English | Telugu

సౌమ్య రావు అంటే ఫ్లవర్ అనుకుంటిరా ఫైర్...


రీసెంట్ గా న్యూ ఇయర్ సందర్భంగా బుల్లితెర మీద ఒక షో ప్రసారమయ్యింది. అందులో నూకరాజు యాంకర్ సౌమ్య రావు తెలుగు మీద రకరకాల కామెంట్స్ చేసాడు. ఆమెకు తెలుగు రాదనీ చెప్పాడు. దాంతో ఆమె కూడా కొంచెం ఫీల్ అయ్యింది. కన్నడ వాళ్ళను ఇక షోస్ కి పిలవకండి మీ తెలుగు వాళ్లనే పిలుచుకోండి అంటూ పాపం కన్నీళ్లు పెట్టుకున్నంత పని చేసింది. కానీ ఆ ఇన్స్పిరేషన్ తో ఆమె పట్టుబట్టి తెలుగు నేర్చుకున్నట్టు ఉంది. రాబోయే శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో చూస్తే అందులో డైలాగ్స్ చించేసింది.

బులెట్ భాస్కర్ , సౌమ్య స్కిట్ లో ఆమె చెప్పిన డైలాగ్ వైల్డ్ ఫైర్ లా ఉంది. "భారతదేశాన్ని ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్న నీ తలను తెగనరికి కిట్టూర్ లో విజయపతాక ఎగరవేయకపోతే నేను కిట్టూర్ చెన్నమ్మనే కాను..ఇంకోసారి పన్ను అనే పదం నీ నోటి నుంచి వినిపిస్తే నీ నాలుక చీరేస్తా..జాగ్రత్త" అంటూ పేల్చిన డైలాగ్ బాంబుతో స్టేజి మొత్తం షాకైపోయింది. సౌమ్య నేనా ఈ డైలాగ్స్ తెలుగులో చెప్పింది అంటూ ఆశ్చర్యపోయారు. సౌమ్య కన్నడ అమ్మాయి. కన్నడ నుంచి వచ్చి ఇక్కడ తెలుగులో షోస్ చేస్తోంది. జబర్దస్త్ యాంకర్ గా వచ్చినప్పుడు ఆమెను అందరూ కూడా చాలా ఎగతాళిగా ఆమె తెలుగును కామెంట్ చేశారు. కానీ అందరినీ ఓడించి తెలుగులో ఇప్పుడు చెప్పిన డైలాగ్ తో అందరినీ ఫిదా చేసేసింది. సౌమ్య అంటే ఫ్లవర్ అనుకుంటివా కాదు వైల్డ్ ఫైర్ అన్న రేంజ్ లో ఆ పవర్ ఫుల్ ఎక్స్ప్రెషన్స్ తో ఈ డైలాగ్స్ చెప్పి భేష్ అనిపించుకుంది.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.