English | Telugu

Eto Vellipoyindhi Manasu : అత్తింటి వాళ్ళు ఇచ్చి‌న గిఫ్ట్ చూసి అల్లుడు ఫిధా.. భార్య గిఫ్ట్ ఏంటంటే!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్నా సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -180 లో....సీతాకాంత్ కేక్ కటింగ్ దగ్గరికి వస్తాడు. చూసావా అన్నయ్య.. నీ ఇష్టానికి తగ్గట్టు ఎలా వదిన ఏర్పాట్లు చేసిందోనని సిరి అనగానే.. సీతాకాంత్ హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు. ఎంతైనా భర్త మీద ప్రేమ అలాంటిది కదా అని పెద్దాయన అంటాడు. వచ్చినవాళ్ళు మీరిద్దరి కాంబినేషన్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని అంటారు.

అ తర్వాత అన్నయ్య పక్కకి వెళ్ళు అమ్మ అని సందీప్ అంటాడు. ఎందుకు అవమానపడేందుకా.. అది పక్కనే ఉంది కదా అని శ్రీలత అంటుంది. రామలక్ష్మి నాపై పంతంతో ఏదైనా చేస్తుందని అంటుంది. అప్పుడే శ్రీలతని సీతాకాంత్.. అంత దూరంగా ఉన్నావేంటి అమ్మ.. వచ్చి నా పక్కన ఉండమని అంటాడు. పర్లేదు అని శ్రీలత అనగానే.. అత్తయ్య గారిని నేను పిలుచుకొని వస్తానని రామలక్ష్మి వస్తుంది. అత్తయ్య రండి మీరు తన పక్కన ఉండాలి.. సొంతతల్లి కాకున్నా సవతి తల్లి అయిన కూడా బాగా చూసుకున్నారని రామలక్ష్మి ఇండైరెక్ట్ గా తన కపట ప్రేమ గురించి మాట్లాడుతుంది. ఆ తర్వాత సీతాకాంత్ కేక్ కట్ చేసి శ్రీలతకి తినిపిస్తుంటే.. ఎప్పుడు అమ్మకేనా ఈ సారి నీ భార్యకి తినిపించమని పెద్దాయన అనగానే.. రామలక్ష్మికి సీతాకాంత్ తినిపిస్తుంటాడు. ఎవరికైనా తల్లి ఫస్ట్ తనకి తినిపించండని రామలక్ష్మి అనగానే.. సీతాకాంత్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత కేక్ తినిపించక.. అందరు గిఫ్ట్స్ ఇస్తుంటారు. శ్రీలత దగ్గర సీతాకాంత్ ఆశీర్వాదం తీసుకుంటాడు. సీతాకాంత్ కోసం సుజాత గిఫ్ట్ తీసుకొని వస్తుంది. కానీ అది అతని రేంజ్ కి తక్కువ అవుతుందని ఇవ్వకుండా ఉంటుంద. అప్పుడే రామలక్ష్మి రావడంతో బావ కోసం గిఫ్ట్ తెచ్చాము.. అమ్మ ఇవ్వట్లేదని పింకీ చెప్తుంది.

అ తర్వాత సీతాకాంత్ ని రామలక్ష్మి పిలిచి.. మా అమ్మ వాళ్ళు ఏదో గిఫ్ట్ తెచ్చారు మీ స్థాయికి సరిపోదని ఇవ్వట్లేదని అనగానే పర్లేదు అత్తయ్య ఇవ్వండని సీతాకాంత్ అనగానే.. సుజాత గోల్డ్ చైన్ ఇస్తుంది. అది చూసి అది గోల్డ్ ఏనా.. అది మా ఇంట్లో పనిమనిషి కూడ వెయ్యదంటూ సుజాతని శ్రీవల్లి అవమానిస్తుంటే.. సీతాకాంత్ తనపై కోప్పడుతాడు. గిఫ్ట్ నాకు బాగా నచ్చిందని సీతాకాంత్ అంటాడు. నీ పుట్టింటి వాళ్ళు తెచ్చిన గిఫ్ట్ నీ చేతులతో సీతాకాంత్ మెడలో వేయమని పెద్దాయన అనగానే.. రామలక్ష్మి వేస్తుంది. ఆ తర్వాత పెద్దాయన.. నీ మనసులో మాట రామలక్ష్మికి వెళ్ళి చెప్పమని అంటాడు. సీతాకాంత్ తన కోసం తీసుకొని వచ్చిన రింగ్ తీసుకొని రామలక్ష్మి దగ్గరికి వెళ్తాడు. అందరూ గిఫ్ట్ ఇస్తున్నారు. నువ్వు ఇంకా ఇవ్వలేదని సీతాకాంత్ అంటాడు. అ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.