English | Telugu

Guppedantha Manasu Serial Saroja (Vinitha) : గుప్పెడంత మనసు రిషి మరదలు సరోజ షాకింగ్ కామెంట్స్!

గుప్పెడంత మనసు సీరియల్ కి తెలుగు టీవీ కార్యక్రమాల్లోనే అత్తధిక ఫ్యాన్ బేస్ ఉంది. అయితే ఇప్పటికే క్లైమాక్స్ ఎపిసోడ్ పూర్తయిందని దర్శకుడు తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో కొన్ని ఫోటోలని కూడా షేర్ చేశాడు. ఇక తాజాగా జ్యోతిరాయ్, రిషి వరుసగా ఇంటర్వ్యూలు ఇచ్చారు. వీరితో పాటుగా కొత్త క్యారెక్టర్ సరోజ కూడా బాగా పాపులర్ అయింది.

రిషికి మరదలుగా సరోజ పాత్రలో రాణిస్తుంది వినీత. ఈమె మన తెలుగు అమ్మాయే. పక్కా హైదరాబాదీ. ఇక్కటే పుట్టి పెరిగింది. బీటెక్ వరకు చదివిన వినీత.. 2020 కోవిడ్ బ్యాచ్‌లో బీటెక్ పూర్తి చేసింది. సీరియల్స్‌లోకి రాకముందు తమడా మీడియాలో పనిచేసింది. వెబ్ సిరీస్, కవర్ సాంగ్స్‌లో కూడా నటించింది. సినిమాల్లో అవకాశాల కోసం చాలా ప్రయత్నించిన వినీత.. వెండితెరపై అవకాశం రాలేదు కానీ.. బుల్లితెరపై రాణిస్తోంది. అనేక సీరియల్స్‌లో నటించింది వినీత.

మొదట్లో ఈవీటీలో అను-పల్లవి సీరియల్‌లో నటించిన వినీత.. జీ తెలుగులో ‘దేవతలారా దీవించండి’, ‘ఊహలు గుసగుసలాడే’ సీరియల్స్‌లో నటించింది. వీటితో పాటు.. పలు టీవీ షోస్‌లోనూ కనిపించింది. శ్రీదేవి డ్రామా కంపెనీలోనూ పంచ్‌లు పేల్చింది వినీత. దేవతలారా దీవించండి సీరియల్‌లో నెగిటివ్ రోల్‌ పోషించి.. నటిగా మంచి పేరు సంపాదించుకుంది. ఆ తరువాత ఊహలు గుసగుసలాడే సీరియల్‌లోనూ మెప్పించింది వినీత. కాగా ఆమె పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. రాకేష్ అనే వ్యక్తిని పెళ్లాడింది. ప్రస్తుతం గుప్పెడంత మనసు సీరియల్‌లో రంగా (రిషి) మరదలిగా చేస్తోంది. చూడ్డానికి కుందనపు బొమ్మలా, తెలుగుదనం ఉట్టిపడేలా కనిపిస్తోంది. అందానికి తగ్గ అభినయం అన్నట్టుగానే రంగా మరదలిగా నటనతోనూ మెప్పిస్తోంది వినీత.

తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వినీత మాట్లాడుతూ.. తను చాలా తక్కువ రోజులే షూటింగ్ లో ఉన్నానని, ఇంత తొందరగా ముగుస్తుందని ఊహించలేదని అంది. రిషి, వసుధారలు షూటింగ్ కి వెళ్లిన మొదటిరోజే కలిసిపోయారని, వాళ్ళిద్దరు డౌన్ టూ ఎర్త్ అని చాలా బాగా మాట్లాడతారని, ఈజీగా ఫ్రెండ్స్ అయిపోయారంటు వినీత చెప్పుకొచ్చింది.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.