English | Telugu

హైపర్ ఆది ఇంట్లో మర్డర్

అనుకోకుండా హైపర్ ఆది ఇంట్లో మర్డర్ జరిగేసరికి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ వచ్చి అతన్ని అతని భార్యని ఎంక్వయిరీ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా అడివి శేష్ వస్తారు. ఆదిని హోస్ట్ ప్రదీప్ ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. అసలు మర్డర్ ఎలా జరిగింది ? అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఆదిని కన్ఫ్యూస్ చేస్తూ ఉంటారు. ఆది ఆన్సర్ తప్పు చెప్తే చాలు చేతికి, కాలికి షాక్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. నీ ఫోన్ లో ఎక్కువగా లేడీస్ నంబర్స్ ఉన్నాయి కదా ? అని అడివి శేష్ అడిగేసరికి అలాంటివేమి ఉండవ్ అని చెప్తాడు ఆది. వెంటనే షాక్ తగులుతుంది ఆదికి. దాంతో ఒక్కసారిగా కెవ్వు మంటాడు.

ఇంతకు ఎంతమంది అమ్మాయిల నంబర్లు ఉన్నాయో చెప్పు అంటూ జానీ మాస్టర్ అడిగేసరి 2 , 6 అంటూ తప్పులు చెప్తుంటాడు ఆది. నీ వయసెంత అనే ప్రశ్నకు 16 అంటూ తప్పు చెప్పేసరికి మళ్ళీ షాక్ ట్రీట్మెంట్ ఇస్తారు. ఆ తర్వాత ఆది వైఫ్ ని కూడా ఇంటరాగేట్ చేస్తారు ఆఫీసర్స్. తర్వాత ఆర్మీ యూనిఫామ్ లో ఉన్న ఒక టీం నా పేరు సూర్య.. నా ఇల్లే ఇండియా అనే మూవీలో ఓ సైనిక అనే పాటతో దుమ్ము రేపుతుంది. ఇక ఈ హైలెట్స్ అన్నిటిని కూడా జూన్ 1 న ప్రసారం కాబోయే ఢీ షోలో చూడొచ్చు.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.