English | Telugu

అప్పుడు క్రష్ ఇప్పుడు అక్క.. ఇద్దరి మధ్య రివేంజ్ నామినేషన్!

బిగ్ బాస్ సీజన్ -8 లో యష్మీ పాపకి ఉనంత క్రేజ్ మరి ఎవరికి లేదు. నామినేషన్ ప్రక్రియలో భాగంగా యష్మీ ని నామినేట్ చేసాడు గౌతమ్. మిమ్మల్ని మేడమ్ అనొచ్చా అని గౌతమ్ మొదలెట్టగా.. కాల్ మీ యష్మీ అని తను అంటుంది. నువ్వు ఒక్కో చోట ఒక్కోలాగా మాట్లాడావ్.. ఫ్లిప్ అయ్యావని గౌతమ్ అనగా.. మరి నువ్వు కాదా.. ఒకసారి క్రష్ అంటావ్ మరోసారి అక్క అంటావ్.. నువ్వు ఫ్లిప్ అవ్వడం లేదా అని యష్మీ అంటుంది.

ఆ తర్వాత యష్మీ ని రోహిణి నామినేట్ చేస్తుంది. గంగవ్వ కూడా యష్మీ నే నామినేట్ చేసి.. నువ్వు నీకు నచ్చినట్టు జరిగితే ఒకలా లేదంటే చిరాకుగా ఉంటావని అర్ధం వచ్చేలా గంగవ్వ అంటుంది. నువ్వు ఆ ప్రేరణ కలిసి గౌతమ్ పిలగాడి మీద పడతారు. ఏం అంటుండు ఆ పిలగాడు.. నువ్వు ఒక్కరితోనే ఉంటావని నామినేట్ చేస్తుంది.

ఆ తర్వాత గౌతమ్ ని రివెంజ్ నామినేషన్ చేస్తుంది యష్మీ.. వీకెండ్ లో ఏదో జరిగిందని చెప్పి నా దగ్గరికి వచ్చి అక్క అంటూ మాట్లాడడం నాకు నచ్చలేదు. అక్క అనే ఎమోషనల్ అక్కడ లేదు కాబట్టి నాకు ఇష్టం లేదని యష్మీ అంటుంది. ప్లీజ్ అక్క అనకు అంటూ రిక్వెస్ట్ చేస్తుంది. గౌతమ్ నామినేషన్ అంగీకరించి కలర్ నీళ్ళు పోసుకొని వస్తాడు. నేను అక్క అంటే ఇంత మంది హర్ట్ అవుతున్నారా సారీ అని గౌతమ్ అందరికి చెప్తాడు. గౌతమ్ కి యష్మీ టవల్ ఇస్తూ.. ఇక మన మధ్య ఏం గొడవలు వద్దని చెప్తుంది.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.