English | Telugu

నూకరాజు - పంచ్ ప్రసాద్ కి మధ్య గొడవ...అసలేం జరిగిందంటే ?


శ్రీదేవి డ్రామా కంపెనీ లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇక ఇందులో నూకరాజుకి, పంచ్ ప్రసాద్ కి పెద్ద గొడవే అయ్యింది. పంచ్ ప్రసాద్ కి ఒంట్లో బాగోనప్పుడు కానీ హాస్పిటల్ లో చేర్పించినప్పుడు కూడా నూకరాజు దగ్గరుండి అన్నీ చూసుకున్నాడు. వాళ్ళతో కలిసి వీడియోస్ చేసి వాటిని యూట్యూబ్ లో పెట్టి పంచ్ ప్రసాద్ కి ఆర్థికంగా కూడా సాయం చేయమని కోరాడు. పంచ్ ప్రసాద్ కి నూకరాజు ఒక బ్యాక్ బోన్ లా ఉండి ఎంతో సాయం చేసాడు. ఇక కోలుకున్నాక కూడా నూకరాజు, ప్రసాద్ కలిసి మంచి స్కిట్స్ చేస్తున్నారు అటు జబర్దస్త్ లో, ఇటు శ్రీదేవి డ్రామా కంపెనీలో. ఏమయ్యిందో ఏమో కానీ ఇప్పుడు ఇద్దరి మధ్యా గొడవొచ్చింది. "బేసిక్ గా నూకరాజు నాకు బ్రదర్ కంటే ఎక్కువ. అసలు అతను నాతో మాట్లాడడం మానేసాడు. ఎందుకు మాట్లాడ్డం లేదో నాకు తెలియాలి" అన్నాడు పంచ్ ప్రసాద్. ఆ మాటలకూ నూకరాజు స్టేజి మీదకు వచ్చి "ఒక మనిషికి దూరంగా ఉంటున్నామంటే అదేంటో నాకు తెలుసు" అన్నాడు. "తెలిసినప్పుడు చెప్పారా అన్నాడు" ప్రసాద్ . "ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ఇక్కడెందుకు ఆ విషయం" అన్నాడు. " హా లేదు లేదు..అందరికీ తెలియాలి ఆ విషయం" అని అన్నాడు.

ఆ వెంటనే ఇద్దరి మధ్య గట్టిగానే మాటల యుద్ధం జరిగినట్టు ప్రోమోలో కనిపిస్తోంది. ఆ సిట్యుయేషన్ అని ప్రసాద్ అంటూ ఉంటె..వద్దు నాకు చెప్పకు అని నూకరాజు..హి విను ముందు అంటూ ప్రసాద్ ఇలా గట్టిగా స్టేజి మీద పోట్లాడేసుకున్నారు. ఇక వీళ్ళను విడదీయడానికి అటు రష్మీ ఇటు రామ్ ప్రసాద్ ఇద్దరూ వచ్చారు. అసలు ఏమయ్యిందో కానీ గట్టిగానే గొడవ జరిగింది. ఇంతకు ఆ గొడవ ఎందుకు జరిగింది ? అసలు నిజమైన గొడవ ? లేదంటే ఫన్నీ కాన్సెప్ట్ ఆ ? ఈ షో చూస్తే కానీ తెలీదు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.