English | Telugu

టూర్ లో శ్రీ‌హాన్‌.. హోమ్ ఐసోలేష‌న్‌లో సిరి..

బిగ్‌బాస్ సీజ‌న్ 5 కార‌ణంగా రెండు ప్రేమ జంట‌ల్లో క‌ల‌క‌లం మొద‌లైంది. ఈ షో పుణ్య‌మా అని న‌లుగురు ప్రేమికులు విర‌హ వేద‌న‌ని అనుభ‌విస్తున్నారు. ఈ షో కార‌ణంగా ష‌న్ను - దీప్తి సున‌య‌న మ‌ధ్య దూరం పెరిగింది. సోష‌ల్ మీడియా వేదిక‌గా దీప్తి - ష‌న్నుకు బ్రేక‌ప్ చెప్పేసింది కూడా. ఇప్పుడు వీరిద్ద‌రు క‌లుస్తారా? .. లేదా అని వీరి అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇక ఈ జంట బ్రేక‌ప్ ప్ర‌భావం మ‌రో జంట పై ప‌డింది. అదే శ్రీ‌హాన్ - సిరి.

Also Read: ధ‌నుష్‌, ఐశ్వ‌ర్య మ‌ధ్య‌ ల‌వ్ స్టోరీ ఎలా మొద‌లైందో తెలుసా?

గ‌త కొన్ని రోజులుగా వీరిద్ద మ‌ధ్య కూడా దూరం పెరిగిపోయింది. బిగ్ బాస్ హౌస్ నుంచి బ‌య‌టికి వ‌చ్చాక శ్రీ‌హాన్ -సిరి క‌లుసుకున్న సంద‌ర్భాలు లేవు. సోష‌ల్ మీడియా వేదిక‌గా క‌లిసి ఫొటోల‌ని పంచుకున్నదీ లేదు. సిరి బ‌ర్త్ డే సంద‌ర్భంగా శ్రీ‌హాన్ విష్ చేస్తూ పోస్ట్ పెడితే దానికి సిరి నుండి ఎలాంటి రిప్లై రాక‌పోవ‌డంతో ఇద్ద‌రి మ‌ధ్య దూరం మొద‌లైంద‌ని అర్థ‌మైంది. దీంతో శ్రీ‌హాన్ - సిరి కూడా విడిపోతున్నారంటూ ప్ర‌చారం మొద‌లైంది.

Also Read: ధ‌నుష్‌-ఐశ్వ‌ర్య ఎందుకు విడిపోయారు?

ఇదిలా వుంటే తాజాగా సిరి వైర‌స్ బారిన ప‌డింది. గ‌త కొన్ని రోజులుగా ఇంటి ప‌ట్టునే వుంటూ చికిత్స తీసుకుంటోంది. బిగ్‌బాస్ కార‌ణంగా సిరికి దూరంగా వుంటున్న శ్రీ‌హాన్ ఇప్పుడు ఒంట‌రిగా నార్త్ టూర్ కి వెళ్ల‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. సిరి ఇలా వుంటే శ్రీ‌హాన్ నార్త్ టూర్ కి వెళ్ల‌డం ఏంట‌ని అంతా అంటున్నారు. సిరి కార‌ణంగా హ‌ర్ట్ అయిన శ్రీ‌హాన్ త‌న‌ని దూరం పెడుతున్నాడ‌ని, త‌న‌కు కోవిడ్ అని తెలిసినా త‌ను నార్త్ టూర్ కి వెళ్ల‌డం వారిద్ద‌రి మ‌ధ్య పెరుగుతున్న దూరాన్ని తెలియ‌జేస్తోంద‌ని నెటిజ‌న్ లు కామెంట్ చేస్తున్నారు.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.