్యం పైన గౌరవంగల అమెరికన్లు నరోజినీదేవి ఆంతర్యంలోగల న్యాయతత్పరతను, స్వాతంత్య్ర గౌరవాన్ని వెలికి తీసుకువచ్చారని మెచ్చుకున్నారు.  గాంధీజీ ప్రతి ఉద్యమాన్ని త్రికరణశుద్ధిగానమ్మి ఆమె వాటిలో పాల్గొనేవారు. ఉప్పు సత్యాగ్రహ సమయంలో దండియాత్ర చేసినవారిలో ఆమె ముఖ్యులు. గాంధీజీని అరెస్టు చేసిన తరువాత ఆమె ఉప్పు కొఠార్లపై జరిగిన దాడికి నాయకత్వం వహించారు. పోలీసులు ఆమెకు అన్నం, నీళ్లు అందకుండ చుట్టు ముట్టి వుండేవారు. ఆమె నవ్వుతు ప్రళయం వచ్చేవరకు నేను ఇక్కడ ఇట్లాగే వుంటాను, మరి మీరు వుండగలరా అని ప్రశ్నించారు. ఏ జవాబు ఇవ్వలేక పోలీసులు చివరకామెను 1980 మే 18న అరెస్టుచేశారు. 1982 ఏప్రిల్ 28న శాసనోల్లంఘనం సందర్భంలో ఆమెను బొంబాయిలో అరెస్టు చేసి ఒక సంవత్సరం జైలులో వుంచారు. తిరిగి క్విట్టిండియా ఉద్యమ సందర్భంలో గాంధీజీ, మీరాబేన్, మహదేవ గార్లతో పాటు అరెస్టుచేసి పూనాలోని ఆగాఖాన్ మందిరంలో బంధించారు. అలాంటి ప్రభుత్వమే.. 1981లో జైలునుండి విడుదల చేసి రౌండు టేబులు కాన్ఫరెన్సుకు భారత మహిళా ప్రతినిధిగా ఆమెను ఇంగ్లండు పంపించింది. ఆమె అధ్యక్షత వహించిన సభలు, సమావేశాలకు లెక్కలేదు. 1920లో అంతర్జాతీయ మహిళా సభకు భారత ప్రతినిధిగా జెనీవా వెళ్లారు. తన వైదుష్యంతో, బెదురు లేని స్వభావంతో, అందరితో చక్కగా కలిసిపోతూనే ముక్కుసూటిదనంగా మాట్లాడుతూ  భారతస్త్రీలు ఇంతటివారు అనే మంచి అభిప్రాయాన్ని  మిగతా దేశస్తుల మనసులో కలిగించారు. 1947 మార్చి 28 నుంచి ఏప్రిల్ 2 వరకు ఢిల్లీ ఎర్రకోటలో జరిగిన ఆసియా ఖండ సమైక్య సభ ఆమె ఆధ్యక్షతన బ్రహ్మాండంగా జరిగింది. ఆమె అఖిల భారత మహిళాసభలకు అధ్యక్షత వహించారు. రౌండు టేబుల సభలకు హాజరయినారు. ఎక్కడికి వెళ్లినా ఆమె శాంతిదూతలానే అందరి మనసుల్లో గోచరించారు.  ఇంతటి మహిళ నుండి మనం ఎంతో కొంత నేర్చుకోవాలి. సగటు మహిళలుగా మనమూ శక్తివంతంగా అవ్వాలి.                                 ◆నిశ్శబ్ద.

మహిళల ఆర్థిక ప్రగతికి బీజం వేసిన యోధురాలు!

