English | Telugu

Bigg Boss 8 Telugu: నిఖిల్ టీమ్ నుండి బేబక్క అవుట్.. కారణం ఏంటంటే!

బిగ్ బాస్ సీజన్ మొదలై వారం అయ్యింది. ఇక ఒక్కో రోజు కంటెస్టెంట్స్ ఏం చేశారో నాగార్జున నిన్నటి ఎపిసోడ్ లో చెప్పుకొచ్చాడు. మొదటగా హౌస్ లోని కంటెస్టెంట్స్ వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పాడు. ఆ తర్వాత మగ్గురు చీఫ్‌లకి కంగ్రాట్స్ చెప్పి యష్మీకి మాత్రం స్పెషల్ కంగ్రాట్స్ అని నాగార్జున అన్నారు. ఆ తర్వాత ఎప్పటిలా కాకుండా ఈ సీజన్‌లో నాకంటే ముందే శనివారం మీ జడ్జిమెంట్ ఉంటుందంటూ మీకు నచ్చని కంటెస్టెంట్‌కి కత్తి గుచ్చి రీజన్ చెప్పాలని నాగార్జున అన్నాడు.

మొదటగా మణికంఠలో నెగెటివ్ ఎనర్జీ ఉందంటూ శేఖర్ బాషా పొడిచాడు. యష్మీకి నైనిక కత్తి గుచ్చుతూ ఆమె బిహేవియర్ బాలేదంటూ కంప్లెయింట్ ఇచ్చింది. కానీ విచిత్రంగా ఈ విషయంలో యష్మీకి నాగ్ ఫుల్ సపోర్ట్ ఇచ్చాడు. యష్మీ టీమ్ గెలిచింది.. వాళ్ల చేతిలో పవర్ ఉంది..ఎలా కావాలంటే అలా వాడుకుంటారు.. అది తప్పా రైటా అనేది వేరే విషయం.. దీనికే ఇలా అయిపోతే ఎలా? ముందుముందు చాలా ఉంది ఇంకా అంటూ నాగ్ అన్నారు.

ఇక నెక్స్ట్ నినిఖిల్‌కి కత్తి గుచ్చుతూ బేబక్క చాలానే చెప్పింది. తనలో ఒకప్పుడు గొప్ప లీడర్‌ని చూశానని.. కానీ ఇప్పుడు అలా లేడంటూ చెప్పింది. ఇప్పుడు సోనియా సోనియా అంటూ తనకే ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు.. మమ్మల్ని పట్టించుకోవట్లేదు.. అందుకే నాకు ఆయన టీమ్‌లో ఉండాలని లేదంటూ బేబక్క చెప్పింది. దీంతో బేబక్కను నిఖిల్ టీమ్ నుంచి తీసేశారు నాగ్. ఏ టీమ్‌లోకి వెళ్తారనేది బిగ్‌‍బాస్ చెబుతాడంటూ నాగ్ క్లారిటీ ఇచ్చారు. తర్వాత నిఖిల్‌కి కత్తి దింపుతూ మొదట్లో చూసినట్లు లేడంటూ అభయ్ చెప్పాడు.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.