రాణి అహిల్యాబాయి హోల్కర్ గురించి తెలుసా...

 రాణి అహిల్యాబాయి హోల్కర్ గురించి తెలుసా...     రాణి అహిల్యాబాయి హోల్కర్ (1725–1795) భారతదేశ చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకమైన, ఆదర్శప్రాయమైన మహిళా పాలకురాలిగా నిలిచారు. మధ్యభారతదేశంలోని ఇండోర్ సంస్థానంలో జన్మించిన ఆమె, చిన్నతనంలోనే భర్తను కోల్పోయి, తన కుటుంబాన్ని సమర్థంగా నడిపించారు. తర్వాత, ఆమెను సంస్థానాధీశులు రాణిగా నియమించారు. పరిపాలనలో ప్రతిభ.. రాణి అహిల్యాబాయి హోల్కర్ రాజ్యాన్ని సమర్థంగా, ప్రజా సంక్షేమాన్ని ప్రధానంగా ఉంచి పరిపాలించారు. ప్రతి రోజు నర్మదా నదిలో స్నానం చేసి, మట్టితో శివలింగాన్ని తయారు చేసి, ఆ లింగం సాక్షిగా న్యాయనిర్ణయం చేసేవారు. అవినీతికి తావులేని పాలన, పన్నుల విధానంలో పారదర్శకత, ప్రజల సమస్యలను స్వయంగా పరిష్కరించడం వంటి లక్షణాలతో ఆమె పాలన ప్రసిద్ధి చెందింది. సాంస్కృతిక పునర్నిర్మాణం.. రాణి అహిల్యాబాయి హోల్కర్ తన స్వంత నిధులతో దేశవ్యాప్తంగా సుమారు 150 దేవాలయాలను పునర్నిర్మించారు. కాశీ విశ్వేశ్వర ఆలయం, కేదారనాథ్, గయ, ప్రయాగ, శ్రీశైలం, రామేశ్వరం, పూరి జగన్నాథ్ ఆలయాలు వంటి ప్రఖ్యాత దేవాలయాలను పునర్నిర్మించారు. ఈ విధంగా, ఆమె భారతీయ సంస్కృతిని కాపాడడంలో కీలక పాత్ర పోషించారు. సామాజిక సవరణలు.. అహిల్యాబాయి హోల్కర్ సమాజంలో అనేక సవరణలు తీసుకువచ్చారు. బాల్య వివాహాలను నిషేధించారు, వరకట్న పద్ధతిని రద్దు చేశారు, వితంతు వివాహాలను ప్రోత్సహించారు. అదేవిధంగా, భిల్లులు, గోండులు వంటి ఆదివాసీలను సంస్కరించి, వారికి స్థిర నివాసాలు కల్పించారు. దౌత్య నైపుణ్యం.. రాణి అహిల్యాబాయి హోల్కర్ 15 దేశాలకు రాయబారులను పంపించి, సమర్థమైన విదేశాంగ విధానాన్ని నిర్వహించారు. ఆమె రాజ్యంలో వివిధ కులాలకు, మతాలకు చెందిన ప్రజల పట్ల సమానత్వంతో వ్యవహరించారు. అందువల్ల, ఆమె పాలనలో సామాజిక సామరస్యత నెలకొంది. నారీ శక్తికి ప్రతీక.. రాణి అహిల్యాబాయి హోల్కర్ తన జీవితాన్ని నిరాడంబరంగా గడిపారు. ఆమెకు "పుణ్యశ్లోక" అనే బిరుదు కూడా వచ్చింది, అంటే "పుణ్యమూర్తి" అని. ఆమె జీవితం నారీ శక్తికి ప్రతీకగా నిలిచింది.  ఆమెను ఆదర్శంగా తీసుకుని అనేక మహిళలు తమ జీవితాలను తీర్చిదిద్దుకుంటున్నారు. ఈ విధంగా రాణి అహిల్యాబాయి హోల్కర్ భారతదేశ చరిత్రలో ఒక అపూర్వమైన మహిళా పాలకురాలిగా నిలిచారు. ఆమె పరిపాలన, సాంస్కృతిక పునర్నిర్మాణం, సామాజిక సవరణలు,  దౌత్య నైపుణ్యాలతో ఆమె దేశానికి అమూల్యమైన సేవలు అందించారు. ఈమె ప్రతి మహిళకు ఆదర్శం.                                    *రూపశ్రీ.

మానసిక సమస్యలకు చెక్ పెట్టాలంటే

  మానసిక సమస్యలకు చెక్ పెట్టాలంటే   ఒత్తిడి ..ఎంతటి వారిని అయినా చిత్తు చేసేస్తుంది . అందులోను మహిళల విషయం లో ఈ ఒత్తిడి మరింత ప్రభావాన్ని చూబిస్తుంది , ఎందుకంటే వారు ఎన్నో విధాలుగా నిత్యం ఒత్తిడికి గురి అవుతూనే వుంటారు , అందులోను , ఆఫీసుల్లో పనిచేసే ఉద్యోగినిలు కంటే గృహిణులు గా ఇంట్లో వుండే మహిళలలోనే ఒత్తిడి ఎక్కువ అట. సాధారణంగా ఉద్యోగం చేసే మహిళలలో ఒత్తిడి ఎక్కువగా వుంటుంది అనుకుంటారు. కాని తాజాగా చేసిన ఒక అధ్యయనం లో ఇంటికే పరిమిత మయిన మహిళలలోనే  ఒత్తిడి ఎక్కువ అని తేలింది. హార్మోన్ల స్తాయి ని లెక్కించి వారి ఒత్తిడిని అంచనా వేసారు. చివరికి వారు తేల్చిన విషయం ఏంటంటే ఎవరయినా , ఎప్పుడు అయినా తను చేసే పనికి తగిన గుర్తింపు కావాలని కోరుకుంటారు. ఉద్యోగినులకి అయితే శ్రమకి తగిన జీతం , పదోన్నతలు, ప్రశంసలు వంటివి వుంటాయి. కాని గృహిణులుగా ఎంత బాధ్యతతో వున్నా వారికి చిన్నపాటి గుర్తింపు కూడా ఉండదు. పైగా వారు చేసే పనిని కూడా ఎవరు కష్టమయినదిగా గుర్తించరు. దానితో పనికి గుర్తింపు లేకపోవటం అన్నది వారిని చాలా మానసిక ఒత్తిడికి గురిచేస్తోంది అని తేలింది. పైగా ఉమ్మిడి కుటుంబాలలో ఉండే మహిళలలో ఈ ఒత్తిడి మరింత అధికంగా వుండటం గుర్తించారుట. చేసే పనికి చిన్నపాటి గుర్తింపు కుటుంబ సబ్యుల నుంచి దొరికితే వారిలో అసహనం, కోపం, వత్తిడి వంటివి తగ్గుతాయని , దానివలన ఇతర అనారోగ్యాలు కూడా తగ్గుతాయని వీరు గట్టిగా చెబుతున్నారు. చిన్న పాటి ప్రశంస మహిళల మానసిక, శారీరక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అని అధ్యయనాలు చెబుతున్నా కూడా  , ఇప్పటికి ఆ ప్రశంస దొరకటం కష్టం గా వుంది అంటే ...ఆ సమస్యకి పరిష్కారం గట్టిగా ఆలోచించాల్సిందే. నిపుణులు ఈ విషయం లో మహిళలకి కొన్ని సూచనలు చేస్తున్నారు. అవి ఏంటంటే 1. మొదటిగా, మిమ్మల్ని మీరు ప్రేమించు కొండి 2. మీతో మీరు కొంత సమయం గడపండి 3. మీకోసం మీరు ఆలోచించటం మొదలు పెట్టండి ఎప్పుడు అయితే మీ గురించి మీరు ఆలోచించటం మొదలు పెడతారో , ఆత్మవిశ్వాసం మీ స్వంతం అవుతుంది . అప్పుడు బయట వ్యక్తుల ప్రశంసల కోసం ఎదురు చూడరు . వారినుంచి ప్రశంస దొరికినా , లేకపోయినా కూడా ఆనందం గానే వుంటారు. ఈ చిన్న విషయాన్ని గమనిస్తే చాలు ...ఎన్నో మానసిక సమస్యలు కి చెక్ చెప్పినట్టేనట.  

బట్టల మీద  మరకలు  ఇలా ఈజీగా తొలగించవచ్చు..!

