English | Telugu

రెండు వందల ఎపిసోడ్ లు పూర్తిచేసుకున్న కార్తీకదీపం-2.. 

స్టార్ మా టీవీలో ప్రసారమయ్యే కార్తీకదీపం సీరియల్ కు ఎంత ఫ్యాన్ బేస్ ఉందో చెప్పలేం.. ఏ మూవీకి లేనంత ఫాలోయింగ్ ఈ సీరియల్ కి ఉంది. కార్తీకదీపం మొదటి పార్ట్ విజవంతంగా పూర్తి అవ్వడంతో దర్శకుడు నవవసంతం అంటు కార్తీకదీపం-2 ని తీసుకొచ్చాడు.

ఇక ఈ సీరియల్ తాజాగా రెండొందలు(200) ఎపిసోడ్ కి చేరుకుంది. ఇక ఇందులోని పాత్రల గురించి ప్రత్యేకంగా చెప్పానక్కర్లేదు. దీప అలియాస్ ప్రేమీ విశ్వనాథ్.. కార్తీక్ బాబు అలియాస్ నిరుపమ్ పరిటాల. బుల్లితెర శోభన్ బాబు అని ఫ్యాన్స్ ముద్దుగా పిలుచుకుంటారు. కార్తీక దీపం-2 కథ ఇప్పటికే మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. కార్తీక్ దీపని శౌర్య కోసం పెళ్లి చేసుకున్నాడు. దాంతో ఫ్యాన్స్ సంబరాలు అంబరాన్ని అంటాయి. మాములుగా లేవు టీవీలో పెళ్లి చేసుకుంటే.. టీవీ ముందు కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు అభిమానులు. మరికొందరు అయితే హారతులు కూడా పట్టారు. ఈ వీడియోలని సోషల్ మీడియాలో చూస్తే వీళ్ళకి పిచ్చి పీక్స్ కు పోయిందనిపిస్తుంది.‌ మరి ఈ సీరియల్ కి ఉన్న క్రేజ్ అలాంటిది. కార్తీక్ , దీప ఇద్దరు ఒకటయ్యారు. ఇక సీరియల్ మెయిన్ విలన్ జ్యోత్స్న ఎలాగైనా కార్తీక్ ని దక్కించుకోవాలని పారిజాతంతో కలిసి విశ్వప్రయత్నాలు చేస్తూ ఫెయిల్ అవుతుంది.

మరొకవైపు సుమిత్ర, దశరథ్ ల అసలైన వారసురాలు దీప అనే విషయం దాస్ కనిపెడతాడో లేదా అనేది ఆసక్తికరంగా మారింది. దాస్ కూతురు జ్యోత్స్న.. ఆ విషయం పారిజాతం, జ్యోత్స్న, దాస్ లకి తెలుసు కానీ దీప అసలైన వారసురాలనే విషయం మాత్రం సస్పెన్సు. దీప దగ్గర ఉన్న కుబేర్ ఫోటోని దాస్ చూసినప్పుడే ఈ నిజం బయటకొస్తుంది‌. కానీ దీనిని
మనకి ఏ వెయ్యో ఎపిసోడ్ లోనో రెండువేల ఎపిసోడ్ ల తర్వాతనో రివీల్ చేస్తాడు డైరెక్టర్. ఎందుకంటే ఈ సీరియల్ లో‌ ఇదే కీలకం. దీపే అసలైన వారసులు అని తెలిసాక శివన్నారాయణ‌, దశరథ్, సుమిత్ర అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ ఇది ఇప్పట్లో రాదు కాబట్టి వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.