English | Telugu

అఖిల్ సార్థక్ సెలూన్ ని ఓపెన్ చేసిన నాగార్జున


బిగ్ బాస్ రన్నర్ గా నిలిచిన అఖిల్ సార్థక్ కొంతకాలంగా సోషల్ మీడియాలో సైలెంట్ అయిపోయాడు. వెబ్ సిరీస్‌లు, సినిమాల్లో కూడా అఖిల్ సందడి చేయడం లేదు. నీతోనే డ్యాన్స్ షో అంటూ తేజస్వీతో అఖిల్ డ్యాన్స్ చేసాడు ఆ తర్వాత అస్సలు కనిపించకుండా వెళ్ళిపోయాడు. ఇక ఇప్పుడు మళ్ళీ సందడి చేస్తున్నాడు అఖిల్. హైదరాబాద్ లో ఎలెవన్ సలోన్ ని ఓపెన్ చేసాడు. ఇక తన సలోన్ ఓపెనింగ్ ఫంక్షన్ కి తన ఫ్రెండ్స్ ని ఇన్వైట్ చేసాడు.

ఆర్జే కాజల్, రోల్ రైడ, సిరి హన్మంత్, నోయెల్, అలాగే హీరో నాగార్జున, బ్రహ్మముడి మానస్ వాళ్ళ అమ్మ పద్మిని, వచ్చారు. ఇక నాగార్జునతో సలోన్ ని ఓపెన్ చేయించాడు. బిగ్ బాస్ సీజన్ 4 లో రన్నరప్ గా నిలైహ్చాడు అఖిల్. ఐతే అఖిల్ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక పెద్దగా ఎలాంటి ఆఫర్స్ రాలేదు. కొన్ని షోస్ కి హోస్ట్ చేసాడు కానీ పెద్దగా క్లిక్ కాలేదు. బిగ్ బాస్ లోకి వెళ్లి వచ్చాక అందరిలో కొందరికైనా దశ తిరుగుతుంది కానీ అఖిల్ కి మాత్రం ఇంకా మహర్దశ వచ్చినట్టు కనిపించడం లేదు. ఇక ఇప్పుడు సలోన్ ఓపెన్ చేసేసరికి నెటిజన్స్ అంతా కూడా విషెస్ చెప్తున్నారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.