మహిళల ఆర్థిక ప్రగతికి బీజం వేసిన యోధురాలు!   స్వాతంత్ర పోరాటంలో కదం తొక్కిన మహిళలు లెక్కకు మిక్కిలి ఉన్నారు. వారిలో ఉన్నవ లక్ష్మీబాయమ్మ చెప్పుకోదగినవారు. భారతీయ మహిళగా సంస్కృతి సంప్రదాయాలు పాటిస్తూనే స్వాతంత్ర్యం కోసం పోరాడిన, మహిళల అభ్యున్నతికి పాటుపడిన మహిళ ఉన్నవ లక్ష్మీభాయమ్మ. 1926-27 ప్రాంతాలలో ఒకనాడు శ్రీమతి ఉన్నవ లక్ష్మీబాయమ్మ.. గుంటూరు కొత్త పేటలో వున్న తమ పరిచయస్తులు శ్రీమతి గోళ్ల మూడి రాజ్యలక్ష్మమ్మ యింటికి వెళ్లారు. బయట హాలులో ఆ కాలపు అలవాటును పట్టి కుమారీ శతకం, సుమతి శతకంలో పద్యాలు గడగడ ప్రైవేటు మాస్టరుకు అప్ప చెపుతున్నది ఒక ఆరేళ్ల అమ్మాయి "పతి భుజియించిన మెతు కొక్కటి మిగల కుండ" అని ఆ అమ్మాయి చదువుతునే ఉంది. అది విన్న లక్ష్మీభాయమ్మ 'ఛీఛీ యేమిటా చదువు మీ అమ్మ లేదూ యింట్లో' అని ఒక్క కేక పెట్టింది.  బిత్తరపోయిన అమ్మాయి 'అమ్మా ఉన్నవ అత్తయ్య వచ్చారు' అంటు తల్లిని పిలుస్తు లోపలికి వెళ్లింది. పై సంఘటన గురించి వినిన వాళ్లెవరూ ఆమె నుదుట పెద్ద కోలబొట్టు, మెళ్లో పసుపుతాడు, చేతులకు వెండి గాజులు, కాళ్లకు మట్టెలు అంటదువ్వి చుట్టుకున్న చిన్న కొండిచుట్ట, మోచేతులవరకు వున్న తెల్ల ఖద్దరు రవికె, కాశపోసి కట్టుకున్న ముతక తెల్ల ఖద్దరు చీర, జీరాడే పమిటెతో వూహించుకోలేరు. కాని వేరే యే అలంకారాలు, ఆభరణాలు లేని ఈ నిరాడంబర వేషంతోనే శ్రీమతి లక్ష్మీబాయమ్మ సభలు సమావేశాలు, పెళ్లిళ్లు పేరంటాలు అన్నీ సలక్షణంగా జరిపించేవారు. ఆమె అక్షరాలా పురాణి. పురాతన పూజలు, పునస్కారాలు, నోములు, వ్రతాలు, వేషభాషలు చదువు సంస్కారాలు అభిమానిస్తారు. కాని పాతవే అయినా స్త్రీల అభ్యున్నతికి అడ్డువచ్చేవి, అభిజాత్యానికి అడ్డువచ్చేవి అంటే మాత్రం సహించరు. మహాకాళిగా మారిపోతారు.  సభలు సమావేశాల సమయంలోనైనా సరే స్త్రీలకు తగిన గౌరవం ఇవ్వకపోతే ఎవరిని లెక్కచెయ్యకుండ లేచి వెళ్లి పోయేవారు.  ఆమెలో వున్న విప్లవ భావన, పరతంత్ర శృంఖలాలను ఛేదించి పారవేయాలన్న తపన ప్రతి ఒక్క విషయంలోను కనిపిస్తుంది. 