English | Telugu

శేఖర్ మాస్టర్ మీద నాగబాబు ఫైర్


"ఈ దీపావళికి మాస్ జాతర" రీసెంట్ ప్రోమో ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉంది. ఇక ఇందులో అందాల పోటీలు కూడా పెట్టారు. ప్రకృతి కంభం, నైనికా వచ్చి స్టేజిని దడదడలాడించారు. ప్రకృతి ఐతే లంగా వోణిలో అచ్చ తెలుగు ఆడపిల్లలా వచ్చి స్టేజి మీద రాంప్ వాక్ చేసింది. "ఈ రౌండ్ జడ్జెస్ కి అన్నమాట. మీ ఇద్దరి జడ్జెమెంట్ ఒకేలా ఉందా లేదా అనేది" అంటూ ప్రదీప్ అనౌన్స్ చేసాడు. ఇక ప్రకృతి ఐతే ఊపుకుంటూ, తిప్పుకుంటూ, హొయలు పోతూ రాంప్ వాక్ చేసింది.

ఇక తర్వాత నైనికా కూడా వచ్చి రాంప్ వాక్ చేసింది. తర్వాత శేఖర్ మాష్టర్ "ప్రకృతి 8 మార్క్స్. కాదు ఇంకోటి నడుముంది కదా అని మధ్యలో ఓ తిప్పేసుకోవడం కాదు. ఎంత వరకు తిప్పాలి ఎంత వరకు బాలన్స్ చేయాలి అనేది చూడాలి. నాగబాబు సర్ నమస్కారం చేసావ్. నాకు సెల్యూట్ కొడతావేంటి " అని అడిగాడు. "నన్నేదో పెద్దవాడిగా గుర్తించింది. నిన్ను యంగ్ బాయ్ గా గుర్తించింది ఆ అమ్మాయి." అని చెప్పారు నాగబాబు. "నన్ను కూడా పెద్దోడిలాగే గుర్తించొచ్చు కదా సర్" అని శేఖర్ మాష్టర్ అనేసరికి. "ఎందుకు నీకు రెండోదే కావాలి. నీకు ఏది కావాలో అదే ఇచ్చింది" అన్నారు నాగబాబు. నైనికాకి ఎన్ని మార్క్స్ ఇచ్చారో చెప్పాలి అంటూ ప్రదీప్ అడిగేసరికి "నైనికాకు ఐతే తన నడకలో క్యాట్ వాక్ తో పాటు సంప్రదాయం కనపడింది" అన్నాడు శేఖర్ మాష్టర్ మార్కులు గురించి చెప్పకపోయేసరికి "ఎంతిచ్చావో చెప్పేహే" అంటూ నాగబాబు కౌంటర్ వేశారు.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.