English | Telugu

Eto Vellipoyindhi Manasu : ఆమె మనసులో మాట చెప్పగలదా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -181 లో... రామలక్ష్మి దగ్గరికి సీతాకాంత్ వచ్చి.. నాకు మర్చిపోలేని గిఫ్ట్ ఇస్తాను అన్నావ్.. ఏంటి అది అని అడుగుతాడు. ముందు మీరు చెప్పండి మీ మనసులో మాట చెప్తాను అన్నారు కదా అని రామలక్ష్మి అంటుంది. ఆ తర్వాత రామలక్ష్మి కళ్ళు మూసుకుంటుంది. సీతాకాంత్ తను తెచ్చిన రింగ్ ని పట్టుకొని రామలక్ష్మి కి ప్రపోజ్ చేస్తుంటే.. అప్పుడే నందిని వస్తుంది. తనని చూసిన సీతాకాంత్ షాక్ అవుతాడు. రామలక్ష్మి కళ్ళు తెరిచి ఏమైందని అడుగుతుంది.

నందినిని చూసి మేడమ్ అని అనగానే.. అంటే నువ్వు చెప్పిన మేడం తనేనా అని రామలక్ష్మితో సీతాకాంత్ అంటాడు. అవునని రామలక్ష్మి వెళ్లి నందినిని రిసీవ్ చేసుకుంటుంది. సీతాకాంత్ మాత్రం నందినిని షాకింగ్ గా చూస్తుంటాడు. హ్యాపీ బర్త్ డే సీతాకాంత్ అంటూ నందిని షేక్ హ్యాండ్ ఇస్తుంది. అందరికి ఒక విషయం చెప్పాలని అందరి ముందుకి వచ్చి.. సీతాకాంత్ చాలా గొప్పవారు తనతో కలిసి పార్టనర్ గా ఉండడం అనేది చాలా హ్యాపీగా ఉంది. దీనికి కారణం రామలక్ష్మి అని అందరి ముందు రామలక్ష్మికి నందిని థాంక్స్ చెప్తుంది. ఇక నాకు వర్క్ ఉంది అంటూ అక్కడ నుండి వెళ్లిపోతుంటుంది. మేడమ్ మాకు ఇచ్చిన మాటేంటి అని సందీప్ వెనకాలే వెళతాడు. అయినా సందీప్ ని పట్టించుకోకుండా వెళ్లిపోతుంది. మరొకవైపు సుజాత వెళ్ళిపోతూ.... అల్లుడు గారు నిన్ను బాగా చూసుకుంటున్నారు.. చాలా హ్యాపీగా ఉంది.. మీరు ఇంకా హ్యాపీగా ఉండాలంటే నీ కడుపు పండాలని రామలక్ష్మికి సుజాత చెప్తుంది. ఆ తర్వాత సీతా సర్ కన్పించడం లేదని రామలక్ష్మి చూస్తుంది. సీతా తన మనసులో మాట చెప్పడానికి సర్ ప్రైజ్ ప్లాన్ చేసి ఉంటాడని పెద్దాయన అనుకుంటాడు.

మరొకవైపు అ మేడమ్ ఇలా చేసిందని శ్రీలతతో సందీప్ అంటాడు. ముందు అ నందిని సీతకు ఏమవుతుందో తెలుసుకోవాలి.. ఎందుకంటే తను రాగానే సీతా చేంజ్ అయ్యాడు. ఒక్క మాట కూడా మాట్లాడలేదని శ్రీలత కి డౌట్ వస్తుంది. ఆ తర్వాత రామలక్ష్మి తన గదిలోకి వెళ్తుంది. ఈ రోజు ఎలాగైనా సీతా సర్ కి నా మనసులో మాట చెప్పి అయన సొంతం అవుతానని రామలక్ష్మి అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.