English | Telugu

గాయ‌త్రీదేవి ఆత్మ న‌య‌నికి చెప్పిన అద్దం ర‌హ‌స్యం!

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ 'త్రిన‌య‌ని'. త‌ల్లి హ‌త్య వెన‌కున్న ర‌హ‌స్యం తెలియ‌ని ఓ కొడుకు.. ఆ కొడుకు కోసం త‌పించే త‌ల్లి ఆత్మ‌.. జ‌ర‌గ‌బోయేది ముందే తెలిసే ఓ యువ‌తి పాత్ర‌ల నేప‌థ్యంలో సాగే ఆస‌క్తిక‌ర‌మైన కథే ఈ సీరియ‌ల్. గ‌త కొన్ని వారాలుగా మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటూ విజ‌య‌వంతంగా ప్ర‌సారం అవుతోంది. బెంగాలీ సీరియ‌ల్ ఆధారంగా దీన్ని తెలుగులో రీమేక్ చేశారు. ప్ర‌ధాన జంట‌గా అషికా గోపాల్‌, చందూ గౌడ న‌టించారు. ఇత‌ర పాత్ర‌ల్లో ప‌విత్ర జ‌య‌రామ్‌, నిహారిక హ‌ర్షు, విష్ణు ప్రియ‌, శ్రీ‌స‌త్య‌, భావ‌నా రెడ్డి, సురేష్ చంద్ర‌, అనిల్ చౌద‌రి, ద్వార‌కేష్ నాయుడు త‌దిత‌రులు న‌టించారు.

తిలొత్త‌మ అనుభ‌విస్తున్న ఆస్తి విశాల్ కే ద‌క్కాలని గాయ‌త్రీ దేవి తండ్రి పుండ‌రీనాథం త‌ను రాసిన వీలునామాలో ఓ ర‌హ‌స్య స‌మాచారాన్ని పొందుపరుస్తాడు. అందులోని ఓ కాగితంలో బాబుని ఎత్తుకుని వున్న ఓ యువ‌తి చంద‌మామ‌ను చూపిస్తూ వుంటుంది. అందులో వున్న ర‌హ‌స్యాన్ని న‌య‌ని కోసం వ‌చ్చిన గాయ‌త్రీ దేవి ఆత్మ వివ‌రిస్తుంది. పున్న‌మి రోజు రాత్రి ప్ర‌కాశించే చంద‌మామ వెలుగులో మా నాన్న‌గారు గీసిన చిత్రాన్ని పెట్టి అద్దంలో చూస్తే నీకు అస‌లు ర‌హ‌స్యం ఏంటో అర్థ‌మ‌వుతుంద‌ని చెబుతుంది. ఆ మాట‌ల‌కు 'అద్దంలో చూడాలా?' అంటుంది న‌య‌ని. 'అవును' అని తిలోత్త‌మ ఇంట్లో వున్న పెద్ద అద్దాన్ని తీసుకొచ్చి అందులో చూడాల‌ని గాయ‌త్రీదేవి ఆత్మ చెబుతుంది.

ఆ ఇంట్లో త‌న వ‌ద్ద వున్న అద్దాన్ని తిలోత్త‌మ అత్త‌య్య ఇవ్వ‌దు.. ఇప్పుడు ఎలా అమ్మ‌గారు అని అమాయ‌కంగా అడుగుతుంది న‌య‌ని.. దీనికో మాస్ట‌ర్ ప్లాన్ చెబుతుంది. దీంతో మారువేషాల్లో అద్దం కోసం విశాల్ , న‌య‌ని రంగంలోకి దిగుతారు. తిలోత్త‌మ క‌ళ్లుగ‌ప్పి గాయ‌త్రీదేవి చెప్పిన అద్దాన్ని పెద్దింట్లోంచి సేఫ్ గా తీసుకురాగ‌లిగారా?.. దీనికి క‌సి, వ‌ల్ల‌భ ఎలాంటి అడ్డంకుల్ని సృష్టించార‌న్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.