1920-40ల మధ్య గుంటూరులో శారదా నికేతనం వార్షికోత్సవాలు పౌరులను వివరీతంగ ఆకర్షించేవి. పదేళ్లలోపు అమ్మాయిలకు పెళ్లిళ్లు చేయకుండా మూడో యెక్కమైనా ముచ్చటపడి నేర్చుకోకుండ అత్తవారిళ్లకు పంపే ఆ రోజల్లో శారదా నికేతనంలో అమ్మాయిలు తళతళలాడే మఖమల్ జరీబుటా దుస్తులు ధరించి సంస్కృత నాటకాలు కూడ ప్రదర్శించేవారు, కన్నుల పండుగగా పదేసిమంది పిల్లలు రకరకాల వాయిద్యాలతో పాట కచ్చేరీ చేస్తువుంటే రాత్రి తొమ్మిదయినా ప్రేక్షకులు కదిలేవారు కాదు. ఆ రోజుల్లో శారదా నికేతనం విశ్వకవి రవీంద్రుని శాంతి నికేతనాన్ని స్ఫురింపచేసేది. అక్కడ తెలుగు, సంస్కృతం, సంగీతం, చిత్రలేఖనం, లేసు అల్లికలు, పూవులు, లతలు కుట్టటం, నూలువడకటం వంటి జాతీయ విద్యలెన్నో నేర్పేవారు. జాతి, కుల, మత, భేదం లేకుండ ఆడపిల్లలకు ఉచితంగా విద్య నేర్పటమేకాక ఉచితంగా హాస్టలు సదుపాయాలు కూడ కల్పించేవారు. ఇవన్ని నేర్చి అమ్మాయిలు విజ్ఞానవంతులు కావాలి, తమగౌరవాన్ని తాము కాపాడుకోగలగాలి, అవసరమైన పరిస్థితులలో కొంత డబ్బు సంపాదించుకోగలగాలి తమకు తమ స్త్రీజాతికే కాక తమ మాతృదేశానికి సేవచేయాలి అన్న తలంపుతోనే శ్రీ ఉన్నవ దంపతులు శారదా నికేతనం స్థాపించారు.  బాల్య వివాహాలవల్ల స్త్రీ మానసికంగా యెదగకుండానే గృహవిధులకు, కష్టాలకు లోనవుతున్నది. ఇక బాలవితంతుల గోడు చెప్పనే అవసరంలేదు. ఈ పరిస్థితిలో చైతన్యం స్త్రీలలోనే కలిగించాలనే ఉద్దేశంతో సంస్థాపించి గురుకుల వాతావరణంలో నడిపించసాగారు. ఆంధ్రపర్యటనకు వచ్చినప్పుడు గుంటూరులో ఎంత తక్కువకాలం గడిపినా గాంధీజీ ఒకసారో రెండుసార్లో శారదానికేతనానికి వచ్చి, అక్కడి వారందరిని ఆశీర్వదించి, వుద్బోధించి తీరవలసిందే. రెల్లు కప్పు వేసిన గుండ్రటి వేదికలు అనేకం వుండేవి. వాటిమీద కూర్చుని గాంధీజీ మాట్లాడుతుంటే సభికులు తామెక్కడున్నారో మరచి పరవశించేవారు. ఇంతటి గొప్ప వ్యక్తిత్వం, గొప్ప లక్ష్యాలు కలిగిన ఉన్నవ లక్ష్మీభాయమ్మ ప్రతి మహిళకూ స్ఫూర్తి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. పైపెచ్చు లక్ష్మీభాయమ్మ చెప్పినట్టు ప్రతి మహిళా సొంతంగా సంపాదించుకోవడంలో ఆ మహిళ అస్తిత్వం దాగుంటుంది.                                       ◆నిశ్శబ్ద.

