English | Telugu

వేద ప్రెగ్నెంట్ అన్న డాక్ట‌ర్‌.. షాక్ లో య‌ష్‌!

నిరంజ‌న్‌, డెబ్జాని మోడ‌క్ ప్ర‌ధాన జంట‌గా న‌టించిన రొమాంటిక్ ఫ్యామిలీ సీరియ‌ల్‌ `ఎన్నెన్నో జ‌న్మ‌ల బంధం`. స్టార్ ప్ల‌స్‌లో సూప‌ర్ హిట్ గా నిలిచిన `యే హై మొహ‌బ్బ‌తే` ఆధారంగా ఈ సీరియ‌ల్ ని తెలుగులో రీమేక్ చేశారు. గ‌త కొన్ని వారాలుగా బుల్లితెర ప్రేక్ష‌కుల్ని, ప్ర‌ధానంగా మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. ఇందులోని ఇత‌ర పాత్ర‌ల్లో మిన్ను నైనిక‌, బెంగ‌ళూరు ప‌ద్మ‌, జీడిగుంట శ్రీ‌ధ‌ర్‌, ప్ర‌ణ‌య్ హ‌నుమండ్ల‌, ఆనంద్‌, సుమిత్ర‌, రాజా శ్రీ‌ధ‌ర్ త‌దిత‌రులు న‌టించారు.

గ‌తంలో టెండ‌ర్ విష‌యంలో త‌న‌కు అండ‌గా నిలిచి రూ. 60 కోట్లు న‌ష్ట‌పోకుండా చేసిన వేద‌ని అర్థం చేసుకోకుండా ఇబ్బంది పెట్టాన‌ని య‌ష్ ఫీల‌వుతుంటాడు. త‌న‌కు ఎలాగైనా సారీ చెప్పాల‌నుకుంటాడు. అది ఎలా చెప్పాలా అని ఆలోచించి బెడ్ పై పూల‌తో సారీ అని రాసి వేద‌ని ఏదో ప‌ని వుంద‌న్న‌ట్టుగా పిలుస్తాడు య‌ష్‌. కానీ గ‌దిలోకి వ‌చ్చిన వేద బెడ్ పై య‌ష్ రాసిన అక్ష‌రాలని చూడ‌కుండా వెళ్లిపోతుంది. మ‌రో సారి ఫైల్స్ క‌నిపించ‌డం లేద‌ని పిలుస్తాడు. అదే స‌మ‌యంలో వేద పెంచుకుంటున్న కుక్క పిల్ల బెడ్ పైకి చేరి య‌ష్ పూల‌తో రాసిన 'సారీ'ని చెరిపేస్తుంది.

దీంతో ఇక్క‌డ పూలు ఎవ‌రు చ‌ల్లార‌ని, వాటిని వెంట‌నే క్లీన్ చేయ‌మ‌ని య‌ష్ కు చెబుతుంది. దీంతో య‌ష్ 'ఇంత ప్ర‌య‌త్నించినా వేద గుర్తించ‌డం లేదేంటీ?' అని ఫీల‌వుతాడు. ఇదే స‌మ‌యంలో అంతా ఏదో ఫంక్ష‌న్ కి బ‌య‌టికి వెళ్లిపోతుంటారు. చివ‌ర్లో వేద‌, య‌ష్‌, ఖుషీ మాత్ర‌మే వుంటారు. వేద రెడీ అయితే వెళ‌దామ‌ని తొంద‌ర పెడ‌తాడు య‌ష్‌. తొంద‌ర పెడితే కుద‌ర‌ద‌ని చెబుతుంది వేద‌. దీంతో నిదానంగా రెడీ అయి ర‌మ్మ‌ని ఖుషీని తీసుకుని కింద వెయిట్ చేస్తుంటానని వెళ‌తాడు య‌ష్‌..

ఇదే స‌మ‌యంలో వేద బ‌ట్ట‌లు మార్చుకుని రెడీ అవుతుంటే త‌న‌పై క‌న్నేసిన‌ య‌ష్ బావ కైలాష్ చాటుగా వేద‌ని చూస్తూ వుంటాడు. అది వేద అద్దంలోంచి గ‌మ‌నించి షాక్ కు గుర‌వుతుంది. క‌ట్ చేస్తే.. అంతా ఫంక్ష‌న్ నుంచి ఇంటికి తిరిగి వ‌స్తారు. వేద క‌ళ్లు తిరిగి ప‌డిపోతుంది. ప‌రీక్షించిన డాక్ట‌ర్ వేద ప్రెగ్నెంట్ కావ‌చ్చ‌ని చెబుతుంది. దీంతో య‌ష్ షాక్ కు గుర‌వుతాడు. అస‌లు ఏం జ‌రిగింది? .. ఏం జ‌ర‌గ‌బోతోంది? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.