English | Telugu

 `గుప్పెడంత మ‌న‌సు`: రాత్రి వ‌సు, రిషి ల మ‌ధ్య ఏం జ‌రిగింది?

రిషి, వసుల చిలిపి త‌గాదాలు, గిల్లిక‌జ్జాల‌ నేప‌థ్యంలో సాగుతున్న సీరియ‌ల్ `గుప్పెడంత మ‌న‌సు`. గ‌త కొన్ని వారాలుగా విజ‌య‌వంతంగా సాగుతూ ఆక‌ట్టుకుంటున్న ఈ సీరియ‌ల్ ఈ శ‌నివారంలో 303వ ఎపిసోడ్‌లోకి ఎంట‌ర్ కాబోతోంది. ఈ నేప‌థ్యంలో స‌లు ఆస‌క్తిక‌ర స‌న్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి. ఈ రోజు హైలైట్స్ ఏంటో ఒక‌సారి లుక్కేద్దాం.

వ‌సు, మ‌హీంద్ర రెస్టారెంట్‌లో క‌లుద్దామ‌ని అనుకున్న విష‌యం తెలుసుకున్న రిషి చాలా కాలంగా ద్వేషిస్తున్న జ‌గ‌తి కారులోనే రెస్టారెంట్‌కి బ‌య‌లుదేర‌తాడు. కార్ డ్రైవ్ చేస్తూ రిషి.. వ‌సు ఫ్యూచ‌ర్ ప్లాన్స్ ఏంట‌ని జ‌గ‌తిని అడుగుతాడు. అప్పుడు జ‌గ‌తి .. వ‌సు ఏదంటే అదే ..దానికి నేను హెల్ప్ చేస్తాను అంతే` అంటుంది. వెంట‌నే నాకు వ‌సు కావాలి మేడ‌మ్ `అంటాడు రిషి. ఆ మాట‌లు విన్న జ‌గ‌తి షాక్‌కు లోన‌వుతుంది.

మాట మార్చిన రిషి మ‌న కాలేజీలో ఫ్యాక‌ల్టీ హెడ్‌గా వ‌సు కావాలంటాడు. అయితే నేను చెప్ప‌గ‌ల‌ను కానీ ఒప్పించ‌లేను క‌దా సార్ `అంటుంది జ‌గ‌తి. అడ‌గ‌డం అయితే మీరెందుకు త‌న‌ని ఒప్పించ‌మ‌ని మీకు బాధ్య‌త ఇస్తున్నాను` అంటాడు రిషి. ఇలా వీరి సంభాష‌ణ జ‌రుగుతుండ‌గానే కార్ ఆగుతుంది. క‌ట్ చేస్తే... రాత్రి కాలేజీలో రిషి బాస్కెట్ బాల్ ఆడుతుంటాడు. అదే స‌మ‌యానికి వ‌సు అక్క‌డికి వ‌స్తుంది. త‌న‌ని చూసి ఇదేంటి ఇలా వ‌చ్చావ్‌? ` అంటాడు రిషి. అనుకోకుండా వ‌చ్చాను సార్ అంటుంది వ‌సు.. వెంట‌నే `నీకు బాస్కెట్ బాల్ ఆడ‌టం వ‌చ్చా? అంటాడు రిషి. రాదు రాదు అంటూనే రిషితో క‌లిసి వ‌సు బాస్కెట్ బాల్ ఆడుతుంది. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.

Podharillu : పోలీస్ స్టేషన్లో చక్రి, మహా.. భూషణ్ ఏం చేయనున్నాడు!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -26 లో..... చక్రి, మహా ఇద్దరు కార్లో వెళ్తుంటే వాళ్ళని ఫాలో చేస్తూ మహా వాళ్ళ నాన్న ప్రతాప్ అతడి కొడుకు ఆది వెళ్తారు. వారితో పాటుగా మహాని పెళ్ళి చేసుకోవాలనుకునే భూషణ్ మరోచైపు ఫాలో చేస్తుంటారు. అయితే ఒక దగ్గర చక్రి , మహా వాళ్ళు దొరికిపోతారు. ఇక మహా వాళ్ళ నాన్న ప్రతాప్.. మహాని రమ్మని చెప్పగా.. ఆ జుట్టోడితో నా పెళ్ళి వద్దు అందుకే పారిపోతున్నానని మహా అంటుంది. చక్రిని చంపేసి నా కూతురిని తీసుకురమ్మని ప్రతాప్ అంటాడు. అప్పుడే వారి మధ్యలోకి బాలు కారులో వేగంగా వచ్చి ఆగుతాడు.