English | Telugu

Karthika Deepam2: శౌర్య కోసం కోటి రూపాయలు ఇస్తానన్న జ్యోత్స్న.. బదులుగా కార్తీక్ కావాలని కండిషన్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -268 లో....శౌర్యకి ఏదైనా అయితే నువ్వు బ్రతకవని తెలిసి నిజం చెప్పలేదని దీపతో కార్తీక్ చెప్తాడు. ఆపరేషన్ కి డబ్బు కావాలి కదా అని దీప అడుగుతుంది. వస్తాయని కార్తీక్ సమాధానం చెప్తాడు. అసలేం జరుగుతుంది.. ఎవరిని నమ్మాలో అర్ధం కావడం లేదని సుమిత్ర అంటుంది. ఒకసారి దీపకి ఫోన్ చెయ్ అని దశరథ్ అంటాడు. జ్యోత్స్న చెప్పింది కదా అని సుమిత్ర అనగానే.. తను చెప్పింది నిజమని మనం ఎందుకు అనుకోవాలి.. ఎవరిని నమ్మాలో అర్థం కావడం లేదు అన్నావ్ కదా దీప కి ఫోన్ చెయ్ అని దశరథ్ అంటాడు.

దీపకి ఫోన్ చేస్తుంది సుమిత్ర. కానీ తను లిఫ్ట్ చెయ్యదు. కాంచనకి ఫోన్ చేస్తుంటే తను కూడా అంత అవమానం తర్వాత ఎలా మాట్లాడుతుందని దీప లిఫ్ట్ చెయ్యదు. కార్తీక్ కి దీప ఫోన్ చేస్తుంది. ఇప్పుడు లిఫ్ట్ చేస్తే అంత చెప్పాలి.. బాధపెట్టడం తప్ప ఏం లేదని కార్తీక్ లిఫ్ట్ చెయ్యడు. ఎవరు లిఫ్ట్ చెయ్యడం లేదని సుమిత్ర బాధపడుతుంటే.. దీన్ని బట్టి వాళ్ళు ఎంత బాధపడుతున్నారో అర్థం అవుతుందని దశరథ్ అంటాడు. ఇల్లు తీసుకొని డబ్బు ఇవ్వండి అని తన ఊళ్ళో వాళ్ళని అనసూయ అడుగుతుంది. ఇల్లు దీప పేరున ఉంది అయినా అంత డబ్బు ఒకేసారి అంటే కష్టమని వాళ్ళు అంటారు. కార్తీక్ దగ్గరికి డాక్టర్ వచ్చి.. డబ్బు ఇంకా కట్టలేదు.. కడితేనే ట్రీట్ మెంట్ నడుస్తుందని అంటాడు. డబ్బులు ఎలా వస్తాయని దీప అడుగుతుంది. వస్తాయని కార్తీక్ అనగానే.. నాతో అబద్దం చెప్తున్నారని దీప అంటుంది. నా దగ్గర ఇప్పుడు అబద్ధాలు తప్ప ఏం లేవని కార్తీక్ డబ్బు గురించి తన ప్రయత్నం గురించి చెప్తాడు.

వెళ్లిన పని అవ్వలేదంటూ కాంచనతో అనసూయ చెప్తూ బాధపడుతుంది. దీప దేవుడికి మొక్కుకుంటూ ఉంటుంది. అప్పుడే జ్యోత్స్న వచ్చి.. నేను డబ్బు ఇస్తానంటూ కోటి రూపాయల చెక్కు ఇస్తుంది. అరకోటి నీ బిడ్డ ప్రాణం కోసం.. అరకోటి నా ప్రాణం అయిన బావ కోసం నీ తాళిని నాకు ఇచ్చేయమని జ్యోత్స్న అడుగుతుంది. ఇందులో బావకి నీకు సంబంధం లేదు అన్నట్లు రాసి ఉంది.. దాంట్లో సంతకం చెయ్.. మిగతాది మొత్తం నేను చూసుకుంటానని జ్యోత్స్న అనగానే.. దీప షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.