బట్టల మీద  మరకలు  ఇలా ఈజీగా తొలగించవచ్చు..!   మరక మంచిదే అనే యాడ్ చూసే ఉంటారు. అయితే నచ్చిన దుస్తుల మీద మరకలు పడటం వల్ల చాలా బాధపడతాం.  ముఖ్యంగా ఫేవరెట్ డ్రెస్ అని అందరికీ ఉంటుంది.  పొరపాటున ఈ ఫేవరెట్ డ్రెస్ మీద కానీ, ఖరీదైన దుస్తుల మీద కానీ మరకలు పడితే మనసు విలవిలలాడుతుంది. అయితే కొన్ని సులభమైన ఇంటి చిట్కాలతో ఈ మరకలను సులభంగా తొలగించుకోవచ్చు. నిమ్మరసం.. నిమ్మరసం సహజమైన బ్లీచ్ ఏజెంట్ గా పనిచేస్తంది. దుస్తుల మీద మరకలు ఏర్పడినప్పుడు దాని మీద నిమ్మరసం పిండాలి. ఆ తరువాత కొద్దిసేపు దాన్ని అలాగే వదిలేయాలి.  ఆ తరువాత కడగాలి.  మరకలు మాయం అవుతాయి. బేకింగ్ సోడా.. బేకింగ్ సోడా కూడా శక్తివంతమైన క్లీనింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. కేవలం దుస్తులే కాదు.. వివిధ వస్తుల మీద మొండి మరకలను కూడా బేకింగ్ సోడా సహాయంతో మాయం చేయవచ్చు.  ఇకపోతే దుస్తుల మీద ఏర్పడిన మరకల మీద బేకింగ్ సోడా పేస్ట్ అప్లై చేయాలి.  ఆ గుడ్డను కాసేపు పక్కన పెట్టాలి. ఆరిపోయాక దాన్ని వాష్ చేయాలి. బేకింగ్ సోడా మరకల తాలూకు మురికి,  జిడ్డు, రంగు మొదలైనవి లాగేస్తుంది. వెనిగర్.. నిమ్మకాయకు ప్రత్యామ్నాయంగా చాలామంది చాలా సందర్భాలలో వెనిగర్ ను ఉపయోగిస్తారు. అయితే బట్టల మీద మరకలను కూడా వెనిగర్ ద్వారా తొలగించుకోవచ్చు.  మరకల మీద వెనిగర్ రాసి కాసేపు అలాగే ఉంచాలి.  ఆరిన తరువాత  వాష్ చేయాలి. హైడ్రోజన్ పెరాక్సైడ్.. రంగు దుస్తులపై హైడ్రోజన్ పెరాక్సైడ్ ను ఉపయోగించే ముందు ఏదైనా ప్రాంతంలో ప్యాచ్ టెస్ట్ చేయాలి.   బట్టలకు ఎలాంటి నష్టం కలగకుంటే మరకల మీద ప్రయోగించాలి.  ఇది మరకలు తొలగించడంలో చాలా ప్రబావవంతంగా ఉంటుంది. డిష్ వాష్ సోప్.. డిష్ వాష్ సోప్ మరకల తాలూకు ఆయిల్,  గ్రీజు మరకలను తొలగించడంలో చాలా గ్రేట్ గా సహాయపడుతుంది.  మరక మీద కొద్దిగా డిష్ వా,్ సోప్ రాసి రుద్దాలి.  తర్వాత దాన్ని వాష్ చేయాలి. ఉప్పు.. మరకలు ఇంకా అప్పుడే అయినవి అయితే వాటని తొలగించడానికి ఉప్పు భలే మంచి ఎంపిక.  మరకలపైన ఉప్పును వేయాలి.  ఉప్పు మరకల తాలూకు గ్రీజు, జిడ్డు, రంగును లాగేస్తుంది. బోరాక్స్.. బోరాక్స్ అనేక రకాల మరకలను తొలగించడంలో సహాయపడుతుంది.  బోరాక్స్ ను పేస్ట్ చేసి మరకల మీద రాసి కాసేపు అలాగే వదిలేయాలి.  ఆ తరువాత వాష్ చేయాలి.  మరకలు మాయమవుతాయి. బంగాళదుంప.. బంగాళదుంప రసం తుప్పు మరకలను తొలగించడంలో సహాయపడుతుంది.  బట్టల మీద తుప్పు మరకలు ఉన్నప్పుడు బంగాళదుంప ను కట్ చేసి బంగాళదుంప ముక్కలతో మరకల మీద బాగా రుద్దాలి.  ఇలా చేస్తే మరకలు పోతాయి.                                               *రూపశ్రీ.  

అసలైన బనారసీ పట్టును ఇలా గుర్తించండి..!

అసలైన బనారసీ పట్టును ఇలా గుర్తించండి..!     పట్టు చీరలు భారతీయ కళకు కాణాచి.  ఇక పట్టు చీరలు కట్టుకున్నమగువలను చూస్తే  సాక్షాత్తూ ఆ దేవతే దిగి వచ్చిందేమో అనిపిస్తుంది.  మగువల వల్ల చీరకు అందమా.. చీర వల్ల మగువల అందం రెట్టింపైందా అనేది తెల్చలేని సందిగ్ధం కూడా ఏర్పడుతుంది. భారతదేశంలో చాలా రకాల పట్టుచీరలు ఉన్నాయి.  ప్రాంతాన్ని బట్టి పలు రకాల పట్టులు పేరొందాయి.  వాటిలో బనారసి సిల్క్ చీర కూడా ఒకటి.   బనారసి సిల్క్ చీరకు దానిదైన ప్రత్యేకత ఉంది. అయితే స్వచ్చమైన బనారసి పట్టు అంత ఈజీగా దొరకవు. చాలా చోట్ల బనారసి పేరుతో మోసాలు జరుగుతుంటాయి.  నిజమైన బనారసి పట్టు చీరల ఫాబ్రిక్, డిజైన్, రంగు అన్నీ చాలా విభిన్నంగా ఉంటాయి.  నిజమైన బనారసి పట్టును ఎలా గుర్తించవచ్చో తెలుసుకుంటే ఈ రకమైన పట్టు చీర కొనేటప్పుడు మోసపోకుండా ఉంటారు. మెరుపు.. బనారసి సిల్క్ చీరలను కొనేటప్పుడు దాని మెరుపు మీద దృష్టి పెట్టాలి్.  కొనుగోలు దారులు నకిలీ చీరలు చూపించి ప్రజలను సులువుగా మోసం చేస్తారు.  అందుకే బనారసి చీరలు కొనేటప్పుడు చీరల మెరుపు మీద దృష్టి పెట్టాలి.  బనారసి సిల్క్ చీరలు  చాలా మృదువుగా ఉంటాయి. అంచు.. బనారసి సిల్క్ చీరల అంచు దారం వదులుగా ఉంటుంది.  ఈ చీరను చేతితో నేస్తారు.  దీని వల్ల అంచు దారం వదులుగా ఉంటుంది.  అదే సమయంలో నకిలీ చీరలు అయితే యంత్రం సహాయంతో నేస్తారు.  ఈ మెషీన్ తో నేసే చీరల అంచు దారాలు వదులుగా ఉండవు.  ఈ అంచును చూసి అసలు చీర, నకిలీ చీర మద్య తేజా కనుక్కోవచ్చు. ధర.. బనారసి సిల్క్ చీరలను ధరతో పోల్చి కూడా కనుక్కోవచ్చు.  ఈ చీరలు ఖరీదైనవి.  దాదాపు 10 నుండి 12వేల రూపాయల ధర ఉంటాయి.  ఇంతకంటే తక్కువ ధరకు ఈ చీరలను ఏ దుకాణంలో అయినా అమ్ముతుంటే అవి నకిలీ చీరలని తెలుసుకోవచ్చు.  అలాంటి చీరలు కొనకూడదు. దారం.. అసలైన బనారసి పట్టు  చీరను కనుక్కోవడానికి మరొక చిట్కా ఉంది.  అసలైన బనారసి పట్టు దారం కాల్చిన వెంటనే కాలిపోతుంది. చేతికి మసి అంటుతుంది.  అదే నకిలీ బనారసి పట్టు అయితే ప్లాస్టిక్ దారాలతో తయారవుతుంది.  దీని దారం కాల్చినప్పుడు చేతికి అతుక్కుంటుంది. నమ్మకం.. బనారసి సిల్క్ చీరలను కొనుగోలు చేసేటప్పుడు ఎక్కడంటే అక్కడ కొనకూడదు.  నమ్మకమైన  దుకాణాదారుల దగ్గర.. చాలా వరకు నేత పని చేసే వారి దగ్గర నేరుగా కొనడం మంచిది.                                         *రూపశ్రీ.

సేఫ్టీ పిన్ వల్ల చీర లేదా దుపట్టా చిరిగిపోతోందా...ఇలా చేస్తే ప్రాబ్లమ్ సాల్వ్ అయినట్టే..!

  సేఫ్టీ పిన్ వల్ల చీర లేదా దుపట్టా చిరిగిపోతోందా...ఇలా చేస్తే ప్రాబ్లమ్ సాల్వ్ అయినట్టే..!     సేఫ్టీ పిన్.. ప్రతి అమ్మాయికి చాలా అవసరమైన వస్తువు. చీరలు,  డ్రస్ కు వేసుకునే చున్నీలను  జారిపోకుండా ఉండటం కోసం సేఫ్టీ పిన్ లను వాడతారు.  మధ్యతరగతి, దిగువ తరగతి మహిళల మంగళసూత్రానికి,  గాజులకు ఈ సేఫ్టీ పిన్స్ తప్పనిసరిగా ఉండటం చూడవచ్చు.  అయితే సేఫ్టీ పిన్ లను చీరలు కట్టుకున్నప్పుడు,  దుప్పట్టా వేసుకున్నప్పుడు సేఫ్టీ పిన్ ను వాడి ఆ తరువాత మనసు చిన్నబుచ్చుకునే వారు చాలామంది ఉంటారు.  కారణం..  ఈ సేఫ్టీ పిన్ లు పెట్టుకున్నప్పుడు డ్రస్ లేదా చీర క్లాత్ కాస్త చిరిగిపోవడం.  సేఫ్టీ పిన్ వినియోగం వల్ల మంచి మంచి దుస్తులు రంధ్రాలు పడుతుంటాయి.  ఈ సమస్యకు చెక్ పెట్టడానికి కొన్ని ఈజీ ట్రిక్స్ పాటించాలి. ఈ సమయంలోనే ఎక్కువ.. చాలా సార్లు హడావిడిగా చీర కట్టుకున్నప్పుడు,  డ్రెస్ వేసుకున్నప్పుడు సేఫ్టీ పిన్ పెట్టేటప్పుడు సరిగా పెట్టకుండా ఆవేశంతో పిన్ ను గుచ్చేస్తుంటారు. దీని వల్ల అవి చీరలోనూ, చున్నీలలోనూ ఇరుక్కుపోయి అవి సులభంగా బయటకు రాలేక.. దుస్తులకు నష్టం చేకూరుస్తాయి. దీని వల్ల చాలా వరకు కొత్త చీరలు, డ్రస్సులు బలి అయిపోతుంటాయి. బటన్స్.. చీర లేదా దుపట్టాను పిన్ చేయడానికి ముందు సేఫ్టీ పిన్ కు రంగురంగుల బటన్ లను అటాచ్ చేయాలి.  ఇలా చేయడం వల్ల చీర చిరిగిపోదు.  బట్ట సురక్షితంగా ఉంటుంది. అంతేకాదు.. సేఫ్టీ పిన్ ను తిరిగి తీసేయడం కూడా సులువుగా ఉంటుంది. స్టిక్కర్.. సేఫ్టీ పిన్ పెట్టుకొనేటప్పుడు స్టిక్కర్ కూడా ఉపయోగించవచ్చు.  స్టిక్కర్ ఉపయోగించి సేఫ్టీ పిన్ పెట్టడం వల్ల దాన్ని తిరిగి తీయడం సులువు అవుతుంది. అలాగే క్లాత్ చిరిగిపోకుండా కాపాడుకోవచ్చు. పాలిథిన్.. చీరకు కానీ,  దుపట్టాకు కానీ సేఫ్టీ పిన్ పెట్టేటప్పుడు దానికి పాలిథిన్ కవర్ లేదా కాగితాన్ని అతికించవచ్చు.  దీని వల్ల క్లాత్ చిరిగిపోకుండా ఉంటుంది.  సేఫ్టీ పిన్ పెట్టుకోవడం,  తిరిగి తీయడం కూడా సులువే. బీడ్స్.. సేఫ్టీ పిన్ పెట్టుకొనేటప్పుడు చీరకు కానీ,  దుపట్టా కు కానీ నష్టం జరగకూడదు అంటే సేఫ్టీ పిన్ కు బీడ్స్ ఎక్కించాలి.  ఇవి కూడా చాలా  అట్రాక్షన్ గా ఉండే ముత్యాలు,  రంగు రంగుల పూసలను సేఫ్టీ పిన్ కు ఎక్కించి వాడటం వల్ల చూడటానికి చాలా అందంగా కూడా ఉంటుంది. టేప్.. సేఫ్టీ పిన్ ల మధ్య టేప్ ఉపయోగించడం వల్ల సేఫ్టీ పిన్ వల్ల చీరలకు,  దుపట్టాలకు నష్టం జరగదు. టేప్ వల్ల క్లాత్ లో సేఫ్టీ పిన్ లు ఇరుక్కోకుండా ఉంటాయి.                                                      *రూపశ్రీ.

