English | Telugu

లవ్ చేసిన వాళ్ళనే నటరాజ్ మాస్టర్ హర్ట్ చేస్తారు

బిగ్ బాస్ నాన్ స్టాప్ నాలుగో వారం పూర్తి చేసుకుంది. నాలుగో వారం ఊహించినట్లుగానే సరయు ఎలిమినేట్ అయింది. బిగ్ బాస్ ఐదో సీజన్ లో మొదటి వారమే ఎలిమినేట్ అయిన సరయు.. బిగ్ బాస్ ఓటీటీలోకి అడుగు పెట్టింది. దీనిలో కూడా ఆమె మొదటి వారమే ఎలిమినేట్ అవుతుందని ప్రచారం జరగగా.. చివరికి ఆమె నాలుగో వారం ఎలిమినేట్ అయింది.

17 మంది కంటెస్టెంట్స్ తో ప్రారంభమైన నాన్ స్టాప్ నుంచి మొదటి వారం ముమైత్ ఖాన్, రెండో వారం శ్రీరపాక, మూడో వారం ఆర్జే చైతు ఎలిమినేట్ కాగా.. నాలుగో వారం సరయు బయటకు వచ్చేసింది. సరయు వెళ్లడంతో ప్రస్తుతం హౌస్ లో 13 మంది కంటెస్టెంట్స్ మిగిలారు.

ఇదిలా ఉంటే ఎలిమినేషన్ తరువాత స్టేజ్ మీద తేజస్వీ, అరియనా, నటరాజ్ మాస్టర్‌ లకు సరయు చురకలంటించింది. తేజు స్క్రీన్ స్పేస్ కోసం చూస్తున్నట్టు అనిపిస్తుందని కౌంటర్ వేసింది. అరియానా మాటలు అని కనీసం రిగ్రెట్ కూడా కాదని కామెంట్ చేసింది. నటరాజ్ మాస్టర్ అయితే ఆయనకు సపోర్ట్ చేసిన వారినే బాధపెడుతుంటారు, ఎవరు ఎక్కువ లవ్ చేస్తారో వాళ్లనే వాళ్లనే హర్ట్ చేస్తారు అని చెప్పుకొచ్చింది. హమీదా, మహేష్ తనకి ఎంతో అండగా ఉన్నారని.. అఖిల్ కూడా సపోర్ట్ చేశాడని కానీ అతను గుంపు నుంచి బయటకు రావాలని సరయు చురకవేసింది.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.