English | Telugu

Jayam serial: ఫుడ్ ఫెస్టివల్ కి గంగ.. రుద్ర చూసి షాక్!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -144 లో.....గంగ పనికోసం అంతటా ట్రై చేస్తుంది.. అందరు నువ్వు గొప్పింటి కోడలు.. నీకు జాబ్ ఎందుకని అంటారు. మరొకవైపు నా రాజకీయ జీవితానికి ఆ రుద్ర అడ్డుపడుతున్నాడని ఇషికతో వీరు అంటాడు. అప్పుడే పారు ఎంట్రీ ఇస్తుంది. ముగ్గురు కలిసి ఫుడ్ ఫెస్టివల్ గురించి ప్లాన్ చేస్తారు. అందులో ఫుడ్ పాయిజన్ చేసి అది గంగ పైకి వచ్చేలా చెయ్యాలనుకుంటారు. ఇప్పుడు గంగ పని కోసం ట్రై చేస్తుంది.

తను ఫుడ్ ఫెస్టివల్ కి వచ్చేలా ప్లాన్ చెయ్యాలని వీరు అంటాడు. మరొకవైపు గంగ గుడిలో కూర్చొని బాధపడుతుంది. అటుగా వెళ్తున్న రుద్ర తనని చూసి ఆగుతాడు. అక్కడే శ్రీను ఉంటాడు. ఏమైంది ఎందుకు గంగ ఏడుస్తుందని అడుగుతాడు. వాళ్ళ అమ్మ ఆరోగ్యం బాలేదు కదా.. మందులకి డబ్బులు లేవు.. పని కోసం ట్రై చేస్తుంది కానీ ఎక్కడ పని దొరకడం లేదని శ్రీను చెప్తాడు. ఈ డబ్బులు తీసుకొని తనకు ఇవ్వు నేను ఇచ్చానని చెప్పకు అంటాడు. శ్రీను వెళ్లి డబ్బులు ఇస్తాడు ఇదంతా ఎక్కడివి అని గంగ అడుగుతుంది. పక్కకి చూస్తే రుద్ర కన్పిస్తాడు. ఇవి ఎవరు ఇచ్చారో నాకు తెలుసు కానీ నేను తీసుకోనని గంగ అనగానే అంత పొగరు వద్దని రుద్ర అంటాడు. ఇద్దరు కాసేపు ఇండైరెక్ట్ గా మాట్లాడుకుంటారు.

ఆ తర్వాత వీరు ఒక ప్లాన్ చేస్తాడు. మణి తన మనుషులను గంగ ముందుకి తీసుకొని వెళ్తారు.. పని గురించి కావాలనే మాట్లాడిస్తాడు. అది విన్న గంగ.. పనికి నేను వస్తానని చెప్తుంది. అది విజయేంద్ర ప్రతాప్ గారి ఫుడ్ ఫెస్టివల్ అని వాళ్ళు చెప్పగానే నేను వస్తానని గంగ అంటుంది. గంగ పనికి వస్తానని అంటుందని వీరుకి మణి చెప్తాడు. ఆ తర్వాత లక్ష్మీ దగ్గరికి రుద్ర వస్తాడు. మీరు వస్తారని తెలుసు ప్రొద్దున పెద్ద అయ్యగారు ప్రీతి, ప్రమీల వచ్చారు కానీ గంగ రానని చెప్పిందని లక్ష్మీ చెప్పగానే రుద్ర షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.