English | Telugu

Biggboss 8 Nominations : నామినేషన్లలో యష్మీకే అత్యధికం..  తనకి ఇదే చివరి వారమా!

బిగ్‌బాస్ మొత్తానికి మూడో వారంలోకి అడుగుపెట్టేసింది. అయితే గత రెండు వారాలుగా నామినేషన్ల నుంచి తప్పించుకుంటు వస్తున్న యష్మీకి ఈసారి కంటెస్టెంట్లు గట్టిగానే నామినేషన్ చేశారు. రెండు వారాల నుంచి నామినేట్ చేద్దామనుకున్న వాళ్లంతా ఈ వారం గుద్దిపడేశారు. ఇప్పటికే హౌస్‌లో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది.

మొదటి వారంలో గత సీజన్ శోభాశెట్టిని గుర్తుచేసిన యష్మీ.. రెండో వారంలో మిగిలిన కంటెస్టెంట్లతో నరకం స్పెల్లింగ్ రాయించింది. చీఫ్ అయ్యాననే గర్వంతో ఇష్టమొచ్చినట్లు బిహేవ్ చేసింది. ఇక దీనికి యష్మీ టీమ్ కూడా తానా అంటే తందానా అన్నారు. ఇలా యష్మీ బిహేవియర్ చూసి ఆడియన్స్ ఎలిమినేట్ చేసేయండి నాగార్జున గారు అంటూ సోషల్ మీడియాలో గట్టిగానే డిమాండ్ కూడా చేశారు. మరోవైపు యష్మీకి నామినేషన్లలో ఓటేసి పంపేద్దామనుకున్న కంటెస్టెంట్లకి గత రెండు వారాలు బిగ్‌బాస్ దయ వల్ల ఆ అవకాశం దొరకలేదు. కానీ మూడో వారం మాత్రం యష్మీ నామినేషన్ లో ట్రోలర్స్ కి దొరికేసింది.

మణికంఠ, సోనియా, సీత సహా చాలా మంది కంటెస్టెంట్లు సోనియాకే గుద్దిపడేశారు. దీంతో అత్యధిక ఓట్లతో ఈవారం నామినేషన్లలోకి అడుగుపెట్టింది యష్మీ. దీని గురించి తెలియగానే యష్మీ యాంటీ ఫ్యాన్స్, చాలా మంది నెటిజన్లు సోషల్ మీడియాలో పండగ చేసుకుంటున్నారు. రా అమ్మా మెరుపు తీగ.. ఈసారి నిన్ను ఇంటికి పంపకపోతే చూడు, వెల్కమ్ యష్మీ ఇదే నీకు చివరి నామినేషన్ అంటు నెటిజన్లు తెగ కామెంట్లు పెడుతున్నారు

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.