English | Telugu

డబుల్ ఎలిమినేషన్ లో కొత్త ట్విస్ట్ .. పృథ్వీ ఇంటికేనా!


బిగ్ బాస్ సీజన్-8 లో పదో వారం ముగింపుకి వచ్చేసింది. హౌస్ లో ప్రస్తుతం పన్నెండు మంది ఉన్నారు. ఇప్పటికే పది మంది హౌస్ నుండి ఎలిమినేట్ అయి బయటకూ వచ్చారు. ఇప్పటి వరకు ఒక కిర్రాక్ సీత, శేఖర్ బాషా ఎలిమినేషన్ ఆన్ ఫెయిర్ తప్ప మిగతావన్ని ఎలిమినేషన్ ఫెయిర్ అనే చెప్పాలి‌ ఇంకా గ్రాండ్ ఫినాలే కి అయిదు వారాలున్నాయి. హౌస్ లో పన్నెండు మంది ఉన్నారు. అయితే ఈసారి బిగ్ బాస్ భారీ ట్విస్ట్ ఇవ్వబోతున్నాడన్న వార్తలు వినిపిస్తున్నాయి.

హౌస్ లో ఉన్నవాళ్లంతా దాదాపు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అయితే బిగ్ బాస్ డబల్ ఎలిమినేషన్ ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. అదే జరిగితే శనివారం ఎపిసోడ్ లో ఒకరు.. ఆదివారం ఎపిసోడ్ లో మరికరిని పంపించే ఛాన్స్ ఉంది. ఓటింగ్ లో గత వారం కంటే ఈ వారం భారీ మార్పులు వచ్చాయి. ఫస్ట్ లో ఉన్నవాళ్లు లాస్ట్ కి లాస్ట్ లో ఉన్నవాళ్లు ఫస్ట్ కి వచ్చారు. గౌతమ్ మణికంఠ స్థానంలో బయటకు వెళ్ళేవాడు. మణికంఠ సెల్ఫ్ నామినేటే అవ్వడం తో గౌతమ్ సేవ్ అయ్యాడు.

అయితే ఇప్పుడు గౌతమ్ ఓటింగ్ లో రెండవ స్థానం లో ఉన్నాడు. చివరగా రెండు స్థానాలలో యష్మీ, హరితేజ ఉన్నారు. కానీ బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చి ఇద్దరు ఫీమేల్ కంటెస్టెంట్ ని కాకుండా ఒక మేల్ కంటెస్టెంట్ ని బయటకు పంపించే ఛాన్స్ లేకపోలేదు. అలా అయితే పృథ్వీ బయటకు వచ్చే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.

Podharillu : పోలీస్ స్టేషన్లో చక్రి, మహా.. భూషణ్ ఏం చేయనున్నాడు!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -26 లో..... చక్రి, మహా ఇద్దరు కార్లో వెళ్తుంటే వాళ్ళని ఫాలో చేస్తూ మహా వాళ్ళ నాన్న ప్రతాప్ అతడి కొడుకు ఆది వెళ్తారు. వారితో పాటుగా మహాని పెళ్ళి చేసుకోవాలనుకునే భూషణ్ మరోచైపు ఫాలో చేస్తుంటారు. అయితే ఒక దగ్గర చక్రి , మహా వాళ్ళు దొరికిపోతారు. ఇక మహా వాళ్ళ నాన్న ప్రతాప్.. మహాని రమ్మని చెప్పగా.. ఆ జుట్టోడితో నా పెళ్ళి వద్దు అందుకే పారిపోతున్నానని మహా అంటుంది. చక్రిని చంపేసి నా కూతురిని తీసుకురమ్మని ప్రతాప్ అంటాడు. అప్పుడే వారి మధ్యలోకి బాలు కారులో వేగంగా వచ్చి ఆగుతాడు.