చలికాలంలో చర్మం పగుళ్లా.. ఇదొక్కటి వాడితే మెరిసిపోతారు!

చలికాలంలో చర్మం పగుళ్లా.. ఇదొక్కటి వాడితే మెరిసిపోతారు! చలికాలం  పాటలలోనూ, సినిమాలలోనూ మాత్రమే బాగుంటుంది. కొన్ని సార్లు వేడి వేడి ఆహారం, పకోడిలో, కాల్చిన మొక్కజొన్న పొత్తుల కోసమో చలికాలాన్ని తల్చుకుంటాము. కానీ నిజానికి చలికాలం వచ్చిందంటే పెద్ద పెట్టున చర్మానికి ఎసరు పెడుతుంది. చర్మం పగిలిపోతుంది. కొన్నిసార్లు చర్మం ఎర్రగా మారిపోయి రక్తం కూడా కారుతుంది. ఇంట్లోనుండి అడుగు బయట పెట్టాలన్నా, స్లీవ్ దుస్తులు వేసుకోవాలన్నా కూడా భయపడాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ వీటన్నింటికి కేవలం ఒకే ఒక్కటి చెక్ పెడుతుంది. అదే తేనె. తేనెను ఆయుర్వేదం అమృతంతో పోలుస్తుంది.తేనెలో ఎన్నోపోషకాలు, మరెన్నో ఔషద గుణాలు ఉన్నాయి. కొన్ని సార్లు తేనెను సౌందర్య సాధానంగా కూడా ఉపయోగిస్తారు. అసలు చలికాలంలో తేనెను ఎందుకు వాడాలి? ఎలా వాడితే చర్మం మెరుస్తుంది? చాలామంది తేనెను ఉదయాన్నే వేడినీళ్లలో వేసుకుని తాగుతుంటారు. కానీ చలికాలంలో తేనెను ముఖానికి రాసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. తేనె చర్మం మీద లోతుగా పేరుకున్న మలినాలను తొలగించి చర్మాన్ని శుభ్రపరుస్తుంది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు చర్మాన్ని రిపేర్ చేస్తాయి. చర్మం మీద ముడుతలు తగ్గిచడంలో, వాడిన చర్మానికి జీవం ఇవ్వడంలో తేనె ది బెస్ట్. చలికాలంలో ముఖ చర్మం పగలడం వల్ల, చలి కారణంగా చర్మం మీద దురద, మచ్చలు వస్తాయి. కానీ పెరుగులో తేనెను కలిపి రాసుకోవాలి.  లేదంటే శనగపిండిలో తేనె కలిపి ముఖానికి రాసుకున్నా మంచి ఫలితం ఉంటుంది. దీని వల్ల ముఖ చర్మం మీద మృతకణాలు తొలగిపోయి చర్మం కాంతివంతంగా మారుతుంది. ముడతలు పడి వదులుగా మారిన చర్మం తిరిగి బిగుతుగా మారాలంటే  తేనె బెస్ట్ ఫలితాలు ఇస్తుంది. నిమ్మరసం లేదా యాపిల్ సైడర్ వెనిగర్ లో తేనె వేసి బాగా మిక్స్ చేసి ముఖానికి రాసుకుంటే ఈ ముడతలు పోయి ముఖం యవ్వనంగా మారుతుంది.                                                          *నిశ్శబ్ద.

గర్భధారణ సమయంలో భగవద్గీత చదవితే ఏం జరుగుతుందంటే..!

   గర్భధారణ సమయంలో భగవద్గీత చదవితే ఏం జరుగుతుందంటే..!     భగవద్గీత.. మనిషి జీవితంలో కర్మను తప్పక  అచరించమని, దాని తాలూకు ఫలితాన్ని తప్పించుకోలేరని చెప్పే గ్రంథం.  సత్కర్మల గురించి వివరించేది ఇదే..   కురుక్షేత్ర సంగ్రామానికి ముందు భయానికి,  వ్యాకులతకు,  పిరికితనానికి లోనైన అర్జునుడికి,  శ్రీకృష్ణ భగవానుడు చేసిన బోధనే భగవద్గీత అంటున్నారు.  భగవద్గీత అనగా.. భగవంతుడు స్వయంగా చెప్పిన విషయాలు.   భగవద్గీతలో 18 అధ్యాయములు ఉన్నాయి.  ఈ 18 అధ్యాయములలో 18 యోగములు ఉన్నాయి.  భగవద్గీతను వయసైపోయిన వారు చదవే పుస్తకం అనుకుంటారు చాలా మంది. కానీ మంచి నడవడిక కోసం చిన్న పిల్లల నుండి అందరూ చదవవచ్చు.  ఉగ్గుపాలతో భగవద్గీత సారాన్ని నేర్పిస్తే పిల్లల జీవితం ఆనందమయంగా ఉంటుంది. అంతేకాదు.. గర్భిణి మహిళలు కూడా భగవద్గీత ను చదవవచ్చు. దీని వల్ల జరిగేదేంటో తెలుసుకుంటే.. స్త్రీలు గర్బధారణ సమయంలో తల్లి, బిడ్డల శారీరక మానసిక ఆరోగ్యం కోసం చాలా పనులు చేస్తుంటారు. తీసుకునే ఆహారం దగ్గర నుండి చేసే పనుల వరకు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ముఖ్యంగా ఈ సమయంలో మహిళలు  బాధపడకూడదని,  ఎమోషన్ కు గురవ్వకూడదని అంటారు.  అందుకే..  వాళ్లు ఎప్పుడూ సంతోషంగా ఉండటం కోసం, వారి మనస్సు దృఢంగా ఉండటం కోసం సంగీతం వినడం,  మానసికంగా ఆరోగ్యంగా ఉండే కార్యకలాపాలు చేయడం చేస్తుంటారు. వాటి జాబితాలో భగవద్గీత పఠనం కూడా ఒకటి.  భగవద్గీత పఠనం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. భగవద్గీత గొప్ప ఆధ్యాత్మిక  పుస్తకమే కాదు.. గొప్ప ఫిలాసఫి కూడా ఇందులో దాగుంది.  ఇది మనిషి జీవితంలో లోతైన విషయాలు చాలా సూక్ష్మంగా వివరిస్తుంది. మనిషిలో ఉండే బాధ,  దుఃఖం,  విచారం వంటి వాటిని సున్నితంగా మాయం చేస్తుంది.  మనసు శాంతితో, స్థిరంగా ఉండటంలో సహాయపడుతుంది.  గర్భవతులు ఈ పుస్తకాన్ని చదివితే అది కడుపులో ఉన్న బిడ్డ మీద కూడా ప్రభావం చూపుతుంది.  తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉంటారు. గీత శ్లోకాలు చదవడం వల్ల తల్లి మానసిక ఆరోగ్యం పై మంచి ప్రభావం ఉంటుంది. ఇది శారీరక స్థితిని కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది.  కడుపులో బిడ్డ కూడా ఆరోగ్యంగా పెరుగుతాడు.  ఉట్టి అల్లరి పిల్లవాడు పుట్టాడు.. లాంటి మాటలు ఎదురుకాకుండా ఎంతో గొప్ప ఆలోచనలు, అర్థం చేసుకోగలిగే జ్ఞానం ఉన్నవారిగా పిల్లలు ఎదుగుతారు. భగవద్గీతలో ధర్మం, కర్మ, యోగ, జ్ఞానం వంటి విషయాలు ఎంతో స్పష్టంగా బోధించారు. జీవితంలో ఎంతో ముఖ్యమైన ఈ విషయాలు తెలుసుకుంటే.. అర్థం చేసుకుంటే జీవితం చాలా మారిపోతుంది. ఇవి గర్భవతులు తెలుసుకోవడం వల్ల గర్భం మోసే దశ చాలా హాయిగా గడిచిపోతుంది.  కడుపులో బిడ్డ కూడా ఎలాంటి వికారాలకు లోను కాకుండా, పాజిటివ్ ఆలోచనలతో పుడతారని  చెబుతారు. గర్భధారణ సమయంలో మహిళలలో  హార్మోన్ల మార్పులు సంభవిస్తాయి.  ఇది ఒత్తిడి,  ఆందోళనను పెంచుతుంది.  ప్రతిరోజూ భగవద్గీత పఠించడం వల్ల మానసిక ఒత్తిడి లేకుండా హాయిగా ఉండగలుగుతారు. గీత శ్లోకాలు మానసిక ప్రశాంతతను,  స్వీయ అంగీకార భావనను పెంపొందిస్తాయి.  ఇవి జీవితంలో ఎదురయ్యే కష్టాన్ని,  సుఖాన్ని,  దుఃఖాన్ని సమానంగా స్వీకరించేలా చేస్తుంది. ఇది గర్భవతులకు చాలా అవసరం. గర్భంలో ఉన్న బిడ్డకు 7 వ  నెల నుండి వినికిడి  శక్తి వస్తుంది.  ఆ సమయంలో భగవద్గీతను గట్టిగా చదవడం లేదా ఆ శ్లోకాల గురించి బిడ్డతో చర్చిస్తున్నట్టు,  బిడ్డకు చెబుతున్నట్టు చేయడం వల్ల గర్బంలో పిల్లల మానసిక భావోద్వేగాలు చాలా నియంత్రణలో ఉంటాయి.                                             *రూపశ్రీ.    