అమ్మతో కాసేపు

  అమ్మతో కాసేపు   గోరుముద్దలు - గోరింటాకులు, పాల బుగ్గలు - పట్టుపావడాలు, చందమామ కథలు - చద్దిఅన్నాలు ఇలా చెప్పుకుంటూ పోతే అమ్మ మనకిచ్చే తీపి జ్ఞాపకాలు ఎన్నో లెక్కకి కూడా అందవు. మనసు వాకిటిని తడితే చాలు దొర్లుకుంటూ వచ్చే తల్లి తలపులకు ఆనకట్ట వెయ్యటం కొంచెం కష్టమే. స్కూల్ నుంచి వచ్చాకా అక్కడ జరిగినవన్నీ అమ్మకి చెప్పకపోతే  నిద్ర పట్టదు. మనం సైకిల్ తొక్కినా అమ్మ చూడాలి, చెట్టెక్కి గెంతాలన్నా అమ్మే చూడాలి. మొత్తానికి మనం ఏం చేసినా అమ్మ పక్కనే ఉండాలి. మనతో ఇంతలా అల్లుకుపోయిన అమ్మని విడిచి దూరంగా వెళ్ళాల్సి వస్తే మన ప్రాణాలని ఎవరో తెలియకుండా లాగేసుకుంటునట్టు ఉండదూ. ఎన్నేళ్ళు వచ్చినా మనం ఇంకొకరికి అమ్మ అయినా మన అమ్మ మీదున్న ప్రేమ ఇసుమంతైనా తగ్గదు. పెద్ద చదువులకి వెళ్ళాకా పెద్ద ఉద్యోగాలు వచ్చాకా అమ్మతో గడిపే సమయం కరువవుతుంటే ఏం చేయటం. నిజంగానే మీకు అమ్మతో కాసేపు గడపి ఆమెని సంతోషంగా ఉంచాలంటే  ఎలా ప్లాన్ చేసుకోవచ్చో చూద్దామా. అమ్మకి ఇష్టమైన కాఫీని ఆమె లేచే లోపే తయారుచేసి రెడీగా ఉంచితే? లేవగానే ఒక చిరునవ్వుతో కాఫీని అందించి చూడండి. తనకోసం ఎవరెస్ట్ శిఖరాన్ని గుమ్మం ముందు తెచ్చి ఉంచితే ఎంత ఆశ్చర్యపోతుందో అంత ఆశ్చర్యాన్ని, దాని వెనక ఆనందాన్ని అమ్మ కళ్ళల్లో చూడచ్చు. అలాగే తనకిష్టమైన ప్లేస్ ఏముందో తెలుసుకుని ఆ ప్లేస్ కి సడన్ గా తీసుకెళ్ళి ఆమె కళ్ళల్లోకి తొంగి చూడండి. ఆ రోజంతా అమ్మని అంటిపెట్టుకుని ఉండి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ బయటనే చేసి ఇంటికి తిరిగి రండి. అంతలా తిరిగి వచ్చినా అమ్మ కళ్ళల్లో కనిపించని నీరసాన్ని చూసి మీకు నీరసం రావాలి. అమ్మకిష్టమైన వ్యక్తులని ఇంటికి పిలిచి సర్ప్రైజ్ పార్టీ ఏర్పాటు చేసి ఆమెకి ఆనందాన్ని ఇవ్వచ్చు. ఎప్పుడూ మన పనులతో బిజీగా ఉండే ఆవిడ తనకిష్టమైన వాళ్ళతో గడిపుతూ ఎలా సేద తీరుతుందో మీ కళ్ళతో మీరే చూడచ్చు. ఒక మంచి ఫోటో ఆల్బం కొని  అమ్మకి సంబందించిన అన్నీ ఫొటోస్ పెట్టి  దాన్ని గిఫ్ట్ గా ఇవ్వచ్చు. తనే మరిచిపోయిన ప్రపంచాన్ని తన కళ్ళ ముందు పరవచ్చు. ప్రతిక్షణం  మనకోసమే అలోచించి తన ఉనికినే మర్చిపోయే అమ్మకి ఆనందాన్ని గుర్తుచేద్దాం. ఇలా ఒక రోజు అమ్మని ఆనందంలో ముంచెత్తి మిగిలిన రోజుల్లో తన గురించి ఆలోచించకుండా ఉండటం మాత్రం ఎంతమాత్రం సబబు కాదు. నిజంగా అమ్మంటే ప్రేముంటే ప్రతిరోజూ ఆమె గురించి ఆలోచిద్దాం. ప్రతి క్షణం ఆమెని సంతోషంగా ఉంచుదాం. కళ్యాణి

ఆనందమైన కుటుంబానికి మహిళలు ఎలా కారణం అవుతారు?

