English | Telugu

ఆరియానా పతివ్రత స్టాండర్డ్స్ మాములుగా లేవు!

సోషల్ మీడియాలో హాట్ గా హీట్ పుట్టించే భామ ఆరియానా. రకరకాల రీల్స్ చేస్తూ వీడియోస్ ని పోస్ట్ చేస్తూ అందరినీ తన వైపుకు తిప్పుకుంటుంది. ఐతే త్వరలో ప్రేమికుల దినోత్సవం రాబోతోంది. దాంతో ఇక మూవీలో ఉన్న ప్రేమ, పెళ్లి సీన్స్ ని బయటకు తీసి రీల్స్ గా చేసి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ అందాల భామ కూడా అలాంటి ఒక రీల్ చేసిందండోయ్...ఆ డైలాగ్ మావిచిగురు మూవీలో శ్రీలక్ష్మి, బాబు మోహన్, బ్రహ్మానందం మధ్యన జరిగే "నా మనసు నాకు ఇచ్చేయ్ గోపి" అనే మోస్ట్ ఫన్నీ డైలాగ్. ఇక ఈ ముగ్గురి ప్లేస్ లో ఎవరెవరు చేశారో తెలుసా ఆరియానా, ముక్కు అవినాష్ తమ్ముడు అజయ్, రోల్ రైడా.

"గోపి నువ్వు సచ్చావునుకుని ఈ అడ్డగాడిదను చేసుకున్నాను..నేనిప్పుడు వీడి భార్యను... పతివ్రతా స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నాను...మనిషిని వీడి దగ్గర ఉన్నా కానీ మనసు నీ దగ్గర బ్లాక్ ఐపోయింది" అంటూ సినిమాలో శ్రీలక్ష్మి చాలా ఎమోషనల్ గా చెప్పింది. ఇదే డైలాగ్ తో ఆరియానా టీమ్ రీల్ చేసి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఇక నెటిజన్స్ ఐతే ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. "ఇచ్చేయ్ గోపి..ఎందుకు మనకు ఇదంతా...అక్కా సంపేశావ్ ...పతివ్రత స్టాండర్డ్స్ గురించి మీరే చెప్పాలి. సూపర్ గా చేశారు" అంటూ చెప్తున్నారు. ఆరియానా డైరెక్టర్ ఆర్జీవీతో కలిసి చేసిన రచ్చ ఓ రేంజిలో క్రేజ్ ఆమెకు క్రేజ్ తీసుకొచ్చింది. బుల్లితెరపై సందడి చేస్తూనే సినిమాల్లోనూ కనిపిస్తోంది ఈ అమ్మడు.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.