English | Telugu

డబుల్ ఎలిమినేషన్ లో కొత్త ట్విస్ట్ .. పృథ్వీ ఇంటికేనా!


బిగ్ బాస్ సీజన్-8 లో పదో వారం ముగింపుకి వచ్చేసింది. హౌస్ లో ప్రస్తుతం పన్నెండు మంది ఉన్నారు. ఇప్పటికే పది మంది హౌస్ నుండి ఎలిమినేట్ అయి బయటకూ వచ్చారు. ఇప్పటి వరకు ఒక కిర్రాక్ సీత, శేఖర్ బాషా ఎలిమినేషన్ ఆన్ ఫెయిర్ తప్ప మిగతావన్ని ఎలిమినేషన్ ఫెయిర్ అనే చెప్పాలి‌ ఇంకా గ్రాండ్ ఫినాలే కి అయిదు వారాలున్నాయి. హౌస్ లో పన్నెండు మంది ఉన్నారు. అయితే ఈసారి బిగ్ బాస్ భారీ ట్విస్ట్ ఇవ్వబోతున్నాడన్న వార్తలు వినిపిస్తున్నాయి.

హౌస్ లో ఉన్నవాళ్లంతా దాదాపు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అయితే బిగ్ బాస్ డబల్ ఎలిమినేషన్ ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. అదే జరిగితే శనివారం ఎపిసోడ్ లో ఒకరు.. ఆదివారం ఎపిసోడ్ లో మరికరిని పంపించే ఛాన్స్ ఉంది. ఓటింగ్ లో గత వారం కంటే ఈ వారం భారీ మార్పులు వచ్చాయి. ఫస్ట్ లో ఉన్నవాళ్లు లాస్ట్ కి లాస్ట్ లో ఉన్నవాళ్లు ఫస్ట్ కి వచ్చారు. గౌతమ్ మణికంఠ స్థానంలో బయటకు వెళ్ళేవాడు. మణికంఠ సెల్ఫ్ నామినేటే అవ్వడం తో గౌతమ్ సేవ్ అయ్యాడు.

అయితే ఇప్పుడు గౌతమ్ ఓటింగ్ లో రెండవ స్థానం లో ఉన్నాడు. చివరగా రెండు స్థానాలలో యష్మీ, హరితేజ ఉన్నారు. కానీ బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చి ఇద్దరు ఫీమేల్ కంటెస్టెంట్ ని కాకుండా ఒక మేల్ కంటెస్టెంట్ ని బయటకు పంపించే ఛాన్స్ లేకపోలేదు. అలా అయితే పృథ్వీ బయటకు వచ్చే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి.

Jayam serial : గంగ, రుద్ర పూజలో కూర్చుంటారా.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -164 లో..... రుద్ర ఏ విధంగా గంగకి హెల్ప్ చేసాడో అందరికి చెప్తాడు. పాపం పెద్దమ్మ హర్ట్ అయినట్లు ఉందని వంశీ అనగానే అయితే అవనివ్వులే గంగ సేఫ్ అయిందని పెద్దసారు అంటాడు. మరొకవైపు పారు ఫ్రెండ్స్ ని అకాడమీ మేడమ్ సస్పెండ్ చేస్తుంది. దాంతో నువ్వు సస్పెండ్ ఆపకపోతే నువ్వే ఇదంతా చేసావని మేడమ్ కి చెప్తానని పారు ఫ్రెండ్ పారుతో అంటుంది. దాంతో మేడమ్ ని సస్పెండ్ క్యాన్సిల్ చెయ్యమని రిక్వెస్ట్ చేస్తుంది పారు. తప్పు ఒప్పుకుంటున్నారు కదా ఈ ఒక్కసారి క్షమించండి అని మేడమ్ తో గంగ అనగానే తను సరే అని సస్పెన్షన్ క్యాన్సిల్ చేస్తుంది.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.