సుగంధ నూనెలతో ఇల్లు పరిమళభరితం

సుగంధ నూనెలతో ఇల్లు పరిమళభరితం ఇల్లు పరిమళభరితంగా ఉంటే మనసు ఆహ్లాదంగా ఉంటుంది. ఐతే కొన్నిసార్లు వంట చేసిన తరువాత ఏర్పడే ఘాటు వాసనలతో, గాలి, వెలుతురు లేక ఏర్పడే దుర్వాసనలతో ఇబ్బందికరంగా అనిపిస్తుంటుంది. అటువంటి సమస్యలని రసాయనాలతో కాకుండా సుగంధ నూనెతో పరిష్కరించుకోవచ్చు. 1. అరబకేట్ నీటిలో పావుకప్పు వెనిగర్, పెద్ద చెంచా నిమ్మరసం నూనె కలిపి గదిలో కాస్త చల్లితే.. గదిలోని వంట వాసనలు పోయి హాయి వాతావరణంతో నిండిపోతుంది. 2. కార్పెట్లు మురికిగా మారి దుర్వాసన వస్తుంటే.... కప్పు బేకింగ్ సోడాకి, చెంచాడు ఏదైనా సుగంధ నూనేలని కలపాలి. ఈ మిశ్రమాన్ని కార్పెట్ పై చల్లి తెల్లారి వాక్యుమ్ క్లీనర్ తో శుభ్రం చేసుకొంటే సరిపోతుంది. 3. కిటికీ అద్దాలు దుమ్ముపట్టి ఉంటే కప్పు వెనిగర్ కి చెంచా లావెండర్ పరిమళన్ని జోడించి తుడిస్తే సరి. అవి తలుక్కుమనడమే కాకుండా సువాసనభరితంగా కూడా ఉంటాయి. 4. వంట చేసిన తరువాత గది అంతా ఆవరించే ఘాటు వాసనలు తొలగిపోవడానికి ఒక గిన్నె నిండా నీళ్ళు తీసుకొని దానిలో దాల్చిన చెక్కని వేసి మరిగిస్తే గది చక్కని పరిమళాలు వెదజల్లుతుంది. 5. దుస్తులు ఒక్కచోట పోగుపడి.. ముక్కిపోయిన వాసన వస్తుంటే ఎండలో ఆరవేయ్యాలి. వీలుకానప్పుడు నిమ్మ, లావెండర్ వంటి ఏదైనా పరిమళంలో ఒక జేబు రుమాలుని ముంచి దానిని దుస్తుల మధ్య ఉంచితే సరిపోతుంది.

మహిళలూ ఆర్థిక విషయాల్లో జాగ్రత్త తప్పనిసరి!

మహిళలూ ఆర్థిక విషయాల్లో జాగ్రత్త తప్పనిసరి! మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. నేటికీ కొంతమంది మహిళలు ఆర్థికపరమైన విషయాల్లో తండ్రి, సోదరుడు, భర్త...ఇలా ఎవరొకరిమీద ఆధారపడుతుంటారు. ఆర్థికపరమైన అంశాలపట్ల సరైన అవగాహన లేకపోవడమే దీనికి కారణమంటున్నారు నిపుణులు. ఇంకొంతమంది మహిళలు తాము సంపాదించిన మొత్తాన్ని పరిస్థితులకు అనుగుణంగా తమ భర్త చేతిలో పెట్టడం వల్ల చిన్న చిన్న అవసరాలకు కూడా వాళ్ల వద్ద చేయి చాచాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా చేతినిండా సంపాదన ఉన్నా...చాలా మంది మహిళలు ఆర్థికపరంగా నేటికీ పురుషులపై ఆధారపడాల్సి వస్తుంది. అయితే ఇకనైనా మేల్కోని ఈ ధోరణిని మార్చుకోవాలి. లేదంటే అనుకోని సంఘటనలు ఎదురైనప్పుడు ఆర్థికపరమైన ఇబ్బందులు తప్పవు. ఈ క్రమంలో వివాహం జరిగినప్పటినుంచి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని చెబుతున్నారు. ఉద్యోగం మానకూడదు: కొంతమంది వ్యక్తిగత కారణాలు, కుటుంబ పరిస్థితుల కారణంగా అప్పటివరకు తాము చేస్తోన్న ఉద్యోగానికి రాజీనామా చేస్తుంటారు. ఇంకొంతమంది సంపాదించాల్సిన అవసరం లేదని ఈ నిర్ణయం తీసుకుంటారు. ఈ రెండూ కూడా ఆర్థికంగా చేటు చేసే నిర్ణయాలే అని చెబుతున్నారు నిపుణులు. మొదట్లో బాగానే ఉన్నా తర్వాత భవిష్యత్తులో ప్రతి చిన్న అవసరానికీ భర్త మీదే ఆధారపడాల్సి వస్తుంది. కాబట్టి పెళ్లైనా ఉద్యోగం మానకపోవడమే మంచిది. తద్వారా భవిష్యత్తులో ఒంటరిగా జీవించాల్సి వచ్చినా ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అవగాహన పెంచుకోవాలి: ఆర్థిక విషయాల్లో పెళ్లికి ముందు తండ్రిపై...పెళ్లి తర్వాత భర్తపై ఆధారపడే అమ్మాయిలు ఈ కాలంలో చాలా మంది ఉన్నారు. ఆర్జన వరకు బాగానే ఉన్నా...డబ్బు పొదుపు మదుపు విషయాల్లో అవగాహన లోపమే దీనికి కారణం. అయితే ప్రతి చిన్న దానికీ ఇతరులపై ఆధారపడటం వల్ల వాళ్లు అందుబాటులో లేనప్పుడు ఇబ్బందులు ఎదుర్కొవల్సి వస్తుంది. కాబట్టి డబ్బులను ఎందులో పొదుపు చేయాలి లాభాలు ఆర్జించాలంటే వేటిలో పెట్టుబడులు పెట్టాలనే ప్రథమిక విషయాలపై అవగాహన పెంచుకోవడం చాలా అవసరం అంటున్నారు నిపుణులు అలాని ఒకేసారి అన్ని విషయాల గురించి తెలుసుకోవడం ఎవరితోనూ సాధ్యం కాదు. కాబట్టి నిపుణుల సలహాలు పాటిస్తూ ఉండాలి. ఇవి కూడా గుర్తుంచుకోవాలి... మహిళలు తప్పకుండా వైద్య బీమా చేయించుకోని ఉండాలి. అనుకోని అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఆర్థిక సంక్షోభంలోకి నెట్టకుండా ఉంటుంది. మీ అత్తమామలు, భర్త, ఇతర కుటుంబ సభ్యులు ఏవైనా పత్రాలపై సంతకం చేయమని అడుగుతే గుడ్డిగా చేయకండి. వాటిని క్షుణ్ణంగా చదివిన తర్వాతే చేయాలా వద్దా అనేది నిర్ణయించుకోండి. పెళ్లికి ముందు తర్వాత మహిళలకు పుట్టింటివారు మెట్టినింటి వారి నుంచి వచ్చే బహుమతులు, కానుకలు స్త్రీధన్ అంటారు. అవి పెట్టుబడులు, స్థిరాస్తి, చరాస్తి, డబ్బు, బంగారం ఇలా ఏ రూపంలో అయినా ఉండవచ్చు. వీటికి సంబంధించిన డాక్యుమెంట్లను జాగ్రత్తగా భద్రపరుచుకోవడం ముఖ్యం.  

ప్రెగ్నెన్సీ సమయంలో చర్మం పొడిబారితే.....

