English | Telugu

సుదీప్ మూవీ లో సాంగ్ పాడుతున్న...ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సింగర్

తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 లో దర్శన్ అనే కంటెస్టెంట్ స్పెషల్ గా తన టాలెంట్ ఆఫ్ సింగింగ్ తో అలాగే చక్కగా తెలుగు నేర్చుకుని జడ్జెస్ ని ఇంప్రెస్ చేస్తూ ఉన్నాడు. ఈ షో నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో దర్శన్ ఒక అద్భుతమైన సాంగ్ పాడి జడ్జెస్ అందరినీ మెప్పించాడు. "నేను నా నెక్స్ట్ ఫిలింని సుదీప్ తో అలాగే సంతోష్ ఆనంద్ రామ్ తో కలిసి పని చేస్తున్నాను. ఆ మూవీలో నువ్వు ఒక సాంగ్ పాడాలి. అలాగే నువ్వు పాడే పాత రికార్డింగ్ సెషన్ కి విజయ్ ప్రకాష్ ని కూడా పిలుస్తాను" అంటూ థమన్ ఒక బిగ్ ఆఫర్ ని దర్శన్ కి ఇచ్చేసరికి అతని ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

ఇక లాస్ట్ వీక్ ఐతే సహస్ర అనే కంటెస్టెంట్ "జరగండి జరగండి" అనే సాంగ్ ని హైపిచ్ లో జడ్జెస్ ని మెప్పిస్తూ అద్భుతంగా పాడింది. దాంతో థమన్ ఫిదా ఐపోయాడు. "నువ్వు పాడిన ఈ పాటతో నేను సునిధి చౌహన్ ని, దలేర్ మెహందీ అందరినీ మర్చిపోయాను. నీ వాయిస్ మాత్రమే మోతమోగుతోంది. సో నా స్టూడియోకి వచ్చేయి. ఈ సాంగ్ మీద ఒక కవర్ సాంగ్ చేద్దాం" అంటూ ఆమెకు ఆఫర్ ఇచ్చారు థమన్. ఇలా ప్రతీ సీజన్ లో జడ్జెస్ వాళ్ళు చేసే మూవీస్ లో కానీ అలాగే స్టేజి షోస్ లోకి ఇలాంటి కంటెస్టెంట్స్ కి అవకాశం కల్పిస్తూ వాళ్ళను వాళ్ళు ప్రూవ్ చేసుకునేలా సపోర్ట్ చేస్తున్నారు.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.