English | Telugu

Jayam serial: ఫుడ్ ఫెస్టివల్ కి రుద్ర.. రానని చెప్పేసిన గంగ!

జీ తెలుగు లో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -143 లో..... గంగని తీసుకొని రమ్మని ఇంట్లో డిస్కషన్ చేస్తుంటారు. వద్దని శకుంతల అంటుంది. తీసుకొని వస్తానని పెద్దసారు అంటాడు. ఎక్కడ డిస్కషన్ పెద్దగా అయి గంగని తీసుకొని వస్తారోనని వీరు టాపిక్ డైవర్ట్ చేస్తాడు. ఫుడ్ ఫెస్టివల్ కి మనం వెళ్ళాలి అని అంటాడు. నేను అదే అందామని అనుకుంటున్నానని రుద్ర అంటాడు. సరే నువ్వు దాని గురించి చూసుకోమని వీరుకి రుద్ర చెప్తాడు.

ఆ తర్వాత ఫుడ్ ఫెస్టివల్ కి సంబంధించినది నువ్వు చూసుకోమని రుద్రతో పెద్దసారు అంటాడు. సరే అని రుద్ర అంటాడు. అదేంటి వీరు చూసుకుంటానని అన్నాడు కదా అని శకుంతల అనగానే.. ఎవరు చూసుకుంటే ఏంటి.. కావాలంటే రుద్రకి అసిస్టెంట్ గా వీరు ఉంటాడని పెద్దసారు అంటాడు. ప్రీతీ మనం గంగ దగ్గరికి వెళ్దామని పెద్దసారు అంటాడు. ఆ తర్వాత ప్రీతీ, ప్రమీల, పెద్దసారు ముగ్గురు కలిసి గంగ దగ్గరికి వెళ్తారు. గంగని రమ్మని రిక్వెస్ట్ చేస్తారు. నేను రాను నేను ఏ తప్పు చెయ్యలేదు.. అది ఆయన నమ్మి, నన్ను తీసుకొని వెళ్ళాలని గంగ వాళ్ళని తిరిగి పంపిస్తుంది. ఆ తర్వాత గంగ తన తల్లికి వైద్యం చేయించడం కోసం డబ్బులు కోసం పని చూసుకుంటుంది. తను గతం లో చేసిన సిలిండర్ డెలివరీ చేసిన దగ్గరికి వెళ్లి పని కావాలని అడుగుతుంది. నువ్వు పెద్దింటి కోడలివి.. నువ్వు నా దగ్గర పని చేస్తే నాకు మాట వస్తుందని అతను అంటాడు. అప్పడే శ్రీను వచ్చి గంగని తీసుకొని వెళ్తాడు.

ఆ తర్వాత పెద్దసారు కోపంగా ఇంటికి వస్తాడు. ఏమైందని శకుంతల అడుగగా.. గంగ ఇంటికి రానని చెప్పిందని ప్రీతీ చెప్తుంది. ఆ తర్వాత పెద్దసారు, రుద్ర దగ్గరికి వెళ్తాడు. నువ్వు గంగని తీసుకొనిరా.. తనేం తప్పు చెయ్యలేదని పెద్దసారు కోప్పడుతాడు. నేను తీసుకొని వస్తాను కానీ నేను ఈ ఇంట్లో ఉండనని రుద్ర అనగానే అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2: వైరాతో జ్యోత్స్న డీలింగ్.. కార్తీక్ కి డౌట్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -544 లో.....శౌర్యకి దీప భోజనం తినిపిస్తుంది. అది చూసి కొడుకు కోడలితో చెల్లి మాట్లాడుతలేనట్లు ఉందని అనసూయ అంటుంది. వాళ్లే దాక్కొని తిరుగుతున్నారని కాంచన అంటుంది. శౌర్య వెంట భోజనం తినమని దీప పరుగెడుతుంది. శౌర్య అలా అమ్మని పరిగెత్తించవచ్చా.. ఇప్పుడు అమ్మ కడుపులో బేబీ ఉంది కదా తనకి ఆయాసం వస్తుంది ఇకనుండి నువ్వే భోజనం చెయ్యాలని కాంచన అనగానే.. నువ్వు మంచి నానమ్మవి కాదు నిన్ను తాతయ్య దగ్గరికి పంపించాలి.. మా అమ్మ నాకు తినిపించకుండా చేస్తున్నావని శౌర్య అంటుంది.

Illu illalu pillalu: ఇంగ్లీష్ టీచర్ గా శ్రీవల్లి.. ప్రేమ, నర్మద ప్లాన్ సూపర్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu ). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -345 లో... భాగ్యం, ఆనందరావు ఇద్దరు రామరాజు ఇంటికి శ్రీవల్లి డూప్లికేట్ సర్టిఫికేట్లు తీసుకొని వస్తారు. అవి ప్రేమ చూసి డూప్లికేట్ సర్టిఫికేట్లు అని చెప్పదు. ఇంకేంటి మావయ్య మీరు మీకు తెలిసిన కాలేజీ ప్రిన్సిపల్ కి ఫోన్ చెయ్యండి.. అక్క  ఇంగ్లీష్ టీచర్ గా జాయిన్ చెయ్యండి అని ప్రేమ అంటుంది. రామరాజు ఫోన్ చేస్తుంటే కావాలనే శ్రీవల్లి తుమ్ముతుంది. ఇప్పుడే వద్దు మావయ్య అంటుంది. అయినా రామరాజు వినకుండా ఫోన్ చేసి ప్రిన్సిపల్ తో మాట్లాడతాడు.