  ప్రెగ్నెన్సీ సమయంలో చర్మం పొడిబారితే.....   అమ్మతనం గొప్ప వరం. మాతృత్వాన్ని పొందాలంటే ఎన్నో రకాల సమస్యలను ఎదురుకోక తప్పదు. కొంత మంది నెల తప్పిన దగ్గరనుండి వికారం వాంతులతో బాధపడతారు, మరికొందరికి చర్మం పొడిబారినట్టుగా అయ్యి దురదలు మొదలవుతాయి. ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా చర్మాన్ని గోక్కోకుండా ఉండలేరు. దాని ఫలితంగా వచ్చే రేషేస్ ఇంకా చికాకు తెప్పిస్తాయి. అసలీ ఇచ్చింగ్ ఎందుకు వస్తుందా అని ఆలోచిస్తే, మాములుగా ఉన్నప్పటి కన్నా ప్రెగ్నెన్సీ టైంలో మన శరీరంలో కొన్ని హార్మోనియల్ చేంజెస్ రావటం వల్ల  ఇలా చర్మం పొడిబారే అవకాశం ఉంటుంది, దాని వల్ల ఇచ్చింగ్ వస్తుంది. అదీకాక చర్మం సాగుతూ ఉండటం వల్ల చర్మానికి తగినంత తేమ అందక దురదలు వచ్చే అవకాశం ఉంది. దీని ప్రయవసానమే కడుపు మీద చారలు ఏర్పడి అవి ఎప్పటికి అలానే ఉండిపోతాయి. ఇలాంటి సమస్యలన్నీ తొలగిపోయి మీరు హాయిగా మాతృత్వపు ఆనందాన్ని అనుభవించాలంటే ఇంట్లోనే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ కొన్ని చిట్కాలు పాటించాలి.      * ఎక్కువ మందికి కడుపు మీద లేదా మొహం మీద చర్మం పొడిగా అవుతుంది. చర్మం పొడిబారుతోంది అని అనిపించిన దగ్గర నుండి ఆలివ్ ఆయిల్ మసాజ్ చేసుకుంటే మంచిది. రెండు మూడు చుక్కల ఆలివ్ ఆయిల్లో కాసిని నీళ్ళు కలిపి దానిని కావాల్సిన చోట రాసుకుంటూ ఉంటే సరిపోతుంది.       * అలాగే వెన్న కూడా ఈ సమస్యకి మంచి పరిష్కారం చూపిస్తుంది. ఇంట్లో వెన్న ఉన్నా లేదా పాల మీగడ ఉన్నా దానిని చర్మానికి రాసుకుంటే త్వరిత ఫలితం కనిపిస్తుంది.   * రోజూ వాడే సబ్బులు కూడా చర్మం పొడిబారటానికి కారణం అవుతాయి. అందుకే కెమికల్స్ ఎక్కువగా ఉండే సబ్బులు వాడకుండా జాగ్రత్త పడాలి. సబ్బులకి బదులు ఆపిల్ సైడర్ వెనిగర్ వాడటం మంచిది. దీనిని నీటిలో వేసి ఆ నీళ్ళతో స్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.   * పొడి చర్మాన్ని పోగొట్టటానికి పెరుగు కూడా చక్కగా ఉపయోగపడుతుంది. ఎక్కడయితే చర్మం పొడిగా ఉందో  అక్కడ పెరుగు రాసుకుని ఒక 10నిమిషాలు ఉంచి తరువాత కడిగేసుకుంటే చాలు.   * ఎక్కువగా వేడి ఉన్న నీళ్ళు కాకుండా కాస్త గోరువెచ్చటి నీళ్ళతో స్నానం చేయటం వల్ల చర్మం పొడి బారకుండా ఉంటుంది.   * చర్మం పొడిబారిపోయి గరుకుగా తయారయితే. రెండు కోడిగుడ్ల తెల్లసొనలో పావు కప్పు జొన్నపిండి, నాలుగు చెంచాల చక్కెరపొడి వేసి కలిపి రాసుకుని బాగా ఆరిన తరువాత కడిగేసుకుంటే చాలు.   * స్నానం తర్వాత చర్మం తడిపొడిగా ఉన్నప్పుడే మాయిశ్చరైజర్‌ రాసుకోండి. అందువల్ల చర్మం ఎక్కువ సమయం తేమగా ఉంటుంది. అప్పుడు దురదలు కూడా రావు.   * అన్నిటికన్నా ముఖ్యమైనది ఎక్కువగా నీళ్ళు తాగటం. మాములుగా ఉన్నప్పటికన్నా ప్రెగ్నేన్సీ తో ఉన్నప్పుడు నీళ్ళు మరిన్ని తాగాలి. అప్పుడు చర్మం పొడిబారకుండా మృదువుగా ఉంటుంది.   ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. అలాగే ఈ పొడిబారే చర్మానికి కూడా ఇలా చాలా నివారణా మార్గాలు ఉన్నాయి. వాటిలో ఏదో ఒకటి పాటించి ఇంట్లోనే  మన సమస్యని మనమే దూరం చేసుకుని హాయిగా ఉండచ్చు. ...కళ్యాణి

పనులు పెండింగ్ లో పడుతున్నాయా

పనులు పెండింగ్ లో పడుతున్నాయా     చెయ్యాలనుకునే పనుల లిస్టు పెరుగుతూ మీకు టెన్షన్ తెచ్చిపెడుతోందా. అయితే కొన్ని కిటుకులు పాటిస్తే చాలు,పనులన్నీ చకచకా అయిపోయి మీ టెన్షన్ ని దూరం చేస్తాయి. దీనికోసం ముందుగా మనం చెయ్యాలనుకున్న పనుల జాబితా మన బుర్రలో కాకుండా ఒక పేపరుపై పెట్టి వరుసగా రాసుకోండి. అందులో ఇంటికి సంభందించిన పనులన్నీ ఒక వైపు,బయటకెళ్ళి చెయ్యాల్సినవి మరో వైపు, అలాగే ఇంట్లో వాళ్ళ సహాయంతో చేసేవి ఇంకోవైపు చక్కగా డివైడ్ చేసి పెట్టుకోండి. ఇలా డివైడ్ చేసుకోవటం వల్ల మనం చెయ్యాల్సిన పనులపట్ల ఒక అవగాహన ఏర్పడుతుంది.       ఇంట్లో చెయ్యాల్సిన పనులలో దేనికి ఎక్కువ ప్రిఫెరెన్సు ఇవ్వాలనుకుంటున్నారో దాని మీద ముందుగా దృష్టి పెట్టండి. ఇలా మన ప్రిఫెరేన్సు కి అనుగుణంగా పనుల లిస్టులో కాస్త మార్పులు చేర్పులు చేసుకోవటం వల్ల పనులు తొందరగా అయిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. అన్ని పనులని ఒకేసారి తలచుకోవటం వల్ల వచ్చే అలజడి తగ్గి మనకు తెలియకుండానే పనులు చకచకా అయిపోతాయి. ఇక బయట చెయ్యాల్సిన పనుల లిస్టులో కూడా ఆ పనుల కోసం వెళ్ళాల్సిన ప్లేస్ పేరు పక్కన రాసుకోండి. ఎక్కువగా ఏ ప్లేస్ కి వెళితే చాలా  పనులు పూర్తి చెయ్యచ్చో మనకి క్లియర్ గా అర్ధమవుతుంది. దానికి తగ్గట్టుగా వెళితే మన లిస్టులో పనులూ తగ్గుతాయి. మీకున్న పనులకి ఇంట్లో వాళ్ళ సాయం కూడా తోడయితే ఇంకా హాయి కదా. మొహమాటం పక్కన పెట్టి కాస్త ఆప్యాయంగా అడిగి చూడండి. చేసే పనులు ఎన్ని ఉండి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నా ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకుని దానికి అనుగుణంగా వెళితే కొండంత పనయినా చిటికెలో చేసి చూపించే సత్తా మీ సొంతమవుతుంది.   ..కళ్యాణి 

ప్రత్యేకంగా కనపడండిలా

ప్రత్యేకంగా కనపడండిలా   నలుగురిలో ప్రత్యేకంగా కనిపించాలంటే దుస్తులతో పాటు యాక్ససరీస్ మీదా కూడా శ్రద్ధ పెట్టాల్సిందే. అతి మామూలుగా డ్రస్ వేసుకున్నా నప్పే యాక్ససరీస్ ఉపయోగిస్తే ఎంతో అందగా కనిపిస్తారు. మరి ఆ యాక్ససరీస్ని ఎంచుకునే సమయంలో దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలు ఏమిటో చూద్దాం. * హేండ్ బ్యాగులని మన శరీరాకృతిని దృష్టిలో పెట్టుకొని కొనుక్కోవాలి. కాస్త ఎత్తు తక్కువ ఉండేవారు పెద్ద బ్యాగుల జోలికి వెళ్లద్దు. అలాగే సన్నగా ఉన్నవారికి వెడల్పాటి బ్యాగులు కన్నాగుడ్రంగా ఉండే బ్యాగులే బాగా నప్పుతాయి. * మెడలో ధరించే నగల విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు అవసరం. ఎత్తు తక్కువ ఉన్నప్పుడు, లేదా లావుగా  ఉన్నప్పుడు మెడకు దగ్గరగా ఉండే నెక్లెసులు, చోకర్లు అంతగా నప్పవు. సన్నగా, పొడవుగా ఉండే చైన్స్ అయితే బాగుంటాయి. అదే మెడ సన్నగా, పొడుగ్గా ఉన్నవారు మెడకి దగ్గరగా ఉండే గొలుసులు వేసుకుంటే బావుంటుంది. * చెప్పులు ఎప్పుడూ మనం వేసుకున్న డ్రస్ ని డామినేట్ చేయకూడదు. వీలయితే మ్యాచింగ్ వేసుకోవచ్చు. లేదంటే బ్రౌన్, బ్లాక్ వంటి సాధారణ రంగుల్లో ఉంటే బాగుంటుంది. * ఆకర్షణీయమైన డ్రస్ వేసుకున్నప్పుడు చెవులకు కొంచం పెద్ద హేంగింగ్స్ పెట్టుకొని, మెడలో మాత్రం సింపుల్ చైన్ వేసుకుంటే బావుంటుంది. అదే డ్రస్ సింపుల్ గా ఉన్నప్పుడు గొలుసు కొంచం గ్రాండ్ గా ఉంటే బావుంటుంది. * చేతికి బంగారం గాజులు, మెడలో ముత్యాలు, ఇలా వైవిధ్యంగా కాకుండా అన్నీ ఒకేలా ఉండేటట్టు చూసుకోవాలి. యాక్ససరీస్ లో మీదైన ఓ శైలిని ఏర్పరచుకుంటే నలుగురిలో ప్రత్యేకంగా కనిపిస్తారు. ప్రత్యేకంగా ఒకే రకమైన బ్యాగులు, నగలు, వంటివి మీదంటూ ఓ ముద్ర వేసేలా చేస్తాయి. మరి మీ స్టైల్ స్టేట్ మెంట్... ఎలా ఉండాలో నిర్ణయించుకోండి. -రమ

మరకలు పోవాలంటే ఇలా...

