English | Telugu

Bigg Boss 8 : చీప్ గా బిహేవ్ చేసిన చీఫ్ యష్మీ.. ప్రేరణ క్రూరత్వం!

బిగ్ బాస్ సీజన్-8 శుక్రవారం నాటి ఎపిసోడ్ లో ఎప్పటిలాగే ఇప్పుడు కూడా హౌస్ మేట్స్ రాజకీయలు మొదలయ్యాయి. అంతేకాకుండా రెండు మూడు గ్రూపుల్లాగా అయ్యారు. యష్మీ చీఫ్ గా ఉండి తమ టీమ్ ని గెలిపించింది. అందులో పృథ్వీ ఫౌల్ గేమ్ ఆడాడు అది వేరే విషయం. కాకపోతే యష్మీ నిఖిల్, నైనిక ముగ్గురు చీఫ్ లు కాబట్టి బిగ్ బాస్ కాన్ఫెషన్ రూమ్ కి పిలిచాడు. యష్మీ టీమ్ టాస్క్ లో గెలవడంతో బిగ్ బాస్ తనకి కొన్ని పవర్స్ ఇస్తాడు. ఆ పవర్ ఏంటంటే యష్మీ హౌస్ మేట్స్ కి పనులు అప్పగించే పవర్ వస్తుంది. (Bigg Boss 8 Telugu)

యష్మీ తన టీమ్ కాకుండా మిగతా వాళ్ళకి వర్క్ అలాట్ చేస్తుంది. నైనిక టీమ్ లోని కిర్రాక్ సీత, నబీల్ , విష్ణుప్రియ, ఇంట్లో వర్క్ అలాట్ చేస్తుంది. ఆ తర్వాత యష్మీ టీమ్ అంత కూడా నైనిక టీమ్ వాళ్ళని ఒక ఆట ఆడుకుంటారు. ఇంట్లో పనులన్నీ వాళ్ళ చేతే చేయిస్తారు. ప్రేరణ మరొక కోణం నిన్న బయట పడింది. కిచెన్ లో జ్యూస్ గ్లాస్ లో పోసుకొని బాటిల్ ని డస్ట్ బిన్ లో వేస్తుంది. వాళ్ళున్నారు కదా చేయడానికి అని మళ్ళీ డస్ట్ బిన్ లోని బాటిల్ ని తీసి టేబుల్ పై పెట్టింది ప్రేరణ. అది చూసి సీత నవ్వుకుంటూనే డస్ట్ బిన్ లో వేసింది. ఆ తర్వాత ప్రేరణ, అభయ్ నవ్వుకుంటుంటారు. యష్మీ టీమ్ అంతా కలిసి బయట జ్యూస్ తాగుతూ పార్టీ చేసుకుంటారు. ప్రేరణ కావాలనే బయటకు గొడుగులు తీసి బయటవేస్తుంది వాళ్ళున్నారు కదా క్లీన్ చెయ్యడానికి అంటుంది. ఆ తర్వాత అభయ్ ఆమ్లెట్ వేసుకుంటున్నానని అంటాడు. దాంతో ఆ డిషెస్ మీరే తోముకోవాలని కిర్రాక్ సీత అంటుంది. అది మా డ్యూటీ కాదని అభయ్ అంటాడు. ఇక మేమ్ పని మనుషులులాగా కన్పిస్తున్నామా అని అభయ్ తో గొడవ పెట్టుకుంటుంది కిర్రాక్ సీత.

మరోవైపు విష్ణుప్రియ తన బాధ చెప్పుకుంది‌. అసలు ఇదెక్కడి న్యాయం. పదిమంది చేసే పనంతా మమ్మల్ని చేయండంటూ ఆర్డర్లు వేయడమేంటి? నేను బిగ్‌బాస్‌కి వచ్చింది పనులు చేయడానికా అంటూ విష్ణు కాసేపు తిట్టుకుంది. ఏదో టైటిల్ గెలిచేద్దామనే ఫైర్‌తో లోపలికి వచ్చాను.. వీళ్ల వల్ల ఫైర్ అంతా ఆరిపోయింది. నేను అయితే ఒక్క పని కూడా చేయను.. నాగార్జున సర్ అడిగితే చెబుతా.. నేను ఏదో పర్సనాలిటీ డెవలెప్‌మెంట్ అనుకొని హౌస్‌లోకి వచ్చా కానీ ఇలా క్లీనింగ్ డెవలప్‌మెంట్ అవుతుందని అనుకోలేదు. బిగ్‌బాస్‌కి రావడం రాంగ్ డెసిషన్ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. యష్మీ టీమ్ చేసే ఆగడాలకు నైనిక, విష్ణుప్రియ, కిర్రాక్ సీత ముగ్గురు ఆగమవుతున్నారు.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.