English | Telugu

రాజీ, అను ఒక‌రే అని ఆర్య‌ క‌నిపెట్ట‌గ‌ల‌డా?

కొంత కాలంగా జీ తెలుగులో ప్ర‌సార‌మ‌వుతోన్న పాపుల‌ర్ సీరియ‌ల్స్‌లో ప్రేమ ఎంత మ‌ధురం ఒక‌టి. మ‌హిళా వీక్ష‌కులు ఈ సీరియ‌ల్ కోసం రోజూ ఎదురుచూస్తుంటారు. మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ గా చిత్ర విచిత్ర‌మైన మలుపులు, ట్విస్ట్ ల‌తో సాగుతూ ఆద్యంతం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది ప్రేమ ఎంత మ‌ధురం. విమాన ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌ప‌డిన ఆర్యవ‌ర్ధ‌న్‌ తిరిగి కోలుకుంటాడు. అయితే అనురాధ‌ ఆచూకీ మాత్రం ల‌భించ‌దు. దీంతో అను కోసం ఆర్య అన్వేష‌ణ మొద‌లు పెడ‌తాడు.

చివ‌రికి ఓ చోట అనుని పోలివున్న రాజీ క‌నిపించ‌డంతో త‌నే అను అని ఆర్య మ‌న‌సు ఆరాట‌ప‌డ‌టం మొద‌లుపెడుతుంది. అయితే జెండే మాత్రం త‌ను అను కాద‌ని వాదిస్తూ వుంటాడు. కానీ ఆర్య మాత్రం "త‌ను అనునే అని నా న‌మ్మ‌కం" అని బ‌లంగా వాదిస్తూ వుంటాడు. త‌న గురించి తెలుసుకోవ‌డం మొద‌లు పెడ‌తాడు. త‌న‌కు క‌ళ్లు లేని ఓ అక్క‌, త‌మ్ముడు వున్నారని తెలుస్తుంది. అయినా స‌రే త‌ను అనునే అని నిరూపించ‌డం కోసం ఆర్య ప్ర‌య‌త్నిస్తుంటాడు.

ఇదే స‌మ‌యంలో ఆర్య, జెండేలని క‌లిసిన రాజీ "నాట‌కాలు వేయ‌డానికి వ‌చ్చిన వార‌ని తెలిసింది. డ‌బ్బులిస్తే నేనూ నాట‌కం వేస్తాను "అంటుంది. దీంతో ఇదే స‌రైన అవ‌కాశ‌మ‌ని, అనుకు గ‌తం గుర్తు చేయొచ్చ‌ని ఆర్య భావించి సీతారాముల నాట‌కం వేయ‌డానికి రెడీ అవుతారు. రాజీ.. సీత‌, ఆర్య.. రాముడు, జెండే.. హ‌నుమంతుడుగా గెట‌ప్ లు వేసుకోవాలి. జెండే గెట‌ప్ తో రెడీ అయిపోతాడు. అను కూడా రెడీ అయి వ‌స్తుంది. ఇంత‌లో ఆర్య.. రాముడి గెట‌ప్ లో రావ‌డంతో రాజీ లో మార్పు క‌నిపిస్తుంది. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? క‌థ ఎలాంటి మ‌లుపులు తిరిగింది అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.