English | Telugu

Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.

మన డిజైన్స్ దొంగతనం చేస్తాడా అని రాజ్ కోప్పడతాడు.‌ ఏవండి ప్లీజ్ ఆగండి.. తర్వాత మాట్లాడుకుందామని కావ్య సర్దిచెప్పుతుంది. ఈ అవార్డు రాజ్ చేతుల మీదుగా తీసుకోవాలని ఉందని రాహుల్ అంటాడు. ఇక తప్పక రాజ్ వెళ్లి అవార్డు ఇస్తాడు. మరొకవైపు అప్పు గదిలో ఉంది అనుకోని ధాన్యలక్ష్మి భోజనం తీసుకొని వస్తుంది. ప్రకాష్ బెడ్ పై పడుకొని ఉంటాడు. అది చూసి హమ్మయ్య అప్పు వచ్చింది అని కళ్యాణ్ అనుకుని అమ్మ నేను అప్పుకి భోజనం ఇస్తాను. నువ్వు వెళ్ళు అని చెప్పగానే ధాన్యలక్ష్మి వెళ్తుంది. పొట్టి ఎప్పుడు వచ్చావని అప్పు అనుకుని ప్రకాష్ తో మాట్లాడుతాడు కళ్యాణ్. ప్రకాష్ మొహం చూసి కళ్యాణ్ షాక్ అవుతాడు.

మరొకవైపు ఇంత మోసం చేస్తాడా వాడి సంగతి చెప్తానని రాజ్ కోపంగా ఉంటాడు. అప్పుడే స్వప్న వచ్చి చాలా థాంక్స్ రాజ్.. నీ వల్లే రాహుల్ ఇదంతా చేసాడు ఈ గౌరవం దక్కింది అంటే దానికి కారణం నువ్వే అని స్వప్న అనగానే రాజ్ సైలెంట్ గా ఉంటాడు. తరువాయి భాగంలో డిజైన్స్ ఎవరు రాహుల్ కి చేరవేశారని రాజ్, కావ్య ఎంప్లాయిస్ ని అడుగుతారు. అది జరిగిపోయింది కానీ ఇప్పుడు ఈ డిజైన్స్ చాలా సీక్రెట్ ఎవరికీ తెలియొద్దని చెప్తారు. అది రాహుల్ మనిషి విని డిజైన్స్ తీసుకోబోతుంటే రాజ్, కావ్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2: వైరాతో జ్యోత్స్న డీలింగ్.. కార్తీక్ కి డౌట్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -544 లో.....శౌర్యకి దీప భోజనం తినిపిస్తుంది. అది చూసి కొడుకు కోడలితో చెల్లి మాట్లాడుతలేనట్లు ఉందని అనసూయ అంటుంది. వాళ్లే దాక్కొని తిరుగుతున్నారని కాంచన అంటుంది. శౌర్య వెంట భోజనం తినమని దీప పరుగెడుతుంది. శౌర్య అలా అమ్మని పరిగెత్తించవచ్చా.. ఇప్పుడు అమ్మ కడుపులో బేబీ ఉంది కదా తనకి ఆయాసం వస్తుంది ఇకనుండి నువ్వే భోజనం చెయ్యాలని కాంచన అనగానే.. నువ్వు మంచి నానమ్మవి కాదు నిన్ను తాతయ్య దగ్గరికి పంపించాలి.. మా అమ్మ నాకు తినిపించకుండా చేస్తున్నావని శౌర్య అంటుంది.

Illu illalu pillalu: ఇంగ్లీష్ టీచర్ గా శ్రీవల్లి.. ప్రేమ, నర్మద ప్లాన్ సూపర్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu ). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -345 లో... భాగ్యం, ఆనందరావు ఇద్దరు రామరాజు ఇంటికి శ్రీవల్లి డూప్లికేట్ సర్టిఫికేట్లు తీసుకొని వస్తారు. అవి ప్రేమ చూసి డూప్లికేట్ సర్టిఫికేట్లు అని చెప్పదు. ఇంకేంటి మావయ్య మీరు మీకు తెలిసిన కాలేజీ ప్రిన్సిపల్ కి ఫోన్ చెయ్యండి.. అక్క  ఇంగ్లీష్ టీచర్ గా జాయిన్ చెయ్యండి అని ప్రేమ అంటుంది. రామరాజు ఫోన్ చేస్తుంటే కావాలనే శ్రీవల్లి తుమ్ముతుంది. ఇప్పుడే వద్దు మావయ్య అంటుంది. అయినా రామరాజు వినకుండా ఫోన్ చేసి ప్రిన్సిపల్ తో మాట్లాడతాడు.