English | Telugu

జయం మూవీ రియల్ జంట వీళ్ళు.. 

టాలీవుడ్ లో హీరో నితిన్ గురించి తెలియని వారు లేరు. జయం మూవీతో సూపర్ డూపర్ హిట్ కొట్టాడు. ఐతే ఈ సినిమాలో హీరోయిన్ సదా అన్న విషయం తెలుసు. కానీ అసలు హీరోయిన్ గా రష్మీ చేయాల్సి ఉంది అంటూ జయం మూవీ హీరో నితిన్ "అనగనగా ఈ ఉగాది" షోలో చెప్పేసరికి అందరూ అవాక్కయ్యారు. "రష్మీ గురించి నేను కొన్ని విషయాలు చెప్పాలి. నిజానికి నా ఫస్ట్ మూవీ జయంలో 90 పర్సెంట్ హీరోయిన్ ఆవిడే. లాస్ట్ మినిట్ వరకు తానే హీరోయిన్ గా చేసింది . కానీ లాస్ట్ మినిట్ లో ఎం జరిగిందో తెలీదు.

కానీ నా లైఫ్ లో ఒక అమ్మాయితో ఒక సీన్ ని రిహార్సల్ చేసింది మొదట రష్మీతోనే ..అందుకే నా లైఫ్ లో నేను ఎప్పుడూ మర్చిపోలేని అమ్మాయి రష్మీ " అని చెప్పాడు నితిన్. ఇంతలో హోస్ట్ నందు వచ్చి ఫైనల్ గా మంచి అమ్మాయిని సెలెక్ట్ చేశారు అంటూ చెప్పేసరికి రష్మీ ఏయ్ అంటూ నందు మీద అరిచింది. తర్వాత రష్మీ - నితిన్ ఒక కాస్టింగ్ కాల్ మీద టాస్క్ చేశారు. "ఏంటి నితిన్ గారు బ్రేకప్ అంటున్నారు. మీరు నన్ను అలా ఎలా మర్చిపోతారు." అని అడిగింది. "చాలా ఈజీగా మర్చిపోతాను" అని చెప్పాడు నితిన్. "మీరు మర్చిపోతే ఏంటి ..మీరు అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు" అని చెప్పింది. "కానీ నువ్వు అప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు అలా అస్సలు లేవు" అని చెప్పాడు. తర్వాత రష్మీ "నాలో ఊహలకు నాలో ఊసులకుక్" అనే సాంగ్ పాడి నితిన్ ని ఎంటర్టైన్ చేసింది. ఐతే రష్మీ జయం మూవీలో చేసి ఉంటె స్టార్ హీరోయిన్ అయ్యేది...కానీ ఏదేమైనా బుల్లితెర ఆమెకు బాగా కలిసొచ్చి స్టార్ యాంకర్ అయ్యింది .

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.