English | Telugu

బిగ్ బాస్ అనేది వేస్ట్ షో... బేబక్క వీడియో వైరల్

సోషల్ మీడియాలో బెజవాడ బేబక్క అంటే తెలియని వారుండరు. ఎందుకంటే కామెడీ పండించడంలో, సెటైర్స్ వేసి నవ్వించడంలో ఆమె తర్వాతే ఎవరైనా. జెంట్స్ లో కామెడీ యాంగిల్ కామన్ . కానీ లేడీస్ లో మాత్రం కొంచెం ఆ యాంగిల్ తక్కువగా ఉంటుంది. అలాంటి కామెడీ చేసే కొందరిలో బెజవాడ బేబక్క ఎంతో ఫేమస్. కానీ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి వారంలోనే ఎలిమినేట్ అయ్యి వచ్చేయడంతో ఆమె ఇంకా ఫేమస్ ఐపోయింది. దాంతో ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఇంకా పెరిగిపోయింది. ఆమె రీసెంట్ గా ఒక వీడియోని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. బిగ్ బాస్ వాళ్ళు మెరుపు తీగలా పని చేయమన్నారు అందుకే ఇలా వెళ్లి అలా ఆ హౌస్ నుంచి ఈ హౌస్ కి వచ్చేసాను అని చెప్పింది.

అలాగే బయటకు వచ్చేసరికి 20 వేల మంది ఫాలోవర్లు కూడా పెరిగిపోయారని తెలిసి వాళ్లకు ఫ్లయింగ్ కిస్సులు కూడా ఇచ్చేసింది. ఎంత కాలం ఉన్నామన్నది కాదన్నయ్యా...ఎంత మంచిగా ఉన్నామన్నదే ముఖ్యం..హౌస్ లో అందరితో కలిసిపోయాను, మంచిగా అందరికీ వంట చేసి పెట్టాను. ఇలా బయటకు వచ్చేసాను. ఇక నుంచి మంచి వీడియోస్ తో ఎంటర్టైన్ చేస్తూ ఉంటాను అని చెప్పింది. దాంతో నెటిజన్స్ కూడా ఆమె వీడియో మీద కామెంట్స్ చేస్తున్నారు. "అదొక వేస్ట్ షో సిస్టర్.... మీరు ఫస్ట్ వచ్చి మంచి పని చేశారు..మీకు ఆ షో అసలు వేస్ట్. వచ్చావా అక్క నువ్వు లేవని కృష్ణమ్మ బాధతో పొంగిపోయింది. ఇన్స్టాగ్రామ్ లో ఉన్నంత చురుకు బిగ్ బాస్ లో లేకుండా పోయింది అక్క " అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.