ఆనందమైన కుటుంబానికి మహిళలు ఎలా కారణం అవుతారు? ఈ సమాజంలో ఓ ఇల్లు, ఆ ఇంట్లో వారు సంతోషంగా ఉండటం వెనుక కారణం  ఏమై ఉంటుంది. చాలా మంది వారికి ఆర్థిక బాధలు లేవని, అనారోగ్యాలు లేకుండా ఉన్నారని, డబ్బు పుష్కలంగా ఉంటుంది లెమ్మని ఇలా బోలెడు కారణాలు చెప్పుకుంటారు. కానీ దానికి అవేవి కారణాలు కాదు. వాటన్నిటికంటే ముందు ఆ కుటుంబం, ఇల్లు సంతోషంగా ఉండటానికి కారణమయేది ఆ ఇంటి మహిళ.  శాంతియుత వాతావరణమే ఒక ఇంటిని అసలైన ప్రశాంత నిలయంగా చేస్తుంది. స్త్రీలు శాంతియుతమైన, సమర్థమైన, ఆనందమయమైన గృహ జీవితాన్ని ఏర్పరచుకునే జ్ఞానం కలిగి ఉండాలని కొందరు చెబుతారు. గృహ కార్యకలాపాల్లో అనురాగం, అంకితభావాలు సమర్థంగా పనిచేస్తాయి. పూర్వీకులు చెప్పినట్లు ఇల్లు అంటే ఒక రాతి కట్టడం కాదు. శాంత స్వభావురాలైన స్త్రీనే ప్రేమానురాగాలతో తన ఇంటిని ఆనందనిలయంగా మలచుకుంటుంది. ఇంటిని ఆనందనిలయంగా ఉంచుకునే మహిళలు సమాజానికి చాలా అవసరం. సమాజంలో శాంతి సౌభ్రాతృత్వాలు వర్ధిల్లడానికి గృహశాంతి ఎంతగానో తోడ్పడుతుంది. వ్యక్తిగత శాంతి, సహనం నుంచి సామాజిక శాంతి సిద్ధిస్తుంది.  భారతీయ మహిళలకు ఈనాడు విజ్ఞానార్జనకూ, మేధావికాసానికీ ఎన్నో అవకాశాలు, సౌకర్యాలు ఉన్నాయి. దురదృష్టవశాత్తూ విద్యావంతులైన కొంతమంది మహిళలు సాటివారితో పోల్చుకుని అవసరాల్నీ, ఖర్చుల్నీ పెంచుకుంటున్నారు. ఈర్ష్య అసూయలకులోనై మనశ్శాంతిని కోల్పోతున్నారు. ఆధ్యాత్మిక అవగాహన పెంచుకోవడం ద్వారా వారు ఈ సమస్యను అధిగ మించగలరు. బాహ్యసౌందర్యానికి ప్రాధాన్యాన్ని తగ్గించి, అంతఃసౌందర్యం పెంపొందించు కోవాలి. ఇది మన చేతుల్లోనే ఉంది. నిర్మలమైన మనస్సు, మాతృప్రేమ, నిరంతర శ్రమ, భక్తిప్రపత్తులు ద్వారా అంతఃసౌందర్యం ప్రతిబింబించేలా చేసుకోవచ్చు.  వనితా లోకం వాక్ సంయమనం, భావ సంయమనాల ద్వారా తమ సామర్థ్యాన్నీ వృద్ధి పరచుకోవచ్చు.  యోగస్య ప్రథమం ద్వారం వాణ్నిరోధః అని వివేక చూడామణిలో ప్రస్తావించారు. యోగానికి తొలిమెట్టు వాక్ సంయమనం అన్నారు ఆది శంకరాచార్యులు. ఇంటా బయటా కలిగే సమస్యలకు ఒక ప్రధాన కారణం. స్త్రీల అనియంత్రిత వాగ్ధోరణి.  