English | Telugu

పవన్ కళ్యాణ్ తెలిసే మాట్లాడటం లేదు..నాగబాబు అలా చెప్పడం కరెక్ట్ కాదు


నటి మాధవి ఏ విషయంలో ఐనా కానీ కరెక్ట్ కాదు అనుకుంటే వెంటనే ఫైర్ ఐపోతుంది. అలాంటి మాధవి ఇప్పుడు జానీ మాష్టర్ విషయంలో మండిపడింది. దీని మీద ఒక వీడియోని రిలీజ్ చేసింది "పవన్ కళ్యాణ్ ఈ విషయం పై ఎందుకు మాట్లాడ్డం లేదు..ఆయనకు ఈ విషయం గురించి తెలిసే ఆయన అసలు మాట్లాడ్డం లేదు. పార్టీ వేరు..వ్యక్తిత్వం వేరు..జానీ మాష్టర్ గిరినుంచి నాగబాబు పోస్ట్ పెట్టడం ఎం బాలేదండి. ఐనా నాగబాబు గారు మీకు ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి కంటే ఈ అమ్మాయి చాలా చిన్నది. జనసేనకు సపోర్ట్ చేసాడు కదా అని మీరు జానీకి సపోర్ట్ చేయడం ఏమీ బాలేదు. అలాగే మహాసేన రాజేష్ కూడా ఈ విషయం మీద ట్రోల్ చేసాడు. మీ ఫాలోయర్స్ ని తప్పు దారి పట్టించొద్దు.

జానీ అనే వాడు మీకు మంచి వ్యక్తి అయ్యుండొచ్చు కానీ ఆ అమ్మాయి విషయంలో మాత్రం విలన్ ..పుష్ప 2 సినిమా సాంగ్ షూటింగ్ లో జానీ మాష్టర్ వచ్చి ఆ అమ్మాయిని కొట్టి తిట్టి రచ్చ చేసాడు సుకుమార్ గారు దాని పంచాయతీ చేశారు తర్వాత విశ్వక్ సేన్ మూవీ షూటింగ్ లో ఆ అమ్మాయి కోరియోగ్రఫీ చేస్తుంటే అక్కడికి జానీ మాష్టర్ వచ్చి రచ్చా చేసాడు. జానీ మాష్టర్ ఆ అమ్మాయి సెల్ కి వందల మెసేజెస్ పంపించాడు. ఐ మిస్ యు, ఐ లవ్ యు, మతం మారు, పెళ్లి చేసుకో, షూటింగ్ స్టాప్ చేసి నన్ను కలవు లేదంటే చంపేస్తాను ఇలా టార్చెర్ మెసేజెస్ అన్నీ పంపిస్తూ ఉంటాడు. ఎన్నో మూవీస్ కి ఛాన్సెస్ వస్తే వాటిని క్యాన్సిల్ చేయించాడు జానీ మాష్టర్. టాలెంట్ పరంగా గొప్పోడు అయ్యుండొచ్చు కానీ వ్యక్తిత్వం పరంగా మాత్రం గొప్పోడు అయ్యుండక్కర్లేదు.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.