English | Telugu

'అంతఃపురం'లో పాటొస్తే సాయికుమార్ భార్యకు కోపం ఎందుకంటే?

'అసలేం గుర్తుకు రాదు... నా కన్నుల ముందు నువ్వు ఉండగా' - కృష్ణవంశీ దర్శకత్వం వహించిన 'అంతఃపురం' సినిమాలో ఈ పాట సూపర్ హిట్. దానిని సాయికుమార్, సౌందర్యపై తెరకెక్కించారు. టీవీల్లో ఈ పాట వచ్చినప్పుడల్లా సాయికుమార్ భార్య సురేఖకు కోపం వస్తుంది. ఇదే విషయం డైలాగ్ కింగ్ ఎప్పుడూ కుటుంబ సభ్యులతో చెబుతుంటారట. ఎందుకు అంటే? 'అసలేం గుర్తుకు రాదు' పాట వచ్చిన ప్రతిసారీ తనను డాన్స్ చేయమని సాయికుమార్ అడుగుతుండటంతో కోపం వస్తుందని సురేఖ చెప్పారు. సాయికుమార్ 60వ పుట్టినరోజు సందర్భంగా 'వావ్' షోకు ఫ్యామిలీ మెంబర్స్ గెస్టులుగా వచ్చారు. అప్పుడు ఈ సంగతి సురేఖ బయటపెట్టారు.

సాయికుమార్ జీవితంలో జరిగిన ఓ సంఘటనను 'బొమ్మాళీ' రవిశంకర్ గుర్తు చేసుకున్నారు. చిన్నతనంలో తల్లి వేడినీళ్లు పోయడంతో సాయికుమార్ చెయ్యి పక్షవాతం వచ్చిన వ్యక్తి చేతిలా అయ్యిందట. అప్పుడు ఒక డాక్టర్ క్రికెట్ ఆడమని చెప్పడంతో ఆడారట. బౌలింగ్ చేయడంతో మళ్ళీ సరి అయ్యిందట. ఇంకా సాయికుమార్ ఫ్యామిలీలో పలు సంగతులను 'వావ్' షోలో ఆయన కుటుంబ సభ్యులు పంచుకున్నారు. తమ్ముళ్లు, చెల్లెళ్లు, పిల్లలు అందరూ షోకు వచ్చారు. ఆది సాయికుమార్ భార్య అరుణతో 'కోడలు అయిన తర్వాత భయం అన్నది పోవాలి' అని సాయికుమార్ అనడంతో ఆమె నవ్వేసింది.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.