మరకలు పోవాలంటే ఇలా...     మనం ఎంతో ఇష్టపడి కొనుక్కునే బట్టలపై ఒక్కొక్కసారి అనుకోకుండా పడే మరకలు మనని ఎంతో  బాధపెడతాయి. వాటిని చూసి బాధపడటం మానేసి ఇంట్లో దొరికే వస్తువులతోనే ఎంతో సులువుగా మరకను పోగొట్టి మళ్ళీ మన ఆనందాన్ని తిరిగి తెచ్చుకోవచ్చు. తుప్పు మరకల బట్టలని తీగల మీద లేదా రాడ్స్ మీద ఆరేసేటప్పుడు ఒక్కోసారి తుప్పు అంటుకుని మరక పడుతుంది. ఆ మరకలు పోవాలంటే నిమ్మకాయ రసంతో,లేదా ఉప్పు కలిపిన నిమ్మరసంతో బాగా రుద్ది ఎండలో వేయాలి. ఇలా రెండు సార్లు చేస్తే చాలు మరక మాయం అవుతుంది. నూనె మరకలు బట్టలపై పడే నూనె మరక అంత సులువుగా పోదు. అందుకనే నూనె పడిన వెంటనే ముందుగా పాత న్యూస్ పేపర్ ఆ మరకపై వేసి గట్టిగా వత్తాలి. తర్వాత వేడినీళ్ళు పోస్తూ సబ్బుతో రుద్దితే చాలు. కాఫీ కప్పులపై పడే మరకలు ఎంతో ఖరీదు పెట్టి కొనే కప్పులపైన మరకలు పడి  అవి పోవాలంటే వెంటనే ఆ కప్పుని తడిపితే చాలు లేదా ఎండిపోయిన మరక పోవాలంటే మాత్రం బైకార్బోనేట్ సోడా మిశ్రమంతో తుడిస్తే ఇట్టే పోతాయి.   పెయింట్ మరకలు బట్టలపై పెయింట్ మరక పడితే ఆ మరకపై బ్లాటింగ్ పేపర్ వేసి దానిపై ఇస్త్రీ చెయ్యాలి. ఆ వేడికి మరక కరిగి బ్లాటింగ్ పేపర్ కి అంటుకుంటుంది. ఆ తర్వాత మరక మీద కొంచం టాల్కం పౌడర్ చల్లి కాసేపు వెయిట్ చేసి ఆ పేపర్ ని దులిపితే పౌడర్ తో పాటే మరక కూడా వదిలిపోతుంది. బాల్ పెన్  ఇంకు మరకలు పిల్లల స్కూల్ యూనిఫారం కి తరచూ బాల్ పెన్ మరకలు మనం చూస్తూ ఉంటాం. అలాంటివి పోవాలంటే టూత్ పేస్ట్ గాని, నిమ్మరసం గాని,బ్రాంది లేదా విస్కీ చుక్కలు వేసి రుద్దితే ఆ మరకలు పోతాయి.     పట్టుచీరలపై మరకలు ఎంతో  ఖరీదు పెట్టి కొనుక్కునే పట్టుచీరల మీద మరక పడితే బాదెందుకు? వెంటనే పెట్రోల్ తో రుద్దితే మరక పోతుంది. డ్రై క్లీనింగ్ కి కూడా ఇవ్వక్కర్లెద్దు. చూసారా! ఇన్ని తరుణోపాయాలు మన ముందే ఉంటే మరకను చూస్తే టెన్షన్ అవసరమంటారా?                                                                                                 ----కళ్యాణి

ఆడపిల్ల జీవితం ఎలా ఉంటుందో నవరాత్రులు తెలియజేస్తాయి!

ఆడపిల్ల జీవితం ఎలా ఉంటుందో నవరాత్రులు తెలియజేస్తాయి! దేవీ నవరాత్రుల వెనుక కేవలం అమ్మవారి ఆరాధన మాత్రమే కాదు.. అమ్మవారి నవదుర్గ రూపాలతో ఆడపిల్లల జీవితానికి చాలా అనుబంధం ఉంది.  ముఖ్యంగా అమ్మవారి తొమ్మిది రూపాలు ఆడపిల్లల జీవితాన్ని వ్యక్తం చేస్తాయి. శైలపుత్రి..  ఆడపిల్ల  మొదటి రూపం. ఆడపిల్ల పుట్టినప్పుడు  శైలపుత్రి అంటారు. ఈ దశలో తల్లిదండ్రులు ఆడపిల్లను జాగ్రత్తగా చూసుకుంటారు. బ్రహ్మచారిణి.. ఆడపిల్ల జీవితంలో రెండవ దశను ఈ  రూపం సూచిస్తుంది. ఈ దశ ఆడపిల్ల  బాల్యం నుండి యుక్తవయస్సుకు మారడాన్ని సూచిస్తుంది. చంద్రఘంట..  వివాహం వయసుకు వచ్చిన ఆడపిల్లను చంద్రఘంట దేవి తో పోలుస్తారు. వివాహం తర్వాత ఈ రూపాన్ని తీసుకుంటుంది. కూష్మాండ.. ఆడపిల్లలు వైవాహిక జీవితంలోకి ప్రవేశించిన తర్వాత  తన కుటుంబంతో ప్రేమ, అభిమానం, ఆప్యాయతను పెంచుతూ వెలుగును పంచుతుంది. స్కందమాత.. వివాహం అనంతరం ఒక ఆడపిల్ల స్వయంగా తల్లి అయినప్పుడు ఆమెను స్కందమాతకు ప్రతిరూపంగా పూజిస్తారు. కాత్యాయని.. ఆడపిల్ల కుటుంబాన్ని రక్షించడానికి, ప్రతికూలత నుండి విముక్తి చేయడానికి శ్రమించడం కాత్యాయని అమ్మ రూపంలో స్పష్టంగా ప్రస్ఫుటం అవుతుంది. కాళరాత్రి.. మహిళల జీవితంలో ఇబ్బందులు,  ప్రతికూల శక్తులను దైర్యంగా ఎదుర్కోవడం, వాటిని నాశనం చేయడంలో కాళరాత్రి రూపాన్ని దర్శించవచ్చు. మహాగౌరి.. జీవితం చివరి దశలో స్వచ్ఛత, త్యాగానికి ప్రతీకగా మహాగౌరి గోచరిస్తుంది. సిద్ధిదాత్రి.. ఆడపిల్ల జీవితాన్ని సంతోషంగా గడిపి చివరకు ముక్తిని పొందే రూపం సిద్ధిదాత్రి.

