English | Telugu

నాకు పండు అంటే ఇష్టం..


ఢీ 20 లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ప్రోమోలో హోస్ట్ నందు ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది అని చెప్పాడు. ఇద్దరి జర్నీ ఇక్కడితో ఎండ్ కాబోతోంది అని చెప్పాడు. ఇందులో అందరూ వాళ్ళ వాళ్ళ స్టైల్ లో బెస్ట్ పెర్ఫార్మెన్స లు ఇచ్చారు. ఇక ఢీ 10 రాజు ఒక బిడ్డను పట్టుకుని చేసిన ఒక యాక్ట్ అందరినీ కదిలించింది. "నల్లని వన్నీపాలని" అనే పాటకు లేడీ గెటప్ లో ఒక తల్లిగా నటిస్తూ డాన్స్ చేసాడు. ఊరికే ఆ టైటిల్ ఇవ్వలేదు "కింగ్ ఆఫ్ ఢీ అన్నది" అంటూ విజయ్ బిన్నీ మాస్టర్ రాజుని బాగా మెచ్చుకున్నాడు. "పేరెంట్స్ కిడ్స్ ని ఎంత ప్రేమిస్తారు అన్నది చాలాచాలా బాగా చూపించారు చిట్టి మాస్టర్ " అంటూ చెప్పారు విజయ్ బిన్నీ మాస్టర్. ఇక విజయ్ బిన్నీ మాష్టర్ కోసం ఒక చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. వాళ్ళ ఫామిలీని ఈ స్టేజి మీదకు తీసుకొచ్చారు.

వాళ్ళ అబ్బాయి వియాన్ష్ ని తీసుకొచ్చి "హ్యాపీ బర్త్ డే" సాంగ్ పాడించారు. ఆ తర్వాత విజయ్ బిన్నీ మాష్టర్ తన బిడ్డను ఎత్తుకున్నాడు. ఆ పిల్లాడు ఎమోషనల్ ఐపోయాడు. "నీకు ఢీలో ఎవరంటే ఇష్టం" అని అడిగేసరికి "పండు అంటే ఇష్టం" అని చెప్పాడు. "స్కూల్ కి వెళ్లకపోతే ఏమవుతారు" అంటే "ఫెయిల్" అని చెప్పాడు. ఇక తర్వాత హ్యాపీ బర్త్ డే అంటూ విష్ చేసి అందరూ కలిసి కేక్ కట్ చేశారు. ఇక అసలైన పండు మాస్టర్ వచ్చేసాడు. "సిరిసిల్ల ఎళ్లినాడు..సీరాలెన్నో తెచ్చినాడు" అంటూ లేడీ గెటప్ లో చేసిన డాన్స్ కి అందరూ ఫిదా ఇపోయారు. ఇక విజయ్ బిన్నీ మాస్టర్ ఐతే పండూ అంటూ గట్టిగా అరిచి లేడీ గెటప్ ఎంత బాగున్నావో తెలుసా అన్నాడు. అంతే పండు సిగ్గుపడిపోయాడు. "వాడికి అమ్మ లేదు కదా మాస్టర్ ఢీ షోనే అమ్మల భావిస్తాడు. ఇక లాస్ట్ లో నందు "అరె వియాన్ష్ ఈ సాలా కప్పు" అనేసరికి "లాలీపాప్" అంటూ వేలు చూపించాడు. దాంతో అందరూ నవ్వేశారు.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.