English | Telugu

'బిగ్ బాస్ 5' ప్రారంభానికి ముహూర్తం పెట్టేశారు!

'చెప్పండి బోర్‌డమ్‌కి గుడ్ బై... వచ్చేస్తుంది బిగ్‌బాస్ సీజన్ ఫైవ్' అంటూ కింగ్ అక్కినేని నాగార్జున బుల్లితెర మీద మరోసారి సందడి చెయ్యడానికి సిద్ధమయ్యారు. మూడోసారి 'బిగ్ బాస్' షోకి హోస్ట్ చెయ్యడానికి ఆయన రెడీగా ఉన్నారు. సెప్టెంబర్ తొలి వారం నుండి 'స్టార్ మా' ఛానల్‌లో షో స్టార్ట్ కానుందనేది తెలిసిన విషయమే. ఇప్పుడు ఏ తేదీ నుండి స్టార్ట్ చేస్తారనేది కూడా వెల్లడించారు.

సెప్టెంబర్ 5న సాయంత్రం 6 గంటలకు ఐదో సీజన్‌ గ్రాండ్‌గా ప్రారంభం కానుంది. ప్రతి సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 10 గంటలకు, శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు షో ప్రసారం కానుంది. ఆల్రెడీ కంటెస్టెంట్లను క్వారంటైన్ చేశారు. హౌస్‌లోకి ఎవరెవరు వెళతారనేది ముందుగా చెప్పే అలవాటు స్టార్ మాకు లేదు. కానీ, కొందరి పేర్లు అయితే కన్ఫర్మ్ అంటున్నారు. అందులో యాంకర్లు రవి, వ‌ర్షిణి, యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్ పేర్లు ఉన్నాయి.

రవి, షణ్ముఖ్ కాకుండా... 'టిక్ టాక్' దుర్గారావు పిలిస్తే వెళతానని అంటున్నారు. ఇంకా ఆర్‌జె కాజల్‌, శ్వేతా వర్మ, సిరి హనుమంతు, లోబో, ట్రాన్స్‏జెండర్ ప్రియాంక, యానీ మాస్టర్, కార్తీక దీపం భాగ్య అలియాస్ ఉమ, నటి లహరి పేర్లు వినిపిస్తున్నాయి. ఎవరెవరు షోకి వెళతారో త్వరలో తెలుస్తుంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.