ఏ దేశమేగినా తప్పని వేధింపులు

ఏ దేశమేగినా తప్పని వేధింపులు   ఆడది అర్ధరాత్రి నిర్భయంగా సంచరించడం గురించి గాంధీగారు చెప్పిన మాటలు సరేసరి... కనీసం పట్టపగలు ప్రయాణం చేసే పరిస్థితులు ఉన్నాయా అని అనుమానం కలిగే స్థితిలో ఉన్నాం. ఒళ్లు గగుర్పొడిచే అత్యాచారాలు ఎన్ని జరుగుతున్నా, అలాంటి ఘటనలు ఇక మీదట జరగవంటూ ప్రభుత్వాలు భరోసాను అందిస్తున్నా... పరిస్థితుల్లో మాత్రం ఎలాంటి మార్పూ రావడం లేదు. ఈ విషయాన్ని ధృవీకరించేందుకు బ్రిటన్‌కు చెందిన ‘యాక్షన్‌ ఎయిడ్‌’ అనే సంస్థ ఓ పరిశోదనను నిర్వహించింది. బ్రిటన్‌, ధాయ్‌లాండ్‌, బ్రెజిల్, ఇండియా... ఈ నాలుగు దేశాలలోనూ యాక్షన్‌ ఎయిడ్‌ కొన్ని గణాంకాలను సేకరించింది. సంపన్న దేశాలు మొదల్కొని, పేదరికపు అంచున ఉన్న ప్రాంతాల వరకూ స్త్రీలను వేధించడంలో ఏ దేశమూ వెనక్కి తగ్గడం లేదని ఈ గణాంకాలు తెలియచేస్తున్నాయి. ఈ నాలుగు దేశాలలోనూ నలుగురిలో ముగ్గురు ఆడవారు ఏదో ఒకరకమైన లైంగిక వేధింపుని ఎదుర్కొంటున్నారని తేలింది. దీంతో ఆడవారిని వేధించడం అనేది ఒక అంటువ్యాధిలా మారిపోయిందని యాక్షన్‌ ఎయిడ్‌ హెచ్చరిస్తోంది.   అసభ్యమైన పదాలు వాడటం, ఈలలు వేయడం, ఇబ్బంది కలిగించేలా చూడటం... ఇలా ఏదో ఒక తీరున ఆడవారిని వేధించడం మామూలైపోయింది. ఇరుకు సందుల దగ్గర్నుంచీ ప్రభుత్వ రవాణాల వరకూ... స్త్రీలు నడిచే ప్రతిదారిలోనూ వారికి వేధింపులు తప్పడం లేదని ఈ పరిశోధనలో తేలింది. ఇక అత్యాచారాల సంగతీ సరేసరి. హైస్కూలు కూడా దాటక ముందే బ్రెజిల్‌లో 22 శాతం మంది బాలికలు అత్యాచారానికి లోనవుతున్నారట. కాస్త మంచి బట్టలు వేసుకుని బయటకు రావడానికి కూడా భయపడుతున్నామని అక్కడి అమ్మాయిలు వాపోతున్నారట. అలాగని పోనీ ముసలివారన్నా కామాంధుల కంటపడకుండా ఉన్నారా అంటే అదీ లేదు. ధాయ్‌లాండ్‌లో సేకరించిన లెక్కల ప్రకారం 55 ఏళ్లు పైబడిన స్త్రీలలో కనీసం 20 శాతం మంది ఆడవారు అత్యాచారానికి లోనైనట్లు తేలింది.   నగరజీవితంలో పొంచి ఉన్న వేధింపుల గురించి ప్రచారం చేసేందుకు గత ఏడాది నుంచి మే 20ని ‘Safe Cities for Women Day’గా జరుపుకోవడం మొదలుపెట్టారు. ఇంతకీ ఈ వేధింపులు తగ్గాలంటే ఎలాంటి మార్పులు రావాలి అన్నదే అసలు ప్రశ్న! మగవారి ఆలోచనల్లో, ప్రవర్తనలో మార్పు ఎలాగూ రావాలి. అదే సమయంలో ఆకతాయిల ఆటలు చెల్లకుండా ప్రభుత్వాలు కూడా కొన్ని చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నాయి యాక్షన్‌ ఎయిడ్ వంటి సంస్థలు. వీధుల్లో సరైన విద్యుత్ వెలుగులు లేకపోవడం, పోలీస్ పెట్రోలింగ్ కొన్ని ప్రాంతాలకే పరిమితం కావడం, ప్రభుత్వ రవాణాలో సైతం తగిన రక్షణ లేకపోవడం, ఆకతాయిలను చూసీచూడనట్లు వదిలేయడం... ఇవన్నీ కూడా ప్రభుత్వ వైఫల్యాలే అంటున్నారు. నగర జీవనంలో మగవారితో సమానంగా పరుగులెత్తుతున్న ఆడవారు, తమ కష్టానికి ఫలితంగా వేధింపులను ఎదుర్కోవడం ఎంత దురదృష్టమో కదా! మరి అలాంటి దుస్థితి మీద ఇప్పటికైనా ప్రభుత్వాలు తమ దృష్టిని సారిస్తాయేమో చూడాలి. - నిర్జర.  

చిన్న చిన్న మార్పులతో అందం.. ఆరోగ్యం

చిన్న చిన్న మార్పులతో అందం.. ఆరోగ్యం ఓరీ మీ దుంపలు తెగ మీరెక్కడ తయారయిర్రా నాకు అన్నట్టుగా నాగ మణికంఠ భావిస్తున్నాడు. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్-8 మొదలైనప్పటి నుండి‌ మణికంఠ సింపథీ గేమ్ ప్లే చేస్తున్నాడు. అయితే టాస్క్ లో క్లియర్ గా సంఛాలక్ గా చేసే మణికంఠ.. కాస్త వైల్డ్ గా బిహేవ్ చేస్తాడు.‌ అదే విషయాన్ని చెప్తూ గంగవ్వ ఓ ఆట ఆడుకుంది. యూట్యూబ్ స్టార్, బిగ్ బాస్ కంటెస్టెంట్ గంగవ్వ గురించి తెలియని వారు ఎవరూ ఉండరు.. ఆరు పదుల వయస్సులో సెలబ్రిటీగా మారిన గంగవ్వకి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. బిగ్ బాస్ లోకి అడుగుపెట్టి తన కల నెరవేర్చుకుంది. అయితే ఈ ఇంటి నిర్మాణం కోసం నాగార్జున సాయం చేసినట్లు స్టేజ్ మీదే వెల్లడించింది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో గంగవ్వ, మెహబూబ్, మణికంఠ, టేస్టీ తేజ గార్టెన్ ఏరియాలో ఉన్నారు. ఇక గంగవ్వ తన మాటలతో , పంచులతో ఆడియన్స్ ని కడుపుబ్బా నవ్వించింది.  ఓ పిలగా.. నా భార్య కావాలి.. నా పాప కావాలని ఏడ్చింది నువ్వే నాకు తెలుసు అని‌ గంగవ్వ అనగానే.. అవును కావాలని మణికంఠ అంటాడు. అయితే నామినేషన్ వేస్తా వెళ్ళని అనగానే.. మరి పైసల్ కావాలి కదా.. హౌస్ లోకి వచ్చింది పైసల కోసం కాదా అని గంగవ్వ అంది. అయిన గట్ల ఏడుస్తున్నాడేంది ఈ మగ బాయ్ అని అనుకున్నానంటూ గంగవ్వ అనగానే.. టేస్టీ తేజ, మెహబూబ్ నవ్వుకున్నారు. ఇక అంతకముందు నబీల్, నిఖిల్, రోహిణి, పృథ్వీ, విష్ణుప్రియ అందరు గార్డెన్ ఏరియా దగ్గరలోని సోఫాలో కూర్చొని మాట్లాడుకుంటన్నారు. కాస్త ఆ పాలు ఇస్తే మేం ఛాయ్ చేసుకుంటామని గంగవ్వ అనగానే.. మిల్క్ లగ్జరీ అని నబీల్ అన్నాడు. మరి అలా చెప్తే మేం పాల ప్యాకెట్లు తెచ్చుకునేవాళ్ళ‌ం కదా అని గంగవ్వ అంది. అయిన మా సీజన్ లో ఫుల్ పాలు.. పెద్దదాన్ని కదా నాకు ఇవ్వమని గంగవ్వ అనగానే.. నేను కూడా పెద్దదాన్నే అని అక్కడే ఉన్న రోహిణి అనగానే.. నీకెంత మంది పిల్లలు అని గంగవ్వ అంది. ఇక రోహిణితో పాటు అక్కడివారంతా ఫల్లుమని నవ్వేశారు.  ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి వరకు గడియారంలో ముల్లుతో సమానంగా పరుగులు పెట్టే మహిళలతో కాస్త మీ గురించి మీరు పట్టించుకోండని ఎవరైనా చెబితే, ఆ చెప్పినవాళ్ళ మీద బోలెడంత కోపం వస్తుంది. ఉరుకులు, పరుగులు పెడుతూ, అటు ఆఫీసులోనూ, ఇటు ఇంట్లోనూ అన్ని పనులు సమర్థవంతంగా చేయాలనీ, అందరినీ తృప్తిపరచాలనీ హైరానా పడిపోతూ, ఈ హైరానాలో మనకోసం మనం ఆలోచించుకునే తీరిక, కోరిక కూడా వుండదు. కానీ మనకోసం మనం శ్రద్ధ చూపకపోతే ఎలా? అందం ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. ఆరోగ్యం చురుకుదనాన్ని అందిస్తుంది. సో... అందంగా, ఆరోగ్యంగా వుంటే ఆత్మవిశ్వాసం నిండుగా, మెండుగా వుండి, అది మన ప్రవర్తన తీరులో బయటపడుతుంది. అందుకు పెద్దగా సమయం కూడా అక్కర్లేదు. రోజు మొత్తంలో మన రొటీన్‌కి చిన్నచిన్న మార్పులు, చేర్పులు చేస్తే సరిపోతుంది. * మొట్టమొదటగా తప్పనిసరిగా చేయాల్సింది... ఉదయం నిద్ర లేస్తూనే హడావిడిగా మంచం దిగి పని ప్రారంభించకుండా ఓ 2 నిమిషాలు దీర్ఘంగా శ్వాస తీసుకుని వదలాలి. ఎక్సర్‌సైజులు వంటివి చేయడానికి టైమ్ వుంటే సరే, లేకపోతే కనీసం శ్వాస ప్రక్రియ పైన దృష్టి పెట్టినా చాలు. ఇక మరో ముఖ్య విషయం... పరగడుపునే రెండు మూడు గ్లాసుల నీటిని తాగడం ద్వారా శరీరం మరింత కాంతిని సంతరించుకుంటుంది. అలాగే రోజులో వీలు చిక్కినప్పుడల్లా మంచి నీటిని తాగటానికి ప్రయత్నించండి. ఇది పెద్ద విషయమా అనుకోకండి. రోజు మొత్తంలో ఎంత మంచినీరు తాగుతున్నారో ఒక్కసారి గమనించి చూడండి. ఇలాంటి చిన్న చిన్న విషయాల పట్ల కూడా కొంచెం శ్రద్ధ పెడితే అందానికి, ఆరోగ్యానికి కూడా మంచింది. * చాలామంది బ్యూటీ పార్లర్లకి వెళ్ళడానికి ఇష్టపడరు. అంతమాత్రాన మనపై మనం శ్రద్ధ పెట్టకుండా ఉంటే ఎలా? చిన్న చిన్నవే... ఉదాహరణకి స్నానం చేసే గోరువెచ్చని నీటిలో కొన్ని చుక్కల ఆయిల్ వేసుకోవడం, మంచి బాడీ లోషన్ అప్లయ్ చేసుకోవడం వంటి చిన్న చిన్న విషయాలపై శ్రద్ధ పెడితే చాలు... వయసు ప్రభావం కనిపించకుండా చూసుకోవచ్చు. మరో విషయం... ఎండలోకి వెళ్ళేముందు నన్‌స్క్రీన్ లోషన్ వంటివి అప్లయ్ చేసుకోవడం, చలువ అద్దాలు వాడటం వంటివి చాలా చిన్న విషయాలే. కానీ, చాలామంది శ్రద్ధ పెట్టని విషయాలు కూడా. * సాధారణంగా బయటి నుంచి ఇంట్లోకి అడుగు పెడుతూనే చేయాల్సిన పనులని తలుచుకుంటూ పనిలో పడతాం. కానీ, ఇంటికి రాగానే చల్లటి నీటితో ముఖాన్ని కడుక్కుని, పచ్చిపాలలో దూదిని ముంచి ముఖాన్ని తుడుచుకోవడానికి రెండు నిమిషాలు కూడా పట్టదు. బయట పొల్యూషన్ ప్రభావం మన ముఖంపైనుంచి పోవడానికి. ఇక వారానికి ఒక్కసారైనా ఒక చెంచా తేనెలో కొంచెం వెనిగర్ కలిపి ముఖానికి పట్టించి 15 నిమిషాలు ఉంచుకుని చల్లటి నీటితో కడిగి చూసుకోండి. అట్టే సమయం పట్టదు సరికదా, మీకు మీరే కొత్తగా కనిపిస్తారు. ఇక ఆడవారిలో ఒత్తిడిని, వయసుని బయటపెట్టేవి కళ్ళకింద నల్లటి చారలు. రోజూ పడుకునే ముందు రెండు కీరా ముక్కల్ని కళ్ళపై పెట్టుకునే అలవాటు చేసుకుంటే చాలు నల్లటి వలయాలు కొన్నాళ్ళలో మాయమవటానికి. * రోజువారీ కార్యక్రమాలను పూర్తి చేశాక నిద్రకి ఉపక్రమించే ముందు మీకోసం మీరు ఓ 5 నిమిషాలు ఇచ్చుకోగలిగితే చాలు. గోరువెచ్చని నీటిలో పాదాలని ఉంచి, మీకు ఇష్టమైన పుస్తకాన్ని తిరగేయండి. రోజంతటి శ్రమని మర్చిపోవచ్చు. ఇక ఆఖరిది, ముఖ్యమైనది... తప్పనిసరిగా ఎనిమిది గంటల నిద్ర ఉండేలా చూసుకోండి. ఎందుకంటే ఏ ఫేస్‌ప్యాక్‌లూ, మేకప్‌లూ అది ఇచ్చే ఆరోగ్యాన్ని, అందాన్ని అందించలేవు నిజానికి.  ఈరోజు మనం చెప్పుకున్న ఈ విషయాలన్నీ చాలా చిన్న చిన్నవే. కానీ, మనం ప్రత్యేక శ్రద్ధ పెట్టనివి కూడా. ఈ చిన్న జాగ్రత్తలతో మన అందాన్ని, ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. రోజూ చేయగలిగితే అలవాటుగా కూడా మారుతుంది.. ఏమంటారు? -రమ

