English | Telugu

అన‌సూయ‌కు ధీటుగా శ్రీ‌ముఖి కాస్కో అంటోంది!

ఓ షోకి పోటీగా మ‌రో షోని అదే టైమ్‌కి లైన్‌లోకి తీసుకురావ‌డం అనే పోటీ ఈ మ‌ధ్య మొద‌లైంది. బిగ్‌బాస్ షోకు ధీటుగా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ `ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు` టాక్ షోని మొద‌లు పెట్ట‌డం.. దాని కార‌ణంగా బిగ్ బాస్ టీఆర్పీ రేటింగ్‌లో తేడా రావ‌డం తెలిసిందే. ఇప్పుడు ఇదే త‌ర‌హాలో జెమినీ టెలివిజ‌న్ షోకి పోటీగా మ‌రో షో తెర‌పైకి వ‌చ్చేసింది. జెమిని టీవీలో `మాస్ట‌ర్ ఛెఫ్‌` పేరుతో ఛెఫ్‌ల ఛాలెంజింగ్ షో ప్ర‌సారం అవుతున్న విష‌యం తెలిసిందే.

ఈ షోకు ధీటుగా మాస్ట‌ర్ మైండ్ అల్లు అర‌వింద్ త‌న ఆహా ఓటీటీ కోసం `ఛెఫ్ మంత్ర` పేరుతో స‌రికొత్త షోకి శ్రీ‌కారం చుట్టారు. `మాస్ట‌ర్ ఛెఫ్‌` కు ముందు త‌మ‌న్నా హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌గా టీఆర్పీ రేటింగ్ కార‌ణంగా త‌మ‌న్నాని త‌ప్పించి నిర్వాహ‌కులు ఆ స్థానంలో హోస్ట్‌గా అన‌సూయ‌ని రంగంలోకి దింపేశారు. ఇక ఇదే స్పీడుతో ఆహా `ఛెఫ్ మంత్ర‌` షో కోసం బుల్లితెర రాముల‌మ్మ శ్రీ‌ముఖిని హోస్ట్‌గా ఫైన‌ల్ చేశారు. దీంతో అన‌సూయ‌, శ్రీ‌ముఖిల మ‌ధ్య నువ్వా నేనా కాస్కో అనే స్థాయిలో పోటీ మొద‌లైంది.

శ్రీ‌ముఖి హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న `ఛెఫ్ మంత్ర` స‌క్సెస్ అయితే అన‌సూయ ఇమేజ్ డ్యామేజ్ అయిన‌ట్టే అంటున్నాయి సినీ వ‌ర్గాలు. ఇప్ప‌టికే రెజీనా, శ్రియ‌ల‌తో ఓ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్‌ని షూట్ చేసి వ‌దిలారు కూడా. తాజాగా శ్రీముఖి ఈ ప్రోగ్రామ్ కోసం ట్రెండీగా సిద్ధ‌మై ఫొటోల‌కి ఫోజులిచ్చిది. ప్ర‌స్తుతం ఈ ఫొటోలు నెట్టింట సంద‌డి చేస్తున్నాయి.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.