English | Telugu

బాలయ్య 'అన్ స్టాపబుల్' షోలో 'ఆర్ఆర్ఆర్' టీమ్.. బాబాయ్ తో అబ్బాయి?

'అఖండ' సక్సెస్ జోష్ లో ఉన్న నటసింహం నందమూరి బాలకృష్ణ 'అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే' షోలో మరింత ఎనర్జీతో పాల్గొంటున్నారు. మొదటి మూడు ఎపిసోడ్స్ లో మోహన్ బాబు, నాని, బ్రహ్మానందంతో అలరించిన బాలయ్య.. నాలుగో ఎపిసోడ్ లో అఖండ మూవీ టీమ్ తో సందడి చేశారు. ఇప్పుడు ఐదో ఎపిసోడ్ కోసం 'ఆర్ఆర్ఆర్' టీమ్ ని రంగంలోకి దింపారు.

Also Read:బ‌న్నీకి జ‌క్క‌న్న స్మూత్ వార్నింగ్‌!

'అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే' షో ఐదో ఎపిసోడ్ లో దర్శకధీరుడు రాజమౌళి, ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి సందడి చేయనున్నారని తెలుపుతూ తాజాగా పోస్టర్స్ ను విడుదల చేసింది ఆహా. ఈ పోస్టర్స్ లో బాలకృష్ణ మరింత ఎనర్జీతో కనిపిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆర్ఆర్ఆర్' జనవరి 7 న విడుదల కానుంది. ఈ ప్రమోషన్స్ లో భాగంగానే రాజమౌళి షోలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. అఖండ ప్రీరిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న రాజమౌళి.. బాలయ్య ఒక ఆటమ్ బాంబు లాంటోడు అంటూ ప్రశంసించారు. మరి ఇప్పుడు ఆ ఆటమ్ బాంబుతో కలిసి ఎలా ఎంటర్టైన్ చేస్తారో చూద్దాం.

Also Read:మిలియ‌న్ డాల‌ర్ల క్ల‌బ్‌లో 'అఖండ‌'!

మోహన్ బాబు గెస్ట్ గా వచ్చిన మొదటి ఎపిసోడ్ లో మంచు లక్ష్మి, మంచు విష్ణు మెరిశారు. అదేవిధంగా ఐదో ఎపిసోడ్ లో తారక్, చరణ్ మెరుస్తారేమో చూడాలి. అదే జరిగితే నందమూరి ఫ్యాన్స్ కి పండగే అని చెప్పొచ్చు. బాబాయ్ అబ్బాయిలు తమ ఎనర్జీతో ప్రేక్షకులను అలరించడం ఖాయం. మరి తారక్, చరణ్ ఈ ఎపిసోడ్ లో సందడి చేస్తారో లేదో చూడాలి.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.