వాటర్ బాటిల్స్ తో కలర్ ఫుల్ లైట్స్

  వాటర్ బాటిల్స్ తో కలర్ ఫుల్ లైట్స్     మనం వాడేసిన వాటర్ బాటేల్స్ డస్ట్ బిన్ లో పడేయకుండా అందమైన కలర్ ఫుల్ లైట్స్ ఎలా చేసుకోవాలో క్రింద ఇచ్చిన 6 స్టెప్స్ తో చూపించాం..   కావలసినవి :                  వాటర్ బాటేల్స్                   అక్రోలిక్ పైంట్స్                    కత్తెర                    సిరియల్ లైట్స్ ·      1. కాళీ వాటర్ బాటేల్స్ తీసుకుని మూత తీయకుండా ఫోటోలో చూపించినట్టు కొంత పార్ట్ వరకు కట్ చేసుకోవాలి. 2. ఆ కట్ చేసుకున్న పార్ట్ ని నిలువుగా ఫ్లవర్ కి ఎన్ని పెటెల్స్ కావాలో అన్నింటిని సమానంగా కోలుచుకుని కత్తెరతో కట్ చేసుకోవాలి.    3. అలా కట్ చేసుకున్న పార్ట్స్ ని వెనక్కి  బెండ్ చేసుకోవాలి. ఫోటో లో  చూపించినట్టుగా అన్ని ఇలానే చేసుకోవాలి. ఇప్పుడు అది చూడడానికి ఫ్లవర్ లా వుంటుంది.   4. ఇలా కట్ చేసుకున్న వాటికి  మనకు నచ్చిన కలర్ వేసుకోవాలి. ఏ కలర్ అయితే మనం వేస్తామో అదే కలర్ మనం  లైట్ వేసినపుడు వెలిగుతుంది. పెటల్స్ కి కలర్ వేసిన తరువాత రెండు గంటలు డ్రై అవ్వనివ్వాలి.   5. ఇప్పుడు వాటికున్న బాటిల్ మూతకూ రంధ్రం చేసి లైట్స్ ని మూతలో  సెట్ చేసుకోవాలి.   6. ఇప్పుడు సిరియల్ లైట్స్ ని మనకు నచ్చిన విధంగా సెట్ చేసుకుని పండగలకి,పార్టీలకి  డెకరేట్ చేసుకోవచ్చు       మీరు కూడా ట్రై చేస్తారు గా మరీ                  

బొప్పాయి బ్రెస్ట్ మిల్క్ ను పెంచుతుందా

  బొప్పాయి బ్రెస్ట్ మిల్క్ ను పెంచుతుందా   ‘నేను పుష్టిగా భోజనం చేసినా మా బాబుకి పాలు సరిపోవట్లేదు’ అని కొత్తగా తల్లయిన వాళ్ళు అనటం మనం వింటూనే ఉంటాం. అన్నం ఎక్కువగా తినేస్తే పాలు సమృద్దిగా పడతాయి అనుకోవటం పొరపాటే. మనం తీసుకునే ఆహారంలో పాలను ఉత్పత్తి చేసే పదార్థాలు అదిక శాతం ఉండేలా చూసుకోవాలి. మనకి అందుబాటులో ఉండే కొన్ని రకాల కూరగాయల్లో, మెంతులు, వెల్లుల్లి, తులసి, వాము, కాకరకాయి, బొప్పాయి మొదలైన వాటిలో పాలను ఉత్పత్తి చేసే గుణం అధికంగా ఉంటుంది. వీటిని మన రోజువారి ఆహారంలో భాగంగా చేసుకుంటే చాలు ఇక ఏ దిగులు ఉండదు. మెంతులు ఈ సమస్యకి ఒక మంచి పరిష్కారం. బాలింతకు ఎక్కువగా మెంతిపొడి, మెంతికూర మొదలైనవి పెట్టాలి. నార్త్ ఇండియన్స్ అయితే మెంతులతో చేసిన హల్వా తినిపిస్తూ ఉంటారు. మెంతులను నేతిలో వేయించి, పోసి చేసి వంతులు గోధుమ పిండిని కలిపి వాటిలో పంచదారపొడి వేసి హల్వా లా తయారు చేస్తారు.     సోంఫు కూడా బాలింతలకు మంచిది. పాలు తాగే పిల్లలకి కడుపులో నొప్పి లేదా గ్యాస్ కు సంబందించిన సమస్యలు దీని వల్ల బాగా తగ్గుముఖం పడతాయి. తల్లి ఈ సోంఫుని ఎంత తింటే పిల్లలకి అంత మంచిది. దీనిని పొడిగా చేసుకుని కూరల్లో తినచ్చు లేదా నీళ్ళల్లో వేసి కాచుకుని కషాయంలా కూడా తీసుకోవచ్చు. వెల్లుల్లి పాలు ఎక్కువగా ఉత్పత్తి అయ్యేందుకే కాదు పాలకు మంచి రుచిని కూడా తెచ్చిపెడుతుందని ఒక అధ్యయనం తేల్చి చెప్పింది. వెల్లుల్లి తిన్న తల్లుల పిల్లలు తల్లి దగ్గర ఎక్కువ పాలు తాగారట. ఈ వెల్లుల్లిని బాలింత తినే అన్ని వంటకాల్లో కలుపుకోవచ్చు. అలాగే వాము కూడా పాలు పడటంలో ఎక్కువ సహాయం చేస్తుంది. వాము పొడిలో కాని కషాయంలో కాని తేనె కలిపి తినిపిస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.యుటరస్ కి సంబంధించి  ఏదైనా సమస్య ఉన్నా అది కూడా తగ్గుతుంది. అన్నింటికన్నా ముఖ్యమైనడి బొప్పాయి పండు. ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు దీన్ని అస్సలు తినకూడదని చెప్తారు అదే పండు డెలివరీ అయ్యాకా మాత్రం ఎక్కువగా తినాలి. ఇందులో తగినన్ని ప్రోటీన్స్, విటమిన్స్ ఉండటమే కాకుండా పాలు సమృద్దిగా తయారుకావటానికి దోహదం చేస్తాయి. బాలింతలు దీన్ని ఎంత తింటే అంత మంచిది. ఓట్స్ లో ఐరన్, కాల్షియం, ఫైబర్ ఇంకా విటమిన్ బి ఎక్కువగా ఉండటంవల్ల దీనిని తీసుకుంటే డిప్రెషన్ కూడా తగ్గుతుందిట. కొత్తగా తల్లి అయిన వాళ్ళలో తెలియని భయం ఉంటుంది. అలాంటి సమస్యలన్నీ ఓట్స్ తినటం వల్ల పోతాయని తేల్చి చెప్పాయి కొన్ని అధ్యయనాలు. వీటితో పాటు బ్రెడ్ తింటే కూడా మంచిది. తల్లులు తీసుకునే ఆహారంలోనే ఏది పాలను ఎక్కువగా ఉత్పత్తి చేస్తుందో తెలుసుకుని తీసుకుంటే చాలు, పిల్లలకి పోత పాలు పట్టాల్సిన పని ఉండదు. ..కళ్యాణి