భారతీయుల దృష్టిలో వాగ్దేవతే బుద్ధి దేవత కూడా. మన వాక్కును నియంత్రించు కొని, స్వచ్ఛంగా ఉండటం ద్వారా మనం వివేకాన్ని సాధించవచ్చు. శాంతి సంతోషాలను అనుభవించవచ్చు. కానీ చాలామంది మహిళలు తమ మాటతీరు విషయంలో చాలా గట్టిగా ఉంటారు. ప్రతి చిన్న విషయాన్ని సమస్యగా గొంతు విప్పి చెబుతారు. అంటే ఆడవారు గొంతెత్తి మాట్లాడకూడదని కాదు ఇక్కడ చెప్పేది. ఇంటి విషయాన్ని వీధిలోకి వచ్చి మాట్లాడటం సమంజసం కాదు కదా.. చాలామంది అదే తప్పు చేసేస్తారు. మాట్లాడటం తమ స్వేచ్ఛ కదా అంటారు. దీనికి మగవారు కూడా అతీతం కాదు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అన్నట్టుగానే.. మాట అదుపులో ఉంటే మనిషి కూడా ప్రశాంత జీవనాన్ని పొందగలుగుతాడు.  కాబట్టి మహిళలు తమ మాట ఎంత పొదుపుగా, జాగ్రత్తగా వాడితే వారికి అంత ప్రశాంతత. వారు ఎంత ప్రశాంతంగా ఉంటే వారి కుటుంబం కూడా అంత బాగుంటుంది.                                                  ◆నిశ్శబ్ద.

సుగంధ నూనెలతో ఇల్లు పరిమళభరితం

సుగంధ నూనెలతో ఇల్లు పరిమళభరితం ఇల్లు పరిమళభరితంగా ఉంటే మనసు ఆహ్లాదంగా ఉంటుంది. ఐతే కొన్నిసార్లు వంట చేసిన తరువాత ఏర్పడే ఘాటు వాసనలతో, గాలి, వెలుతురు లేక ఏర్పడే దుర్వాసనలతో ఇబ్బందికరంగా అనిపిస్తుంటుంది. అటువంటి సమస్యలని రసాయనాలతో కాకుండా సుగంధ నూనెతో పరిష్కరించుకోవచ్చు. 1. అరబకేట్ నీటిలో పావుకప్పు వెనిగర్, పెద్ద చెంచా నిమ్మరసం నూనె కలిపి గదిలో కాస్త చల్లితే.. గదిలోని వంట వాసనలు పోయి హాయి వాతావరణంతో నిండిపోతుంది. 2. కార్పెట్లు మురికిగా మారి దుర్వాసన వస్తుంటే.... కప్పు బేకింగ్ సోడాకి, చెంచాడు ఏదైనా సుగంధ నూనేలని కలపాలి. ఈ మిశ్రమాన్ని కార్పెట్ పై చల్లి తెల్లారి వాక్యుమ్ క్లీనర్ తో శుభ్రం చేసుకొంటే సరిపోతుంది. 3. కిటికీ అద్దాలు దుమ్ముపట్టి ఉంటే కప్పు వెనిగర్ కి చెంచా లావెండర్ పరిమళన్ని జోడించి తుడిస్తే సరి. అవి తలుక్కుమనడమే కాకుండా సువాసనభరితంగా కూడా ఉంటాయి. 4. వంట చేసిన తరువాత గది అంతా ఆవరించే ఘాటు వాసనలు తొలగిపోవడానికి ఒక గిన్నె నిండా నీళ్ళు తీసుకొని దానిలో దాల్చిన చెక్కని వేసి మరిగిస్తే గది చక్కని పరిమళాలు వెదజల్లుతుంది. 5. దుస్తులు ఒక్కచోట పోగుపడి.. ముక్కిపోయిన వాసన వస్తుంటే ఎండలో ఆరవేయ్యాలి. వీలుకానప్పుడు నిమ్మ, లావెండర్ వంటి ఏదైనా పరిమళంలో ఒక జేబు రుమాలుని ముంచి దానిని దుస్తుల మధ్య ఉంచితే సరిపోతుంది.