English | Telugu

Divya Remuneration: దివ్య రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

బిగ్ బాస్ సీజన్-9 లో మొదటగా ఒక కామనర్ గా అగ్నిపరీక్షలో ఎంట్రీ ఇచ్చింది దివ్య. అయితే తనయ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వలేకపోయింది. ఇక బిగ్ బాస్ తనని మూడో వారం అగ్నిపరీక్ష కంటెస్టెంట్స్ తో లోపలికి తీసుకొచ్చాడు. అయితే తనని హౌస్ మేట్స్ అంతా వద్దని ఓట్ చేశారు కానీ బిగ్ బాస్ తననే హౌస్ లోకి తీసుకొచ్చాడు.

మూడో వారం నుండి పన్నెండో వారం వరకు దివ్య స్ట్రాంగ్ అండ్ జెన్యున్ కంటెస్టెంట్ గా ఆడియన్స్ దృష్టిలో నిలిచింది. అయితే భరణితో అన్నయ్య అనే బాండింగ్ ని కొనసాగించడమే తన గేమ్ ని స్పాయిల్ చేసింది. భరణి మధ్యలో ఎలిమినేట్ అయి లోపలికి వెళ్ళాడు. అప్పుడు దివ్య మళ్లీ తనతో బాండింగ్ కొనసాగించడం తనని వెనక్కి లాగేసింది. గతవారం ఇమ్మాన్యుయల్ పవరస్త్ర వాడటం వల్లే దివ్య హౌస్ లో ఉంది. అయితే ఈ వారం మాత్రం తను ఎలిమినేషన్ అయి బయటకు వచ్చేసింది.

దివ్య వారానికి లక్ష యాభై వేల చొప్పున రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అంటే తను హౌస్ లో ఉన్న తొమ్మిది వారాలకు గాను పదమూడు లక్షల యాభై వేల నుండి పద్నాలుగు లక్షల వరకు రెమ్యునరేషన్ దివ్య అందుకున్నట్లు తెలుస్తోంది.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.