English | Telugu

మరదలి ప్రేమలో పటాస్ ప్రవీణ్...దీవించిన ఇంద్రజ


సోషల్ మీడియాలో పటాస్ ప్రవీణ్ ఫైమా జోడి ఒకప్పుడు కలిసి వీడియోస్ చేసేవాళ్ళు. ఐతే వీళ్ళిద్దరూ తర్వాత విడిపోయారు. ప్రవీణ్ ఐతే నిజంగా లవ్ చేశాను ఫైమాని అని చెప్తే ఫైమా మాత్రం జస్ట్ ఫ్రెండ్ అనేసరికి ప్రవీణ్ తట్టుకోలేకపోయాడు. ఇక ఇప్పుడు తన మరదలితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడు. ఐతే తన మరదలుకి తానేంటో ఎంతో ఇష్టం అని చెప్పుకొచ్చాడు. ఐతే ఈ విషయాన్ని ఈ ఆదివారం ప్రసారమైన శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో బయటపెట్టాడు. అలాగే ప్రవీణ్ తన మరదలిని కూడా ఈ షోకి తీసుకొచ్చాడు.

ఐతే రాంప్రసాద్ వచ్చి "ఏంటి ప్రవీణ్ సెటిల్ అయ్యావంట.. కొత్త అమ్మాయిని చూసుకున్నావట..పెళ్లి చేసుకోబోతున్నావట" అని అడిగాడు. దానికి ఇంద్రజ అది తన డెసిషన్ అని చెప్పారు. "ప్రవీణ్ నన్ను తల్లిగా స్థానంలో ఉంచి ఎక్కువగా అభిమానిస్తాడు..అలా తన సమస్యను చెప్పుకున్నాడు. ఐతే నేను కూడా ప్రవీణ్ నిజమైన ప్రేమకు ఎవరైనా మంచి అమ్మాయి ఉంటే బాగుండు అనుకున్నా. ఆ అమ్మాయికి కూడా ప్రవీణ్ అంటే ఇష్టం..అందుకే వాళ్లకు ఈ షోకి నేను ఇన్వైట్ చేసాను" అన్నారు. ఇక రష్మీ "ఏంటి ఇది రియలా ? అని అడిగింది. " అవును ..వంశికకి ఫాదర్ లేడు..ఫామిలీని ఈ అమ్మాయే పోషిస్తుంది. అందుకే వంశిక అంటే ఇష్టం" అన్నాడు ప్రవీణ్. "ప్రవీణ్ అందరినీ బాగా చూసుకుంటాడు...చాలా ప్రేమగా ఉంటాడు..అందుకే ఇష్టం" అని చెప్పింది వంశిక.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.