English | Telugu

Brahmamudi : ఇంటికి వారసుడిని ఇవ్వడం నా భాద్యత.. శుభవార్త చెప్పిన కావ్య!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -793 లో.... కావ్యకి రాజ్ ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేస్తుంది. రాజ్ వెళ్తుంటే ఇందిరాదేవి, అపర్ణ ఆపి మేం కావ్యకి నచ్చజెప్పుతాం.. నువ్వు టెన్షన్ పడకని అంటారు. వద్దు తనకి ఇష్టం లేదు.. ఇన్ని రోజులు నా హెల్ప్ తీసుకుంటే అది ప్రేమ అనుకుని భ్రమ పడ్డాను అంతే అని రాజ్ ఎమోషనల్ అవుతాడు. బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు.

ఆ తర్వాత ఇందిరాదేవి, అపర్ణ ఇద్దరు కావ్య దగ్గరకు వచ్చి.. నువ్వు ఏం చేస్తున్నావ్.. అర్ధం అవుతుందా.. ఇన్ని రోజులు ఈ సమయం కోసం వెయిట్ చేసావ్.. తీరా ఇలా చేసావ్ ఎందుకు ఇలా చేసావ్ కారణం ఏంటని కావ్యని అడుగుతుంది ఇందిరాదేవి. ఏం లేదు నా కారణాలు నాకుంటాయని కావ్య అనగానే నువ్వు చెప్పవు ఇప్పుడే రాజ్ దగ్గరికి వెళ్లి గతం గురించి చెప్తానని అపర్ణ వెళ్లిపోతుంటే.. నేను తల్లిని కాబోతున్నానని కావ్య అంటుంది. ఇందిరాదేవి, అపర్ణ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడు ఈ విషయం ఆయనతో ఎలా చెప్పాలి.. నా కడుపులో బిడ్డకి తండ్రి మీరే అని ఎలా చెప్పాలని కావ్య బాధపడుతుంది. నేను ఈ ఇంటికి వారసుడిని ఇవ్వడం నా బాధ్యత.. అందుకే నేను ఆయనకు ఎదురు పడనని కావ్య చెప్తుంది. ఆ తర్వాత రాజ్ నడుచుకుంటూ వెళ్తుంటే వెనకాల నుండి ఏదో వచ్చి డాష్ ఇస్తుంది. మరొకవైపు రాజ్ కోసం యామిని చూస్తుంటుంది.

ఆ తర్వాత కావ్య అందరికి కాఫీ తీసుకొని వస్తుంది. రాజ్ ని కావ్య రిజెక్ట్ చేసిందని కోపంతో ప్రకాష్, సుభాష్, ధాన్యలక్ష్మి కాఫీ తీసుకోకుండా తనతో కోపంగా మాట్లాడుతారు. పాపం దాని పరిస్థితి చుస్తే బాధగా ఉంది అత్తయ్య.. నిజం చెప్పలేక ఎవరు ఎమన్నా పడుతుందని ఇందిరాదేవి, అపర్ణ అనుకుంటారు. అప్పుడే రుద్రాణి వచ్చి.. నీకు రాజ్ అంటే ఇష్టం కదా ఎందుకు వద్దన్నావని అడుగుతుంది. కావ్య కోపంగా అక్కడ నుండి వెళ్తుంది. తరువాయి భాగంలో మా బావ ఎక్కడ నిన్నటి నుండి ఇంటికి రాలేదని కావ్య దగ్గరికి వస్తుంది యామిని. రాజ్ ఎక్కడికి వెళ్ళాడని ఇంట్లో అందరు టెన్షన్ పడతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.