English | Telugu

సవతి తల్లి ప్లాన్ అదే.. ఆమె గుర్తుపట్టగలదా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -279 లో... సందీప్, ధనలకి శ్రీలత ఒక ప్లాన్ చెప్తుంది. మీరు పూర్తిగా మారిపోయినట్టు వాళ్లనుకోవాలి.. ఆఫీస్ కి వెళ్ళాలి అక్కడ కూడా వాళ్ళని నమ్మించాలని శ్రీలత చెప్తుంది. అక్క బావలకి తెలిస్తే ఎలా అని ధన అనగానే.. ఇప్పుడు రిలేషన్ గురించి ఆలోచిస్తే నువ్వు ఇక్కడే ఉంటావని సందీప్ అంటాడు. నాకు నా లైఫ్ ఆస్తులు ముఖ్యం అన్నట్లు ధన సెల్ఫిష్ గా ఆలోచిస్తాడు.

మరొకవైపు రామలక్ష్మి, సీతాకాంత్ లు ఆఫీస్ కి వెళ్తు.. ధన, సందీప్ ల బాధ్యతలు అత్తయ్య మనకి అప్పజెప్పారు. మనం ఎలాగైనా వాళ్ళని మార్చాలని రామలక్ష్మి అనగానే.. నేను దాని గురించి ఆలోచిస్తున్నానని సీతాకాంత్ అంటాడు. మరొకవైపు శ్రీలతకి నందిని ఫోన్ చేసి రామలక్ష్మి సీతాకాంత్ ని విడగొడతానన్నావని అడుగుతుంది. నేను అలా చెయ్యలేను. నేను మారిపోయాను నువ్వు ఏదైనా చేసుకోమని శ్రీలత అంటుంది. ఆ తర్వాత నేనే నా సీతాని సొంతం చేసుకుంటాను అని నందిని అనుకుంటుంది. ఆ తర్వాత అత్తయ్య మీరు మారలేదు కదా ఎందుకు అలా చెప్పారని శ్రీవల్లి అడుగగా.. మారలేదు.. ప్లాన్ లో ఉన్నానని నందినికి చెప్పలేదని శ్రీలత అంటుంది. అలా అనగానే చెప్పలేదు.. తెలియొద్దు ఇప్పుడు నేను మారానని రామలక్ష్మి నమ్ముతుంది. ఇప్పుడు మారలేదని తెలిస్తే దాన్ని ఎదర్కోలేము.. ఇప్పుడేదైనా నందిని పైకి వెళ్తుందని శ్రీలత అంటుంది.

మరొకవైపు సందీప్, ధన ఆఫీస్ కి వెళ్తారు. ధనకి వర్క్ చెప్పండి అని నందిని అంటుంది. సందీప్ మాట తీరు చూస్తే నందిని కి మారినట్టు అనిపించదు. ఆ తర్వాత రామలక్ష్మి, సీతాకాంత్ లు షేర్ వాల్యూ పడిపోయిందని టెన్షన్ పడుతుంటే.. నందిని స్వీట్ తీసుకొని వస్తుంది. ఇప్పుడు చూడండి షేర్ వాల్యూ అని నందిని అనగానే రామలక్ష్మి చూస్తుంది. షేర్ వాల్యూ పెరుగుతుంది. దాంతో అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. నందినిని దగ్గరికి తీసుకొని సీతాకాంత్ థాంక్స్ చెప్తాడు. కాసేపటికి నందిని అందరికి స్వీట్ ఇస్తానంటూ వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.